English | Telugu
వెదర్ కో- ఆపరేట్ చేస్తుంది అందుకే కైట్ ఎగురుతుంది
Updated : Aug 1, 2022
నవ్య స్వామి, రవికృష్ణ ఏ షోలో చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. వీళ్లిద్దరి జంట బుల్లి తెర మీద మస్త్ ఫేమస్. "నా పేరు మీనాక్షి" సీరియల్ తో నవ్య స్వామి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన నవ్య తమిళ్ లో, తెలుగులో సీరియల్స్ చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటోంది. స్టార్ మాలో ప్రసారమైన "ఆమె కథ" సీరియల్ లో రవికృష్ణ , నవ్యస్వామి కలిసి నటించారు.
అప్పటి వరకు వాళ్ళ ప్రేమ కొంతవరకే ప్రపంచానికి తెలుసు కానీ ఈ సీరియల్ తర్వాత వీళ్ళ ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఢీ 14 డాన్స్ షోకి ఇద్దరూ కలిసి టీమ్ లీడర్లుగా పని చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఢీ 14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ప్రదీప్ వేసే జోకులకు అడ్డుఅదుపు ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో నవ్యస్వామికి ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తాడు ప్రదీప్. "సంక్రాంతి రోజు కైట్ ఎందుకు ఎగరేస్తారు" అని అడుగుతాడు. "అప్పుడు వెదర్ కొంచెం కో- ఆపరేట్ చేస్తుంది కాబట్టి కిట్స్ ఎగరేస్తారు" అంటుంది నవ్యస్వామి. అదేంటి పతంగికి వెదర్ కో-ఆపరేట్ చేస్తుందా అంటూ నవ్వుతాడు ప్రదీప్ . మేమైతే ఇంట్లోనే పతంగులు ఎగరేసుకుంటూ ఉంటాం అంటూ ఫన్ చేస్తాడు. ఫైనల్ గా అందరూ హోలీ కలర్స్ చల్లుకుని ఢీ స్టేజిని రంగులమయం చేసేస్తారు.