English | Telugu

Karthika Deepam 2: క్షేమంగా ఉన్న సుమిత్ర.. శివన్నారాయణకి ఎందుకు తెలియొద్దంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -492 లో... దీప ఫోన్ చేయగానే కార్తీక్ కంగారుగా వస్తాడు. ఇంట్లో సుమిత్రని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. అక్కడ తాత వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని కార్తీక్ అంటే దీప వద్దని ఆపుతుంది. సుమిత్ర కోపంగా తనతో అన్న మాటలు చెప్తుంది. నేను ఆ ఇంటికి వెళ్లను అంది.. ఇప్పుడు స్పృహలోకి వచ్చి మళ్ళీ ఏమైనా అంటుందేమోనని దీప అంటుంది.

ఆ తర్వాత కాంచన, శ్రీధర్ ఇంటికి వస్తారు. నాన్న వచ్చినట్లు ఉన్నాడు తనకి అత్త ఇక్కడ ఉన్నట్లు తెలియొద్దని వాళ్లు లోపలికి రాకుండా ఆపుతారు. నేను ఇంట్లోకి రావడం ఇష్టం లేదా అని శ్రీధర్ అంటాడు. అలా కాదు ఇంటిదగ్గర పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తారు కదా.. వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా అని శ్రీధర్ ని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. కాంచన లోపలికి వచ్చాక సుమిత్ర ఉన్న విషయం చెప్తారు. సుమిత్రని చూసి కాంచన బాధపడుతుంది.

అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి మా అమ్మ గురించి తెలిసిందా అని అడుగుతుంది. అత్త క్షేమంగా ఉందని కార్తీక్ అనగానే మమ్మీ ఎక్కడ ఉందో తెలిసిందా అని జ్యోత్స్న అంటుంది. లేదు క్షేమంగా ఉంటుందని అంటున్నానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. దాంతో దాసు, కాశీ ఇద్దరు సుమిత్ర ని వెతకడానికి వెళ్తారు. శ్రీధర్ కూడా సుమిత్ర కోసం వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.