English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లికి షాకిచ్చిన విశ్వ.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో.....ఇంట్లో గోడవ జరిగింది కదా.. ఆ మూడ్ నుండి బయటకి రావడానికి శ్రీవల్లి అందరిని హాల్లోకి పిలుస్తుంది. అందరం సరదాగా అంత్యాక్షరి ఆడుకుందామని అంటుంది. దాంతో ఎందుకు ఇప్పుడు అదంతా అని వేదవతి అంటుంది. అయిన వినకుండా స్లిప్స్ లో అక్షరం రాసి ఒక దాంట్లో వేసి తిరుపతికి ఇస్తుంది. అందులో తిరుపతి ఒక్కొకటిగా తీస్తాడు.


మొదట శ్రీవల్లి ఆ తర్వాత నర్మద, ప్రేమ వాళ్ళకి వస్తుంది. రామరాజు కూడా ఒక పాట పాడుతాడు. అలా ఇల్లంతా సందడిగా మారుతుంది. అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వస్తారు. మీరు ఎందుకు వచ్చారని శ్రీవల్లి వాళ్లపై కోప్పడుతుంది. వాళ్ళని బయటికి తీసుకొని వెళ్లి ఎందుకు వచ్చారని అడుగుతుంది. దాంతో విశ్వ నుండి ఇద్దరు తప్పించుకోబోతుంటే వాళ్ళకి ఎదురుగా విశ్వ వస్తాడు. మీరు అమూల్య పెళ్లిచూపులు ఆపకుంటే మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం ఇద్దరు శ్రీవల్లికి చెప్తారు.

అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇంటి పైనుండి విశ్వ చూస్తాడు. అతడిని చూసి వాళ్లు ఇంకా భయపడుతారు. మరొకవైపు అమూల్యకి పెళ్లిచూపులని వేదవతి కంగారుపడుతూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత తిరుపతి తన అతిలోక సుందరితో ఫోన్ మాట్లాడుతుంటే సాగర్,చందు, ధీరజ్ వచ్చి.. మావ నిన్ను చూస్తుంటే ఎక్కడో బోర్లా పడుతావపిస్తుందని తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.