English | Telugu

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.

మరుసటి రోజు శ్రీమంతంకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి అప్పు, కావ్యలకి బంగారం గాజులు తీసుకొని వస్తారు. అవి చూసి అపర్ణ, ధాన్యాలక్ష్మి బాగున్నాయని చెప్తారు. కనకం మాత్రం శ్రీమంతం కోసం మట్టి గాజులు వాడాలి. లోపల బిడ్డకి మంచిది అని చెప్పగానే సరే తెప్పిస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి జుట్టుకి సామ్రాణి పడుతాడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కళ్యాణ్ వెళ్లి రెడీ చెయ్యాలా అని అడుగుతాడు. అప్పుడే ధాన్యాలక్ష్మి వచ్చి నువ్వేం అవసరం లేదు. నేను రెడీ చేస్తానని ధాన్యాలక్ష్మి అంటుంది. ధాన్యాలక్ష్మి తనపై చూపించే ప్రేమకి అప్పు ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత రేఖ, రుద్రాణి కలిసి కావ్య తాగే దాంట్లో పసరు మందు కలపాలని ట్రై చేస్తారు. కావ్య దగ్గరకి కనకం వచ్చి ఎంత అందంగా ఉన్నావే అని కూతురిని చూసి మురిసిపోతుంది. తరువాయి భాగంలో కావ్య, అప్పులకి శ్రీమంతం జరుగుతుంటే రుద్రాణి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే వద్దని కనకం అపుతుంది. ఈ రుద్రాణి కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుందని పసరు మందు ఇచ్చిన అతన్ని కనకం తీసుకొని వస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.