English | Telugu

Brahmamudi: భర్త ఆకలి తీర్చడానికి అలా చేసిన భార్య.. అతను తెలుసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -855 లో... రాజ్ నిరాహార దీక్ష చేస్తుంటే.. అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. మీ భార్యకి మీకు గొడవ ఏంటని అడుగుతారు. అది నా పర్సనల్.. దాని గురించి మీకు అవసరం లేదని రాజ్ ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు అక్కడ జరిగేది మొత్తం ఎప్పటికప్పుడు ఇందిరాదేవి తెలుసుకుంటుంది. అపర్ణ కూడా చెప్తుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వచ్చి అల్లుడు గారి ముందు కావాలనే భోజనం చెయ్ అని చెప్తుంది. దాంతో కావ్య వెళ్లి తన ముందు కూర్చొని భోజనం చేస్తుంది రాజ్ టెంప్ట్ అవుతాడు కానీ బయటపడడు. మరొకవైపు అపర్ణ డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైందని సుభాష్ వచ్చి అడుగుతాడు. ఏముంది అక్కడ కొడుకు ఏం తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా అని ఇందిరాదేవి చెప్తుంది.

ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వెళ్లి భోజనం తీసుకెళ్ళమని చెప్తుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇదంతా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ విషయం ఆయన్ని అడగండి అని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి వెళ్లి భోజనం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.