English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేసిన దాస్.. శివన్నారాయణ భయం ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -525 లో.....జ్యోత్స్నని దాస్ కాలుస్తాడు. దీప ఎలాగూ పేదింట్లో పెరిగింది కానీ తన బిడ్డ అలా కాదు.. ఆ పెద్దింట్లో పెరగాలి.. అలా కాదని నువ్వు అడ్డుపడితే నిజం చెప్పడానికి నేనే వస్తానని జ్యోత్స్న ని దాస్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప కి టెస్ట్ లు ఎప్పుడు చేయించాలని కార్తీక్ డాక్టర్ తో మాట్లాడతాడు. అప్పుడే దీప వచ్చి ఇవన్నీ ఎందుకు బావ ఇప్పుడే అని అంటుంది.

అప్పట్లో అయితే ఇవన్నీ ఏం లేవు కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఇక రేపటి నుండి పనికి రాకు అని కార్తీక్ అనగానే.. వస్తాను బావ.. అక్కడ అమ్మనాన్నలని చూస్తూ ఉండొచ్చు కదా అని దీప అంటుంది. మరుసటి రోజు స్వప్నకి కాశీ డాష్ ఇవ్వగా పడిపోతుంటే కాశీ పట్టుకొని సారీ చెప్తాడు. స్వప్న సైలెంట్ గా వెళ్తుంటే.. ఏంటి మాట్లాడవు. మీ అన్నయ్య మనల్ని కలిపాడు కదా అని కాశీ అనగానే మా అన్నయ్య అంటే గౌరవం ఉందని స్వప్న గొప్పగా మాట్లాడుతుంది. దాంతో కాశీకి కోపం వచ్చి మీ అన్నయ్య చేసేది ఆఫ్ట్రాల్ డ్రైవర్ జాబ్ అని అంటాడు. అది శ్రీధర్ విని.. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడే స్థాయి నీది అని కాశీపై శ్రీధర్ కోప్పడతాడు. నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. అది వచ్చాక చెప్తానని శ్రీధర్ ఆఫీస్ కి వెళ్తాడు. మరొకవైపు శివన్నారాయణ హాల్లో డల్ గా కూర్చుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. సుమిత్ర అందరికి హారతి ఇస్తుంది. దీప నువ్వు జాగ్రత్తగా ఉండాలని దశరథ్, శివన్నారాయణ అంటారు.

దీపకి ఇదేం కొత్తేమీ కాదు.. ఆల్రెడీ పిల్లలని కనడంలో అనుభవం ఉంది అని జ్యోత్స్న తప్పుగా మాట్లాడడంతో దశరథ్ తనపై చెయ్ ఎత్తేలోపే జ్యోత్స్నని సుమిత్ర కొడుతుంది. నువ్వు దీపని కాదు మాతృత్వాన్ని అవమానిస్తున్నావని అమ్మతనం గురించి సుమిత్ర గొప్పగా చెప్తుంది. దాంతో జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. దీప ఏడుస్తూ వెళ్తుంది. కార్తీక్ కి సుమిత్ర సారీ చెప్తుంది. కార్తీక్ ని శివన్నారాయణ బయటకు తీసుకొని వస్తాడు. పంతులు అతడితో ఏం చెప్పాడో అన్నీ కార్తీక్ కి చెప్తాడు. నాకు భయంగా ఉందిరా ఎవరికి ఆపద వస్తుందోనని శివన్నారాయణ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.