English | Telugu

 ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. రామరాజు ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో......వేదవతిపై రామరాజు కోప్పడుతాడు. కోడళ్లకి నువ్వు అంటే భయం లేదు.. వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటున్నారని రామరాజు అంటాడు.

ఆ తర్వాత రామరాజు భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. భాగ్యం టెన్షన్ పడుతుంది. మరొకవైపు నాన్నకి డబ్బు విషయం ఎందుకు చెప్పావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ వల్లి అక్క అన్ని మాటలు అంటుంటే నాకెలా అనిపిస్తుంది. నువ్వు ఎందుకు కలుగజేసుకోవడం అని ధీరజ్ అంటుంటే ఎందుకంటే నువ్వు నా మొగుడివి అని ప్రేమ అంటుంది. మరొకవైపు వేదవతి ముగ్గు వేస్తూ భద్రవతిని చూస్తూ తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే నర్మద వచ్చి ఏదో లవర్స్ అయినట్టు అలా చూసుకుంటున్నారని అంటుంది. ప్రొద్దున నర్మద ఆఫీస్ లో జరిగింది చెప్తుంది. నేను చేసింది తప్పా అని నర్మద అడుగుతుంది. లేదని వేదవతి చెప్తుంది.

మరొకవైపు భాగ్యం వాళ్ళకి రామరాజు ఫోన్ చేస్తుంటే.. లిఫ్ట్ చెయ్యరు. దాంతో శ్రీవల్లిని పిలిచి రామరాజు కోప్పడతాడు. మరొకవైపు అసలు బ్యాచిలర్ పార్టీ కోసం.. ఏం డ్రెస్ వేసుకోవాలని ప్రేమ ఆలోచిస్తుంటే నర్మద, వేదవతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.