English | Telugu

Illu illalu pillalu : మిల్ లో దొంగతనం చేసింది సింహాద్రి.. నర్మద తెలివి సూపర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -243 లో.. భాగ్యం వాళ్ళ గురించి నర్మద, ప్రేమ రామరాజుకి చెప్పబోతుంటే అప్పుడే మిల్ లో దొంగలు పడి డబ్బు పోయిందని ఫోన్ చేసి చెప్పడంతో రామరాజుతో సహా అందరు మిల్ కి వెళ్తారు. అసలు ఏమైందని సింహాద్రిని అడుగుతాడు రామరాజు. ఏమో అయ్యా లాకర్ పగులగొట్టి డబ్బు తీసుకొని వెళ్ళారని సింహాద్రి చెప్తాడు.

అక్కడున్న వాళ్లందరిని సింహాద్రి ఎవరు డబ్బులు తీశారంటూ అడుగుతాడు. అక్కడ ఒక బియ్యం బస్తాపై రక్తం ఉంటుంది. అది నర్మద చూస్తుంది. మళ్ళీ సింహాద్రి చేతికి రక్తం ఉంటుంది. ఈ దొంగతనం చేసింది సింహాద్రి అని నర్మద చెప్తుంది. నేను చెయ్యలేదని సింహాద్రి అంటాడు. మరి ఎందుకు కంగారుపడుతున్నావ్ లాకర్ నుండి డబ్బు తీసుకొని ఆ బియ్యం బస్తాలో దాచావ్.. నీ చేతికి రక్తం ఉంది.. అలాగే అక్కడ సంచికి ఉంది.. ఆ సంచిలో డబ్బు ఉంటుంది చూడండి అని నర్మద అనగానే ధీరజ్, సాగర్, చందు వెళ్లి చూడగానే అందులో డబ్బు ఉంటుంది. దాంతో రామరాజు సింహాద్రిని తిడతాడు. నిన్ను ఎంత నమ్మానని కుప్పకూలిపోతాడు. వాడే దొంగతనం చేసాడని చెప్పకుండా ఉంటే బాగుండేది నర్మద.. ఏ దొంగ ఎత్తుకొని వెళ్ళాడనుకునే వాడిని.. నమ్మకం పోగొట్టుకున్నాడని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ.. నాన్నని మోసం చేస్తున్నానని సాగర్... నేను ప్రేమని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో.. ఇన్ని రోజులు చెప్పకుండా మోసం చేసానని ధీరజ్ ఇద్దరు అనుకుంటారు. నాన్నకి తెలియకుండా అప్పు చేసాను ఆ విషయం నాన్నకి తెలిస్తే మోసం చేసానని అనుకుంటాడంటూ చందు బాధపడతాడు.

మరొక వైపు శ్రీవల్లి తన అమ్మ దగ్గరికి వెళ్లి మన గురించి చెప్పేలోపు.. దొంగలు పడ్డారని మిల్ కి వెళ్ళారు కానీ వచ్చాక చెప్తారని శ్రీవల్లి భయపడుతుంది. తరువాయి భాగంలో నర్మద రామరాజు వాళ్లకు భాగ్యం వాళ్ళ గురించి చెప్పనందుకు నర్మదపై ప్రేమ కోపంగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడకు అక్క అని ప్రేమ అనగానే నర్మద బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.