English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.....రామలక్ష్మి రామ్ కి టీసీ ఇస్తానని చెప్పడంతో.. నేను భోజనం చెయ్యనంటు రామ్ మారం చేస్తుంటాడు. నాకు ఆ మిస్ కావాలి. నాతో సరదాగా ఆడుకుంటుందని రామ్ ఏడుస్తుంటే.. నువ్వు ఆ స్కూల్ లోనే ఉంటావ్. నేను మేడమ్ తో మాట్లాడతానని రామ్ ని సీతాకాంత్ బ్రతిమాలతాడు. రామలక్ష్మి తన క్యాబిన్ లోకి వచ్చి తనకి సంబంధించిన వస్తువులు తీసుకుంటుంది. అప్పుడే ఇద్దరు టీచర్స్ వస్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ రామ్ కి ఇవ్వండి అని చెప్పి బయలుదేర్తుంది.

రామలక్ష్మి వెళ్ళాక సీతాకాంత్ రామ్ ని తీసుకొని వస్తాడు. మేడమ్ వేరొక దగ్గరికి వెళ్తుంది. ఇక రాదని చెప్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పిందని వాళ్ళు చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఎంతసేపు అవుతుందని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడే అనగానే సీతాకాంత్ పరిగెత్తుకుంటూ వెళ్లి రామలక్ష్మి కార్ ని ఆపాలని చూస్తాడు. మేడమ్ ఆగండి అంటున్నా రామలక్ష్మి వినిపించుకోదు.. అప్పుడే రామ్ పడిపోతాడు. అది చూసి సీతాకాంత్ వెళ్తాడు. రామలక్ష్మి కూడా వెళ్తుంది. మేడమ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టానని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తాడు. రామ్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. లేదని రామలక్ష్మి అంటుంది. రేపు రామ్ పుట్టినరోజు మీరు రండి అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఇక మళ్ళీ వీళ్ళని కలవను కదా రేపు పుట్టిన రోజుకి వెళ్తానని ఫణీంద్ర, సుశీలలకి చెప్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే రాగలవా అని సుశీల అనగానే.. వెళ్లనివ్వు మళ్ళీ రాదు కదా అని ఫణీంద్ర అంటాడు.

మరుసటి రోజు రామ్ పుట్టినరోజు బట్టలు వేసుకోమని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. మా మిస్ వస్తేనే వేసుకుంటానని మారం చేస్తాడు. దాంతో శ్రీలతకి కోపం వచ్చి కొట్టబోతుంటే సీతాకాంత్ ఆపుతాడు. ఆ తర్వాత సిరి ఫోటో దగ్గరికి వెళ్ళి శ్రీలత బాధపడుతుంది. ఈ రోజే మీ కూతురు చనిపోయిన రోజు.. ఈ రోజే తన కొడుకు పుట్టినరోజు.. ఒకవైపు ఆనందం.. ఒకవైపు బాధ అని పంతులు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.