English | Telugu

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి భార్యాభర్తల ముచ్చట్లు.. అత్త మాస్టర్ ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -191 లో.....రామలక్ష్మి శ్రీలత గదిలోకి వెళ్లి పడుకుంటుంది. దాంతో సీతాకాంత్ లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. తన పక్కన రామలక్ష్మి ఉందని ఉహించుకొని తన మనసులో మాటలు చెప్తుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏంటి మనవడా నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. తాతయ్య నువ్వా అంటూ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. అందుకే నీ మనసులో మాటని నీ భార్యకి చెప్పమని చెప్పానంటూ పెద్దాయన అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి.. అమ్మ దూరంగా ఉండమని చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు.

మీ అమ్మ కలిసి ఉండకూడదు అంది కానీ మాట్లాడుకోకని చెప్పలేదు కదా ఇప్పుడు వెళ్లి నీ మనసులో మాటని రామలక్ష్మికి చెప్పమని పెద్దాయన అనగానే సీతాకాంత్ సరే అంటాడు. మరొకవైపు నందిని ఫోటో షూట్ కోసం సీతాకాంత్ కి సూట్ తీసుకంటుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంటే.. అప్పుడే హారిక వస్తుంది. నువ్వు కొన్నావ్ సరే తను వేసుకుంటాడా అని అడుగుతుంది. తనకి నాపై ప్రేమ ఉంది ఖచ్చితంగా వేసుకుంటాడని నందిని అంటుందిమ. నందిని అలా సీతాకాంత్ పై ప్రేమ చూపించడం చూసి ఆశ్చర్యపడుతుంది. ఆ తర్వాత శ్రీలత పైన పడుకుంటానని లేస్తుండగా అప్పుడే సీతాకాంత్ డోర్ కొడతాడు. దాంతో మళ్ళీ వెంటనే వెళ్లి పడుకుంటుంది. సీతాకాంత్ డోర్ తీసి పేపర్స్ తో రామలక్ష్మిని నిద్ర లేపుతాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి లేచి సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏంటని అడుగుతుంది. నీతో మాట్లాడాలి పద అంటూ బయటకు తీసుకొని వస్తాడు.రామలక్ష్మితో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. అది తప్ప అన్నీ మాట్లాడతాడు. మరొకవైపు వెళ్లేంటి ఇంకా రావడం లేదని శ్రీవల్లి దగ్గరికి శ్రీలత వెళ్లి.. నిద్రలేపి రామలక్ష్మిని గదిలో నుండి సీతా బయటకు తీసుకొని వచ్చాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్లు మాత్రం కలవకుండా చూడమని శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత సందీప్ ని శ్రీవల్లి నిద్ర లేపి బలవంతంగా బయటకు తీసుకొని వస్తుంది. సీతాకాంత్ రామలక్ష్మిలు కూర్చొని ఉన్న దగ్గరే శ్రీవల్లి, సందీప్ లు కూర్చొని ఉంటారు. సీతాకాంత్ తన ప్రేమ విషయం చివరికి ధైర్యం చేసి చెప్తుంటే.. అప్పుడే సందీప్ తో శ్రీవల్లి మాట్లాడడం వినిపిస్తుంది. అది విని సీతాకాంత్ చెప్పకుండా ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.