English | Telugu
Brahamamudi : రేవతిని కుటుంబానికి దగ్గర చెయ్యాలనుకుంటున్న రాజ్.. రుద్రాణి కొత్త ప్లాన్!
Updated : Sep 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -817 లో.....దుగ్గిరాల కుటుంబం మొత్తం వినాయకుడి పండుగ చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే కనకం కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు. ఈ పండగకి నా కూతుళ్ళని మా ఇంటికి తీసుకొని వెళ్తానని ఇందిరాదేవిని అడుగుతుంది కనకం. అవసరం లేదు నా కోడలు నా ఇంట్లోనే ఉండాలని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు ప్రేమ వచ్చినా.. కోపం వచ్చిన భరించలేమని ప్రకాష్ అంటాడు.
మీ కూతుళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి పండుగ చేసుకునే బదులు.. మీరు ఇద్దరు ఇక్కడికి వస్తే అందరం కలిసి ఇక్కడే చేసుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. ఐడియా బాగుందని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత కావ్య డల్ గా బయటకి వస్తుంది. తన వెనకాలే రాజ్ వస్తాడు. మనమందరం ఇక్కడ సంతోషంగా ఉన్నాం కానీ మీ అక్క బస్తీలో ఇబ్బంది పడుతుందని రేవతి గురించి రాజ్ కి చెప్తుంది కావ్య. మా అక్కని కలవాలని రాజ్ అంటాడు. మరొకవైపు స్వరాజ్ బట్టలు వేసుకోనని మారం చేస్తుంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు కలిసి రేవతి ఇంటికి వస్తారు.
రాజ్ కి గతం గుర్తుకొచ్చిందని రేవతి తో కావ్య చెప్తుంది. తమ్ముడు అని రాజ్ దగ్గరికి రేవతి వచ్చి ఎమోషనల్ అవుతుంది. మీరు అందరు రేపు రండి మనం ఎప్పుడు కలిసే ఉండాలని రేవతితో రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు కళ్యాణ్ హాస్పిటల్ కి వెళ్తారు. అప్పు రిపోర్ట్స్ చూసి అంతా ఒకే అని డాక్టర్ చెప్తుంది. కానీ మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది.. తొమ్మిది నెలలు బిడ్డని మోస్తే తన ప్రాణానికే ప్రమాదమని కావ్య గురించి అప్పుకి చెప్తుంది డాక్టర్. తరువాయి భాగంలో కావ్యని ప్రేమగా చూసుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఈ ఇంటికి ఎవరు వారసులు వద్దు.. నీ కూతురే ఈ ఇంటికి వారసురాలు అవ్వాలని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.