English | Telugu

అగ్నిపరీక్షలో ఒపీనియన్ ట్యాగ్ ఎవరికొచ్చిందంటే!


బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడానికి జియో హాట్ స్టార్ లో అగ్నిపరీక్ష ద్వారా ఎపిసోడ్ లని రిలీజ్ చేస్తున్నారు బిబి టీమ్. ఇక ఈ అగ్నిపరీక్ష ముగియడానికి మూడు ఎపిసోడ్ లే మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో పదిహేను మందిలో ఎవరికి ఏ ఒపీనియన్ ఉందో ట్యాగ్ ఇవ్వాలని టాస్క్ అందరు ఒకొక్క ఒపీనియన్ తమకి నచ్చని వారికి ఇస్తూ వచ్చారు. నాగ, హరీష్ కి ప్రసన్న కుమార్ ట్యాగ్ ఇచ్చాడు కానీ వాళ్ళు మేమ్ అది కాదు అని వాదించారు. దాంతో ప్రసన్న కుమార్ సైలెంట్ అయిపోయాడు. ఇక శ్రీముఖి అతని దగ్గరికి వచ్చి ఇలా ఉండకూడదు.. ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావని అతడిని అడుగుతుంది.

సిచువేషన్ జరిగినప్పుడు అది కాదు.. ఇది అని చెప్పాలనిపిస్తుంది కానీ ఇలాంటి చెప్పే సిచువేషన్ లో నేను మాట్లాడలేకపోతున్నాను అంటాడు. ఆ తర్వాత పదిహేను మందిలో ఒపీనియన్ టాస్క్ ఏడుగురికి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు అయిదుగురికి ఒపీనియన్ ఇచ్చారు. ఇంకా మిగిలింది కల్కి. తనకి ఒపీనియన్ ఛాన్స్ రాలేదు. ఎవరు తనకి ఒపీనియన్ చెప్పలేదు. దాంతో తనని స్టేజ్ మీదకి శ్రీముఖి పిలుస్తుంది. ఇన్ని రోజుల ప్రయాణంలో నీ మీద ఒక్కరికి కూడా ఒపీనియన్ లేకపోవడమేంటి? అంటే నువ్వు ఒక్కదానివి ఉన్నట్లు.. నిన్ను ఎవరు గుర్తించడం లేదని శ్రీముఖితో పాటు జడ్జెస్ అంటారు.

ఈ ఎపిసోడ్ వరకు నువ్వు పక్కన కూర్చోవాల్సిందేనని తనని పంపిస్తారు. ఇక ఆ తర్వాత అసలైన టాస్క్ మొదలవుతుంది. ఎవరైతే ఒపీనియన్ ఇచ్చిన కంటెస్టెంట్, ఒపీనియన్ తీసుకున్న కంటెస్టెంట్ ఉన్నారో వారిద్దరిని కలిసి ఒక జంటగా చేసి అలా ఏడు జంటలు చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.