English | Telugu

నరేశ్‌కి డైపర్లు ఇస్తానన్న బామ్మ!

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే ఎపిసోడ్ అంతా బోనాల జాతర స్పెషల్ ఎపిసోడ్ గా ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమయ్యింది. బుల్లితెర నటులు, కమెడియన్స్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ షోకి వచ్చిన ఒక బామ్మని నాటీ నరేష్ ఆటపట్టిందామనుకుంటాడు. కానీ ఆ బామ్మ సై అంటే సై అంటూ కౌంటర్ ఇచ్చి పడేస్తుంది. "ఏ బామ్మా నీకు ఫన్ కావాలన్నా, కామెడీ కావాలన్నా నన్ను అడుగు" అంటాడు నరేష్. "నీకు డైపర్లు కావాలంటే నన్నడుగు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది బామ్మ. అంతే స్టేజి మీద ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.

ఇక ఈ షోకి ఇంద్రజ రీఎంట్రీ ఇచ్చి అందరిని ఆనందపరిచింది. నెటిజన్స్ కూడా ఇంద్రజ ఎంట్రీ పై చాలా బెస్ట్ కామెంట్స్ చేశారు. తర్వాత పవన్ క‌ళ్యాణ్, బాలయ్య డూప్స్ వచ్చి వర్ష, ఫైమాతో కలిసి సూపర్ సాంగ్స్ కి డ్యాన్సులు వేసి స్టేజిని ఇరగొట్టేసారు. ఇక ఈ షోకి 'కార్తికేయ 2' జంట‌ అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ వచ్చారు. "ఇలాంటి ఒక జాతరలో చిన్నప్పుడు నా మరదలు తప్పిపోయింది" అంటాడు నిఖిల్. "నా బావ కూడా మిస్ అయ్యాడు" జాతరలో అంటుంది అనుపమ.

అనుపమ డైలాగ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇమ్ము స్టేజి మీదకు వచ్చి "దొండకాయ, బెండకాయ, అనుపమ నా గుండెకాయ్.. నేను అనుపమ బావను" అంటూ వస్తాడు. ఆ తర్వాత అనుపమ "అలా నువ్వు చూస్తే చాలు" అంటూ తన మూవీలోని సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక అనుపమతో కలిసి కమెడియన్స్ అంతా "రాను రానంటూ చిన్నదో" అనే పాటకు డాన్స్ చేసేస్తారు. ఇలా ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించనుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.