English | Telugu

Ilu illalu pillalu : కొత్తజంటకి శోభనం ఏర్పాట్లు.. ప్రేమని కాపాడిన ధీరజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -40 లో.......నర్మద స్నానం చేసి తల తుడ్చుకుంటుంటే అప్పుడే సాగర్ వచ్చి నర్మద వంక రొమాంటిక్ గా చూస్తూ తనని పట్టుకుంటాడు. వదలండి లేదంటే గట్టిగ అరుస్తానని నర్మద అంటుంది. అరువు అని సాగర్ అనగానే నిజంగానే నర్మద గట్టిగా అరుస్తుంది. దాంతో ఏమైందంటూ వేదవతి ఇంకా కామాక్షి వస్తారు. ఏమైందని అనగానే బల్లి పడింది అందుకే అరిచానని నర్మద అంటుంది.

అదంతా గమనించిన కామాక్షి నాకు అంతా అర్థం అయింది కానీ శోభనం జరగకుండా ఇద్దరు ఒకే గదిలో వద్దని సాగర్ తో కామాక్షి చెప్తుంది. అది విన్న వేదవతి అప్పుడే రామరాజు దగ్గరికి వెళ్లి పెళ్లి అయిన జంటకి కొన్ని తంతులు ఉంటాయి. అవి పట్టించుకోకుంటే ఎలా అని వేదవతి అంటుంది. ఏంటని రామరాజు అడుగగా నడిపోడికి శోభనమని వేదవతి చెప్తుంది. వాళ్లకు సంబంధించినవి నువ్వే చూసుకోమన్నాను అలాంటప్పుడు నన్ను అడగడం ఎందుకని రామరాజు చెప్పి వెళ్ళిపోతాడు. ఒప్పుకున్నారు కానీ అలా ఎందుకు ఉన్నారని వేదవతి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ కోసం కళ్యాణ్ వెయిట్ చేస్తుంటాడు. తన కోసం టీ ఆర్డర్ చేసి అందులో మత్తు కలుపుతాడు. అప్పుడే ప్రేమ వచ్చి అది తాగబోతుంటే ధీరజ్ వచ్చి ఆపుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. వీడితో తిరగొద్దని ధీరజ్ అనగానే.. నువ్వు ఎవడివిరా అంటు ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. నువ్వు నా మరదలివి నిన్ను కాపాడే బాధ్యత నాకుందని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ వినదు.

దాంతో ధీరజ్ ప్రేమ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ప్రేమకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇంటికి వెళ్తుంది. అందరు తన గురించి వెయిట్ చేస్తుంటే.. ఇంట్లో అందరికి చెప్పేసి ఉంటాడని ప్రేమ భయపడుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నీకు పెళ్లి చూపులని భద్రవతి అనగానే ప్రేమ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో సాగర్, నర్మదలకి శోభనం ఏర్పాట్లు చేస్తుంది వేదవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.