English | Telugu

Illu illalu pillalu: శ్రీవల్లి చేసిన పనికి నర్మద, సాగర్ బుక్ అవుతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 198 లో.. భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. అమ్మడూ ఊరకే కంగారు పడకు.. బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు.. అంతే తప్ప దాచుకోవడానికి, లాకర్‌లో పెట్టేటప్పుడు కాదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది భాగ్యం. బతికించావే అమ్మా.. ఎక్కడ మన బండారం భయపడి చచ్చానే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. బ్యాంక్ వాళ్లు చెక్ చేయరు కదా అని అజాగ్రత్తగా ఉండకు.. వాటిని ఎవరైనా పరిశీలనగా చూస్తే అవి రోల్డ్ గోల్డ్ అని కనిపెట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని ఎవరూ చూడకుండా మూటగట్టి ఇచ్చేయ్ అని భాగ్యం అంటుంది‌. ఇంతలో వేదవతి పిలివడంతో.. సరేనమ్మా అంటూ నగల్ని మూటకట్టేస్తుంది శ్రీవల్లి.

అప్పటికే నర్మద, ప్రేమ ఇద్దరు తమ నగల్ని వేదవతికి ఇస్తారు‌. శ్రీవల్లి మూట తీసుకురాగానే వేదవతి దాన్ని విప్పమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి కంగారుపడుతుంది. ఇక వేదవతితో పాటు నర్మద, ప్రేమ అనుమానంతో చూస్తారు. ఆ నగలు రోల్డ్ గోల్డ్ లా ఉన్నాయని నర్మద అనుమానపడుతుంది. దాంతో శ్రీవల్లి తెగ నటించేస్తుంది. ఇంతలో తిరుపతి వచ్చేస్తాడు. బావ బంగారం తీసుకురమ్మని చెప్తున్నాడని తిరుపతి అనగానే.. అందరి నగల్ని తీసుకెళ్తుంది వేదవతి. ఇక రాత్రివేళ నర్మద తన చీరకొంగులో సీక్రెట్ గా ఏదో తీసుకెళ్తుంది‌‌. అది శ్రీవల్లి చూసి ఏంటని అడుగగా.. తనకి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది నర్మద. ఇంతకీ ఆమె చీర చెంగులో ఉన్నది ఏంటంటే.. సాగర్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ కావడానికి బుక్స్. ఎవరికీ కనిపించకుండా బుక్స్‌ని తీసుకొచ్చి సాగర్‌‌కి ఇస్తుంది. నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని అన్నావ్ కదా.. ఎగ్జామ్స్‌లో పాస్ కావాలంటే బుక్స్ చదవాలి కదా... ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయని సాగర్ తో నర్మద చెప్తుంది. అమ్మ బాబోయ్ ఇన్ని బుక్స్ చదవాలా. ఇది నా వల్ల అవుతుందా.. నాకు ఉద్యోగం వస్తుందంటావా అని సాగర్ అంటాడు. మీకు నేనున్నా కదా శ్రీవారూ.. మీతో చదవిస్తా కదా అని నర్మద అంటుంది.

ఇక మొదలుపెడదామా శ్రీవారూ అని నర్మద అనగానే నువ్వు ఊ అంటే నేనూ ఊహూ అంటానా.. ఆల్రెడీ బెడ్ కూడా సర్దేశా.. పద మొదలుపెడదామని సాగర్ అంటాడు. నేను చెప్పింది చదవడం గురించి శ్రీవారూ అని నర్మద అంటే.. అంతకంటే ముందు నిన్ను ప్రేమగా చదివి అప్పగించాలి కదా అని నర్మదతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు సాగర్. ఆగండి శ్రీవారూ.. గవర్నమెంట్ జాబ్‌లు ఊరికే రావు.. దృష్టి బుక్స్‌పై పెట్టు.. నా మీద కాదు అంటూ సాగర్‌ని దగ్గరుండి చదివిస్తుంది నర్మద. అతనికి అర్థం అయ్యేట్టుగా సబ్జె‌క్ట్‌ని చదివి వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.