ఆవకాయ్ పచ్చడితో గోరు ముద్దలు తినిపించిన గంగవ్వ
"ఢీ సీజన్ 16 " గ్రాండ్ గా బుధవారం లాంఛ్ కాబోతోంది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తూ ఉంటామో ఇప్పుడు బుల్లితెర మీద డీపీఎల్ కూడా అలాగే చూడబోతున్నాం. ఢీ న్యూ సీజన్ కి ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. అదే డిపిఎల్ దీని ప్రోమో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ ఇందులో కనిపించారు. ప్రదీప్, ఆది, దీపికా పిల్లి, శేఖర్ మాష్టర్, పూర్ణ, గంగవ్వ, విజె సన్నీ కనిపించారు. ఈ లాంఛింగ్ ఎపిసోడ్ కి వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చారు. అభి మాష్టర్ టీంకి బెజవాడ టైగర్స్ అని, గ్రీష్మ మాష్టర్ టీంకి హైదరాబాద్ ఉస్తాద్స్ అని, ఐశ్వర్య మాష్టర్ టీంకి నెల్లూరు నెరజాణలు, కన్నా మాష్టర్ టీంకి ఓరుగల్లు వీరులు అనే టైటిల్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.