Read more!

English | Telugu

దమ్మున్న కొరియోగ్రాఫర్స్ తో రాబోతున్న ఢీ ప్రీమియర్ లీగ్

 


సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ డాన్స్ షోగా  ‘ఢీ’ ఎంతో పేరు తెచ్చుకుంది.  ఈటీవీలో ఇప్పటివరకు 15 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా టాలీవుడ్ కి ఎంత మంది కొరియోగ్రాఫర్స్  ని ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు..అంతటి చరిత్ర ఉన్న షో ఇది. ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ని సోమేష్ మాష్టర్ సొంతం చేసుకుని వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఢీ సీజన్ 16 స్టార్ట్ ఐపోతోంది. జూన్ 21 వ తేదీ రాస్తే 9 . 30 కి ..క్రికెట్ లో ప్రీమియర్ లీగ్స్ చూసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఢీ ప్రీమియర్ లీగ్ చూడబోతున్నాం.

ఇందులో 8 టీములు ఉండబోతున్నాయి...ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి 40  మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. ఇక ఈ న్యూ ఎపిసోడ్ టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చూస్తే గనక గత ఎపిసోడ్స్ లో దుమ్ము రేపిన కొరియోగ్రాఫర్స్ అంతా ఈ ప్రోమోలో కనిపించారు. వాళ్ళే గ్రీష్మ, ఐశ్వర్య, అభి, కన్నా, సాయి మాస్టర్స్ . మరి మిగతా కొరియోగ్రాఫర్స్ ఎవరు అనే విషయం లాంచింగ్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.

వీళ్లంతా గత సీజన్స్ పోటా పోటీగా చేసిన వాళ్లే. ఇక ఈ కొత్త సీజన్ ప్రోమో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. గత సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ కి ప్రభుదేవా వచ్చారు. ఐతే ఈ న్యూ సీజన్ కి ఎవరు వస్తారు అనే విషయం ఇంకా తెలియలేదు. గత ఎపిసోడ్స్ లో వన్ ఆఫ్ ది జడ్జిగా ఉన్న పూర్ణ మరి ఈ డిపఎల్ నుంచి కనిపించబోతున్నారా  అంటే వస్తున్నారని అనే ఊహాగానాలు  వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లో త్వరలో వస్తాను అని కూడా చెప్పడం చూసాం. ఇప్పుడు ఈ న్యూ సీజన్ కి మరి వచ్చే అవకాశం కనిపిస్తోంది.