English | Telugu

ప్రముఖ హీరోకి కీర్తి సురేష్ క్షమాపణలు.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ  

అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో ప్రముఖ హీరోయిన్ 'కీర్తి సురేష్'(Keerthy suresh)కూడా ఒకరు. కేరళ కి చెందిన కీర్తి బాల్యం నుంచే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతు, రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలజ క్యారక్టర్ లో క్యూట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, మొదటి చిత్రంతోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత చేసిన  నేను లోకల్, అజ్ఞాతవాసి,సర్కారివారి పాట, దసరా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు కూడా కీర్తి రేంజ్ ని పెంచాయి. మహానటి తో అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ లెజండ్రీ యాక్ట్రస్ సావిత్రిగారి క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించి, సావిత్రి గారిని మన కళ్ళ ముందుకు మళ్ళీ సజీవంగా నిలబడేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 12 న 'ఆంథోనీ తటిల్' నిప్రేమ వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ఈ వార్త కనుక నిజమైతే దిల్ రాజు భారీ రిస్క్ చేస్తున్నట్టే

నిర్మాత అంటే క్యాషియర్ కాదు, మేకర్ అని నిరూపించిన అతితక్కువ మంది నిర్మాతల్లో 'దిల్ రాజు'(Dil Raju)కూడా ఒకరు. ఇది దిల్ రాజు సినిమా అనే ఒక బ్రాండ్ ని కూడా సృష్టించుకొని, రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. సబ్జెక్ట్ ని మాత్రమే నమ్ముకొని సదరు సబ్జెక్టు ని అన్ని విభాగాల్లోను అగ్ర శ్రేణిగా నిలిపి, ప్రేక్షకుల అదరణని చూరగొనేలా చేయడంలో దిల్ రాజు కి తిరుగులేదు. ఇందుకు ఆయన సినీజర్నీనే ఒక ఉదాహరణ. అందుకు తగ్గట్టే విజయాలు శాతం కూడా ఎక్కువే. కానీ గత కొంత కాలంగా వెనకపడ్డాడు. ఈ విషయాన్నీ ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.