English | Telugu

దేవర శాటిలైట్ రైట్స్.. ఇంత లేట్ అవ్వడానికి అసలు కారణమేంటి..?

ఈమధ్య మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఆ వెంటనే టీవీలోనూ ప్రసారమవుతున్నాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ.. ఏడాది దాటినా శాటిలైట్ రైట్స్ విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో టీవీ ఛానల్స్ లో ఈ సినిమా ఎప్పుడు ప్రసారమవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించాయి. త్వరలోనే 'దేవర' చిత్రం టీవీలో ప్రసారం కానుంది. (Devara)

'దేవర' మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ స్టార్ గోల్డ్ లో అక్టోబర్ 26న టెలికాస్ట్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా స్టార్ మాలో త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ శాటిలైట్ రైట్స్, ఏకంగా ఏడాది తర్వాత అమ్ముడవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీని వెనుక రకరకాల కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

'దేవర' శాటిలైట్ రైట్స్ డీల్ ఆలస్యమవ్వడానికి కారణం నెట్ ఫ్లిక్స్ అని ఓ ప్రచారం ఉంది. 'దేవర' డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ ఓ కండిషన్ పెట్టిందట. అదేంటంటే, ఒక ఏడాది పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తప్ప ఎక్కడా స్ట్రీమ్ అవ్వకూడదని. అందుకే 'దేవర' శాటిలైట్ రైట్స్ విషయంలో ఇంత ఆలస్యం జరిగిందని అంటున్నారు.

ఇంకో ప్రచారం కూడా ఉంది. 'దేవర' సినిమా విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ కోసం స్టార్ గ్రూప్ ఒక బిగ్ అమౌంట్ ఆఫర్ చేసిందట. అయితే నిర్మాతలు ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయడంతో.. అప్పుడు డీల్ క్లోజ్ కాలేదట. రిలీజ్ తర్వాత కూడా స్టార్ గ్రూప్ ఓ మంచి అమౌంట్ ని ఆఫర్ చేసిందట. అప్పుడు కూడా నిర్మాతలు కాంప్రమైజ్ కాకపోవడంతో.. డీల్ హోల్డ్ లో పడిందట. ఇప్పుడు ఎట్టకేలకు నిర్మాతలు ఓ మెట్టు దిగిరావడంతో.. ఫైనల్ గా శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయిందని చెబుతున్నారు.

మరి ఈ రెండు ప్రచారాల్లో వాస్తవమేంటో తెలియదు కానీ.. ఎట్టకేలకు దేవర సినిమా టీవీలోకి వస్తుందన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.