English | Telugu

పవన్ కళ్యాణ్ ప్లేస్ లో మోహన్ బాబు.. ప్రముఖ దర్శకుడు చెప్పిన నిజం 

తెలుగు చిత్రపరిశ్రమతో దర్శకుడు 'ఎన్.శంకర్'(N Shankar)కి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సూపర్ స్టార్ కృష్ణ(Krishna),రమేష్ బాబు(Ramesh Babu)లు కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఎన్ కౌంటర్'(Encounter)తో శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పరిటాల రవి(Paritala Ravi)తండ్రి శ్రీరాములయ్య (Sriramulaiah)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శ్రీరాములయ్య హిట్ తో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జై బోలో తెలంగాణ వంటి పలు చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి.

రీసెంట్ గా శంకర్ ప్రముఖ మీడియా ఛానల్ 'తెలుగు వన్'(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా రెండో సినిమా శ్రీరాములయ్య తర్వాత నేను ఉషాకిరణ్ మూవీస్ లో సినిమా చెయ్యాలి. శ్రీ రాములయ్య సెట్స్ పై ఉన్నప్పుడే రామోజీరావు(Ramoji Rao)గారిని కలిసి కథని చెప్పాను. కథ ఆయనకి నచ్చడంతో హీరో ఎవర్ని అనుకుంటున్నావని అడిగితే పవన్ కళ్యాణ్ అని చెప్పాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని కలిసి కథ కూడా చెప్పాను. కానీ ఆ వైపు నుంచి వెంటనే రెస్పాన్స్ రాలేదు. ఈ లోపు శ్రీ రాములయ్య కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత కథల విషయంలో సెట్ అవ్వకపోవడంతో మళ్ళీ మోహన్ బాబు హీరోగానే యమజాతకుడు చేసానని శంకర్ చెప్పుకొచ్చాడు.

1999 వ సంవత్సరంలో యమజాతకుడు ప్రేక్షకుల ముందుకు రాగా, మోహన్ బాబు తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. పరుచూరి బ్రదర్స్ కథని అందించగా, మోహన్ బాబు సరసన సాక్షి శివానంద్ జత కట్టింది. రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .