English | Telugu

ప్రముఖ హీరోకి కీర్తి సురేష్ క్షమాపణలు.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ  

అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో ప్రముఖ హీరోయిన్ 'కీర్తి సురేష్'(Keerthy suresh)కూడా ఒకరు. కేరళ కి చెందిన కీర్తి బాల్యం నుంచే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతు, రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలజ క్యారక్టర్ లో క్యూట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, మొదటి చిత్రంతోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత చేసిన నేను లోకల్, అజ్ఞాతవాసి,సర్కారివారి పాట, దసరా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు కూడా కీర్తి రేంజ్ ని పెంచాయి. మహానటి తో అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ లెజండ్రీ యాక్ట్రస్ సావిత్రిగారి క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించి, సావిత్రి గారిని మన కళ్ళ ముందుకు మళ్ళీ సజీవంగా నిలబడేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 12 న 'ఆంథోనీ తటిల్' నిప్రేమ వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ప్రముఖ ఓటిటి ఛానల్ జీ 5 లో జగపతి బాబు(Jagapathi Babu)వ్యాఖ్యాతగా 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో(Jayammu NischayammuRaa Talk show) స్ట్రీమింగ్ అవుతు వస్తుంది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ కి కీర్తి సురేష్ గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు అంథోని నేను పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాం. ఇంట్లో వాళ్ళకి నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాను. వాళ్ళు వెంటనే ఓకే అన్నారు. ఇంట్లో వాళ్లకి చెప్పడం కంటే ముందే జగపతిబాబు గారికి చెప్పాను. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నా ప్రేమ గురించి తెలుసు. అలాంటి తక్కువ మందిలో జగపతి బాబు కూడా ఒకరు. జగపతి బాబు గారిని నమ్మాను కాబట్టే చెప్పాను. కానీ ఆయన్ని పెళ్ళికి పిలవలేదు అని చెప్పింది. అనంతరం ఈ విషయంపై జగపతిబాబుని క్షమాపణ కూడా కోరింది.

జగపతి బాబు, కీర్తి సురేష్ లు గుడ్ లక్ సఖి లో కలిసి నటించారు. సదరు చిత్ర కథ ప్రకారం కీర్తి సురేష్ కి కోచ్ గా జగపతి బాబు కనపడ్డాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మిస్ ఇండియాలో కూడా కలిసి చెయ్యడంతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే కీర్తి సురేష్ గత ఏడాది బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ ఏడాది ఆగస్టులో తనే ప్రధాన పాత్రలో 'రివాల్వర్ రీటా' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి రౌడీ జనార్ధన్ లో చేస్తుంది. ఇక కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. మళయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు వంద చిత్రాల వరకు హీరోయిన్ గా చేసింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో 'పున్నమి నాగు' లో కూడా జత కట్టి అలరించింది.తండ్రి సురేష్ మలయాళంలో అనేక హిట్ చిత్రాలని నిర్మించిన నిర్మాత.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .