English | Telugu

మరో వీడియో రిలీజ్‌ చేసిన శ్రీకాంత్‌.. ఎవరిని టార్గెట్‌ చేశాడు?

ఇటీవలికాలంలో సెలబ్రిటీస్‌ పలు సందర్భాల్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవి వివాదాస్పదం అవడం మనం చూస్తున్నాం. వారు చేసే కామెంట్స్‌ వల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. జనం నుంచి బాగా వ్యతిరేకత వచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పడం సర్వసాధారణంగా మారిపోయింది. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా నటుడు శ్రీకాంత్‌ భారత్‌గా చెప్పుకుంటున్న శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. మహాత్మగాంధీని నీచంగా అభివర్ణించడమే కాకుండా ఆయన స్వాతంత్య్రం తీసుకురాలేదు అని కామెంట్‌ చేశాడు. శ్రీకాంత్‌ చేసిన ఆ వీడియో బాగా వైరల్‌ అయింది.

ఈ విషయంపై కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మంచు విష్ణుని కలిసి శ్రీకాంత్‌ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలంటూ కంప్లయింట్‌ చేశారు. శ్రీకాంత్‌ చేసిన కామెంట్స్‌ వల్ల అతను నటించిన సినిమాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమా ప్రదర్శనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతను నటించిన సినిమా ప్రదర్శన ఆపాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. పరిస్థితి విషమిస్తుండడంతో ఎట్టకేలకు శ్రీకాంత్‌ క్షమాపణలు చెబుతూ మరో వీడియోను రిలీజ్‌ చేశాడు.

‘ఇటీవల చేసిన ఒక వీడియోలో నా కామెంట్స్‌ వల్ల చాలా మంది బాధపడ్డారని తెలిసింది. వారిని క్షమించమని కోరుతున్నాను. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. మనల్ని విడదీసే ఇలాంటి వ్యాఖ్యలు నా నుంచి రాకుండా చూసుకుంటాను’ అంటూ ఓ సుదీర్ఘమైన వీడియోను రిలీజ్‌ చేశారు. మరి శ్రీకాంత్‌ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. అయితే శ్రీకాంత్‌ని మరింత రెచ్చగొట్టడానికా అన్నట్టు గాంధీపై శ్రీకాంత్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘నువ్వు కరెక్ట్‌గా మాట్లాడావు అన్నా.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఓ పక్క దీనిపై రచ్చ జరుగుతుంటే మరోపక్క శ్రీకాంత్‌ని సపోర్ట్‌ చేస్తూ కామెంట్స్‌ పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.