English | Telugu

Guppedantha Manasu : నిజం చెప్పేసిన వసుధార.. అంతా వినేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1157 లో.....రిషి దగ్గరికి వసుధార స్వీట్ తీసుకొని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారని వసుధార అడుగుతుంది. అన్నయ్య ముందే వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు రాలేదని రిషి అంటాడు. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని రిషి అడుగుతాడు. అదేం లేదు సర్ అసలు ప్రొద్దున నుండి ఇప్పటివరకు మీతోనే ఉన్నాను నేనెలా చేస్తాను అని వసుధార అంటుంది. రసగుల్లా తినండి అని వసుధార అనగానే.. ఇప్పుడు స్వీట్ ఏంటని రిషి అడుగుతాడు. మీరు ఎండీ అయ్యారు కదా అందుకే మావయ్య స్వీట్ చెయ్యమని చెప్పారని వసుధార అంటుంది.

Brahmamudi : అప్పు మొదటి వంట.. కళ్యాణ్ ఏం చెప్పనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో.. కళ్యాణ్ తను గతంలో రాసిన పుస్తకం దొరకడంతో దాన్ని తీసుకుని ఆ పుస్తకం పబ్లిష్ చేసిన పబ్లీషర్ దగ్గరకు వెళ్లడంతో అతడు గతంలో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అంటు ఆరు వేలు చేతిలో పెటతాడు. కవితలు ఆపి, కథలు రాయమని చెప్తాడు. మరోవైపు అప్పూ చక్కగా జీన్స్ మీద కాస్త పొడవాటి టాప్ వేసుకునివేసుకునిమెడలోమెడలో పసుపు తాడు పైకి వేసుకుని చేతిలో గరిటె పట్టుకుని వంట చేస్తుంది. వంట అంటే మంట పెట్టుడే అనుకున్నా.. ఇందులో ఇన్ని వేయాల్నా.. ఇందులో సగం ఐటమ్స్ లేనే లేవు.. కూర ఎట్లుంటదో ఏంటో.. కవిగాడు ఎట్లా తింటాడో ఏమోనని అప్పు తనలో తానే మాట్లాడుకుంటూ.. వీడేంది ఇంకా రాలేదనినుకుంటుంది అప్పు ఇంతలో కళ్యాణ్ వచ్చి. అప్పూ. అని పిలుస్తాడు.

అనసూయను టార్గెట్ చేసిన రష్మీ...

రష్మీతో చిట్ చాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆడియన్స్ కానీ ఫాన్స్ కానీ రష్మీ-సుధీర్ జోడిని బాగా ఇష్టపడతారు. కానీ ఈ చిట్ చాట్ లో మాత్రం రష్మీ సుధీర్ ప్రస్తావన తేకుండా కాన్వెర్జేషన్ అంతా ప్రదీప్, అనసూయ గురించే మాట్లాడింది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేయడం కోసమే అనసూయను టార్గెట్ చేసి పంపేశారని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని అడిగేసరికి "అలా చేయలేదు. ఆమె తన ఫిలిమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పారు కూడా. ఎవరి ఎవరినో టార్గెట్ చేసి పంపేయడానికి ఇదేమన్నా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమా" అని కామెడీ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది "సినిమాల్లో నాకు మంచి రోల్స్ రాకపోవడానికి కారణం లక్ లేకపోవడం.

అనసూయ చేతులు నొక్కుతూ.. కోరిక బయటపెట్టిన శేఖర్ మాస్టర్

​కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో మాములుగా మాట్లాడినా చాలు అవి బూతులైపోతున్నాయి. ఈ వారం సెమి ఫినాలేకి దగ్గరయింది ఈ షో. ఐతే ఇందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. అది శేఖర్ మాస్టర్ చాలా కరెక్ట్ గా పూర్తి చేసి విన్ అయ్యాడు. అనసూయ ఓడిపోయింది. ఐతే శేఖర్ మాష్టర్ బాధపడుతూ నిన్నే గెలిపిద్దామనుకున్నా అనసూయ అనేసరికి పర్లేదు మాష్టర్ బాగా ఆడారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఎలా ఉన్నాయి మాష్టర్ అని రొమాంటిక్ గా అడిగింది అనసూయ. దానికి శేఖర్ మాష్టర్ వదలబుద్ది కావడం లేదు అని చెప్పేసరికి అందరూ అరిచారు. తర్వాత మళ్ళీ అనసూయ "నా కోసమో ఎవరి కోసమో కాదు ప్రేరణ అటొస్తే టఫ్ కాంపిటీషన్ బాగుంటుందేమో అని అనుకుంటున్నా అని చెప్పింది. సరే మరి నేను ఏది అడిగితె అది ఇస్తావా నువ్వు ..అది కూడా బయటకు చెప్పను చెవిలో చెప్తాను" అని శేఖర్ మాష్టర్ అన్నాడు .

Karthika Deepam2 : నా కూతురు కోసం వచ్చాను.. పారిజాతానికి షాకిచ్చిన కొడుకు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.... జ్యోత్స్న దీప రూమ్ కి తాళం వేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నావని సుమిత్ర అడుగుతుంది. దీపని తీసుకొని‌ బావ రెస్టారెంట్ కి వెళ్ళాడని జ్యోత్స్న అనగానే.. నేనే శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళమన్నానని సుమిత్ర అంటుంది. అంటావ్ ఎటైనా సరదాగా కూడా తిరిగి రమ్మని బావని పంపిస్తావ్ అని జ్యోత్స్న అనగానే..  తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతుంది సుమిత్ర. అప్పుడే దీప రావడం చూసి ఆగిపోతుంది. ఇదిలా తయారవ్వడానికి కారణం మీరే అంటు పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది.

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది.

Brahmamudi : రాజభోగాలు అనుభవించాల్సింది నా కొడుకే.. ధాన్యలక్ష్మి చేసిన రభస!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో... కళ్యాణ్, అప్పులని తీసుకొని రాకుండా రాజ్ ఒక్కడే వస్తాడు. దాంతో ఏమైంది రానని చెప్పాడా? ఎందుకు రాను అన్నాడని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుని మా అమ్మ కోడలుగా ఒప్పుకుందా అని అడిగాడు. నాకు పిన్ని అ విషయం గురించి ఏం చెప్పలేదు.. నేను కళ్యాణ్ కి ఏం చెప్పలేదు.. అప్పుని కోడలుగా ఒప్పుకొని తనే స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తే వస్తానని కళ్యాణ్ అన్నాడని రాజ్ చెప్పగానే.. అంటే ధాన్యలక్ష్మి వెళ్లి అప్పు కాళ్ళు పట్టుకొని రా మహాలక్ష్మి అంటూ పిలవాలా అని రుద్రాణి అంటుంది.