English | Telugu

మీరు పెళ్లి తప్ప అన్ని చేసుకుంటారు.. అదేంటో?

ఏ పండగైనా, ఏ వ్రతం ఐనా భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి చేసుకోవడం ఆనవాయితీ. కానీ కొంతమందికి మాత్రం అలా ఏమీ ఉండదు..పెళ్లి కాకుండా కలిసి వ్రతాలు, పూజలు చేసేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ బుల్లితెర సెలబ్రిటీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రియాంక జైన్, శివ్ కుమార్ విషయంలో అలాగే జరిగింది. ఇక నెటిజన్స్ ఐతే మాములుగా కామెంట్స్ చెయ్యట్లేదు. బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర హీరోయిన్ ప్రియాంక జైన్ వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. వరలక్ష్మీ వ్రతం అంటే పెళ్లి కాని అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. మరి ప్రియాంక జైన్ కి పెళ్లయిందా అంటే కాలేదు. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అంటూ వ్యూస్ కోసం కూడా ఎన్నో వీడియోస్ చేశారు..పెళ్లి చేసుకోకుండానే అన్ని గుడులకు, విహార యాత్రలకు వెళ్లారు.

ఇక ఈ వరలక్ష్మి వ్రతం విషయం నెటిజన్స్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే.."బాగా చేశారు..కానీ ఇది పెళ్ళైన వాళ్ళు చేస్తారు...ఇదేంటండి చాలా మంది పెళ్లి కాకపోయినా కూడా వ్రతాలు కలిసి కూర్చుని మరీ చేసుకుంటున్నారు. మీరే కాదు..చాలామంది సెలబ్రిటీస్ ఇలానే చేస్తున్నారు. ఇలా చేయడం అంత బాగోదేమో..మీరు ఒక్కరైనా చేసుకోవచ్చు. లేదా పెళ్లి అయ్యాకైనా చేసుకోవచ్చు. ఇలా పెళ్లి కాకుండా ఇద్దరూ కలిసి చేసుకోవడం ఎం బాలేదండి. పెళ్లి చేసుకోకుండా శివ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఏంటండీ...? పెళ్లి చేసుకోరు కానీ అన్నీ చేసేస్తున్నారు చూడలేకపోతున్నాం... పెళ్లి తప్ప అన్నీ చేసుకుంటారు అదేంటో మరి ?" అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.