English | Telugu

Eto Vellipoyindhi Manasu : నందినితో డీల్ కుదుర్చుకున్న సందీప్.. ఆ వేడుకల్లో తను చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -177 లో... శ్రీలత కావాలనే సీతాకంత్ చూడాలని.. దేవుడు ముందు చేతిలో కర్పూరం వెలిగిస్తూ.. నా బిడ్డ సీతాకాంత్ ఎప్పుడు బాగుండాలని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని శ్రీలత ప్రేమని చూసి పొంగిపోతుంటాడు. ఈవిడ ఇంత ఎక్స్ ట్రా చేస్తుందంటే మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నట్టుందని రామలక్ష్మి అనుకుంటుంది.

అ తర్వాత సీతాకాంత్ కి అందరు బర్త్ డే విషెస్ చెప్తుంటారు. పెద్దాయన దగ్గర సీతాకాంత్ ఆశీర్వాదం తీసుకంటాడు. శ్రీలత దగ్గర తీసుకోబోతుంటే.. ఇప్పుడు ఎందుకు? ఈవెనింగ్ బర్త్ డే కి వచ్చిన వారి ముందు తన భాగోతం బయటపెట్టి ఆశీర్వాదం తీసుకోమని రామలక్ష్మి అనగానే.. అందరూ షాక్ అవుతారు. అదే మంచితనం గురించి చెప్పి ఆశీర్వాదం తీసుకోండి అని రామలక్ష్మి కవర్ చేస్తుంది. దానికి సీతాకాంత్ సరేనంటాడు. ఆ తర్వాత నందిని దగ్గరకి రామలక్ష్మి బొకేతో వెళ్తుంది. రామలక్ష్మి థాంక్స్ అంటూ నందినికి చెప్తుంది. ఎందుకు థాంక్స్ ఒకరకంగా నా కంపెనీ డెవలప్ అవ్వాలని స్వార్థం కూడా ఉందని నందిని అంటుంది. మీ భర్త పుట్టిన రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయా అని నందిని అనగానే.. ఈ రోజు మా అయన పుట్టిన రోజు అని మీకెలా తెలుసని రామలక్ష్మి అంటుంది. అలా అనగానే కలిసి పని చేయబోతున్నాం.. ఆ మాత్రం తెలియదా అని నందిని అంటుంది. ఈ రోజు బర్త్ డే కీ రండి అని రామలక్ష్మి అనగానే.. నాకు వీలవ్వదని నందిని చెప్తుంది. ఎలాగైనా రావాలని రామలక్ష్మి అనగానే.. సరేనని నందిని అంటుంది. అదే టైమ్ కి నందిని దగ్గర కి సందీప్ వస్తాడు. రామలక్ష్మి చూస్తుందని దాక్కుంటాడు. రామలక్ష్మి వెళ్లకా నందిని దగ్గరికి సందీప్ వెళ్లి.. నాకు ఎండీ అవ్వాలని కోరిక మీరు సపోర్ట్ చెయ్యండి.. మీకు బెనిఫిట్ ఉందని సందీప్ అనగానే.. నాకు ఓకే అని నందిని అంటుంది. ఆ విషయం ఈ రోజు బర్త్ డే కి వస్తున్నాను కదా అక్కడ చెప్తానని నందిని అంటుంది.

అ తర్వాత నందిని డీల్ కీ ఒప్పుకున్న విషయం.. సందీప్ హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీలతకి చెప్తాడు. మరొకవైపు రామలక్ష్మి బర్త్ డే ఏర్పాట్లు చెయ్యండని పనిమనిషికి చెప్తుంది. అప్పుడే శ్రీలత వచ్చి.. ఏంటి బర్త్ డే ఏర్పాట్లు చేస్తున్నావా.. ఎంత ఆనందపడితే అంత బాధపడతావని శ్రీలత అనగానే.. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లుందని రామలక్ష్మి అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.