English | Telugu

Guppedantha Manasu : నిజం చెప్పేసిన వసుధార.. అంతా వినేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1157 లో.....రిషి దగ్గరికి వసుధార స్వీట్ తీసుకొని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారని వసుధార అడుగుతుంది. అన్నయ్య ముందే వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు రాలేదని రిషి అంటాడు. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని రిషి అడుగుతాడు. అదేం లేదు సర్ అసలు ప్రొద్దున నుండి ఇప్పటివరకు మీతోనే ఉన్నాను నేనెలా చేస్తాను అని వసుధార అంటుంది. రసగుల్లా తినండి అని వసుధార అనగానే.. ఇప్పుడు స్వీట్ ఏంటని రిషి అడుగుతాడు. మీరు ఎండీ అయ్యారు కదా అందుకే మావయ్య స్వీట్ చెయ్యమని చెప్పారని వసుధార అంటుంది.

అ తర్వాత ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటారు. వసుధార వంక రిషి రొమాంటిక్ గా చూస్తుంటాడు. మరొకవైపు మను మహేంద్రతో గతంలో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. కోపంగా గన్ తీసి మహేంద్ర ఫోటో వైపు చూస్తుంటాడు. అ తర్వాత ఫోటో పడేసి ఇన్ని రోజులు నాన్న అంటే చాలా కోపం పెంచుకున్నాను.. అలాంటింది ఇప్పుడేం చెయ్యలేకపోతున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్రలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మను కన్న తండ్రి మహేంద్ర అని తెలిసింది కదా.. ఇక మనుని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఇంకా కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఎండీ అవ్వొచ్చని దేవయాని అంటుంది. అసలు శైలేంద్ర ఎందుకు లేట్ వచ్చారు. ఏమై ఉంటుందని ధరణికి వసుధార ఫోన్ చేసి అడుగుతుంది. అత్తయ్యని కాలేజీకీ రావొద్దని మావయ్య చెప్పారు. కానీ ఏదో టెన్షన్ గా ఫోన్ మాట్లాడుతు ఏదో ఫోటో తీసి ఎవరికో పంపింది.. ఇదంతా మను వల్లే అని మా ఆయన అంటుంటే అత్తయ్య ఆపారని వసుధారకి ధరణి చెప్తుంది. అ తర్వాత ఏం జరిగి ఉంటుంది. మను తన తండ్రి మావయ్య అని తెలుసుకున్నాడా అని వసుధార ఆలోచిస్తుంది.

మరుసటిరోజు వసుధార ఆలోచిస్తుంది. అప్పుడే రిషి వస్తాడు. ఏమైందని అడుగుతుంది. మనం ఒకసారి అనుపమ గారిని కలిస్తే.. నా ఆలోచన బయలు మీకు తెలుస్తాయని వసుధార అనగానే.. సరే వెళ్లి ఇప్పుడే కలుద్దామని రిషి అంటాడు. వాళ్లు వెళ్తుంటే ఎక్కడికి అంటు మహేంద్ర అడుగగా.. అనుపమ గారి దగ్గరకి అని చెప్తారు. అయితే నేను వస్తానని మహేంద్ర అనగానే వద్దని వసుధార అంటుంది. అ తర్వాత వసుధార, రిషిలు అనుపమ దగ్గరికి వెళ్తారు. తరువాయి భాగంలో.. మను తండ్రి మావయ్యనే అని రిషితో వసుధార చెప్తుంది. దాంతో రిషి షాక్ అవుతాడు. అ మాటలు మహేంద్ర విని షాక్ అవుతాడు. అ తర్వాత మనుని శైలేంద్ర కలిసి.. నీ తండ్రి మా బాబాయ్ అని తెలిసింది కదా.. ఇప్పుడేం చెయ్యబోతున్నావని శైలేంద్ర అడుగుతాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.