English | Telugu

రోజు రోజుకీ పెరుగుతున్న మంజు క్రేజ్‌!

మంజు వారియ‌ర్ పేరు ఇంత‌కు ముందు మ‌న‌కు పెద్ద‌గా తెలుసో లేదో గానీ, లూసిఫ‌ర్ సినిమా పుణ్య‌మా అని ఇప్పుడు చాలా బాగా తెలుసు. మోహ‌న్‌లాల్ చెల్లెలి కేర‌క్ట‌ర్‌లో ఇచ్చిప‌డేసింది మంజు వారియ‌ర్‌. ఆ సినిమా త‌ర్వాత మంజు వారియ‌ర్ ఏ మూవీస్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ లాంగ్వోజ్‌లో సినిమాలు చేస్తున్నారు? ఆమె అభిరుచులు ఏంటి? వంటి ఆరాలు ఎక్కువ‌య్యాయి. దీంతో, ఆమె కేవ‌లం మ‌ల‌యాళ సినిమా రంగంలోనే కాదు, మూవీ లవ‌ర్స్ అంద‌రిలోనూ డిస్క‌ష‌న్స్ లో ఉంటున్నారు. ఆమె చేతినిండా ఇప్పుడు మ‌ల‌యాళం సినిమాలు ఉన్నాయి. అయినా కాల్షీట్‌ని అడ్జ‌స్ట్ చేసుకుని ఓ త‌మిళ మూవీకి డేట్లు ఇచ్చారు. ఆర్య‌, గౌత‌మ్ కార్తిక్ న‌టిస్తున్న మిస్ట‌ర్ ఎక్స్ లో కీ రోల్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు మంజు వారియ‌ర్‌. మ‌ను ఆనంద్ డైర‌క్ట్ చేస్తున్న సినిమా ఇది. ఇంత‌కు ముందు విష్ణు విశాల్‌తో ఎఫ్ ఐ ఆర్ సినిమాను తెరకెక్కించారు మ‌ను ఆనంద్‌.

మ‌ను ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో మిస్ట‌ర్ ఎక్స్ సినిమాలో మంజు వారియ‌ర్ యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది ప్రిన్స్ పిక్చ‌ర్స్ టీమ్‌. సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్‌ని అనౌన్స్ చేశారు. ఆమె పోస్ట‌ర్ కూడా అల‌రిస్తోంది. పోస్ట‌ర్ మీద ఉన్న తుపాకి, ఆమె ముఖం మీద ఉన్న చిరున‌వ్వు మిస్ మ్యాచ్ అవుతాయి. స‌మ్‌థింగ్ ఫిష్షీ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మంజు మేమ్‌తో ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని అన్నారు గౌత‌మ్ కార్తిక్‌. ఈ ఏడాది ఆమె న‌టించిన తునివు విడుద‌లైంది. ఈ సినిమా నుంచే ఆమెకు అజిత్‌తో ఫ్రెండ్‌షిప్ మొద‌లైంది. వీరిద్ద‌రూ క‌లిసి బైక్ రైడ్స్ వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.