English | Telugu

ఫేక్ పోస్టర్స్, ఫేక్ రేటింగ్స్ పై నిర్మాత అనిల్ సుంకర రియాక్షన్..!

Publish Date:Jan 13, 2026

  ఇటీవల సినిమాల ఫేక్ కలెక్షన్ పోస్టర్స్, బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఆయన నిర్మించిన 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రెండు అంశాలపై స్పందించారు.   "కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేయడం అనేది నిర్మాతల వ్యక్తిగతం. నా వరకు నేను ఎప్పుడో ఆపేశాను. ఎవరికి వాళ్ళు ఆపేస్తారు. ఒకప్పుడు ప్రెజర్ ఉండేది. దానిని ఒక పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. గ్రాస్ కి, షేర్ కి తేడా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. దూకుడు సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని పోస్టర్ వేశాం. అది చూసి మీకు వంద కోట్లు వచ్చేశాయా అన్నారు. వంద కోట్లు అంటే అందులో మాకు వచ్చేది నలభై. అది తెలీదు ఎవరికీ. ఆడియన్స్ ఆ నెంబర్ చూసి అట్రాక్ట్ అవుతారు కదా. అది ఓ రకంగా ప్రమోషనల్ స్ట్రాటజీ. అయితే ఇప్పుడది మిస్ ఫైర్ అవుతుంది. మేము పోస్టర్స్ వేయడం మానేశాము." అని కలెక్షన్ పోస్టర్స్ పై అనిల్ సుంకర తన అభిప్రాయాన్ని తెలిపారు.   https://x.com/Theteluguone/status/2010970920945594609?s=20   Also Read: మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ   ఇక బుక్ మై షోలో రివ్యూలు, రేటింగ్ లపై కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడంపై అనిల్ సుంకర స్పందిస్తూ.. "బుక్ మై షో వంటి యాప్స్ లో లైక్స్, రేటింగ్స్ కావాలంటే డబ్బులు కట్టాలి. ఎక్కువ రేటింగ్ కావాలంటే ఇంత ప్యాకేజ్ తీసుకోవాలి అనే లెక్కలు ఉంటాయి. అది వాళ్ళ బిజినెస్. కానీ దాని వల్ల నిర్మాతలకు నష్టం జరుగుతుంది. అందుకే దీనికి బ్రేకులు వేయాలి అనుకున్నాం. ఆ దిశగా చిరంజీవి గారి సినిమా అడుగు వేసింది. మేము దానిని కొనసాగిస్తాం." అన్నారు.   https://x.com/Theteluguone/status/2010973549423706119?s=20  

MSG creates huge Mega Euphoria at the Box Office

Publish Date:Jan 13, 2026

Mana Shankara Vara Prasad Garu has officially ignited the Sankranti box office, proving once again why Chiranjeevi is hailed as the "Boss" of Telugu cinema. This collaboration with director Anil Ravipudi has struck a chord with the masses, offering a perfect blend of vintage comedy and heartwarming family drama that audiences were craving. The film has set the box office on fire, grossing a phenomenal Rs.84+ crores worldwide on its opening day. This staggering figure marks the highest opener in the Megastar’s illustrious career, surpassing his previous records by a significant margin. While the overseas market saw a rampage with $1.5 million+ from US premieres alone, the domestic centers in AP and Nizam are witnessing unprecedented footfalls. The "Mega Magic" is clearly visible on ticketing platforms, as MSG has sold over 1.2 Million tickets in record time. BookMyShow has been trending with "Housefull" boards across cities, with more than 3,000 tickets being sold every hour even on weekdays. The demand from family audiences has been so immense that extra shows are being added in several territories to keep up with the festive rush. The film’s success is being attributed to the "unmatched fun" generated by the Chiru-Anil Ravipudi combination. With Victory Venkatesh adding a massive boost in his extended cameo and Nayanthara delivering a graceful performance, the film has become the primary choice for the holiday season. Produced by Sahu Garapati and Sushmita Konidela, MSG is currently dominating the screens and is poised for a long, record-breaking run through the Sankranti holidays. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

తన కథలతో అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Publish Date:Jan 7, 2026

(జనవరి 7 కె.భాగ్యరాజా పుట్టినరోజు సందర్భంగా..) ప్రస్తుతం హీరోలను బట్టి కథలు తయారు చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మార్కెట్‌ ఉంది, ఎలాంటి ఇమేజ్‌ ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. కానీ, కానీ,  పాత రోజుల్లో మొదట కథ అనుకొని దాన్ని పూరిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే సూట్‌ అవుతాడు అనేది ఆలోచించేవారు. 1980కి ముందు సినిమాలు ఈ విధంగానే రూపొందేవి. ఆ తర్వాత హీరోని బట్టి కథలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా కథను నమ్ముకొని సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు కె.భాగ్యరాజా.    ఎన్నో అద్భుతమైన సినిమాలకు రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్‌. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం.    1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్‌ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్‌. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్‌ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్‌ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్‌ అయ్యాయి.    1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్‌ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్‌ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్‌, కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్‌ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు.   1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్‌ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్‌ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్‌ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్‌ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్‌.

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

Brahmamudi : అక్క డెలివరీకి బావని వెళ్ళొద్దని ఆపేసిన చెల్లి!

Publish Date:Jan 13, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -928 లో......మినిస్టర్ భార్య డెలివరీకి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది. మినిస్టర్ టెన్షన్ పడుతుంటే డాక్టర్ ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ కావ్య దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి కావ్య తన గది లోపల ఉండదు. అదే విషయం బయటకు వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు షాక్ అవుతారు. వదిన అన్నయ్య దగ్గరికి వెళ్లి ఉంటుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానని కళ్యాణ్ వెళ్తాడు. మరొకవైపు స్టేషన్ లో ఉన్న రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. తనని చూసి నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. నాకు డెలివరీ అయ్యే టైమ్ లో నా పక్కనే ఉంటానని మాటిచ్చారు. నా పక్కన ఉండాలిసిందేనని కావ్య అంటుంది. కావ్య వెళ్లి ఇన్‌స్పెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడే కళ్యాణ్ వచ్చి కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ కావ్యకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. డాక్టర్ బయటకు వచ్చి అపర్ణ వాళ్ళపై కోప్పడుతుంది. మేము కావ్య పరిస్థితి ఏంటో చెప్తున్నాం అయిన మీరు తనకి నచ్చచెప్పడం లేదని అంటుంది. ఆ తర్వాత రాజ్ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేసి ఫోన్ తీసుకుంటాడు. కళ్యాణ్ కి ఫోన్ చేసి.. నేను న్యాయంగానే స్టేషన్ నుండి బయటకు వద్దామనుకున్న కానీ కావ్య పరిస్థితి చూసి రాక తప్పడం లేదు. నువ్వు స్టేషన్ కి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్లు చెప్పు అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో రాజ్ స్టేషన్ నుండి తప్పించుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. రాజ్ వెళ్లకుండా అప్పు ఆపుతుంది. నేను రూల్స్ బ్రేక్ చెయ్యనని అప్పు అనగానే.. నువ్వు మమ్మల్ని దాటుకొని వాడిని ఎలా వెళ్లానివ్వవో చూస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

The Raja Saab

Publish Date:Dec 31, 1969

Psych Siddhartha

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969