English | Telugu
Jayam Serial : ఇంటి నెలఖర్చులకి గంగకి డబ్బు ఇచ్చిన శకుంతల.. ఇషిక ఏం చేయనుంది!
Updated : Jan 16, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -169 లో..... సూపర్ మార్కెట్ ని తగలబెట్టింది వీరు అని గంగకి అర్థమవుతుంది. వీరు దగ్గరికి గంగ వెనకాల నుండి వచ్చి తన పీకపై చున్నీ వేసి లాగుతుంది. దాంతో వదిలెయ్ అని వీరు భయపడుతాడు. నన్నే చంపాలని చూస్తావా.. నీ సంగతి చెప్తానని వీరు అంటాడు. నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసని వీరుకి గంగ వార్నింగ్ ఇస్తుంది.
అ తర్వాత పెద్దసారు బయటకు వెళ్తే.. అక్కడ లక్ష్మీ కనిపిస్తుంది. తనతో లక్ష్మీ మాట్లాడుతుంది. గంగ పోటీలో గెలిచిందా అని లక్ష్మీ అడుగగా.. లేదు ఓడిపోయిందని పెద్దసారు జరిగింది మొత్తం చెప్తాడు. ఒకసారి గంగతో మాట్లాడుతానని లక్ష్మీ అంటుంది. వెంటనే రుద్రకి పెద్దసారు ఫోన్ చేస్తాడు. ఇక పెద్దసారు ఫోన్ ని లక్ష్మీకి ఇస్తాడు. రుద్రతో లక్ష్మీ మాట్లాడి తర్వాత గంగతో మాట్లాడుతుంది. సూపర్ మార్కెట్ ఎటాక్ గురించి గంగ చెప్పబోతుంటే రుద్ర ఫోన్ తీసుకొని ఇక్కడ అంతా బానే ఉంది.. మీరేం కంగారు పడకండి అని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇషిక ఇంట్లో మెయింటెనెన్స్ సరిగ్గా చెయ్యడం లేదని పెద్దసారు అంటాడు. గంగ చూడు సూపర్ మార్కెట్ ని ఎలా చూసుకుంటుందోనని పెద్దసారు అంటాడు.
అయితే గంగకి ఇంటి మెయింటెనెన్స్ ఇవ్వండి అని ఇషిక అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి వద్దు గంగ అని సైగ చేస్తాడు. ఇంట్లో అందరు గంగకి ఇవ్వాలని అంటారు. ఒకసారి చేస్తే కదా తెలుస్తుందో లేదోనని శకుంతల అంటుంది. గంగకి శకుంతల కొంత డబ్బు ఇచ్చి.. ఇవి ఈ నెల ఖర్చులకి సరిపెట్టాలని శకుంతల అనగానే గంగ తీసుకొని తన గదిలో ఉన్న బట్టల్లో దాస్తుంది అది ఇషిక చూస్తుంది. ఆ తర్వాత గంగ పేరెంట్స్ రుద్రని చూడడానికి వస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.