English | Telugu

Jayam serial: నిప్పు అంటించింది వీరూనే అని చెప్పేసిన గంగ.. రుద్ర నమ్ముతాడా?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-168లో.. గంగ ఇంటికి రాగానే హారతి తీసుకొని వస్తుంది శకుంతల. దాని మీద ప్రమాణం చేసి చెప్పు.. ఇంకెప్పుడు బాక్సింగ్ ఆడనని ప్రమాణం చేసి చెప్పమని గంగతో శకుంతల అంటుంది. ‌ఇక బాక్సింగ్ దగ్గర ఏం జరిగిందో గంగ ఏడుస్తూ చెప్తుంది. ‌ రుద్రకి ప్రాణహాని ఉందని తెలిసి నేను లాస్ట్ మినిట్ లో రింగ్ నుండి బయటకు వచ్చాను లేదంటే గెలిచేదాన్ని అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. నన్ను ఛాంపియన్ గా చేయాలనేది రుద్ర సర్ కల..‌దయచేసి దానిని పాడుచేయొద్దు..‌ కావాలంటే నేను ఏ శిక్ష అయిన భరిస్తాను నన్ను క్షమించండి అత్తయ్య అని శకుంతల కాళ్ళ మీద పడి ఏడుస్తుంది‌. ఇక గంగ ఏడ్వడం చూసి శకుంతల ఏం చేయలేకపోతుంది.

ఇక రుద్ర ఆలోచిస్తూ సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అందులో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇక రుద్రని వెతుక్కుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది గంగ. అదే సమయంలో మాస్క్ వేసుకున్న ఒకడు సూపర్ మార్కెట్ పైకి నిప్పు అంటించిన కర్రని విసిరేయడం గంగ చూస్తుంది. దాంతో వెంటనే లోపలికి వెళ్తుంది గంగ. నువ్వెందుకు వచ్చావ్ గంగ అని రుద్ర అడుగుతాడు. మీరెక్కడుంటే అక్కడే ఉంటానని గంగ అంటుంది. కాసేపటికి ఇద్దరు ఫైర్ నుండి బయటకి వస్తారు.

మరోవైపు ఇలా సూపర్ మార్కెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని విషయం ఇంట్లో తెలుస్తుంది. పెద్దసారు, శకుంతలతో పాటు ఇంట్లోని వాళ్ళంతా టెన్షన్ పడతారు. కాసేపటికి గంగ, రుద్ర ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి అందరు కంగారుపడతారు. ఏం జరిగిందని శకుంతల అడుగుతుంది. గంగ ఏదో చెప్పబోతుంటే తనని రుద్ర ఆపి.. ‌ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తాడు. ఇంట్లో అన్నీ అశుభాలే జరుగుతున్నాయి.. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలని శకుంతల అంటుంది.

మరుసటి రోజు రుద్ర ఒక్కడే కూర్చొని బాధపడుతుంటే ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి.. ఇది ఎలా జరిగిందని అడుగుతారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలని చేశారని రుద్ర అంటాడు. దాంతో అందరు టెన్షన్ పడతారు. ఇక అప్పుడే వీరు వచ్చి టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తాడు.

ఇక గంగ కాఫీ తీసుకొని వచ్చి రుద్రకి ఇచ్చి వెళ్తుంటుంది. అదే సమయంలో ఒకతను వీరుని చూసి.. తలకి ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు. అది వింటుంది గంగ. నిన్న ఫైర్ యాక్సిడెంట్ చేసిన వాడిని తలపై కొట్టింది గంగకి గుర్తొస్తుంది. వీడే ఫైర్ యాక్సిడెంట్ కి కారణం.. నేను రాయితో కొట్టానని గంగ అంటుంది. అది విన్న రుద్ర.. వెంటనే గంగని తన గదికి తీసుకొని వెళ్తాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలతో మాట్లాడాలి.. నువ్వు నిరూపించలేనప్పుడు అలా‌ అనకూడదు.. ఇంతకముందు నాకు ఇలాగే జరిగిందని గంగని రుద్ర హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.