అందుకే సబితకు టికెట్ ఇవ్వలేదా?

  జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చార్జ్ షీట్లో పేరెక్కినందుకు తన హోంమంత్రి పదవిని కోల్పోయిన సబితా ఇంద్రారెడ్డి, కనీసం ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు టికెట్ ఇవ్వలేదు గానీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న ఆమె కొడుకు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది.   దానికే ఆమె తృప్తి పడినప్పటికీ, ఆమెకు ఆ సంతోషం కూడా మిగలనీయకుండా సీబీఐ ఓబులాపురం గనుల వ్యవహారంలో ఆమెపై మరో సరికొత్త అభియోగం మోపి ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ మరో చార్జ్ షీటు సిద్దం చేస్తోంది. ఆమెపై ఐ.పీ.సి. సెక్షన్స్120 (బి) రెడ్ విత్ 420, 472, 468, 447, 409 మరియు అవినీతి నిరోధక చట్టం-1998లో సెక్షన్స్13(2) రెడ్ విత్ 13(1)(డీ) అభియోగాలు మోపుతూ సీబీఐ చార్జ్ షీట్ సిద్దం చేసి ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.   బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి చాలా కాలం క్రితమే ఈ విష్యం తెలిసి ఉండిఉండవచ్చును. బహుశః అందువల్లే సబితకు టికెట్ నిరాకరించి ఆమె కొడుకుకి మాత్రమె ఇచ్చి ఉండవచ్చును. ఈ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఓడిపోయినట్లయితే, సీబీఐ, ఈడీ తదితర సంస్థలన్నీ అటకేక్కించేసిన ఈ అక్రమాస్తుల, గనుల కేసులన్నిటినీ మళ్ళీ దుమ్ము దులుపి బయటకు తీస్తారేమో!

అల్లు అర్జున్ మామకు టీఆర్ఎస్ టికెట్

      టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మామగారికి తెరాస టికెట్ లభించింది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేసింది. గతంలో శేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరపున మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగెందుకు తీవ్రంగా ప్రయత్ని౦చారు. కానీ ఫలితం దక్కలేదు. దాంతో కాంగ్రెస్ కి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తుది విడద అభ్యర్థుల జాబితాను బుధవారం హైదరాబాద్లో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడుదల చేశారు. దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి, కుసుకుంట్ల - ప్రభాకర్ రెడ్డి, పాలేరు - రావెళ్ల రవీందర్, ఇల్లెందు -చుంచు నాగేశ్వరరావులకు కేటాయించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (తెలంగాణా) అభ్యర్దులు

  కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దపడగానే ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమైక్య శంఖారావం పూరిస్తూ తెలంగాణా నుండి మూటాముల్లె సర్దుకొని బయటపడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణాలో కూడా పోటీకి సిద్దమవుతోంది. ఈరోజు వైకాపా తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.   పార్లమెంట్ అభ్యర్థులు మల్కాజ్‌గిరి- వి.దినేష్ రెడ్డి, మెదక్ –ప్రభుగౌడ్, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరీం నగర్ - మీసాల రాజారెడ్డి, నిజామాబాద్- ఎస్.రవీందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు- జె.ధర్మరాజ్, మహబూబ్‌నగర్ -ఎస్.ఎ.రెహమాన్, నల్లగొండ - గున్నం నాగిరెడ్డి, చేవెళ్ల-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్ -ఆదె లీలారాణి, జహీరాబాద్- ఎండీ మొహియుద్దీన్, హైదరాబాద్- బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహబూబాబాద్- తెల్లం వెంకట్రావ్,   అసెంబ్లీ అభ్యర్థుల జాబితా: సిర్పూర్- షబ్బీర్ హుస్సేన్, చెన్నూరు- మేకల ప్రమీల, బెల్లంపల్లి-ఎరుకల రాజ్‌కిరణ్, మంచిర్యాల-సయ్యద్ అఫ్జలుద్దీన్, ఆసిఫాబాద్-మహేశ్వరం శంకర్, ఆదిలాబాద్-బి.అనిల్‌కుమార్, బోథ్- గేదెం తులసీదాస్, నిర్మల్-అల్లూరి మల్లారెడ్డి, ఆర్మూర్- ఎస్‌కె మహబూబ్, బోధన్-కే.సుదీప్‌రెడ్డి, జుక్కల్-యన్.ప్రకాష్, బాన్సువాడ-రావుట్ల శోభనా మహేందర్‌గౌడ్   ఎల్లారెడ్డి-పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి, కామారెడ్డి- పైలా కృష్ణారెడ్డి, నిజామాబాద్ (అర్బన్)- అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నిజామాబాద్ (రూరల్)-బీ.గంగారెడ్డి, బాల్కొండ-పీ.మురళి, కోరుట్ల-ఏ. సంతోష్‌రెడ్డి, జగిత్యాల-కే.సంధ్యాశివకుమార్, ధర్మపురి-అక్కన్నపల్లి కుమార్, పెద్దపల్లి-ఎం.ఎ.ముస్తాఖ్‌పాష   కరీంనగర్-కే.నాగేశ్, చొప్పదండి-యం.ప్రతాప్, వేములవాడ-యం.వెంకటరెడ్డి, సిరిసిల్ల-వీ.శ్రీధర్‌రెడ్డి, మానకొండూరు-యస్. అజయ్‌వర్మ, హుజూరాబాద్-యస్. నరేష్, హుస్నాబాద్- యస్.భాస్కర్‌రెడ్డి, మెదక్-ఏ.కృష్ణదాస్, నారాయణఖేడ్- అప్పారావు షెట్కర్, నర్సాపూర్- డి.బస్వానందం   జహీరాబాద్-యన్.సూర్యప్రకాష్, సంగారెడ్డి- జి.శ్రీధర్‌రెడ్డి, దుబ్బాక-శ్రావణ్‌కుమార్, గజ్వేల్-డీ.పురుషోత్తంరెడ్డి, మల్కాజ్‌గిరి-జీ.సూర్యనారాయణరెడ్డి, కుత్బుల్లాపూర్-కే. శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల్-ఏ.పద్మారెడ్డి, ఇబ్రహీంపట్నం-ఎరుకల చంద్రశేఖర్, ఎల్బీనగర్-పీ. ప్రతాప్‌రెడ్డి, మహేశ్వరం-డీ. భాస్కర్‌రెడ్డి   రాజేంద్రనగర్-ముస్తాబా అహ్మద్ సయ్యద్, శేరిలింగంపల్లి- ముక్కా రూపానందరెడ్డి, వికారాబాద్- సీ. క్రాంతి కుమార్, మలక్‌పేట-యల్.హరిగౌడ్, ఖైరతాబాద్- పి.విజయారెడ్డి, జూబ్లీహిల్స్- కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సనత్‌నగర్-వీ.రాంమోహన్, కార్వాన్- బి.శ్రీకాంత్‌లాల్   సికింద్రాబాద్- ఏ.విజయ్‌కుమార్, కంటోన్మెంట్- పి.వెంకట్రావ్, నాంపల్లి-సిద్దిఖీ, ముషీరాబాద్-బాల్‌రెడ్డి, నారాయణపేట- పి.జయదేవరెడ్డి, మహబూబ్‌నగర్-టీ. శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్- వి.జగన్నాధరెడ్డి, అలంపూర్-బీ.లక్ష్మణ్, నాగర్‌కర్నూల్-యం. శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట- బి.రవీందర్   కల్వకుర్తి-ఏ.కిష్టారెడ్డి, కొల్లాపూర్-వై.మహేశ్వరి, దేవరకొండ-జే.నాగేశ్వర్ రావు నాయక్, నాగార్జునసాగర్- ఎం.రవీందర్‌రెడ్డి, హుజూర్‌నగర్- గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సూర్యాపేట-బీరవోలు సోమిరెడ్డి, మునుగోడు- ఎం.గవాస్కర్‌రెడ్డి, భువనగిరి-జీ.జైపాల్‌రెడ్డి. నకిరేకల్- ఎన్.స్వామి, తుంగతుర్తి-ఐ.వెంకటేశ్వర్లు   స్టేషన్ ఘన్‌పూర్-విలియం మునిగాల, డోర్నకల్-సుజాత బానోత్, వరంగల్ వెస్ట్-భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, వర్దన్నపేట-బి.రాజయ్య, భూపాలపల్లి-అప్పం కిషన్, ములుగు-యల్. సంపతి, పినపాక-పీ.వెంకటేశ్వర్లు, ఇల్లందు- జి.రవిబాబు, వైరా- బానోతు మదన్‌లాల్ నాయక్, సత్తుపల్లి-మట్టా దయానంద్, కొత్తగూడెం- వనమా వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట-టీ.వెంకటేశ్వర్లు

తెదేపా తుది జాబితా విడుదల

  పొత్తుల కారణంగా సీట్లు కోల్పోయిన వారు, టికెట్స్ ఆశించి భంగపడినవారు, పార్టీలోకి కొత్తగా వచ్చినవారు తమకు దక్కాల్సిన టికెట్స్ తన్నుకుపోవడంతో ఆగ్రహంగా ఉన్నవారితో అన్ని పార్టీలు అట్టుడికిపోతున్నాయి. తెదేపా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. అయినా ఈరోజే తెలంగాణాలో నామినేషన్లు వేసేందుకు ఆఖరి రోజు కావడంతో తెదేపాతో సహా అన్ని పార్టీలు తమ తుది జాబితాలను ప్రకటించి, అభ్యర్ధులకు బీ-ఫార్మ్స్ అందజేస్తున్నాయి. మల్కాజ్ గిరీ నుండి లోక్ సభకు పోటీ చేయాలనుకొన్న రేవంత్ రెడ్డికి నిరాశ తప్పలేదు. ఆ సీటుని పార్టీలోకి, రాజకీయాలలోకి కొత్తగా అడుగిడుతున్న మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి ఇచ్చి, రేవంత్ రెడ్డిని మళ్ళీ ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న కొండగల్ అసెంబ్లీ నియోజకవర్గానికే పంపివేశారు. ఈరోజు విడుదలయిన తెదేపా తుది జాబితాలో టికెట్స్ దక్కించుకొన్నప్రముఖులు: లోక్ సభ: నామ నాగేశ్వరరావు-ఖమ్మం మల్లా రెడ్డి-మల్కాజ్ గిరి చిన్నపరెడ్డి-నల్గొండ టీ.వీరేంద్ర గౌడ్-చేవెల్ల బక్క నరసింహులు- నగర్ కర్నూల్ డా.జే.శరత్ బాబు-పెద్దపల్లి. అసెంబ్లీ: ఆర్.కృష్ణయ్య-ఎల్బీ నగర్ రేవంత్ రెడ్డి-కొండగల్ మోత్కుపల్లి నరసింహులు-మధిర సీతా దయాకర్ రెడ్డి-దేవరకద్ర రావుల చంద్రశేఖర్ రెడ్డి-వనపర్తి కొత్తకోట దయాకర్ రెడ్డి-మక్తల్ ఎర్రబెల్లి దయాకర్ రావు-పాలకుర్తి తుమ్మల నాగేశ్వర రావు-ఖమ్మం కూన వెంకటేష్ గౌడ్-సికింద్రాబాద్ మిర్జా యాసిన్ బేగ్-నిర్మల్.

కేంద్రమంత్రిపై కేసు : పదవి ఉక్కు.. పెదవి తుక్కు!

  కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బేణీ ప్రసాద్ వర్క పేరుకే ఉక్కు మంత్రి గానీ, ఆయన నోరు తెరిచారంటే తిట్ల పురాణమే. దేశ రాజకీయాలలో నోరేసుకుని బతికిపోతున్న అనేక మంది రాజకీయ నాయకులలో బేణీ ప్రసాద్ వర్మ కూడా ఒకరు. అందర్నీ తిట్టినట్టే వర్మ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కూడా తిట్టారు. ఆయన మోడీని ‘బిగ్గెస్ట్ గూండా ఆఫ్ ఆర్ఎస్ఎస్’ అని తిట్టారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మోడీ దగ్గర బానిసలా పనిచేస్తున్నాడని నోరు పారేసుకున్నారు. అలా నోరు పారేసుకున్నదానికి రియాక్షన్ వచ్చేసింది. బేణీ ప్రసాద్ వర్మ ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారని అధికారులు బలరాంపూర్‌లో కేసు నమోదుచేశారు. అయినా బేణీ ప్రసాద్ వర్మకి ఇలా ఎన్నికల కేసులలో ఇరుక్కోవడం మామూలే. పరిమితికి మించి వాహనాలు ఉపయోగించినందుకు కూడా ఆయన మీద కేసు నమోదైంది.

కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ : ఎవరా ఇద్దరు ఎంపీలు?

  మొన్న ఏఐసీసీ ప్రతినిధి హైదరాబాద్ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అద్దంకి దయాకర్, వెంకటస్వామి, గజ్జెల కాంతం పేర్లు లిస్టులో వున్నాయి. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన లిస్టులో ఈ ముగ్గరి పేర్లు గల్లంతు కావడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్యమకారులకు టిక్కెట్లు ఇస్తామని పొన్నల చేత ప్రకటన ఇప్పించింది. ఇదిలా వుంటే టిక్కెట్లు వచ్చినట్టే వచ్చి, అంతలోనే చేజారిపోయి, ఇంతలోనే మళ్ళీ టిక్కెట్లు రాబోతున్న ముగ్గురు ఉద్యమకారులకు మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది. గజ్జెల కాంతంకి కంటోన్మెంట్, వెంకటస్వామికి నర్సంపేట టిక్కెట్, అద్దంకి దయాకర్‌కి తుంగతుర్తి టిక్కెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఒప్పుకుందట. ఈ విషయాన్ని అద్దంకి దయాకర్ తెలిపారు. అధిష్ఠానం తమ పేర్లు ప్రకటించాక ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి తాజా లిస్టులో తమ పేర్లు లేకుండా చేశారని అద్దంకి దయాకర్ అంటున్నారు. దాంతో ఇప్పుడు అందరి ఆలోచన ఆ ఇద్దరు ఎంపీలు ఎవరన్నదానిమీద కేంద్రీకృతమైంది.

ఓడిపోయే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు!

  ఈ ఎన్నికలలో తెలంగాణలో గ్యారెంటీగా ఓడిపోయేవారికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తోందట. ఈ మాట అంటోంది వేరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళా కార్యకర్తలు. వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు అన్యాయం చేసిందని వాళ్లు పేర్కొన్నారు. అధిష్ఠానం ఎంపిక చేసిన చాలామంది అభ్యర్థులు ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయేవారేనని జోస్యం చెప్పారు. ఎవరికి గెలిచే సత్తా లేదో వాళ్ళనే వెతికిమరీ ఎంపిక చేసినట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ఎంతమాత్రం న్యాయం చేయలేదని వారు అన్నారు.

అమెరికా కేసు : సోనియా కుంటి సాకు

  సిక్కుల ఊచకోతకి సంబంధించి అమెరికా కోర్టు సోనియాగాంధీని నిను వీడని నీడను నేనే అన్నట్టు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు సోనియాగాంధీ పీకకి తాచుపాములా చుట్టుకుంది. ఎప్పుడు సోనియా సదరు పాము కాటుకి గురవుతుందో అర్థంకానట్టుంది. ఆమధ్య సోనియా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమెకు ఈ కేసుకు సంబంధించిన నోటీసులను అమెరికా ప్రభుత్వం జారీ చేసింది. వాటిని సోనియా లక్ష్యపెట్టకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా అమెరికా సోనియాని తన పాస్ పోర్ట్ కాపీ తమకు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సోనియమ్మ చాలా అతి తెలివిగా స్పందించింది. తన పాస్ పోర్ట్ కాపీ చాలా సీక్రెట్‌గా వుంచాల్సిన అవసరం వుందని, తన పాస్ పోర్ట్ వివరాలు బయటపడితే తనకు రక్షణకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుందని కుంటిసాకు చెబుతూ అమెరికా నోటీసులకు జవాబిచ్చింది. వీపు మీద కొడితే పళ్ళు రాలతాయన్నట్టు తన పాస్ పోర్ట్ కాపీ అమెరికాకి ఇస్తే సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు ఎందుకొస్తాయో సోనియానే చెప్పాలి. మొత్తమ్మీద ఈ ఇటాలియన్ బామ్మకి చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాగానే వున్నాయి.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: శంకర్రావు

  ఈసారి ఎన్నికలలో తాను ఇండిపెండెంట్‌గా కంటోన్మెంట్ నియోజకవర్గం బరిలో నిలువనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.శంకరరావు ప్రకటించారు. వివాదాస్పద వ్యక్తిగా నిలిచిన శంకర్రావుకు ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఎంత బాగా సోనియాగాంధీ భజన చేసిన శంకర్రావు పప్పులు ఉడకలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శంకర్రావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. పొన్నాల టిక్కెట్లను అమ్ముకుని తనకు టిక్కెట్ రాకుండా చేశాడని విరుచుకుపడ్డాడు. కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లో టిక్కెట్ల పంపిణీ వ్యవహారం జరగడంతో తనకు ఈసారి టిక్కెట్ రాలేదని శంకర్రావు వాపోతూ చెప్పాడు. టీ కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపు మీద సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కామెడీ డిమాండ్ చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వీర విధేయుడినని, కాంగ్రెస్ పార్టీని వీడిపోనని ఆయన ప్రకటించాడు. కాకపోతే ఈసారి ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు శంకర్రావు వెల్లడించాడు. జలయజ్ఞంలో జరిగిన అవినీతిపై తాను అలుపులేని పోరాటం చేసినందునే తనమీదక కక్షకట్టినవాళ్ళు తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

బిక్షపతిని గెంటేశారు!

  టీఆర్ఎస్‌లో కొత్తగా చేరిన కొండా సురేఖ దంపతులు పార్టీ మీద తమ ప్రభావం చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టిన సురేఖ అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్ఎస్‌లో చేరడమే ఒక వింత. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా డోన్ట్ కేర్ అన్నట్టుగా వున్న కొండా సురేఖ దంపతులు పార్టీ మీద పట్టు బిగిస్తున్నారు. ఏ స్థాయిలో పట్టు బిగించారంటే, వాళ్లిద్దరికీ టీఆర్ఎస్ నుంచి సీటు కన్ఫమ్ చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీలో తమకు ఇష్టంలేని వారిని దెబ్బతీసేంత స్థాయిలో పట్టు బిగించారు. వరంగల్ జిల్లాలో మంచి బలమున్న నాయకులైన వీరిద్దరికీ పరకాల టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిక్షపతి అంటే పడదు. అతనికి టిక్కెట్ రానివ్వకుండా చేయాలని, ఆ స్థానంలో తమకు చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోవాలని కొండా సురేఖ దంపతులు తీవ్ర ప్రయత్నాలు చేసి సకెస్స్ అయ్యారు. ఏ తప్పూ చేయని నాకెందుకీ శిక్ష అని బిక్షపతి కేసీఆర్ దగ్గర లబోదిబో అన్నా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తమ్మీద బిక్షపతిని పరకాల అసెంబ్లీ స్థానం నుంచి బయటకి గెంటేసినట్టే. కొత్తగా బయటి నుంచి వచ్చిన వారి కోసం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని వున్నవారికి అన్యాయం చేయడం ఏం న్యాయమో కేసీఆరే చెప్పాలని టీఆర్ఎస్‌లో ఒక వర్గం వాపోతోంది.

‘ఎక్స్ పీ’ వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్!

  కంప్యూటర్ వినియోగదారులకు గత 13 సంవత్సరాలుగా మంచి ఎక్స్ పీరియన్స్‌ గా మిగిలిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ ఎక్స్ పీ’ ఈరోజు ఎక్స్ పెయిర్ కాబోతోంది. అంటే ఈరోజుతో ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి విండోస్ సంస్థ తన సపోర్ట్ నిలిపివేయనుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పీ ఓఎస్ వినియోగిస్తున్న అనేక కోట్ల కంప్యూటర్లు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికీ ఎక్స్ పీ నుంచి తప్పుకోకుండా ఈ ఓఎస్ నే వినియోగిస్తున్న అనేక సంస్థలు సమస్యల్లో పడే ప్రమాదం వుంది. ఎక్స్ పీకి విండోస్ సపోర్ట్ నిలిపివేయడం వల్ల ఎక్స్ పీ వినియోగం మన కంప్యూటర్లకు, మన డేటాకి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అంచేత లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి మారిపోవడం మంచింది.

కేజ్రీవాల్ చెంప మళ్ళీ పగిలింది!

  ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చెంప మరోసారి పగిలింది. మొన్నీమధ్యే ఢిల్లీలో ప్రచారంలో వున్న కేజ్రీవాల్‌ని ఒక వ్యక్తి చెంపమీద లాగిపెట్టి కొట్టాడు. ఆ వ్యక్తిని ఆమ్ ఆద్మీ కార్యకర్తలు చావబాదారు. మంగళవారం నాడు ఢిల్లీలో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌ చెంప మీద ఒక ఆటో డ్రైవర్ లాగిపెట్టి కొట్టాడు. కేజ్రీవాల్‌కి మొదటి నుంచి ఇలాంటి అవమానాలు జరుగుతూనే వున్నాయి. గతంలో కేజ్రీవాల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారు. వారిలో కేజ్రీవాల్ మీద పెరిగిన ఆగ్రహమే ఇలా అవమానాల రూపంలో బయట పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రామ‘చంద్రుడు’ ఇతడూ...

      ఒకవైపు బీజేపీతో తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంది. మరోవైపు ఈరోజు శ్రీరామనవమి. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని శ్రీరాముడితో పోలుస్తూ మురిసిపోతున్నారు. ఆ పోలికలిలా వున్నాయి...   రాముడు క్రమశిక్షణ కలిగిన ఆదర్శపురుషుడు. చంద్రబాబు కూడా అలాగే డిసిప్లిన్‌కి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. నాయకులు ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి. రాముడు పీతాంబరధారం. చంద్రబాబు పచ్చ వస్త్రధారి. తండ్రి మాటకు కట్టుబడి రాముడు అరణ్యవాసం చేశాడు. ప్రజల తీర్పుకు కట్టుబడి చంద్రబాబు సమర్థమైన ప్రతిపక్షాన్ని నడిపారు. రాముడి లక్ష్యం రావణ సంహారం. చంద్రబాబు లక్ష్యం కాంగ్రెస్ సంహారం. రాముడి లక్ష్య సాధనకు వానరసేన అండగా నిలిచింది. చంద్రబాబు లక్ష్య సాధనకు బీజేపీ వానరసేన అండగా నిలుస్తోంది

కాంగ్రెస్ లిస్టులో పాయింట్లివి..

      కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన లిస్టులో ఆసక్తికరంగా వున్న అంశాలివి. మొత్తం 119 స్థానాలకు గాను 111 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా 42 మందికి మళ్ళీ సీట్లు దక్కాయి. ఏడుగురికి సీట్లు దక్కలేదు. అందులో ఓవర్ యాక్షన్ చేసినందుకు శంకర్రావుకి, అనారోగ్య కారణాల వల్ల టి.మణెమ్మకి, కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినందు వల్ల సబితా ఇంద్రారెడ్డికి టిక్కట్లు ఇవ్వలేదు. మిగతా సీట్లు పొత్తుల్లో పోయాయి.   కుటుంబానికి ఒకే టిక్కెట్ అనే పాలసీని కాంగ్రెస్ పాటించింది. రెడ్యానాయక్, రాంరెడ్డి సోదరులకు మాత్రం మినహాయింపు లభించింది. అనేకమంది నాయకుల వారసులకు మొండిచెయ్యి చూపించింది. నాయకులు ఎంత మొత్తుకున్న ఒక కుటుంబంలో మరో వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదు. 8 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. రెడ్డి కులస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. లిస్టులో మొత్తం 47 మంది అగ్ర కులాలకు చెందినవారు వున్నారు. 32 మంది వెనుకబడిన కులాలకు చెందినవారున్నారు. 18 ఎస్సీ, 8 ఎస్టీ అభ్యర్థులున్నారు. టీ జేఏసీని ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా టిక్కెట్లు ఇవ్వలేదు. ఉద్యమంలో పాల్గొన్న గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న టిక్కెట్లు వస్తాయని ప్రచారం చేసిన కాంగ్రెస్ చివరికి వాళ్ళకి మొండిచెయ్యి చూపించింది.

శంకరన్న తిక్క కుదిరింది

      కంటోన్మెంట్ శాసనసభ్యుడు శంకర్రావు తిక్క కుదిరింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన శాసనసభ అభ్యర్థుల జాబితాలో శంకర్రావుకి స్థానం లేకుండా పోయింది. ఇంతకాలం శంకర్రావు చేసిన ఓవర్ యాక్షన్‌కి తగిన ఫలితం లభించింది. సోనియాగాంధీకి గుడి కట్టించినా, సోనియా రాహుల్ భజన నిర్విరామంగా చేసినా ఉపయోగం లేకుండా పోయింది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు బతిమాలుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ వినిపించుకోలేదు. తనకు గానీ, తన కూతురికి గానీ టిక్కెట్ వచ్చేలా చేయమని తన బావమరుదులు, వీ బ్రదర్స్ అయిన వినోద్, వివేక్‌లను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. శంకర్రావు ఇప్పుడు సోనియమ్మని దేవత అంటాడో, దయ్యం అంటాడో చూడాలి. తాను కట్టించిన సోనియా గుడిని అలాగే వుంచి పూజలు చేస్తాడో, మొత్తం గుడినే కూల్చేస్తాడో వేచి చూడాలి.

ఇద్దరికీ బ్యాండ్ పడింది!

      ఇద్దరు తెలంగాణ నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. వారికి భారీ స్థాయిలో బ్యాండ్ పడింది. ఇటు ఇంటికూటికి, అడు బంతి కూటికి చెడ్డట్టు అయింది. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ శాసనసభ్యులు ఆకుల రాజేందర్‌కి అకస్మాత్తుగా బుర్ర తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయాడు. రాజేందర్‌కి మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ రావడంలో ఎలాంటి సమస్య లేదు. అయినా రాజేందర్ టీఆర్ఎస్ పంచన చేరాడు. టీఆర్ఎస్‌లో ఓ వారం రోజులు వున్న తర్వాత తనను మందకృష్ణ చంపుతానంటున్నాడని, రాజకీయాల్లో వుండనని హడావిడి చేశాడు. ఈయన పరిస్థితి ఇలా వుంటే టీడీపీలో బలమైన నాయకుడిగా వున్న మైనంపల్లి హనుమంతరావు తనకు మల్కాజ్‌గిరి స్థానం ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి టిక్కెట్ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ నుంచి హామీ కూడా పొందాడు. ఇంతలో ఆకుల రాజేందర్ తనకు జ్ఞానోదయం కలిగిందంటూ సోమవారం నాడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఇద్దర్లో మల్కాజ్‌గిరి స్థానం ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదో ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దర్నీ కాదని నందికంటి శ్రీధర్ అనే వ్యక్తికి ఆ స్థానం కేటాయించేసింది. దీంతో ఆకుల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరికీ జాయింట్‌గా బ్యాండ్ పడింది.

టీఆర్ఎస్ మూడో జాబితా

      టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మూడో జాబితాని విడుదల చేసింది. 8 ఎంపీ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తూ వుండగా, కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలోకి దిగుతున్నారు.   లోక్‌సభ అభ్యర్థులు.. మెదక్ - కేసీఆర్, పెద్దపల్లి - బాల్క సుమన్, జహీరాబాద్ - బీవీ పాటిల్, నిజామాబాద్ - కవిత, ఆదిలాబాద్ - నగేష్, హైదరాబాద్ - రషీద్ అలీ, మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఖమ్మం - బుడాన్ బేగ్‌షేక్. అసెంబ్లీ అభ్యర్థులు.. ఉప్పల్ - బేతి సుభాష్‌రెడ్డి, మలక్‌పేట్ - సతీష్ యాదవ్, చార్మినార్ - ఇనాయత్ అలీ, అంబర్‌పేట్ - ఎడ్ల సుధాకర్‌రెడ్డి, సనత్‌నగర్ - దండె విఠల్, యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ, ఎల్బీనగర్ - ఎం. రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్ - కొలను హన్మంత్‌రెడ్డి, ఖైరతాబాద్ - మన్నే గోవర్థన్‌రెడ్డి, కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్, గోషామహల్ - ప్రేమ్‌కుమార్‌దూత్, కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు, మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి, ఖమ్మం - జి. కష్ణ, వైరా - చంద్రావతి, పినపాక - శంకర్‌నాయక్, మధిర - బొమ్మెర రాంమూర్తి, నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా, మంచిర్యాల - దివాకర్‌రావు, నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి, కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి, ఆశ్వరావుపేట - ఎ. ఆదినారాయణ.