ఐఫోన్ తన సరికొత్త మోడల్.. భారతీయులకు నిరాశే..
స్మార్ట్ఫోన్ దిగ్గజం ఐఫోన్ తన సరికొత్త మోడల్ ఎస్ఈని ఆవిష్కరించింది. 4 అంగుళాల స్క్రీన్తో ఉన్న ఈ ఫోన్ అందరిని ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం అమెరికాలోనే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర 26, 500 రూపాయలు. అమెరికాలో 26,500 గా ఉన్న ఫోన్ భారత్ లో 30,000కి విక్రయించాలని మొదట సంస్థ అనుకుంది. కానీ ఇప్పుడు ఈ ధరను కాస్త మార్చి ఇండియాలో 39,000 రూపాయలకు అందిస్తామని సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం ఇండియన్లకు మాత్రం నిరాశకు గురిచేసింది. కాగా, భారతదేశంలో ఏప్రిల్ చివరి నాటికి ఈ ఫోన్ను అందులోకి తెస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది.