కారు జోరుకు సైకిల్ బ్రేకులేసేనా?

ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్నారు. ఆ క్రమంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు.. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థుల్లో సైతం అసమ్మతి జ్వాల పెల్లుబికుతోందిని.. వారిని సైతం చల్లబరిచేందుకు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలు చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీలో  పసుపు పార్టీ భయం అంతర్గతంగా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని  టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను దింపుతామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఎన్నీ సెంటర్... సింగిల్ హ్యాండ్‌ అన్నట్లుగా పోటీకి దిగుబోతున్నట్లుగా పసుపు పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రకటన ఓ క్లారిటీ ఇచ్చినట్లు అయిందని.. అలాంటి వేళ  రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీ వల్ల.. కారు పార్టీ విజయావకాశాలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవనం చేసుకోవాలని.. బీజేపీ అగ్రనేతలు ప్రణాళిక బద్దంగా దూసుకెళ్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అదీకాక కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా రావడంతో.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపినట్లు అయింది. దీంతో ఎలాగైనా గెలువాలనే ఓ పట్టుదలతో.. ఆ దిశగా హస్తం పార్టీ శ్రేణులు ముందుకు  కదులుతోన్నాయి.  ఇంకోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన సాగించినా.. అభివృద్ధి, సంక్షేమం మాత్రం అరకొరగానే జరిగిందని... కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా పునాదులు వేసుకొందని.. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మాత్రమే ఉంటే.. వాటికి అదనంగా సైబరాబాద్ మహానగరం పురుడు పోసుకుందని.. ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రస్తుత అధికార గులాబీ  పార్టీలోని అగ్రనేతలు సైతం వివిధ వేదికల మీద ఒప్పుకొన్నారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.       అలాగే ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టారని.. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అలాగే ఈ దశాబ్ది కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , అదేవిధంగా ఆయా ప్రభుత్వాలు తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, ఇక హైదరాబాద్ నగరాభివృద్ధి నాడు ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రజలకు వివరించడంలో.. సైకిల్ పార్టీ శ్రేణులు.. యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ కానీ, వామపక్షాలు కానీ అధికారాన్ని చేపట్టింది లేదని.. కానీ కేంద్రంలో బీజేపీ పాలన ఎలా సాగుతోందో మోదీ పరిపాలనతో అందరికీ అర్థమైందని.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఓట్లు.. భారీగా చీలి.. అవి తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని... దీంతో గులాబీ బాస్‌ కూర్చికి ఎసరు పట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదీకాక.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందని... దీంతో తెలంగాణ వాదం కాస్తా అవిరైపోయిందని.. సరిగ్గా ఆదే సమయంలో ఖమ్మం వేదికగా గతేడాది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని.. దీంతో ఆ నాటి నుంచి తెలంగాణలో సైకిల్ పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటు కొనేందుకు చేపట్టిన ప్రతీ చర్య.. సఫలీకృతమవుతు వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.

విదేశీ పర్యటనకు జగన్.. 10 రోజులు సీఎం లేకుండా పరిపాలన!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పది రోజుల పాటు సీఎం కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లనున్నారు.  సీఎంగా జగన్ గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల సదస్సు కోసం ఆయన అప్పట్లో మంత్రి వర్గంలోని కీలక మంత్రులను, ఉన్నతాధికారులను దావోస్ తీసుకుని వెళ్లారు. మొత్తం పది రోజుల పాటు జగన్ విదేశీ టూర్ అప్పట్లో సాగింది. ఇక సీఎం కాకముందు కుటుంబంతో కలిసి ఇలాగే విదేశీ యాత్రలకు వెళ్లేవారు. గతంలో జగన్ పారిస్, డెట్రాయిట్, దావోస్, డల్లాస్ పర్యటనకు వెళ్లగా ఇప్పుడు యూకే వెళ్లనున్నారు. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం మూడు రోజుల క్రితం తెలంగాణలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరారు.  అవినీతి కేసులలో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. కాగా  దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించి తాను విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోర్టు సీబీఐని కోరగా.. ముందుగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొద్దిగా సమయం కావాలని సీబీఐ తెలిపింది. అనంతరం జగన్ విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారనే అనుమానాలు ఉన్నాయని.. అందుకే అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ వాదనలు చేసింది. అయితే, సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సీఎం జగన్ రెడ్డి శనివారం (సెప్టెంబర్ 2)  నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు.  కాగా.. సీఎం జగన్ తో పాటు అదే అక్రమ ఆస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆయనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన విషయానికి వస్తే ఈయన యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ లో పర్యటించనున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం ఆరు నెలల్లో ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరగా కోర్టు అందుకు అనుమతి ఇవ్వడం విశేషం. అక్రమాస్తుల కేసులలో బెయిల్ షరతుల్లో భాగంగా ఈ ఇద్దరి పాస్ పోర్టులు అప్పుడు కోర్టుకు సరెండర్ చేయగా.. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆ రెండు పాస్ పోర్టులు వీరికి అప్పగించనున్నారు. పర్యటన పూర్తి కాగానే మళ్ళీ తిరిగి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.  విజయసాయి రెడ్డి విదేశాలకు ఎప్పుడు వెళ్తారో   షెడ్యూల్ ఖరారు కాలేదు కానీ, సీఎం జగన్ మాత్రం శనివారం(సెప్టెంబర్ 2) ప్రయాణం కానున్నారు.  ఆ రోజు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఉండడంతో జగన్ ఇడుపులపాయకు వచ్చి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచే నేరుగా  ఆయన లండన్ టూర్ కి బయల్దేరి వెళ్తారు. విదేశాలలో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను చూసేందుకే జగన్ ఈ టూర్ పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే, మొత్తం పది రోజుల పాటు సీఎం రాష్ట్రంలో లేకుండానే రాష్ట్ర పరిపాలన సాగనుంది. వర్చువల్ విధానం ద్వారా అక్కడ నుండే పరిపాలన సాగిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సీఎం విదేశీ యాత్రకు వెళ్ళినపుడు కూడా ఇలాగే పరిపాలన సాగగా.. ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.  

కొండముచ్చుకి రాఖీ కట్టిన స్వయం సేవకులు!

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి.. రాఖీ పౌర్ణమి. ఈ పర్వ దినాన్ని పురస్కరించుకొని.. కొండముచ్చుకు కొందరు స్వయం సేవకులు రాఖీ కట్టారు. వారిని సోదరులుగానే భావించిన ఆ కొండ ముచ్చు కూడా వారిపై దాడి చేయలేదు..అలాగని భయపడి పారిపోనూ లేదు.. అచ్చం మనిషిలాగానే  వారి చేత రాఖీ కట్టించుకొంది. ఆ తర్వాత.. స్వయం సేవకులతో కాసేపు ఆ కొండముచ్చు ఆటలాడింది. హనుమాన్ ప్రతిరూపంగా భావించి ఆ కొండ ముచ్చుకు రాఖీ కట్టినట్లు స్వయం సేవకులు ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్ద మంతనాల దోర్నాల మండలం ఖండ నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుగూడెంలో చోటు చేసుకొంది. అయితే కొండ ముచ్చుకు స్వయం సేవకులు రాఖీ కట్టిన వీడియోలు, చిత్రరాజాలు... సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఇది కలికాలమే అయినా.. అందులోను ఇది మరీ కరెన్సీ కాలమైపోయిందని.. దీంతో బంధాలు, అనుబంధాలు ఇంకా ఎక్కడ ఉన్నాయని.. ఉన్నాదంతా ఆ ఒక్క రాఖీ పండగ రోజు మాత్రమేనని వారు పేర్కొంటున్నారు. అయితే కొండముచ్చు.. రామయణంలో అంజనేయుడిగా భావించి ఆ వానరం చేతికి స్వయం సేవకులు రాఖీ కట్టారంటే.. వారికి దైవత్వం మీద, దైవబలం మీద..అంతకు మించి రామాయణం కావ్యంపైన అపారమైన భక్తి శ్రద్దలు కలిగి ఉన్నాయని స్పష్టమవుతోందని వారు వివరిస్తున్నారు.  అంతేకాదు.. రామాయణం మహాకావ్యంలో కీలక పాత్ర ఏదైనా ఉందంటే.. అదీ హనుమంతుడిదేననీ,  సీత ఎక్కడ ఉందో తెలుసుకోన్నదీ,  రామ, రావణ యుద్ధంలో లక్ష్మణుడు ఆపస్మారక స్థితిలోకి వెళ్లితే సంజీవని పర్వతం తీసుకు వచ్చి..  లక్ష్మణుడిని  బతికించింది కూడా ఈ ఆంజనేయుడేనని,  అలాగే సుందరమైనది సుందరకాండ.. ఈ కాండకు అండాదండా అంతా ఆ వానరుడేనని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.    సోదరి, సోదరుల మధ్య బంధానికి... రక్త సంబంధీకుల మధ్య అనుబంధానికి అసలు సిసలు ప్రతీక రాఖీ పండగ. కాలక్రమంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెమ్మల మధ్య సోదర భావం దాదాపుగా కనుమరగవుతోందని.. అందుకు సీజీవ సాక్ష్యాలుగా ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే కదలాడుతోన్నాయని వారు వివరిస్తున్నారు. తాజా ఉదాహరణ అంటూ జగన్, షర్మిలల ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా.. స్వయం సేవకులు రాఖీ కట్టిన.. వారి చేత రక్షా బంధనం కట్టించుకొన్న కొండ ముచ్చు నిజంగా హనుమంతుడేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.

సీన్ రివర్స్.. నాడు పొగడ్తలు నేడు తెగడ్తలు

దేనికైనా టైమ్ రావాలంటారు. అలాంటి టైమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీఅధినేత జగన్‌కు వచ్చింది.. కాదు.. కాదు ఆయన సొంత చెల్లెలు షర్మిల తీసుకువచ్చారన్న ప్రచారం  పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.   జగన్ జైల్లో ఉంటే..  జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. జగనన్న గద్దెనెక్కితే రాజన్న రాజ్యం వస్తుందంటూ..  హోరెత్తించేసిన షర్మిల జగనన్న అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర సైతం చేశారు.  ఆమె ప్రచారం ఫలితంగా  2019 ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ఏపీలో అధికారం చేపట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల ఫలితాలతో   జగన్ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యారో తెలియదు కానీ..  జగనన్న కళ్లలో ఆనందం చూసి.. షర్మిల మాత్రం ఓ రేంజ్‌లో  సంతోషపడ్డారనడంలో సందేహం లేదు.  అయితే అలా అధికార పగ్గాలు చేపట్టిన  జగన్‌కి నాటి నుంచి గుడ్ టైమ్ మొదలైతే.. ఆయన సోదరి  షర్మిలకు మాత్రం బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ నేటికీ సాగుతోంది. అయితే సోదరుడు   జగన్ గద్దెనెక్కిన తర్వాత ఒక సారి మాత్రమే వైయస్ షర్మిల రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టారనీ,  ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ రావడంతో.. ఆమె తన తల్లిని తీసుకొని పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు.  ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.  అలా సోదరుడు  జగన్‌కి వైయస్ షర్మిల దూరం జరిగితే.. మరోవైపు  జగన్‌ని  గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారు.. అంటే జగన్ కేబినెట్‌లోని పలువురు మహిళా మంత్రులు.. ఆర్కే రోజా, విడదల రజినీ తదితరులు  సీఎం జగనన్నకు రాఖీ కట్టి ఆయనను తమ సోదరుడని చెప్పుకుంటున్నారు.. గతంలో  రోజా టీడీపీలో ఉన్నప్పుడు.. మహానేత  రాజశేఖర్ రెడ్డిని ఎన్ని మాటలన్నారో అందరికీ తెలిసిందేనని... అలాగే ఇక విడదల రజినీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. 2017లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడుతూ.. నరకాసురులు ఎవరంటే   జగన్‌,  ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను చూపించాలంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీరిద్దరు వైసీపీలో చేరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు.   అందలం ఎక్కిన వారు.. అందలం ఎక్కించిన వారిని దూరం చేసుకొంటే.. ఆ తర్వాత ఏ ఎండుకా గొడుగు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే.. భజన బ్యాచ్ అన్ని చోట్ల... అన్ని వేళలా రెడీగా ఉంటుందనీ, ఆ బ్యాచ్ గాని రంగంలోకి దిగితే... ఆ తర్వాత.. మళ్లీ ఎన్నికల వేళ.. మన కోసం కష్టపడే వారి కోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సి ఉంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. భజన చేసే వాళ్లు, రాఖీ కట్టే వాళ్లు ఈ రోజు ఉండవచ్చు.. కానీ రేపు అధికారం  దూరం అయితే.. వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థుల్లాగా కోతి కొమ్మచ్చి ఆటలతో మరో పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు నూటికి నూరుశాతం  ఉన్నాయనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌ వాడివేడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ సోదరి షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తతో జగనన్న నాడు వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ లో  వస్తోందనీ, ఇది జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమేననీ అంటున్నారు. 

బీజేపీకి తెలుగుదేశం ఆఫర్ పాతిక అసెంబ్లీ స్థానాలు.. నిజమేనా?

ఏపీలో రానున్న ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం  జనసేన, బీజేపీలకు ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుంది? ఎన్ని లోక్ సభ స్థానాలు కేటాయిస్తుంది? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలు టీడీపీతో పొత్తు కోసం ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నాయి? ఇలా చాలా రోజులుగా ఇవే ప్రశ్నలు రాజకీయ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడిన ప్రతిసారి, చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసినా, పవన్ కళ్యాణ్ తో కలిసినా పొత్తు ఖరారైందని.. జనసేన-బీజేపీలకు కేటాయించిన సీట్లు ఇవేనంటూ కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే  తాజాగా ఢిల్లీలో జరిగిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు  బీజేపీ పెద్దలతో  భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డాతో సమావేశమైన చంద్రబాబు  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే బీజేపీతో తమకు వ్యక్తిగత శత్రుత్వం లేదని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో విభేదించామని చెప్పారు. ఇక సమయం వచ్చినపుడు పొత్తుల గురించి చెప్తానని.. కాలమే పొత్తులను నిర్ణయిస్తుందని చంద్రబాబు చెప్పారు.  కాగా, చంద్రబాబు అలా నడ్డాతో భేటీ అయ్యారో లేదో  ఇలా జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకూ మళ్ళీ యథావిథిగా పొత్తులపై కథనాలు వండి వార్చాయి. బీజేపీ అనుకూల మీడియా ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ప్రసారాలు చేసింది. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చర్చలలో  ఏకంగా బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు   ఆఫర్ చేశారని కథనాలు వదిలారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ వార్తా కథనాలన్నీ బీజేపీ అనుకూల మీడియా వండి వార్చినవేనన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి   ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 25 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయిస్తుందనడం వాస్తవానికి దూరంగా ఉందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు కానీ ఏపీలో ఆ పార్టీకి కనీసమైన స్టేక్ కూడా లేదు. నిండా ఒక శాతం ఓటింగ్ కూడా లేదు.  మరోవైపు ఒంటరిగానైనా ఈసారి టీడీపీ అధికారం దక్కించుకుంటుందని ఇప్పటికే  పలు సర్వేలు పేర్కొన్నాయి.  జనసేన-బీజేపీలతో కలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్తూనే.. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా వందకు తగ్గకుండా స్థానాలను సొంతం చేసుకుంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేర ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఏపీలో పొత్తులతో సంబంధం లేకుండానే తెలుగుదేశం 15 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుందని పేర్కొంది.  మరోవైపు బీజేపీ కలిసిరాకపోయినా పొత్తుకు జనసేన సిద్ధంగా ఉంది. బీజేపీని దూరం పెడితే.. పవన్ కళ్యాణ్  పొత్తు ఎటూ ఉంటుంది. అదనంగా వామపక్షాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.   మరి ఇన్ని అడ్వాంటేజీలు ఉండగా చంద్రబాబు బీజేపీకి ఏకంగా 25 అసెంబ్లీ స్థానాలు ఎలా కేటాయిస్తారు? ఎందుకు కేటాయిస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇంకా చెప్పాలంటే జనసేన-బీజేపీలకు కలిపి కూడా  అన్ని సీటు కేటాయించడం కూడా అనుమానమేనని అంటున్నారు.    ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా బీజేపీకి తెలుగుదేశం అధినేత పాతిక అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేశారన్న ప్రచారం కేవలం బీజేపీ స్ట్రాటజీగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రతి అంశాన్ని తమకు కావాల్సినట్లు మలచుకునే ప్రయత్నం చేసే బీజేపీ ఏపీలో పొత్తుల వ్యవహారాన్ని కూడా ఇదే  విధంగా తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నమే ఈ 25 సీట్ల ఆఫర్ కథనాలను పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు.  అన్నిటికీ మించి మోడీ హవా బ్రహ్మాండంగా వీచిన 2014 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం ఆ పార్టీకి కేవలం 9 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్ సభ స్థానాలు కేటాయించింది. మరి తొమ్మిదేళ్ల పాలన తరువాత దేశంలో మోడీ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం బీజేపీకి పొత్తులో భాగంగా ఏకంగా పాతిక స్థానాలను ఆఫర్ చేసిందంటే నమ్మడం కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనం లాంఛనమే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు టానిక్

వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ఇక లాంఛనమే. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల గురువారం (ఆగస్టు 31) హస్తినలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తన భర్త అనీల్ తో కలిసి సోనియాతో భేటీ అయిన అనంతరం షర్మిల ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విలీన చర్చలలో అనేక ఆప్షన్స్ వెలుగులోనికి వచ్చాయి. వైఎస్ షర్మిల తొలి నుంచీ కూడా తన కార్యక్షేత్రం తెలంగాణయే అని చెబుతూ వస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆమె అవసరం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువ ఉందని చెబుతూ వస్తున్నది. దీంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఆమె సేవలు ఎక్కడ అన్న విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన కారణంగానే ఇప్పటి వరకూ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. అయితే గురువారం (ఆగస్టు 31) షర్మిల సోనియా భేటీతో విలీనం విషయంలో స్పష్టత వచ్చింది. ఈ విలీనం కారణంగా కాంగ్రెస్ కు భారీ ప్రయోజనం చూకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో  కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్న కాంగ్రెస్ ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలిపారని చెబుతున్నారు. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తెలంగాణలో వైఎస్ బ్రాండ్ ను తిరిగి తెరమీదకు తీసుకురావడం ద్వారా ఆ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం సంతృప్తి చెందుతుంది. అదే సమయంలో ఆమె ఏపీలో కీలక పాత్ర పోషించడం ద్వారా వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి తరలిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అన్నిటికీ మించి తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ విలీనం బోనస్ అవుతుందనే చెప్పాలి. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణ ఇచ్చిన సోనియాను కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ణతలు తెలిపిన కేసీఆర్ టీఆర్ఎస్ ( ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తరువాత మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేసే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను బలహీనం చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ లా తాను మాట తప్పననీ, చెప్పింది చేస్తాననీ షర్మిల గట్టిగా చెప్పే అవకాశం ఉంది. సోనియాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన షర్మిల తెలంగాణలో కేసీఆర్ పాలన అంతమయ్యే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్యను ఈ నేపథ్యంలోనే తీసుకోవలసి ఉంటుంది. తాను స్వయంగా ఏపీ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించి కూడా షర్మిల తెలంగాణ రాజకీయాల గురించి, మరీ ముఖ్యంగా కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కుటుంబ పాలనపై చేసే విమర్శలు  బీఆర్ఎస్ కు కచ్చితంగా నష్టం చేకూరుస్తాయని కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తున్నది. అలాగే రెండు రాష్ట్రాలలోనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రజాభిమానం షర్మిల పార్టీ విలీనంతో కాంగ్రెస్ కు ఒక పాజిటివ్ వేవ్ గా పనికి వస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది.    తెలంగాణ ఎన్నికల  సమయం ముంచుకువస్తున్న తరుణంలో ఇక ఏమాత్రం  ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడెంది. ఆమెకు ఏపీలో కీలక పాత్ర ఇచ్చినా.. ఆమె సేవలను మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వినియోగించుకునే విధంగా వ్యూహ రచన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు షర్మిల అంగీకారం తెలపడంతోనే సోనియాతో భేటీ  కుదిరిందని చెబుతున్నారు. సోనియాతో భేటీలో కూడా ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిల చేపట్టాలని కాంగ్రెస్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కూడా షర్మిల పాల్గొంటారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విలీన ప్రకటన వైఎస్ వర్ధింతి అయిన సెప్టెంబర్ 2న అధికారికంగా వెలువడుతుందని చెబుతున్నారు.  సోనియాతో చర్చల సందర్భంగా షర్మిల రాహుల్ ను ప్రధాని చేయాలనే తన తండ్రి లక్ష్య సాధన కోసం పని చేస్తానని చెప్పారని చెబుతున్నారు.   విలీనం ప్రతిపాదనల మేరకు  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే షర్మిల తన సేవలను పూర్తిగా ఏపీకే పరిమితం చేస్తారనీ, మరీ ముఖ్యంగా తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్  ను గద్దెదింపడమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయం లో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్..ఆయన ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది.  అలాగే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ తో పాటుగా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు బరిలోకి దించే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినట్లు, ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించినట్లూ విశ్వసనీయ సమాచారం. ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించడం ద్వారా విభజన తరువాత జగన్ వైపు మళ్లిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు తిరిగి పార్టీ వైపు వస్తుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.  

నారా లోకేష్ డబుల్ సెంచరీ.. తెలుగుదేశం డబుల్ హ్యాపీ!

రాజకీయాలలో తొలి అడుగులు వేయకముందే.. తొక్కేద్దామని చూసిన వక్రబుద్ధి నేతల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఎగసిన కేరటం నారా లోకేష్. బాడీ షేమింగ్ సహా, అహారపు అలవాట్లనూ గేలి చేసి రాజకీయంగా అణగదొక్కేయాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టి పరిణితి చెందిన నేతగా ఎదిగిన నాయకుడు నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తావనకు ముందు ఎందుకు ఇన్ని విశేషణలు అన్న ప్రశ్నకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.  నాలుగేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ  కక్షపూరిత రాజకీయాల కుతంత్రాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ, మూర్ఖత్వం మూర్తిభవించిన ప్రభుత్వాధినేత జగన్  తీసుకొచ్చిన విధానాలతో  విసిగిపోయిన ప్రజలకు అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో కీలకమైన మైలురాయికి చేరుకుంది. గురువారం (ఆగస్టు 31)లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది.  రాయలసీమలోని లోకేష్ స్వస్థలం కుప్పం నుంచి ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్‌ 200 రోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పర్యటిస్తున్న లోకేష్‌ ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల  మండలాలు, మున్సిపాలిటీలను కవర్ చేశారు. మొత్తంగా 200 రోజులలో 2,710 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల వద్ద సెల్ఫీలు దిగుతూ.. జగన్ సర్కార్ వైఫల్యాలను సమస్యలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తాహామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. విపక్ష నేతగా జగన్  చేసిన పాదయాత్ర చూసిన వారంతా.. ఆ పాదయాత్రకు భిన్నంగా లోకేష్ కదులు తున్న తీరు చూసి అచ్చెరువోందుతున్నారు. నిబద్ధత, సంకల్పంతో  ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కనుగొనడం కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న లోకేష్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు.. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్ మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలనే మెలో డ్రామాలు లేవు.  కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు.  పెయిడ్  ఆర్టిస్టులతో సెంటిమెంట్ పండించే టాలెంట్ కనిపించడం లేదు. పాదయాత్ర వెళ్లిన చోట పేదవాళ్ళు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే పాదయాత్రకు ఎక్కడా బ్రేకుల్లేవు. వీకెండ్ సెలవలు లేవు. కేవలం ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూ, ఆ సమస్యలను సృష్టించిన ప్రభుత్వంపై  పదునైన మాటలతో  విమర్శలు చేస్తూ  లోకేష్ అధికార పార్టీ గుండెల్లో గుబులు రేపుతున్నారు.  లోకేషా.. పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకుంటున్నారు.  ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు, కార్యకర్తలతో మాటా మంతీ.. ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా లోకేష్  పాదయాత్ర కు కొత్త నిర్వచనం చెప్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను వేధిస్తోందని తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని వదిలి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్‌ డైరీని పట్టుకొని వారి పేర్లు రిజిస్టర్ చేస్తున్నామంటూ ఊరూరా చెబుతున్నారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు. పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది.. నడవడిక మారింది. నేతలను ఆప్యాయం పిలవడం తెలిసింది.. ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులే ప్రశంసలు గుప్పిస్తున్నారు.   ఇక లోకేష్‌ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. నేటి యువగళం పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొననున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుండి గురువారం ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నరసన్నపాలెం, సీతంపేట, బయ్యనగూడెం, కొయ్యలగూడెం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం తర్వాత గవరవరం, పొంగుటూరుల్లో లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాత్రికి పొంగుటూరు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఖాయం.. పోటీ ఎక్కడ అన్నదే డైలమా?!

ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు, అంశం ఏదైనా ఉందంటే అది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా, ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన పార్టీ మారే యోచన చేస్తున్నారనీ, అయితే ప్రతి సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పలిపించుకునో, రాయబారం పంపో బుజ్జగించి నిర్ణయం ప్రకటించకుండా ఆపుతున్నారనీ పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తిదేననీ, తుమ్మల కారు దిగడం ఖాయమైపోయిందనీ.. హస్తం చేయందుకోవడానికి రెడీ అయిపోయారనీ ఆయన సహచరులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ తుమ్మల బీఆర్ఎస్ లోనే కొనసాగుతారంటూ జిల్లా పార్టీ నేతలలో మిణుకుమిణుకు మనే ఆశ ఉండేది. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చే ఎన్నికలలో  బీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలో ఉండే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారో అదే రోజు తుమ్మల ఇక బీఆర్ఎస్ లో ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ ను వీడి ఏ పార్టీలో చేరుతారన్న విషయంలోనే నిన్న మొన్నటి వరకూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని కొందరు.. కాదు కాదు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆయన కమలం గూటికి చేరుతారని మరి కొందరూ చెబుతూ వచ్చారు. కానీ తుమ్మల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వాదనా బలంగా వినిపించింది. అసలు వాస్తవమేమిటంటే ఈ ప్రచారాలూ, వాదనలూ అన్నీ ఆయా పార్టీల నుంచే వచ్చాయి. అంటే తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలు తుమ్మలను మా పార్టీలో చేరాలంటే.. మా పార్టీలో చేరాలని ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపాయి. దీంతో తుమ్మల కారు దిగి ఏ పార్టీతో కరచాలనం చేస్తారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వచ్చే ఎన్నికలలో తాను కచ్చితంగా పోటీ చేస్తానంటూ తుమ్మల విస్పష్టంగా ప్రకటించడంతో ఆయన బీఆర్ఎస్ తో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నట్లేనని అంటున్నారు. అలాగే  ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కూడా దాదాపు ఖరారైందనీ తుమ్మల సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు వచ్చే నెల 6వ తేదీ ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. ఆ రోజు ఆయన హస్తిన వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇందుకు ఒకటి రెండు రోజుల ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల నివాసానికి వెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  అయితే తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తాను పాలేరు నుంచి రంగంలోకి దిగుతానని తుమ్మల గట్టిగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ కోసం ఆ ఇరువురి మధ్యా పోటీ ఏర్పడే అవకాశలు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తం మీద తుమ్మల పోటీ ఎక్కడ నుంచి అన్న విషయంలో కాంగ్రెస్ ఆయనకు స్పష్టత ఇచ్చిన వెంటనే చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

నారా లోకేశ్ పాదయాత్ర@ 200 డేస్.. అమ్మ దీవెన

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. గురువారం (ఆగస్ట్ 31)తో  రెండు వందల రోజులు పూర్తి చేసుకోనుంది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే గురువారం లోకేశ్ పాదయాత్రలో తమ కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన తల్లి నారా భువనేశ్వరి  తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె తొలి సారిగా నారా లోకేష్ పాదయాత్రపై స్పందించారు. భగవంతుడు లోకేశ్‌కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. లోకేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజాస్వామంలో  స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి  ప్రజల తరఫున లోకేశ్ పాదయాత్ర చేపట్టారని వివరించారు.   ఈ ఏడాది జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నారా లోకేశ్.. యువగళం   పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ప్రారంభమైన నారా లోకేశ్ పాదయాత్ర.. రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.    ఆయన పాదయాత్ర  దాదాపు  మూడు వేల కిలోమీటర్ల మైలురాక చేరువ అవుతోంది. లోకేశ్ తాను చేపట్టిన పాదయాత్రలో ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలు.. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  ఇంకో వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనున్న సంగతి  తెలిసిందే.        ఇంకోవైపు లోకేశ్ పాదయాత్రపై ఆయన తల్లి నారా భూవనేశ్వరి మంగళవారం అంటే ఆగస్ట్ 29వ తేదీన తొలిసారిగా కుప్పంలో  స్పందించారు. నారా లోకేశ్ పాదయాత్ర చూసి తాను ఓ తల్లిగా చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తొలుత నారా లోకేశ్ పాదయాత్ర  చేస్తానన్నప్పుడు తనకు భయం వేసిందని..    వద్దని వారించాననీ అన్నారు.  ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని..  తనను ఆపవద్దనీ లోకేశ్ తనతో అన్నారన్నారు. అంతే ఆ తరువాత తాను ఎప్పుడూ తన బిడ్డను వారించలేదని భువనేశ్వరి వివరించారు.   ప్రజలకు   ఏదో చేయాలనే తపన లోకేష్ లో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం లోకేష్ నిలబడుతున్నారనీ, పార్టీలో కేడర్, ప్రజలు చాలా అవస్థలు పడ్డారని... వాళ్ల గురించి ఆలోచిస్తే.. లోకేశ్ చేసిందేమీ లేదన్నారు. వాళ్ల కోసం వాళ్ల హక్కుల కోసం.. వారి స్వేచ్ఛ కోసం.. లోకేశ్  కష్టపడాలన్నారు. లోకేశ్ ఇప్పటి వరకు.. ఏ నాడు ఈ పాదయాత్రలో అనారోగ్య సమస్యల గురించి తనకు చెప్పిందే లేదన్న భువనేశ్వరి తన బిడ్డ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తారనీ, దేవుడి దీవెనలు లోకేష్ కు పుష్కలంగా ఉన్నాయన్నారు. తల్లిగా తన దీవెనలు ఎప్పుడూ లోకేష్ కు ఉంటాయని చెప్పారు.   అధికార పార్టీ వల్ల తమ కుటుంబం సమస్యలు ఎదుర్కొందనీ.. అలా ఎదుర్కోవడం తమ కుటుంబానికి అలవాటైపోయిందనీ అన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా  పోరాడి.. విజయంతో బయటకు వస్తామని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి ఎన్టీఆర్ 100 రూపాయిల నాణెం విడుదల చేయించాలనే ఓ ఆలోచన తన సోదరి పురంధేశ్వరికి వచ్చిందన్న భువనేశ్వరి ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతుందని.. స్థానికంగా ఇల్లు ఉండడం వల్ల ప్రజలకు మరింత దగ్గరాగా ఉంటామని  వివరించారు. కుప్పంలో మళ్లీ చంద్రబాబు మంచి మెజార్టీతో  గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ వారు  తనపై చేసిన వ్యాఖ్యల నుంచి బయటకు రావడానికి తనకు నెలరోజులు పట్టిందని.... ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా, అండగా నిలిచారని చెప్పారు.  ఇక ఎవరు ఎన్ని అన్నా లెక్క లేదన్నారు. ఒకసారి ఎదుర్కొన్నాం.. ఇంకా పదిసార్లు అయినా ఎదుర్కొంటామన్నారు. 2024లో తప్పకుండా.. తెలుగుదేశంఅధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు.  తన భర్త చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు.. ఏడు సార్లు గెలిపించారని... ఆ నియోజకవర్గ ప్రజల రుణం తాము తీర్చుకోలేనిదన్నారు. అలాగే వారు చూపించే అభిమానం ఈ జన్మలో మరిచిపోలేమని చెప్పారు. అందుకు ప్రతీగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంజివీని ఆరోగ్య క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా పేద వారందరికి ఆరోగ్యం అందుతోందని ఆమె ఆకాంక్షించారు. సంజివీని క్లినిక్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఓ బస్సు ఏర్పాటు చేస్తామని.. ఈ బస్సు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుందన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో.. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఈ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు నారా భువనేశ్వరి వివరించారు. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చేసేందుకు కృషి చేస్తామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

పాపం చెల్లెమ్మలు

శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి. సోదరీ సోదరుల బంధానికి, అనుబంధానికీ ప్రతికగా ఈ పండగ జరుపుకొంటారు. బుధవారం ( ఆగస్టు 30)న రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో అక్క చెళ్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లెమ్మ‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృతజ్ఞుడిని. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్ష‌ణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్న‌గా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నా... అంటూ ముక్తాయింపు ఇచ్చారు. అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్ స్పందించిన తీరుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.   ప్రతిపక్ష నేతగా  జగన్ పాదయాత్ర సమయంలో కూడా ఇలాగే చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు.  అయితే 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మీ సొంత చిన్నాన్న.. మాజీ మంత్రి  వివేకానంద రెడ్డి అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారనీ,  ఈ కేసులో అసలు సిసలు సూత్రదారులు ఎవరో తెలుసుకొని.. వారిని కఠినంగా శిక్షించి.. మీ సోదరి అంటే  వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు న్యాయం చేయాలని వారు సోషల్ మీడియా ద్వారా విజ్జప్తి చేస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి   సునీతకు మీరు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి ఇదే అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.  అలాగే గతంలో మీరు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో దాదాపు 16 నెలల పాటు ఉన్నారని.. ఆ సమయంలో మీ సొంత సోదరి షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. మిమ్మల్ని అధికార పీఠం ఎక్కించారనీ... అంతగా కష్టపడిన ఆమెను.. మీరు సీఎం కూర్చి ఎక్కగానే మరిచిపోతే ఎలా అని వారు సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. మీ సోదరి షర్మిల.. మీ నుంచి ఏదో కోరుకుంటున్నదని.. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమెకు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే వెంటనే ఇచ్చేయండంటూ సీఎం జగన్‌కి నెటిజన్లు సూచిస్తున్నారు.        ప్రస్తుత కాలంలో బంధాలన్నీ రాయిబండలాగా మారిపోయాయని.. ఓ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే.. ఎడమెఖం పెడ ముఖంగా ఉంటున్నారని.. అలాంటి వాళ్లకు అతీతంగా మీ సొంత సోదరి   షర్మిల.. నీ కోసం పాదయాత్ర చేశారనీ,.. అలాగే మీ చిన్నాన్న కుమార్తె సునీత సైతం.. మీరు ప్రతిపక్ష నేతగా నిరాహర దీక్ష చేస్తున్న సమయంలో మీ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారనీ.. అలాంటి సోదరీమణులకు తప్పక న్యాయం చేయాల్సి ఉందని నెటిజన్లు జగన్ కు హితవు పలుకుతున్నారు.  అయితే రాఖీ పౌర్ణమి వేళ.. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అంతా క్యూ కడతారని.. వీరితో రాఖీ కట్టించుకోన్నట్లే.. మీ సొంత సోదరీమణులు   షర్మిల,  సునీతలకు న్యాయం చేస్తాను, మీకు అండగా... రక్షణగా నేను ఉంటానంటూ రాఖీ పౌర్ణమి సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పినట్టే చెప్పి.. వారితో సైతం రాఖీ కట్టించుకోవాలని సీఎం  జగన్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా సొంత చెల్లిని రోడ్డున పడేసిన మీరు అక్క చెళ్లెమ్మలకు రక్షణగా ఉంటానంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.  . ఇక ఈ నాలుగేళ్ల కాలంలో.. రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారో, అదృశ్యమయ్యారో తెలిసిందేననీ,   వారికి, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉందని సీఎం జగన్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు.

ఏపీలో పొత్తులు.. తెలంగాణలో ఒంటరి పోరు.. తెలుగుదేశం వ్యూహం ఇదేనా?

గెలుపోటములతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు అంటే రాజకీయాలలో అపర చాణుక్యుడనే పేరున్న సంగతి తెలిసిందే. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవడంలో ఆయనకో మార్క్ ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రతి ఎన్నికలలో ఆయన స్ట్రాటజీలను చూసిన వారు ఆయన రాజకీయ చతురతను కొనియాడకుండా ఉండలేరు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం  పొత్తులతో కలిసి వెళ్తుందా? ఒంటరిగా పోటీకి దిగుతుందా అనే సందిగ్దత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనసేన, బీజేపీలను కలుపుకునే టీడీపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతున్నది. అధికార  వైసీపీ నేతలైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఎప్పుడో కుదిరిపోయాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డాలతో  చంద్రబాబు భేటీ కావడంతో పొత్తులు  దాదాపుగా ఖరారయ్యాయని జనం  కూడా ఫిక్సయిపోయారు. అయితే  ఇప్పటి వరకూ ఈ పొత్తులపై ఎక్కడా అధికారిక ప్రకటనలు లేవు. మరోవైపు తెలుగుదేశం తెలంగాణలో ఎలా ముందుకు వెళ్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఖమ్మం సభతో తెలంగాణలో కూడా టీడీపీ ఊపు కనిపించినా ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో తెలంగాణ తమ్ముళ్లు నిరాశపడిపోయారు. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం తెలంగాణపై  ఫోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన చంద్రబాబు.. తాజాగా ఇక్కడ ఎలాంటి పొత్తులకు అవకాశం లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఇటీవల మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అన్ని స్థానాలలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటారని వెల్లడించారు. ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం.. ఎన్నికల మూడ్ వచ్చేయడంతో ఇక తెలంగాణలో పొత్తులు లేవని చంద్రబాబు డిసైడ్ చేసేశారు.  అలాగే ఏపీలో పొత్తులపై కొంత సానుకూల ధోరణితో మాట్లాడారు. బీజేపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం విభేదించామన్న  విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుగా పేర్కొన్న చంద్రబాబు.. ఆ హక్కు సాధన కోసమే అప్పటి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని.. బీజేపీతో తమకు ఎప్పుడూ శత్రుత్వం లేదని తెలిపారు. అంతే కాదు, ఎన్నికల్లో పొత్తులపై కాలమే నిర్ణయిస్తుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని.. ఇప్పటివరకు అయితే పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే పొత్తులపై క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, తెలంగాణలో సింగిల్ గా.. ఏపీలో ఉమ్మడిగా వెళ్లేలా టీడీపీ వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తున్నది.   గత ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ దాన్ని ఆయుధంగా వాడుకున్నారు. టీడీపీ భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చేసి మళ్ళీ అధికారాన్ని దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీని పరాయి పార్టీగా.. చంద్రబాబును ఆంధ్రా పాలకునిగా, ఆంధ్రా పాలకులతో చేతులు కలిపిన పార్టీగా ప్రజలలో కాంగ్రెస్ ను నిలబె్టడంలో అప్పుడు కేసీఆర్ వంద శాతం సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి టీడీపీ ఒంటరిగానే తెలంగాణలో బరిలో దిగుతున్నది. ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ గత ఎన్నికలు తెలంగాణ ఎన్నికలకు పూర్తిగా విరుద్ధం. తెలంగాణలో టీడీపీ పొత్తుతో వెళ్లడంతో నష్టం జరిగితే.. ఏపీలో సింగిల్ గా వెళ్లడంతో నష్టం జరిగింది. అంతకు ముందు 2014లో టీడీపీతో కలిసి ఉన్న జనసేన, బీజేపీని కాదని టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి వైసీపీకి మేలు జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతోనే వైసీపీకి ఊహించని స్థాయిలో సీట్లు దక్కాయి. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కూడా ఏపీలో ప్రతికూల ప్రభావం చూపించింది. అందుకే ఈసారి రివర్స్ లో తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగుతున్న తెలుగుదేశం ఏపీలో మాత్రం కలిసి వచ్చే మిత్ర పక్షాలను కలుపుకొని పోవాలని భావిస్తోంది. మరి ఎన్నికల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

వైసీపీ ఖాళీ!?

తాను గేట్లు తెరిస్తే వైసీపీ అనేదే లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని  అన్నారు.  విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే పెద్దదన్నారు. తాను టీడీపీ గేట్లు తెరిస్తే...   వైసీపీలో ఒక్కరు కూడా మిగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇక  బీజేపీతో పొత్తులపై మాట్లాడిన చంద్రబాబు.. అంతర్గతంగా తాము ఏం చర్చిస్తున్నాం అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు.  తాను చూడని రాజకీయం లేదని దేశ నిర్మాణంలో భాగం కావడమే తన ఉద్దేశమని అన్నారు. అది ఏ విధంగా, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో విభేదించానని, మిగతా విషయాలలో తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పొత్తుల విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పిన చంద్రబాబు తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు లేదని తేల్చేశారు. తెలంగాణలో పొత్తులకు సమయం మించిపోయిందని, తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు.  కాగా  చంద్రబాబు తాను గేట్లు తెరిస్తే వైసీపీ మాయమవుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని పలు సందర్భాలలో చెప్పిన సంగతి విదితమే.  నెల్లూరు లాంటి జిల్లాలలో అయితే  వైసీపీ ఇప్పటికే కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అటు విజయనగరంలో మంత్రి బొత్స కుటుంబ సభ్యులే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న చర్చ పొలిటిల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  గత ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లిన నేతలు చాలామంది ఇప్పుడు సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరికొందరు టికెట్లు దక్కవనే ఉద్దేశ్యంతో తమ దారి తాము చూసుకోలేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజలు తమపై చూపిస్తారన్న జంకుతో గోడదూకేయడానికి సిద్ధంగా ఉన్నారు.   మరోవైపు ఎమ్మెల్యేలను ఎంపీలుగా.. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ప్లాన్ ఒకటి వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తున్నదని ప్రచారంలో ఉండగా.. పార్లమెంటుకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. ఇప్పటికే సర్వేలు ఈసారి వైసీపీ గట్టెక్కడం కష్టమేనని తేల్చేయడంతో.. తెలిసి తెలిసి మునిగే పడవలో ప్రయాణం ఎందుకని అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం  వైపు చూస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి టీడీపీతో పొత్తుకు వెళ్తే అడ్డుకోవడం అసంభవం అనే భావన ఉన్న నేపథ్యంలో ముందుగానే కొందరు వైసీపీ నేతలు ఈ కూటమిలో సీటు కోసం ఖర్చీఫ్ వేసే సన్నాహాలలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాను గేట్లు తెరిస్తే అనే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇంత వరకూ   వైసీపీ  నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం. సహజంగా చంద్రబాబు ఒక్క మాటంటే వెయ్యి మాట్లాడే వైసీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడానికి జంకుతున్నారు. దీంతో వైసీపీలో ఏం జరుగుతొంది? యుద్ధం మొదలు కాకుండానే వైసీపీ అస్త్ర సన్యాసం చేసేసిందా? వైసీపీ మౌనం ఓటమిని అంగీకరించేసినట్లేనని భావించాల్సి ఉంటుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. 

ముందస్తుగానే మినీ జమిలి?.. మోడీ వ్యూహమిదేనా?

వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి ప్రధాని పదవి చేపట్టాలన్న మోడీ ఆకాంక్ష నెరవేరుతుందా? గత నాలుగైదు నెలల వరకూ బీజేపీలో కనిపించిన గెలుపు ధీమా సన్నగిల్లిందా? అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలుపు తీరాలను చేరాలన్న లక్ష్యంతో కొత్త వ్యూహాలు రచిస్తోందా?   అసలు కర్నాటక ఎన్నికల ఫలితంతోనే బీజేపీ పర్ స్పెక్టివ్ మారిపోయిందా? . ఆ ఎన్నికల ఫలితం వెలువడడానికి ముందు వరకూ హ్యాట్రిక్ విజయంపై ఉన్న ధీమా బీజేపీలో ఇప్పుడు పూర్తిగా అడుగంటిందా? అంటూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణలను అలంబనగా ఆ పార్టీ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలను ఎత్తి చూపుతున్నారు. ఎవరో తరుముకు వస్తున్నారన్నట్లుగా వరుసగా ప్రజాకర్షక కార్యక్రమాలను ప్రకటించేస్తున్నారు. ఇంత కాలం ధరల మోత గురించి పన్నెత్తి మాట్లాడని మోడీ ఇప్పుడు వరుసగా సామాన్యుడికి ఊరట కలిగేలా ధరల తగ్గింపుపై పడ్డారు. ముందుగా మధ్యతరగతికి గుదిబండగా మారిన గృహావసరాలకు వినియోగించే గ్యాస్ బండ ధరను రెండు వందల రూపాయల వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆయన పెట్రో ధరలను తగ్గించనున్నారని చెబుతున్నారు. కేంద్రం హఠాత్తుగా  ఇలా తాయిలాలు  ప్రకటించడం వెనుక భారీ వ్యూహం ఉందంటున్నారు.   ఆ వ్యూహమే ముందస్తు సార్వత్రిక ఎన్నికలు అంటున్నారు. ఎటూ ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి ఉన్నాయి. ఈ ఎన్నికలలో మొరుగైన ఫలితాలు సాధించి సార్వత్రిక ఎన్నికలకు బలంగా, ఘనంగా సమాయత్తం కావాలన్న ఆలోచనలో ఉన్నాయి. అదే సమయంలో విపక్షాల ఐక్యతా యత్నాలు కూడా సవ్య దిశలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అందుకే ముందస్తు సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచిస్తున్నది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు సార్వత్రిక ఎన్నికలూ ఒకే సారి జరిపిస్తే.. మొత్తం ఎన్నికలను జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయనీ, తద్వారా జాతీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలూ మరుగున పడతాయని మోడీ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పనిలో పనిగా గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదిస్తున్న జమిలి ప్రయోగం కూడా కానిచ్చేసినట్లౌతుందన్నది మోడీ యోచనగా చెబుతున్నారు. అందుకే ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను కూడా జరిపించేస్తే రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది మోడీ యోచనగా చెబుతున్నారు. పనిలో పనిగా తాము ఏం చెబితే అది చేయడానికి ఎవరెడీ బ్యాటరీలా సదా సిద్ధంగా ఉండే వైసీపీ, బీజేడీ ప్రభుత్వాలను ఒప్పించి ఆయా రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేస్తే వీటినే మినీ జమిలి ఎన్నికలని ఘనంగా చాటుకుని చేసి చూపించామన్న ఘనతను ఖాతాలో వేసుకోవచ్చన్నది మోడీ యోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అందుకే  కేంద్రంలోని బీజేపీ సర్కార్ విపక్షాలు గుక్క తిప్పుకునే అవకాశం ఈయకుండా వరుస పెట్టి తాయిలాలు ప్రకటిస్తూ వేగంగా ఎన్నికలకు సమాయత్తమైపోతున్నదంటున్నారు.  అంటే నిర్దిష్ట గడువుకంటే మూడు నుంచి నాలుగు నెలలు ముందుగానే సార్వత్రిక ఎన్నికలు జరిగేలా మోడీ సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందంటున్నారు.   లోక్‌సభను రద్దుచేసి డిసెంబర్‌లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ముందుస్తుకు వెళ్లేందుకు అవసరమైన సన్నాహకాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కార్ చాపకింద నీరులా కానిచ్చేస్తోందని  అంటున్నారు.    ఏపీ, ఒడిషాల  అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుగానే జరిపించేయాలని భావిస్తోందంటున్నారు. విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలించేందుకు వీలుగా అవి సమగ్రంగా చర్చిచుకునేందుకు, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చేందుకు సమయం లేకుండా ఎన్నికల యుద్ధానికి శంఖారావం పూరించేసి ప్రయోజనం పొందాలన్నది మోడీ సర్కార్ యోచనగా చెబుతున్నారు.    

ఎన్టీఆర్ కాయిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్!

ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారు దైవసమానంగా భావించే హీరో, శక పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ అధిరోహించని ఎత్తులు లేవు. ఆయనను అభిమానించని తెలుగువాడు ఉండడు. అటువంటి ఎన్టీఆర్  గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఎవరు  చేపట్టినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుంది. కాగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను సోమవారం (ఆగస్ట్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. సోమవారం విడుదలైన ఈ నాణేన్ని మంగళవారం నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ లో అమ్మకాలు చేపట్టగా తొలిరోజే విశేష స్పందన లభించింది. ఈ ఎన్టీఆర్ రూ.100 స్మారక కాయిన్ ధరను మూడు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి ఉంచారు. రూ.4,850 చెక్క డబ్బాతో, రూ.4,380 ఫ్రూప్​ ఫోల్డర్​ ప్యాక్​, రూ.4,050 యూఎస్​సీ ఫోల్డర్​ ప్యాక్​గా నిర్ణయించింది. హైదరాబాద్ రెండు మింట్ కేంద్రాలతో పాటు..  https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ధర ఎక్కువైనా రూ.4,850 చెక్క డబ్బాతో వచ్చే కాయిన్ కు డిమాండ్ అధికంగా ఉండడం విశేషం. మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాణేన్ని విక్రయానికి అందుబాటులో ఉంచగా.. నాణేన్ని సొంతం చేసుకొనేందుకు ఉదయం నుండే మింట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు క్యూ కట్టారు.  రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేలు విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని విక్రయాలు జరిగిపోగా.. మరోవైపు ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్‌సైట్‌లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. ఊహించని స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేనికి  విపరీతమైన డిమాండ్ నెలకొంది. మొత్తం 12 వేల నాణెల్ని ముద్రించగా.. మరో ఎనిమిది వేల నాణేలను ముద్రించనున్నారు. ఆఫ్ లైన్ లో 5 వేల నాణెలు తొలిరోజే అమ్ముడుపోగా.. ఆన్ లైన్ లో నిమిషాల వ్యవధిలోనే అవుటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. సాధారణంగా  స్మారక నాణేలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణేలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆయన పట్ల తెలుగువారి అభిమానానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు.  ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ప్రముఖుల జ్ఞాపకార్థం ఇలా ఎన్నో కాయిన్స్ విడుదల చేసినా ఏ  స్మారక నాణేనికీ దక్కని విశేష స్పందన ఎన్టీఆర్ నాణానికి దక్కడం విశేషం. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేలేవీ  పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి ముందుగానే 12వేలు ముద్రించామని, అయితే అవి తొలిరోజే అమ్ముడవడం విశేషమని శ్రీనివాస్ చెప్పారు. దీనిని బట్టే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్ధమౌతుంది.  మరో ఎనిమిది వేలు ముద్రించి అందిస్తామని శ్రీనివాస్ చెప్పారు. అయితే, తొలిరోజు ఎక్కడ ఈ నాణేలు దొరుకుతాయో.. ఎలా దక్కించుకోవాలో చాలా మంది అభిమానులకు అవగాహనా లేదు. అసలు చాలా మందికి ఇవి అందుబాటులోకి వచ్చాయని కూడా తెలియదు. అయినా ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. కాగా.. ఒకటీ రెండు రోజులు పోతే ఈ నాణేనికి ఇంకాడిమాండ్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ముద్రించే 8 వేలు ఉన్న డిమాండ్ కు ఏ మాత్రం సరిపోవు అనడంలో సందేహం అక్కర్లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఛరిష్మా ఇసుమంతైనా తగ్గలేదు సరికదా మరింత పెరుగుతోంది అనడానికి  ఈ నాణానికి ఉన్న డిమాండ్ ను బట్టే తెలిసిపోతున్నది.

కోడికత్తి కేసులో కొత్త అనుమానాలు!?

 ​కోడికత్తి కేసు విచారణ సందర్భంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ ఎందుకు రావడం లేదు అనడానికి కారణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. విశాఖ విమానాశ్రయంలో గత ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో జనపల్లి శ్రీను అనే యువకుడు దాడి చేసిన కేసును జగన్ పట్టుబట్టి మరీ ఎన్ఐఏ చేపట్టేలా చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పరిధిలోకి ఈ కేసు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న ఒకే ఒక్క సాంకేతిక కారణం ఆధారంగా ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించారు. అంతే ఇక అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు, విచారణ కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడో జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన దాడి కేసులో సంఘటన జరిగిన వెంటనే అరెస్టయిన నిందితుడు జనపల్లి శ్రీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నారు. ఇక సుదీర్ఘంగా సాగుతున్న దర్యాప్తు, విచారణలో ఇప్పటికే ఈ దాడి వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విస్పష్టంగా తేల్చేసింది. అయినా కూడా కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనుకు బెయిలు మంజూరు కాలేదు. నిబంధనల మేరకు ఈ కేసులో నిందితుడికి బెయిలు రావాలంటే.. బాధితుడిగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని అంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ కేసులో ఎన్ఐఏ విచారణ సరిగా లేదనీ, మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందంటూ కోర్టుకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ విశాఖకు మారింది.  విచారణ కోసం మంగళవారం కోడికత్తి శీనును రాజమహేంద్రవరం జైలు నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు తీసుకువచ్చారు. యధా ప్రకారం కేసు విచారణ వాయిదా పడింది. కోడి కత్తి శీనుకు బెయిలు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో   కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడిన శీను తరఫు న్యాయవాది  జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలమైనా ఇవ్వాలి లేదా శ్రీనుకు బెయిలు మంజూరు చేయడానికి అభ్యంతరం లేదంటూ ఎన్ఓసీఅయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.   కేసులో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ విస్పష్టంగా చెప్పినా రాజకీయాల కోసమే కేసును వాయిదా మీద వాయిదాలు పడేలా జగన్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ కోర్టుకు హాజరు కావడం లేదని ఆరోపించారు.   ఈ కేసులో ఏదైనా ఉందంటే అది కేవలం రాజకీయం మాత్రమేననీ, అప్పట్లో విపక్ష నేతగా ఈ దాడిని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్ ఇప్పుడు ఐదేళ్ల తరువాత మళ్లీ ఎన్నికలలో ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారనీ నిందితుడు జనపల్లి శ్రీను తరఫు న్యాయవాది ఆరోపించారు. వాస్తవంగా 2018 అక్టోబర్ 25న అంటే విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన సమయంలో కోడి కత్తి ని విమానాశ్రయంలోకి తీసుకువచ్చింది ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అని జనపల్లి శ్రీను తరఫు న్యాయవాది సలీం వీలేకరుల సమావేశంలో చెప్పారు. నేరాన్ని జనపల్లి శీనుపై నెట్టేశారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలంటే నాటి విషయాలన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే రాకుండా తప్పించుకుంటున్నారని సలీం ఆరోపించారు. ఇలా ఉండగా జగన్ పై విశాఖ విమానాశ్రయంలో అసలు దాడే జరగలేదనీ, మజ్జి శ్రీనివాసరావు తీసుకువచ్చిన కోడి కత్తితో జగన్ తనను తాను గాయపరుచుకుని ఆ నేరాన్ని జనపల్లి శ్రీనుపై నెట్టేశారనీ, అందుకే కోడికత్తిపై శ్రీను వేలిముద్రలు ఉన్నాయా? అసలు ఎవరి వేలిముద్రలు ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పటి వరకూ ఇతమిథ్థంగా చెప్పడంలేదనీ న్యాయనిపుణులు అంటున్నారు. ఇక మంగళవారం విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన నిందితుడి తరఫు న్యాయవాది సలీం.. ఈ కేసులో రాజకీయమే కుట్ర కోణమనీ, వచ్చే ఎన్నికలలో లబ్ధి కోసమే జగన్ కోర్టుకు హాజరు కాకుండా కేసులో వాయిదాల పర్వం కొనసాగేలా చేస్తున్నారనీ ఆరోపించారు. ఏది ఏమైనా  గత ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న జనపల్లి శ్రీనుకు న్యాయం జరగాలంటే ఎన్ఐఏ కోర్టుకు  రావాలి జగన్.. ఇవ్వాలి వాంగ్మూలం అన్నదే తమ డిమాండ్ అని సలీం చెప్పారు. 

గన్నవరంలో వార్ వన్ సైడేనా? వంశీ ఓటమి ఖాయమేనా?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ సీటు తెలుగుదేశం ఖాతాలో పడటం ఖాయమన్న చర్చ నియోజకవర్గంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశంలోకి జంప్  చేయడంతో , తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ విజయం  దాదాపుగా ఖాయమైందనే ఓ టాక్  స్థానికంగా వైరల్ అవుతోంది.  మరోవైపు గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేత దుట్టా రామచంద్రరావు తీరు ఎవరికీ అంతు బట్టని విధంగా ఉండడంతో.. ఆయన వ్యవహారశైలితో ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తల నొప్పులు మొదలైయ్యాయనే ఓ చర్చ హల్‌చల్ చేస్తోంది.  ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2019లో గన్నవరం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా  గెలిచిన వల్లభనేని వంశీ.. జగన్ ముఖ్యమంత్రి కావడంతో.. ఆయన పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే గతంలో అంటే.. 2014 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ  తెలుగుదేశం అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై గెలుపొందారు. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. దుట్టా రామంచంద్రరావుతోపాటు ఆయన వర్గాన్ని.. ఎమ్మెల్యే వంశీ  అండ్ కో ఓ రేంజ్‌లో ఆట ఆడుకొన్నారు. నాడు వల్లభనేని వంశీ అరాచకాలపై అప్పుడే ప్రతిపక్ష నేత జగన్‌కి దుట్టాతోపాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత .. అతడి సంగతి చూద్దామంటూనే.. వంశీ విషయాన్ని పక్కన పెట్టేశారు జగన్. అంతలో 2019 ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మళ్లీ వంశీ  విజయం సాధించడం ఆ వెంటనే  జగన్ పార్టీలో చేరిపోవడం... చకచకా జరిగిపోయాయి.  కానీ దుట్టా రామచంద్రరావుకే కాదు.. యార్లగడ్డ వెంకట్రావ్‌కు సైతం   జగన్ ప్రభుత్వం న్యాయం అయితే చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు ఫ్యాన్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న వారికెవరికీ న్యాయం జరగడం లేదని యార్లగడ్డ వెంకట్రావ్..తన అనుచరలతో జరిపిన ఆత్మీయ సమావేశంలో దుట్టా రామచంద్రరావు అంశాన్నే సోదాహరణగా వివరించారు. ఆ వెంటనే యార్లగడ్డ వెంకట్రావ్  సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేశారు.  దీంతో యార్లగడ్డ వెంకట్రావ్ అడుగులో అడుగు వేసి దుట్టాతోపాటు ఆయన వర్గం సైతం సైకిలెక్కేయడం ఖాయమని జగన్ భావించారు. ఆ క్రమంలో దుట్టాతోపాటు ఆయన ఫ్యామిలీతో సీఎం వైయస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో దుట్టా రామచంద్రరావు కొంత మెత్తబడ్డట్లే కనిపించినా.. ఆ తర్వాత ఆయన సైతం తన ప్రయత్నాలు తాను చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ  అగ్రనాయకత్వం..   మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని రంగంలోకి దింపింది. అందులో భాగంగా దుట్టాతో వల్లభనేని వంశీ మంతనాలు జరిపినా.. ఫలితం లేకుండా పోయింది.    గతంలో ఎమ్మెల్యే వంశీతోపాటు ఆయన వర్గం పెట్టిన ఇబ్బందుల కారణంగా.. రానున్న ఎన్నికల్లో ఆతడి విజయం కోసం పని చేయడం తమ వల్ల కాదని.. దుట్టా వర్గం ఇప్పటికే క్లియర్ కట్‌గా ఎంపీ వల్లభనేని బాలశౌరితో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  ఇటువంటి పరిస్థితుల్లో దుట్టా వర్గం కూడా... రేపో మాపో తెలుగుదేశం గూటికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని..అదే జరిగితే  గన్నవరంలో వార్ వన్ సైడేననీ.. తెలుగుదుశం విజయం గ్యారంటీ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఓ వేళ దుట్టాతోపాటు ఆయన వర్గం ఫ్యాన్ పార్టీలోనే ఉన్నా.. ఆ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలోకి దిగితే మాత్రం.. యార్లగడ్డ గెలుపునకే పని చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

భర్తకు అరెస్టు వారెంట్ పై మంత్రి రోజా మౌనమేలనోయీ!

జగన్  కేబినెట్  మహిళా మంత్రుల్లో అసలు సిసలు ఫైర్ బ్రాండ్  పర్యాటక శాఖ మంత్రి  రోజా . ఈ విషయాన్ని  అధికార పార్టీలోని వాళ్లే కాదు.. ప్రతిపక్ష పార్టీ  నేతలు సైతం అంగీకరిస్తారు. అలాంటి   రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే  తన భర్తకు వారెంట్ వచ్చి రెండు రోజులు గడుస్తున్నా రోజా  నుంచి ఎటువంటి స్పందనా లేదు.  దీంతో తన భర్తపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా మంత్రి రోజా కనీసం స్పందించకపోవడంపపై  నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.    ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ఈగ వాలితేనే ఆర్కే రోజు సహించలేరని.. అలాంటి ఆమె.. తన భర్త   సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఎందుకు స్పందంచడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆర్కే రోజా... తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో సీఎం జగన్ విద్యా దీవెన పథకంలో భాగంగా బటన్ నొక్కే కార్యక్రమాన్ని నిర్వహించారని.. ఈ సందర్బంగా ఆ భారీ సభలో ఆర్కే రోజా మాట్లాడుతూ.... సీఎం జగన్‌ను  దేవుడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆటాడుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ ప్యూచర్ కి సీఎం అని   రోజా  ఆ ప్రసంగంలోపేర్కొన్నారనీ,  ఇంతకీ జగన్.. ఎవరి ప్యూచర్‌కి సీఎం అని వారు క్వచ్చన్ లు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఓ వేళ ఆమె ప్యూచర్‌కే  జగన్ సీఎం అయితే అయి ఉండవచ్చని కూడా అంటున్నారు.  అదీకాక... తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఎవరైనా   జగన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తే.. కొన్ని సెకన్లలో.... అదీ శ్రీవారు కొలువైన తిరుమల? గణేషుడు కొలువున్న కాణిపాకమా?  సత్యదేవుడు నెలవున్న అన్నవరమా ?  లక్ష్మీ నరసింహుడి ఆవాసమైన సింహాచలమా? అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. అలా మీడియా ముందుకు వచ్చి.. ఇలా ఆయా పార్టీల అధినేతలపై సినిమా డైలాగులతో,  ప్రాసలతో   రోజా చిందులు తొక్కుతారనీ.. అయినా.. తాను ఓ బాధ్యత గల మంత్రిని అని.. అదీ కూడా ఓ మహిళా మంత్రినన్న సోయి కూడా లేకుండా.. నాని బ్రదర్స్‌ లేడి అవతారం ఎత్తితే ఎలా మాట్లాడతారో.. అలా ఆమె మాట్లాడుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు.   అయినా ప్రతీదానికి స్పందించే ఆర్కే రోజా.. భర్తకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఏక్కడో ఏదో తేడా కోడుతున్నట్లుగా ఉందనే  ఓ అనుమానాన్ని కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  ఇక చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు రోజా భర్త సెల్వమణికి ఎందుకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసిందంటే.. 2016లో ఓ తమిళ చానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  సినిమా ఫైనాన్షియర్ చంద్ బోత్రాని కించపరిచే విధంగా మాట్లాడారు. దీనిపై చంద్ బోత్రాసెల్వమణిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఆ తర్వాత ఆయన  మరణించడంతో.. ఆయన కుమారుడు గగన్ బోత్ర ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో ఆ కేసు.. మరోసారి విచారణకు వచ్చింది. కానీ ఈ విచారణకు సెల్వమణి హాజరు కాలేదు. అలాగే ఆయన తరుఫు న్యాయవాదులు సైతం హజరుకాలేదు. దీంతో జార్జీ చౌన్ కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.