where to go

వైసీపీ నేతల దారేది?.. బెయిలా..జెయిలా.. హాస్పటలా?

ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. జగన్ హయాంలో  కొంద‌రు  వైసీపీ నేత‌లు   హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. వారిలో  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది.    వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదంటూ వైసీపీకి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.  ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్నది. ఇప్పటికే వైసీపీ హయాంలో విర్రవీగి.. ఇష్టారీతిగా నోరు పారేసుకున్న నేతలు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన నాయకులు కేసుల చట్రంలో ఇరుక్కున్నారు. బోరుగడ్డ అనీల్ లో మొదలెడితే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కటకటాలు లెక్కిస్తున్నారు.  ఒకళ్లా ఇద్దరా పదుల సంఖ్యలో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అలా కేసులు నమోదైన వారిలో  మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, విడదల రజని, పేర్ని నాని, జోగు రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా   వల్లభనేని వంశీ, బోరుగడ్డ అనిల్,  పోసాని కృష్ణ మురళి,  వర్రా రవీంద్రారెడ్డి, నందిగం సురేష్, జోగి రాజీవ్ ఉన్నారు.  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి,  గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్, అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. వీరిలో పలువురు జైలు పాలయ్యారు. కొందరు బెయిలుపై ఉన్నారు.  దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. కేసులు నమోదైన వారిలో పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది చాలదన్నట్లు అనారోగ్యం అంటూ ఆస్పత్రుల పాలౌతున్నారు. మొత్తం మీద ఇప్పుడు వైసీపీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.   పోసాని కృష్ణమురళి వంటి వాచాలురు జైలు కెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే బెయిలు కూడా దొరక్క రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అనారోగ్యం, బ్యాక్ పెయిన్ అంటూ బెయిలు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అవినీతి కేసులో మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నేడో రేపో ఆమె కూడా అరెస్టు కాక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అరెస్టు భయంతో వణికి పోతున్నారు. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణ వాయిదా వేసిన కోర్టు.. తాత్కాలిక ఊరట ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన మెడపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోంది. ఇక బూతుల మంత్రిగా సుప్రసిద్ధుడైన కొడాలి నాని కూడా అరెస్టు భయంతో వణికిపోతున్నారు. తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం పాలై హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన అక్రమాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భూ కబ్జాలకు సంబంధించి దర్యాప్తు వేగం పుంజుకోవడంతో ఆయన కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల తన నివాసంలో బాత్ రూంలో జారిపడి చేయి విరక్కొట్టుకుని ఆస్పత్రి పాలయ్యారు.  మొత్తంగా చూస్తుంటే జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కేసులనమోదు కావడంతో ఎప్పుడు, ఏ క్షణంలో పోలీసలు వచ్చి తలుపుతడతారా అన్న భయంతో వారి హెల్త్ దెబ్బతింటోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.  అనారోగ్యం కారణంగా  ముందస్తు బెయిల్ దొరికే చాన్స్ లు ఎక్కువ ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగారని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  వైసీపీ నేతల అనారోగ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ముందుగా  కొడాలి నాని విషయం తీసుకుంటే.. కొడాలి నాని  కొడాలి నాని గ్యాస్టిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరారు. ఇన్ పేషంట్ గా చేరి రకరకాల పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు గుండెనొప్పి అని ప్రచారం జరిగింది.   గుండెల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు    గుడివాడలో నమోదైన కొన్ని కేసుల్లో కొడాలి ప్రమేయంపై ఆధారాలు సేకరించారు.  కొంత మంది ఖాతాల్లో డబ్బులు వేసి  ఆ తరువాత తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా గుర్తించారు. ఇక అరెస్టు ఖాయమని అనుకున్న సమయంలో ఆయన ఆస్పత్రి పాలు కావడం జరిగింది.  ఇక మద్యం కుంభకోణంలో  ప్రధానంగా వినిపిస్తున్న మిథున్ రెడ్డి, భూ, గనుల వ్యవహారాల్లో దోపిడీకి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా అరెస్టు కత్తి వేళాడుతోందంటున్నారు. మిధున్ రెడ్డి అయితే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ ఆయన పేరు నమోదు కాలేదు. అయినా అరెస్టు భయంతో ముందస్తు బెయిలు తెచ్చుకన్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి సర్జరీ జరిగిందంటూ  మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు.  ఇలా మొత్తంగా జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించి చట్టాలను చుట్టాలుగా చేసుకుని చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్నది. 

Sajjala granted bail in Posani case

పోసాని కేసులో సజ్జలకు బెయిల్  మంజూరు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిలను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో తండ్రి కొడుకులు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  వైకాపా నేతలకు బెయిల్ వచ్చిన  విషయం స్వంత పార్టీ ఒక ప్రకటన చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. వైకాపా మీడియా సంస్థలో  కూడా తండ్రి కొడుకులకు బెయిల్ వచ్చిన వార్త ప్రాధాన్యత చోటు చేసుకోకపోవడం గమనార్హం.  కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు పోసాని కృష్ణ మురళి తన నేరాన్ని అంగీకరించడంతో సజ్జల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే తాను కూటమి నేతలపై వ్యాఖ్యలు చేసినట్టు పోసాని వాంగ్యూలం ఇచ్చారు.  నటుడు , రచయిత, దర్శకుడైన పోసాని కృష్ణ మురళి చివరకు సజ్జల స్క్రిప్ట్ ప్రకారం అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలు కావాల్సి వచ్చింది. కోర్టులో ఆయన న్యాయమూర్తి ఎదుట భోరున విలపించడం ఎవరూ ఊహించలేకపోయారు. 

honour killing in telangana

తెలంగాణలో పరువు హత్య

తెలంగాణలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో పెద్దపల్లి జిల్లాలో 17 ఏళ్ల యువకుడిని ఆ అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ అదే గ్రామానికి చెందిన సదయ్య కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన సదయ్య కోపంతో రగిలిపోయాడు.  చదువు సంధ్యలు లేకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న సాయికుమార్ తన కుమార్తెతో ప్రేమలో పడటం సదయ్యకు నచ్చలేదు. మందలించినా ఫలితం లేకపోవడంతో సాయికుమార్ ను గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. తన పుట్టిన రోజును స్నేహితులతో జరుపుకుంటున్న సాయికుమార్ ను సదయ్య గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

cbn to attend all india reasearch scolors summitt

అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (మార్చి 28) చెన్నైకు బయలు దరి వెళ్లారు. అక్కడ జరిగే అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిల్ లో ఆయన ప్రసంగిస్తారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై మీనంబాకం ఓల్డ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు చెన్నైలోని తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక మద్రాస్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు చెన్నై పర్యటనకు వెళ్లడం  ఇదే తొలిసారి.

tragedy in ammenpur

అమీన్ పూర్ లో విషాదం!

ఏం కష్టమొచ్చిందో? ఎంతగా నలిగిపోయిందో.. ఆ తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. అమీన్ పూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించింది. ఈ తరువాత తానూ తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ముగ్గురూ మరణించగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరణించిన పిల్లలు  సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌ (8)ల‌ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.   పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించి, తానూ తిన్న రజిత.. భర్త చెన్నయ్యకు మాత్రం విషం కలిపిన పెరుగన్నం పెట్టకుండా పప్పు అన్నం మాత్రమే పెట్టింది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణం గానే ర‌జిత ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

komatireddy brothers praise revanth

మంచివాడు మా రేవంత్!

పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది.  శాసనసభలో, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తిం చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది.  కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డి  హోంమంత్రిగా బాధ్య తలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఆ క్రమంలో పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారనీ, లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖ మార్చాలని కోరుతున్నారట. ఈ నేపధ్యంలో అన్నదమ్ములిద్దరు రేవంత్‌కు మద్దతుగా గొంతెత్తుడటం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.

cbn model the best

చంద్రబాబు మోడలే ది బెస్ట్!

తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో మారు ఆరోపించారు. అంతే కాదు, కొట్లాడకపోతే కేంద్రం నిధులివ్వదు.. పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిత బోధ కూడా చేశారు. అలాగే  మరో అడుగు ముందుకేసి  కేంద్రంపై పోరాడేందుకు రేవంత్ ప్రభుత్వానికి మద్దతిస్తామని  కేటీఆర్ సభా ముఖంగా ప్రకటించారు. అయితే, కేటీఆర్  ప్రతిపాదన   నాలాగా వర్ధిల్లు..  అన్నట్లు ఉందని  అంటున్నారు. అవును  బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం పై చేసిన యుద్ధం వలన రాష్ట్రానికి మేలు జరగలేదు సరికదా, బీఆర్ఎస్ కు ఆశించిన రాజకీయ ప్రయోజనం కూడా లభించలేదు. అందుకే కేటీఆర్ ఉద్భోధ   నాలాగా వర్ధిల్లు.. అన్నట్లు ఉందని  అంటున్నారు.   నిజమే కావచ్చును  తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్నది ఎంతో కొంత నిజం కావచ్చును. అలాగే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ/ఎన్డీఏ యేతర ప్రభుత్వాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలోనూ నిజం లేక పోలేదు. నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్  నినాదంతో  తెలంగాణలోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం  తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందనే ఆరోపణను తోసివేయలేము .    అయితే  కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు  కేటీఆర్  ప్రవచించినట్లు కయ్యం ఒక్కటే మార్గమా? అంటే, కాదు. తెలంగాణ అనుభవమే కాదు  మరి కొన్ని రాష్ట్రాల అనుభవం కూడా  కేంద్రంతో నిరంతర కయ్యం రాష్ట్రానికి మంచిది కాదనే చెబుతోందని  రాజకీయ విశ్లేషులు అంటున్నారు. ఒక విధంగా కేంద్రంతో నిరంతర సంఘర్ష ధోరణి  బీజేపీ ప్రవచించే డబుల్ ఇంజిన్  సర్కార్’ నినాదానికి బలాన్ని చేకూర్చే ప్రమాదం కూడా లేక పోలేదని  నిన్నమొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందీ అదే అని విశ్లేషకులు అంటున్నారు.   మరోవంక  కేంద్రంతో సయోధ్యతో ఉంటే ఏమేమి సాధించుకోవచ్చునో  ఏమేమి సాధించుకున్నామో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే సభలో వివరించారు.ఇందుకు సంబంధించి  చాలా పెద్ద  చిట్టానే  ఆయన శాసన సభలో వినిపించారు. ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ వెళుతున్నారని, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శకు సమధానంగా రేవంత్ రెడ్డి  ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళిందీ,  ఏ కేంద్ర మంత్రిని కలిసింది, ఏమి సాధించుకొచ్చిందీ, తారీకులతో సహా వివరించారు. అలాగే వికారాబాద్ లో రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో రాష్ట్రాభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామని  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజానికి  ఆ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు, ఇంకా అనేక సందర్భాలలో, అనేక వేదికల నుంచి కూడా రేవంత్ రెడ్డి , ఇదే విషయం స్పష్టంగా చెప్పారు.  నిజానికి, కేంద్ర రాష్ట సంబంధాల విషయంలో రాజకీయాల  ప్రమేయం ఎంత తక్కువగా ఉంటే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని చరిత్ర చెపుతోంది. ఒకప్పుడు కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఓ ‘ టెక్స్ట్ బుక్  మోడల్’ గా నిలిచారు. ఎన్డీఎ మిత్ర పక్షంగా ఢిల్లీలో  చక్రంతిప్పారు.  కేంద్రానికి అన్ని విధాలా సహకరించారు. వాజపేయి ప్రభుత్వానికి తలలో నాలుకగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో అటల్జీ సర్కార్ ను రాజకీయ, పరిపాలనా చిక్కులోంచి బయట పడేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను వదులుకుని కేంద్రతో  కలిసి నడిచారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను సాధించారు. అప్పట్లో చంద్రబాబు ముఖ చిత్రంతో వెలువడిన  ఇండియా టుడే  పత్రిక కేంద్ర నిధుల వేట గాడు.. చంద్రబాబు అనే మకుటంతో ముఖ చిత్ర కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు, రాజనీతిజ్ఞకు ఇదొక నిదర్శనంగా అప్పట్లో మేథావులు మెచ్చుకున్నారు.  అప్పుడే కాదు ఇప్పడు కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి  కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతున్నారు. గత వైసీపీ  హయాంలో గాడి తప్పిన రాష్ట్ర ప్రగతిని  పట్టాల పైకి తెచ్చి పరుగులు తీయిస్తు న్నారు.అందుకే  కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలీ అంటే  చంద్రబాబు మోడల్  ది బెస్ట్ మోడల్  అంటున్నారు.  అవును  నిజానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఉద్భోదిస్తున్న సంఘర్షణ వైఖరి  రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే కాకుండా, రాజకీయంగానూ అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్యనే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి,  నేషనల్ కాన్ఫరెన్స్  నాయకుడు  ఉమర్ అబ్దుల్లా   జమ్మూ కశ్మీర్  ప్రజల సంక్షేమం కోసం,కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కాదని  కేజ్రీవాల్  తరహాలో కేంద్రంతో నిత్య సంఘర్షణకు దిగితే కేజ్రీవాల్ తరహ ఫలితాలను స్వీకరించడానికి సిద్దంగా ఉండవలసి వస్తుంది  అని అన్నారు.  అలాగని  కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా అణిగి మణిగి ఉండవలసిన అవసరం లేదనీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అది అంత క్షేమకరం అభిలషణీయం కూడా కాదని అంటున్నారు. అలాగే  అయిన దానికీ  కాని దానికీ కయ్యానికి కాలుదువ్వడం కూడా  అంత క్షేమకరం కాదనీ సమయానుకూలంగా శత్రుమిత్ర సంబంధాలు ఉండాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి  ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి అయినా  అంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్  ఓటమికి అయినా  కేటీఆర్  స్వయంగా పేర్కొనట్లుగా  మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో స్కోర్ కు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శత్రుమిత్ర సంబంధాలే కారణం కానక్కర లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ  కేంద్ర ప్రభుత్వం పై తిరుగులేని పోరాటం చేస్తూనే, వరసగా విజయం సాధిస్తున్నారు. మరోవంక, ఏపీలో అవినీతి కేసుల ఉచ్చు నుంచి తప్పించుకేందుకు,  జగన్మోహన్ రెడ్డి  సదా మీ సేవలో... అన్నట్లు కేంద్రానికి సాష్టాంగ  ప్రణామాలు చేశారు.  మరో వంక, కేంద్రం అండ ఉందనే వంకర బుద్దితో రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలకు దూరమయ్యారు. అందుకే ప్రజలు పదకొండుకు పడగొట్టారు. సో  కేవలం కేంద్ర రాష్ట్రల మధ్య సయోధ్య  ఉంటే సరిపోదు, కేంద్రంతో సయోధ్య  పాటిస్తూ నిధులు, ఇతర ప్రయోజనాలు పొందుతూనే  రాష్ట్ర ఆదాయ వనరులను.  రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులకు వినియోగిస్తూ సుపరిపాలన అందిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు అప్పుడు.. ఇప్పడు ఎప్పడూ అదే ఉభయ తారక విధానం ఫాలో అవుతున్నారు. అందుకే   చంద్రబాబు మోడల్ .. ది బెస్ట్ మోడల్ అంటున్నారు. జమ్మూ కశ్మీర్ అబ్దుల్లా మొదలు తెలంగాణ రేవంత్ రెడ్డి వరకు  చంద్రబాబు బాటలో నడుస్తున్నారు.

vanshi lacks mental stability

చంద్రబాబుకున్న మనోబలం.. వంశీకి లేదా?

జైల్లో గడపవలసి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారక్ లో ఒంటరి గా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష  అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసినవారిని ఇటువంటి సాలిటరీ సెల్ లలో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిపి ఉంచడం వలన వారికి ప్రమాదం ఉంటుందనే అనుమానం ఉంటే..  వాళ్ళను కూడా ఒక సెల్ లో ఒంటరిగా ఉంచుతారు. ప్రస్తుతం దళిత యువకుడు సత్యావర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారెక్ లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్ లో ఒక్కడినే ఉండలేకపోతున్నాను.. తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని  ఆయన కోర్టును పదేపదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావడం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండు పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగడం,  ఆ కోరిక నెరవేరకపోవడం జరుగుతూనే ఉంది.  ఇదంతా నేపథ్యం అనుకుంటే.. ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి! ముందే చెప్పుకున్నట్టు ఒక సెల్ లో ఒంటరిగా ఉండడం అనేది నిజంగానే కష్టం! అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తి అయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన  వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్ గా ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది. గతంలో జగన్ పాలనలో చంద్రబాబునాయుడడిని అరాచకంగా అరెస్టు చేసి.. చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో  తరలించి మొత్తానికి ఆయనను 53 రోజుల పాటు సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తనను అరెస్టు చేసిన ప్రభుత్వ అరాచకత్వాన్ని చంద్రబాబునాయుడు ప్రశ్నించారే తప్ప.. జైలులో తనకు తోడు కావాలని మొర పెట్టుకోలేదు. వయసు రీత్యా డెబ్భయ్యేళ్లు దాటిన చంద్రబాబునాయుడుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఆ విషయానికి వస్తే.. వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత.. ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందని అంటే.. పరుపు, దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు.. అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారెక్ లో తనకు ఒక తోడు కావాలని ఆరాటపడడమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014కు పూర్వం జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారెక్ లో మరొకరు తోడు ఉన్నారు.  కానీ.. చంద్రబాబునాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ.. తోడు అడగలేదనే సంగతిని గమనించాలి. ఆయన మానసిక దారుఢ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయస్సు ఎక్కువ అయినప్పటికీ.. శారీరకంగా   చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన వయసు గురించి జగన్ హేళన చేసినప్పుడు.. ఇద్దరం కలిసి నడుద్దాం.. ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు చేశారు కూడా. చంద్రబాబుకు ఉండే మానసిక బలం.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడం, నిబ్బరంగా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవడం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

Vallabhaneni Vamsi bail petition rejected

వల్లభనేని వంశీకి చుక్కెదురు... బెయిల్ పిటిషన్ కొట్టివేత 

వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  సిఐడి  కోర్టులో  చుక్కెదురైంది.   కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ  బెయిల్ పిటిషన్ ను  దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా  బెయిల్ ఇవ్వాలని  కోర్టుకు  ఆయన తరపు న్యాయవాది విన్నవించుకున్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వడం వల్ల  సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీఐడీ తన వాదనలు వినిపించింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడు.  ఈ నేపథ్యంలో  తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి. గురువారం తీర్పును వెలువరించారు. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.  వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించారు.

telangana cm revanth reddy said truth on defection mlas

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది సత్యమే ..కానీ

తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, ముమ్మాటికీ నిజం. శాసన సభ వేదికగా ఆయన చేసిన ప్రసంగం మాటల్లోంచి, ఒక్క అక్షరాన్ని కూడా తప్పు పట్ట లేము. తీసి వేయలేము.  సరే..కోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల  అంశాన్ని సభలో ప్రస్తావించ వచ్చునా? లేదా? అలా ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ అవుతుందా? కాదా? అన్నది, వేరే విషయం. మళ్ళీ అది కోర్టు పరిధిలోని విషయం. ఎలాగూ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆల్రెడీ ప్రకటించారు, కాబట్టి  ఆ విషయాన్ని  కోర్టు చూసుకుంటుంది.  ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇక ముఖ్యమంత్రి ప్రసంగం విషయానికి వస్తే  బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి  కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావని  కుండ బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఏమి జరిగిందో ఇప్పడు కూడా అదే జరుగుతుందన్న విశ్వాసంతో ఉప ఎన్నికలు ఎందుకురావో కూడా వివరించారు.  అవును  గత టీబీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలోనూ ఫిరాయింపులు జరిగాయి. అప్పుడున్న చట్టమే ఇప్పుడూ ఉంది. అప్పుడున్న స్పీకర్ వ్యవస్థే ఇప్పడూ ఉంది.  సో.. అప్పుడు పార్టీ ఫిరాయించిన ఏ ఒక్కరి పైనా అనర్హత వేటు పడలేదు. ఏ ఒక్కరూ రాజీనామ చేయలేదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాలేదు. సో.. ఇప్పుడు కూడా ఏ ఒక్కరిపైనా అనర్హత వేటు పడదు. ఏ  ఒక్కరూ రాజీనామా చేయవలసిన అవసరం రాదు. ఏ ఒక్క నియోజక వర్గంలోనూ ఉప ఎన్నిక రాదు. అని ఎవరైనా అనుకోవచ్చును. ముఖ్యమంత్రి చెప్పిందీ, అదే. అందులో అభ్యంతరం చెప్పవలసింది ఏమీ లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి, ఎలాంటి శషబిషలు లేకుండా చేసిన ప్రకటన గుమ్మడి కాయ దొంగలు బుజాలు తడుముకునేలా చేసింది. అయితే  ముఖ్యమంత్రి సభలో అలాంటి ప్రకటన చేయవచ్చునా? అది  ఫిరాయింపులను ప్రోత్సహించడం అవుతుందా కాదా? అనేది వేరే విషయం.     నిజానికి  గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో జరిగిన ఫిరాయింపులతో పోలిస్తే  ప్రస్తుత కాంగ్రెస్   హయాంలో జరుగుతున్న ఫిరాయింపుల  పెద్ద విషయం కాదు.  2014 నుంచి 2023 వరకు వరసగా రెండు సార్లు అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ మొత్తం మీద ఓ 50 మందికి పైగానే  ఇతర  పార్టీల  ఎమ్మెల్యేలను కారు ఎక్కించి, గులాబీ కండువా కప్పించిది.  అంతే కాదు,  అందులో చాలా మందిని మంత్రులను చేసింది.   నిజానికి  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, స్వాగతించడం మాత్రమే కాదు, ఏకంగా  శాసన సభా పక్షాలను స్వాహా   చేసింది. టీఆర్ఎస్/బీఆర్ఎస్  శాసన సభా పక్షంలో వినీనం చేసుకుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు..  తెలుగు దేశం, సిపిఐ పార్టీల శాసన సభా పక్షాలను టీ(బీ)ఆర్ఎస్  స్వాహ చేసింది.  తెలంగాణ తొలి ముఖ్యమంతి కేసీఆర్   ఇతర పార్టీల ఎమ్మెల్యేల సర్పయాగంతోనే  తెలంగాణ స్వీయ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలనూ వదలకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను  సగౌరవంగా స్వాగతించి  స్వాహా  చేశారు. ఒక్క బీజేపీ  సిపిఎం ఎమ్మెల్యేలు మాత్రమే కేసీఆర్   స్వాహా యాగం నుంచి తప్పించుకున్నారు. అవును  కేసీఆర్  ఎంఐఎం ఎమ్మెల్యేల జోలికి కూడా పోలేదు. కానీఎంఐఎంను మిత్ర పక్షం చేసుకున్నారు.  నిజానికి, 2014 లో టీఆర్ఎస్ గెలిచింది 63 సీట్లు మాత్రమే.  అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్  రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ,టీడీపీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను కారెక్కించారు. అలాగే  ఇతర పార్టీల ఎమ్మెల్యేను తమ వైపుకు తిప్పుకుని అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకున్నారు.  అలాగే, 2018లో సొంత సంఖ్యా బలం 88కి పెరిగినా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందిలో 14(13 ప్లస్ 1) మందిని  లాగేసుకుని  కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా  కూడా లేకుండా చేశారు. అలాగే  టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు` గులాబీ కడువలు కలిపి, అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని సెంచరీ దాటించారు. అందుకే ఇప్పడు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని ఆరోపించడం  వెయ్యి బర్రెలను తిన్న ... సామెత గుర్తుకు తెస్తున్నదని అంటున్నారు.  అయితే  రాజకీయ విశ్లేశకులు మాత్రం  గతంలో ఏమీ జరగలేదు కాబట్టి  ఇప్పడు కూడా ఏమీ జరగదు అనుకుంటే అది పొరపాటే అవుతుందంటున్నారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  ను ఆదర్శంగా తెసుకుని అదే మార్గంలో నడిస్తే ఏమవుతుందో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి చెప్పారు. సో ..మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు.

Pastor Praveen Pagadala funeral held in grand style

ఘనంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు 

అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్  అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. పాస్టర్  భౌతిక  కాయాన్ని సికింద్రాబాద్  సెంటినరీ బాపిస్ట్ చర్చిలో  గురువారం సాయంత్రం( మార్చి 27) వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల్లో పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  హైద్రాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు   బయలుదేరిన  పాస్టర్  నిన్న కొవ్వూరు సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మరణించారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ తిరుమలగిరిలో అంత్యక్రియలు జరిగాయి. పాస్టర్ ప్రవీణ్ అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

jagan phone to kodali nani

కొడాలి నానికి గుండెలో మూడు బ్లాక్స్.. ఫోన్ లో జగన్ పరామర్శ..

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానికి బుధవారం (మార్చి 26) ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కొడాలి నానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తేల్చారు. వైద్య పరీక్షల్లో కొడాలి నానికి గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ బ్లాక్ అయ్యాయని గుర్తించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫోన్ లో కొడాలి నానిని పరామర్శించారు. అధైర్య పడవద్దంటూ ధైర్యం చెప్పారు. అలాగే వైద్యులను నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇలా ఉండగా.. వివిధ కేసుల్లో అరెస్టై జైలు పాలైన వారిని స్వయంగా వెళ్లి పరామర్శించిన జగన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన కొడాలిని పరామర్శించేందుకు ఆస్పత్రికి రాకపోవడమేంటని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

no respite to former minister kakani

మాజీ మంత్రి కాకాని యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  మంగళవారం ( ఏప్రిల్ 1) నాటికి వాయిదా వేసింది. అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై   పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.   నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాలో క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రుస్తుం మైన్స్‌ లీజు గడువు ముగిసి పోయిన తరువాత  సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌ చేశారనే ఆరోపణలతో మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.  తాజాగా ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ4గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో  వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ1గా,  వైసీపీ నేత వాకాటి శివారెడ్డినిఏ2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డిని ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరినీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.  

resolution in telangana assembly

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదని తెలిపారు. ప్రస్తుతం పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతోందని, అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి అన్నారు.  లోక్ సభలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలని, అయితే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని కోరారు.  అలాగే జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాల్సిన అవసరముందన్నారు. ఇక డీలిమిటేషన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన  ఏంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.  మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా జనాభా ప్రాతిపదికన  నియోజకవర్గాల  పునర్విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిథ్యం ఉందనీ, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ ప్రాతినిథ్యం 19 శాతానికి పడిపోతుందన్నారు.  

హైకోర్టులో విడదల రజినికి లభించని ఊరట

వైసీపీ నాయకురాలు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట లభించలేదు. అవినీతి కేసులో విడదల రజని దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం (మార్చి 27) విచరణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. బెయిలుపై కనీసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విడదల రజని విజ్ణప్తిని తోసిపుచ్చింది.   మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ  అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో  మంత్రి హోదాలో విడదల రజిని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా విడదల రజిని,  రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేసిన పల్లె జాషువా, రజిని సమీప బంధువు విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణులు సహ నిందితులుగా ఉన్నారు.  

జగన్ హయాంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడు పరుగులు

ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. అంతేనా అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేవం కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో పరిశ్రమల రంగానికి మహర్దశ పట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి  తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. అదే సమయంలో గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది లాలూ గ్రూపు గురించి.  గతంలో అంటే 2014-2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. అప్పట్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటుకు సుప్రసిద్ధ వ్యాపార దిగ్గజం లాలూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందు కోసం అప్పటి చంద్రబాబు సర్కార్ ఆ కంపెనీకి భూమిని కేటాయించింది. ఏపీఐఐసీ ద్వారా సదరు భూమిని స్వాధీనం చేసుకున్న లులూ షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు రంగం సిద్ధం చేసింది. ఈ లోగా  2019  ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టారు. అంతే.. వైసీపీ పాలనలో లులూకు అంతగా ప్రోత్సాహం లభించడం సంగతి అటుంచి వేధింపులు మొదలయ్యాయి.  దీంతో లులూ గ్రూప్ తన ప్రాజెక్టును రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది.   ఆ ప్రాజెక్టును ఆ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో   తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలో పారిశ్రామిక రంగం దశ తిరిగింది. దేశ విదేశాల నుంచి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టడం ప్రారంభమైంది. చంద్రబాబు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నది. దీంతో లులూ గ్రూపు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లులూకు స్వాగతం పలికారు.  జనవరిలో లులూ గ్రూప్ చైర్మన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో అనుకున్నట్లుగానే విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ను ఏర్పాటు లులూ చైర్మన్ ప్రతిపాదించగా, చంద్రబాబు వెంటనే ఓకే చెప్పారు. అంతే కాకుండా గతంలో లులూకు కేటాయించిన భూమిని తిరిగి కేటాయిస్తూ   పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో తీర్మానం చేశారు. దీంతో నాడు జగన్ కారణంగా తరలిపోయిన లులూ తిరిగి రాష్ట్రంలోనికి అడుగుపెడుతున్నది. 

ఐదుగురు అత్యంత ధనవంతుల్లో ఒకరు  విదేశాలకు 

విదేశాలకు వలస వెళ్లడం అంత ఆష మాషి  కాదు. స్వంత గూడు వదిలి విదేశాల్లో  స్థిరపడాలనుకోవడం అంత మామూలు విషయం కాదు.  భారత్ లో మిత వాద రాజకీయాలు,  విభజించి పాలించే రాజకీయాలు దేశంలోని అత్యంత సంపన్నులు విదేశాల్లో సెటిల్ కావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  ఓ వైపు పన్నుల ఒత్తిడి , రాజకీయ కక్ష్య సాధింపు చర్యల కారణంగా మనదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైంది. వేలాది మంది కోటీశ్వరులు దేశ సరిహద్దులు దాటి పర్మినెంట్ గా విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు.  ప్రతిష్టాత్మకంగా నిర్వహించి కొటక్  ప్రయివేటు ఈవై  సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఈ వివరాలను వెల్లడించింది.  మనదేశంలోని జీవన ప్రమాణాలతో పోలిస్తే విదేశాల్లో మెరుగ్గా ఉండటంతో  అక్కడ స్థిరపడాలనుకుంటున్నారు. ప్రతీయేడు 25 లక్షల మంది విదేశాలకు ఎగుమతి అవుతున్నారు.  పిల్లా పాపలతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కరోనా మహమ్మారి తర్వాత ఎక్కువైంది.  స్వాతంత్రానికి పూర్వం కూడా మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే సంస్కృతి ఉంది. అనేక నియమ నిబంధనలతో బాటు ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్లే వారు.  ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులే విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాలతో పోలిస్తే అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల్లో పెట్టు బడులు పెట్టి వ్యాపారం చేసే సంస్కృతి వెళ్లూనుకుంది.  సూపర్ రిచ్  ఇండియన్స్ కు గోల్డెన్ వీసా రావడం వల్ల  పెద్దగా కష్టపడకుండానే విదేశాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. గోల్డెన్ విసా అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఒకరు. సినిమాల  నుంచి రాజకీయాలకు  వెళ్లాలనుకున్న రజనీకాంత్ కి యునైటెడ్ అరబ్ ఎమ్మిరేట్స్ గోల్డెన్ విసా ఇవ్వడంతో తమ అభిమాన నటుడు భారత్ ను వదిలేస్తారా అని అభిమానులు ఆందోళన చెందారు. గోల్డెన్ విసా జాబితాలో చిరంజీవి, షారూఖ్ ఖాన్,  సానియా మిర్జా, అల్లు అర్జున్ , త్రిష, మోహన్ లాల్ , మమ్ముట్టి తదితరులు ఉన్నారు. 2019లో గోల్డెన్ విసాను కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది.  ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ధనవంతులకు శాశ్వత నివాస విసా అని చెప్పొచ్చు. కళాకారులకే ఉద్దేశించి గోల్డెన్ విసా ఇప్పుడు కళాకారులకు అతీతంగా సూపర్ రిచ్ ఇండియన్స్ కు వరప్రదాయినిగా మారింది.  సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోవటం అంటే  మూలధనం తరలిపోయినట్టు అని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. విదేశాలకు వెళ్లడం అంటే ఫ్యూచర్ ఇన్వెస్టిమెంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్లాలంటే రెండున్నరకోట్ల రూపాయలు తీసుకెళ్లాలి. అదే   ప్రవాస భా రతీయుడైతే ఏకంగా పది కోట్ల వరకు తీసుకెళ్లవచ్చు. దీనివల్ల మన దేశంలో పెట్టు బడులు పెట్టే వారి సంఖ్య తగ్గి అభివృద్ది సూచికపై ప్రభావం పడుతుంది. నిరుద్యోగ సమస్య తాండవం చేసే అవకాశం లేకపోలేదు. మన దేశ సంపద తగ్గి విదేశాలకు సంపదను తరలించినట్టు అవుతుంది.  ఒక వ్యక్తి నివాసం మారితే సంపద మారినట్టు కాదని కొటక్ మహీంద్రా ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ అభిప్రాయానికి ఏకీ భవించడం లేదు. 2023లో అల్ట్రా ఎన్ హెచ్ ఐలు 2. 83 లక్షల మంది ఉంటే వీరి సంపద విలువ నికరంగా  రూ 283 కోట్లు ఉంది. 2028 వరకు వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుతుంది.  వీరి సంపద రూ. 359 లక్షల కోట్లకు చేరొచ్చని సర్వే వెల్లడించింది. సర్వేలో 66.66 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీళ్లంతా తాము విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తికనబరిచిన వారే కావడం గమనార్హం.

.. అయినా జగన్ మారలేదు.. ఆయన పార్టీ తీరు మారలేదు!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కక్ష సాధింపు, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడటమే పాలన అన్నట్లుగా సాగింది. చట్టాలకు తిలోదకాలిచ్చేసి ఇష్ఠారీతిగా  చెలరేగిన వారందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం ముందు నిలబడకతప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా కొందరు ముందస్తు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు. ఇంత జరిగినా వైసీపీ అధినేత జగన్ మారలేదు. ఆయన పార్టీ తీరు మారలేదు. గతంలో ప్రత్యర్థి పార్టీలపై అనుచిత భాషలో విరుచుకుపడిన వారికి జగన్ పదవులు, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. జగన్ అరాచక, అభివృద్ధి నిరోధక పాలనకు తోడు, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత భాషా ప్రయోగం కూడా జగన్ పార్టీ ఘోర ఓటమికి కారణం అనడంలో సందేహం లేదు. అయితే జనం ఓటుతో బుద్ధి చెప్పినా, కనీసం విపక్ష హోదాకు కూడా జగన్ కి, జగన్ పార్టీకీ అర్హత లేదని తేల్చేసినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా భాష విషయంలో ఆయన ఇసుమంతైనా రాజీపడటం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో పార్టీ పదవులు దక్కాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం కూటమి నేతలపై బూతులు, అనుచిత భాషలో విరుచుకుపడేవారికే పదవులు అని జగన్ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ అనుచిత భాషా ప్రయోగంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉంటే అది అదనపు అర్హతగా భావిస్తున్నారు. తాజాగా వైసీపీ యూత్ వింగ్ కు కొత్తగా నియమితుడైన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  బైరెడ్డి సిద్దార్థరెడ్డి కోసం జగన్ పార్టీ యూత్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు సృష్టించారు. ఇంతకీ ఇంత హడావుడిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి పదవి ఎందుకు కట్టబెట్టారంటే.. ఆయన అధికార కూటమిపై విమర్శలతో విరుచుకుపడటమే. అంతేనా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అంటూ వార్నింగ్ ఇవ్వడమే. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మంగళవారం (మార్చి 25)న తెలుగుదేశం కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (మార్చి 26) ఆయనకు పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతకీ ఈ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా పని చేశారు. ఆడుదాం ఆంధ్ర పేర పెద్ద ఎత్తున జరిగిన నిధుల దుర్వినియోగంలో అప్పటి టూరిజం, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు సిద్ధార్ద్ రెడ్డిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై ఆయన నేడో రేపో కేసులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికే వైసీపీలో పెద్ద పీట లభిస్తుంది. పదవుల విషయంలో అగ్రతాంబూలం దొరుకుతుంది.