దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఎక్కడో తెలుసా?
దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.
ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.
సమ్మిట్కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.
ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.
సమ్మిట్కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.