లోకేష్ విదేశీ పర్యటనలు.. ఆచరణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఆంధ్రప్రదేశ్ తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్వోస్టర్లు భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానమే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అక్కర్లేదు. అభివృద్ధి, దార్శనికత విషయాలలో చంద్రబాబుకు ఉన్న ట్రాక్ రికార్డ్ కు లోకేష్ స్పీడ్ తోడుకోవడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చెబుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మంత్రి నారా లోకేష్ కేవలం మాటల్లోనే కాదు ఆచరణలో సైతం చూపుతున్నారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ట్రిలియన్  డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.  ఇందు కోసం దేశ, విదేశీ పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దావోస్ మొదలైన ఈ ప్రయాణం సక్సస్ ఫుల్ గా సాగుతోంది. అదే క్రమంలో  మంత్రి నారా లోకేష్ ఈ నెలలో రెండే దేశాలలో పర్యటించనున్నారు. తొలుత అమెరికాలోనూ, ఆ తరువాత కెనడాలొనూ పెట్టుబడుల వేట కొనసాగించే లక్ష్యంతో లోకేష్ పర్యటించనున్నారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ నారా లోకేష్ డల్లాస్ సహా అమెరికా రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్ఆర్ఐలతో సమావేశం అవుతారు. అలాగే అమెరికాలోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ భేటీలన్నీరాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సాగనున్నాయి. అలాగే అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజుల వ్యవధిలోనే అంటే డిసెంబర్ 11 నుంచి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్న లోకేష్ ఆ పర్యటనలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఈ భేటీల లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రపప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వారికి వివరించడమే.  లోకేష్ తన పర్యటన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దడమేనని చెబుతున్నారు. 

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు

  భద్రాది కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఓ సంచిలో ఉన్న బాంబును వీధి కుక్క రైల్వే ట్రాక్‌‌పైకి నోటితో లాక్కెళ్లింది. ఆ సంచిలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కుక్క కొరింది. దీంతో భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ బాంబు పేలుడుతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో.. కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అంటూ పోలీస్ జాగిలాలతో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆగంతకుడు ఎటువైపు నుంచి వచ్చాడు. ఎటువెళ్లాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన మరసటి రోజే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు

  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటించారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు.  కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా వరకూ తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.  

విజయవాడకు మరో ఫ్లై ఓవర్ .. 500 కోట్ల వ్యయం!

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65ను సిక్స్ లేన్ గా విస్తరించడంలో భాగంగా   నగర పరిధిలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జగరనుంది.  గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర  ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కానుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందనిఅంచనా.  ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తీరిపోయినట్లేనని చెబుతున్నారు.    ఇంతకీ ఈ ఫ్లై ఓవర్ ఎందుకంటే.. ఎన్ హెచ్ 65ను ఆరు లేన్ల రహదారిగా విస్తరించడానికి   భూమి ఆర్‌ఓడబ్ల్యూ 60 మీటర్లు ఉండాలి.  అయితే గొల్లపూడి, కనకదుర్గ వారథి మధ్య అంత వెడల్పు స్థలం లేదు.  రహదారి పక్కన స్థల సేకరణ భారీ వ్యవంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మార్కెట్ ధర ప్రకారమే ఇక్కడ గజం రమారమి లక్ష రూపాయలు ఉంటుంది. అంటే ఈ ఐదుకిలోమీటర్లూ రహదారి విస్తరణకు వెయ్యి కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకే అవసరమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం తెరపైకి వచ్చింది.  భూసేకరణకు వెచ్చించాల్సిన మొత్తంలో సగం ఖర్చు పెడితే చాలు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తవుతుంది.   ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో భారీ పైవంతెన నిర్మాణం కష్టమని భావించినప్పటికీ ఒకవైపు ట్రాఫిక్‌ వదిలి మరోవైపు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత డీపీఆర్‌ ప్రాజెక్టు అప్రైజల్‌ అండ్‌ టెక్నికల్‌ స్క్రూటినీ కమిటీ వద్ద ఉంది. అక్కడ ఆమోదం లభించగానే.. మిగిలిన దశల్లో పరిశీలన పూర్చి చేసి వచ్చే ఏడాది నాటికి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  విజయవాడ -హైదరాబాద్‌ మార్గంలో మొత్తం 221.5 కిలోమీటర్ల రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించాలన్నది ఎన్ హెచ్ ఏఐ ప్రణాళిక. అందుకు అనుగుణంగా తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్‌ సమీపంలోని దండు మల్కాపూర్‌ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకూ విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించి,  అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ రోడ్డు విస్తరణకు ఆదేశించింది.  

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానిచే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. ఇక  ఏయే మంత్రులు ఏయే రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానించాలన్నది కూడా నిర్ణయించారు. ఆ మేరకు ఆయా మంత్రులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానపత్రాలు అందించి ఆహ్వానిస్తారు.   ఈ నెల 8, 9 తేదీలలో  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు జార్ఖండ్ సీఎంను ఆహ్వానించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జమ్మూకాశ్మీర్ సీఎంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంజాబ్, హర్యానా సీఎంలను మంత్రి రాజనర్సింహ ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వానిస్తారు. అలాగే ఏపీ, కేరళ సీఎంలను మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానిస్తారు. కర్నాటక, తమిళనాడు సీఎంలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యూపీ సీఎంను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానిస్తారు.  ఇక రాజస్థాన్ సీఎంను మంత్రి పొన్నం ప్రభాకర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని మంత్రి సీతక్క ఆహ్వానించనుండగా, ఛత్తీస్ గఢ్ సీఎంను మంత్రి కొండా సురేఖ అహ్వానిస్తారు. అదే విధంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిని తుమ్మల నాగేశ్వరరావు, అసోం సీఎంను జూపల్లి కృష్ణారావు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానిస్తారు. అలాగే ఒడిశా సీఎంను వాకిటి శ్రీహరి, హిమాచల్ ముఖ్యమంత్రిని అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్ర సీఎంను మహ్మద్ అజారుద్దీన్ ఆహ్వానిస్తారు. ఇక ఢిల్లీ సీఎంకు, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ ఎంపీలు ఆహ్వాన పత్రాలు అందజేస్తారు.  

పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరులో గంజాయి బ్యాచ్ చేతుల్లో హతమైన పెంచలయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు. బుధవారం (డిసెంబర్ 3) ఆ కుటుంబాన్ని పరామర్శించిన కోటంరెడ్డి.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా  పెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను తాము తీసుకుంటామని కోటంరెడ్డి కుమార్తెలు హైందవి, వైష్ణవిలు హామీ ఇచ్చారు.   పెంచలయ్య సాగించిన గంజాయివ్యతిరేక పోరాటానికి కలిసొచ్చే అన్నిపార్టీలతో కలసి ఆ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే గంజాయి బ్యాచ్  గురించి భయం అవసరం లేదనీ, తాను అండగా ఉంటాననీ ఆర్డీటీ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. వారం రోజులలో కాలనీ అభివృద్ధికి 50లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానన్నారు. భావి తరాలకు గుర్తుండేలా పెంచలయ్య విగ్రహాన్ని కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీ వాసులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా కోటం రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు.  

మద్యం కుంభకోణం సొమ్ముతో ముంబైలో బంగారం కొనుగోలు

జగన్  హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.   ఈ కేసులో ఏ49గా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించింది. ఈ విచారణలో  మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మును ఎలా దారి మళ్లించారో అనిల్ చోఖ్రా పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది.  ఏపీ మద్యం కుంభకోణంలో ఏ1 రాజ్ కేసిరెడ్డికి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బంగారం, నగదు రూపంలోకి మార్చినట్లు చోఖ్రా అంగీకరించారని సమాచారం. ఊరూపేరూ లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలను సృష్టించి.. ఆ కంపెనీలలోకి ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును  మళ్లించారు. ఆ తర్వాత ముంబైలోని చాముండ బులియన్స్ యజమాని , ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు. చివరిగా.. దుబాయ్‌లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్‌వర్క్‌ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు  సిట్ విచారణలో చోఖ్రా వివరించినట్టు తెలిసింది. చోఖ్రా విచారణలో    ఆదాన్‌ డిస్టిలరీస్‌, లీలా డిస్టిలరీస్‌, ఎస్‌పీవై ఆగ్రోస్‌ నుంచి ముంబైకి చెందిన అనిల్‌ చోఖ్రా సృష్టించిన సెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి రూ.78 కోట్లు బదిలీ అయినట్లు సిట్ ఆధారసహితంగా కనుగోంది. చోఖ్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా సిట్ అధికారులు ముంబైకి చెందిన చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్ కు మంగళవారం (డిసెంబర్ 2) విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే అతడు ఆరోగ్యం బాలేదంటూ, తన తమ్ముడు రోణక్ కుమార్ ను పంపించాడు. మంగళవారం (డిసెంబర్ 2)   సిట్‌ కార్యాలయానికి వచ్చిన రోణక్‌ను అధికారులు చోఖ్రాతో కలిపి సాయంత్రం వరకు విచారించారు. అయితే రోణక్ తనకేమీ తెలియదంటూ ప్రశ్నలకు సమాధానం దాటవేయడంతో.. చేతన్ కుమార్ ను బుధవారం (డిసెంబర్ 3) విచారణకు రావాలంటూ ఆదేశించి, అంత వరకూ విజయవాడలోనే ఉండాల్సిందిగా రోణక్ కు ఆదేశించారు.  ఆ సమయంలో అన్న చేతన్ కుమార్ తో మాట్లాడతానంటూ సిట్ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన రోణక్ కుమార్ పారిపోవడానికి చేసిన ప్రయత్నాన్ని సిట్ భగ్నం చేసింది. గన్నవరం విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేసింది.   

బస్సు భద్రతా చట్టం.. గడ్కరీని కోరిన మంత్రి టీజీ భరత్

దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా, భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చ‌ర్చించిన‌ట్లు మంత్రి భరత్ తెలిపారు.  ఎంపీ బ‌స్తిపాటి నాగ‌రాజుతో క‌లిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన  ఇటీవ‌లి కాలంలో తరచుగా జరుగుతున్న బస్సుప్రమాదాలు, వాటిలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు మరణాల విషయాన్నిప్రస్తావించారు.   క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరు స‌మీపంలో బస్సు ప్ర‌మాదంలో మంట‌ల్లో చిక్కుకొని ప్ర‌యాణికులు చ‌నిపోయారు. అధునాతన అగ్నిమాపక వ్యవస్థలపై  తాను గతంలో ఇచ్చిన వినతి మేరకు కొత్త‌ ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురావాలని భరత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తన వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు టీజీ భరత్ చెప్పారు.  గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్ నుండి పెద్దటేకూరు వరకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న హైవే లైటింగ్ గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి  తీసుకువెళ్లానన్నారు. అదే విధంగా కర్నూలు-బళ్లారి జాతీయ రహదారి ప్రతిపాదనతో సహా ముఖ్యమైన ప్రాంతీయ రహదారి అనుసంధాన అవసరాలను వివ‌రించిన‌ట్లు చెప్పారు.  

ఓయు విద్యార్థుల రాస్తారోకో

ఉస్మానియా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వర్సిటీ హాస్టళ్లలో తిష్ఠ వేసిన సమస్యల పరిష్కారం కోసం వారు మంగళవారం (డిసెంబర్ 2) రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.   హాస్టళ్లలో శుభ్రతలేమి, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల దుస్థితి, గదుల మరమ్మత్తుల విషయంలో వర్సీటీ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు.  ముఖ్యంగా హాస్టల్ లో ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటోందని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ణప్తి చేసిన ఫలితం లేకపోయిందనీ, అధికారులు పట్టించుకోలేదనీ ఆరోపిస్తూ ఓయూ ప్రధాన రహదారిపై    రాస్తారోకో చేపట్టారు.  ఈ సందర్భంగా విద్యార్థులు మౌలిక వసతులు కావాలి,  నాణ్యమైన ఆహారం అందించాలి, వీసి డౌన్ డౌన్... పెరుగన్నం మీకు.... పురుగన్నమాకా అంటూని నాదాలు చేశారు.   

కామాక్షి ద గంజాయ్ డాన్ ఆఫ్ నెల్లూర్ అస‌లు క‌థ ఇదే!

ఒక మంచి వాడు- ప‌ది మంది మంచి వాళ్ల‌ను త‌యారు చేయ‌గ‌ల‌డో లేదో  తెలియదుకానీ..  ఒక క్ర‌మిన‌ల్ మాత్రం ప‌ది మంది క్రిమిన‌ల్స్ ని త‌యారు చేయ‌డం ప‌క్కా అని చెప్ప‌డానికి జ‌గ‌న్, ఆయ‌న వైసీపీ,  ఆపై ఆయ‌న చుట్టూ ఉన్న నాయ‌కులు, వారి వారి కార్య‌ క‌లాపాలను బ‌ట్టి ఇట్టే చెప్పేయచ్చంటారు పరిశీలకులు. ఇందుకు తాజా నిదర్శనంగా  నెల్లూరు గంజాయి  మాఫియా లేడీ డాన్ అర‌వ కామాక్షి ఉదంతాన్ని చూపుతున్నారు.   కామాక్షి తొలుత‌ బోడిగాడి తోట‌లో చిత్తు కాగితాల‌ను అమ్ముకుని బ‌తికేది. భ‌ర్త  ఒక డ్రైవ‌ర్. అలాగ‌ని వీళ్లు అక్క‌డితో ఆగిపోలేదు. ఎలాగైనా  స‌రే  జీవితంలో   ఎద‌గాల‌న్న  ఆలోచ‌న‌తో సినిమా ఫ‌క్కీలో ప్రయత్నాలు చేశారు. దానికి తోడు వీళ్ల చిత్తు కాగితాలు, చెత్త వ్యాపారంలో ఆక‌తాయి పిల్ల‌లు ఎక్కువ‌గా ట‌చ్ లో ఉండేవారు. వీరు ప‌గ‌టి  పూట  చెత్త ఏరుకుని, రాత్రి పూట గంజాయి మ‌త్తులో ప‌డి  తూగే  వారు. ఈ విష‌యం గుర్తించి కామాక్షి.. ఈ అల‌వాటు యువ‌త మొత్తానికి ఎలాగైనా అంట‌గ‌ట్టాల‌నుకుంటున్న‌టైంలో ఈమెకు పాల‌కీర్తి ర‌వి అనే  వైసీపీ  నేత  ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇత‌డి సాయంతో ఒక వైసీపీ మాజీ ఎంపీ ట‌చ్ లోకి వెళ్లిన కామాక్షి గుప్పుమ‌ని గంజాయి  పొగ‌లాంటి  ఘాటైన‌ మాట ఆయ‌న‌తో చెప్పుకుంది.  మ‌నం ఎలాగైనా  స‌రే గంజాయి దందా మొద‌లు పెట్టాల‌ని ఆ వైసీపీ  నేత‌తో ఆమె చెప్ప‌డం ఆల‌స్యం.. గంజాయి అంటే మ‌న‌కు ద‌ళితుల‌ను మ‌ర్డ‌ర్ చేసి, మ‌రీ ఇంటికి డెలివ‌రీ ఇచ్చే ఎమ్మెల్సీ అనంత‌బాబు ఉన్నాడుగా అంటూ అత‌డితో ప‌రిచ‌యం చేయించాడా వైసీపీ  నేత‌ అక్క‌డి  నుంచి కామాక్షి లైఫ్ స్టైలే మారిపోయింది. బోడిగాడి  తోట నుంచి త‌న మ‌కాం ఆర్టీడీ కాల‌నీకి మార్చిన కామాక్షి.. గంజాయి దందాను మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా విస్త‌రించింది. స్కూళ్లు, కాలేజీ యువ‌తే టార్గెట్ గా  త‌న మ‌త్తు మార్కెట్ నెట్ వ‌ర్క్ పెంచుకుంటూ పోయి అంచెలంచెలుగా ఈ ఫీల్డ్ లో ఎదిగిపోయింది.   అంతే కాదు ఆమె చుట్టూ భ‌ర్త తో పాటు అత‌డి  బంధుమిత్రుల‌తో స‌హా  గంజాయి దందాను అడ్డూ ఆపూ లేదన్నట్లుగా సాగించింది.  ఈమె మీద ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల వారు  చేసిన ఫిర్యాదులతో   స్థానిక పోలీస్టేషన్లో లెక్క‌లేన‌న్ని కేసులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదుల విషయాన్ని  కొందరు పోలీసులే ఆమెకు చేరవేసేవారు. ఇలా కొందరు పోలీసుల సహకారం కూడా ఉండటంతో కామాక్షి ఆగ‌డాల‌కు  హ‌ద్దూపద్దూ లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు.   కామాక్షి గంజాయి మాఫియా ఆగ‌డాల‌ను గుర్తించిన‌  సీపీఎం  యువ  నేత పెంచ‌ల‌య్య ఈమె గంజాయి  దందాకు  వ్య‌తిరేకంగా పోరాటం చేసేవారు. ఆయ‌న త‌న దందాకు అడ్డు వ‌స్తున్నాడ‌ని  గుర్తించిన కామాక్షి అత‌డిపై  నిఘా పెట్టి.. రెక్కీ నిర్వ‌హించి.. త‌న మ‌నుషుల‌ను పంపి హ‌త‌మార్చేసింద‌ని పోలీసులు తెలిపారు. ఇది వైసీపీ జ‌మానా కాదు కాబ‌ట్టి కామాక్షి   చిక్కిపోయిందిగానీ.. అదే వైసీపీ ప్ర‌భుత్వ‌మే ఉండి ఉంటే ఇలాంటి హ‌త్యాకాండ‌లు ఎన్ని జ‌రిగినా అడిగే నాథుడే  లేకుండా పోయేవారని పరిశీలకులు అంటున్నారు.   అందుకే పెంచ‌ల‌య్య హ‌త్య‌కు నిర‌స‌న‌గా.. ఆర్టీడీ కాల‌నీలోని  కామాక్షి  ఇళ్ల‌న్నిటినీ ప‌గ‌ల‌గొట్టారు స్థానికులు. ఆపై సీపీఎం, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు మంగ‌ళ‌వారం  పెంచ‌ల‌య్య మ‌ర‌ణాన్ని ఖండిస్తూ జిల్లా వ్యాప్త బందు నిర్వ‌హించి  ర్యాలీలు తీశాయి. ఇప్ప‌టికేనా గంజాయి బ్యాచ్ ఆగడాలను పూర్తిగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల పడిగాపులు.. ఎందుకంటే?

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అర్ధరాత్రి నుంచి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి కారణం చెప్పకుండా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన విమానాలు తీవ్ర జాప్యం కావడంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రయాణీకులు నిన్న రాత్రి నుంచీ ఎయిర్ పోర్టులోనే తాము వెళ్లాల్సిన ఫ్లయిట్ ఎప్పుడు బయలుదేరుతుందా అని వేచి చూస్తున్నారు. ఆయా విమానాలలో తలెత్తిన సాంకేతిక లోపాలే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఈ విమానాలన్నీ ఇండిగో సంస్థకు చెందినవే కావడం గమనార్హం. ప్రయాణీకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇండిగో సిబ్బంది సమతమమౌతున్న పరిస్థితి.   తెల్లవారుజామున రెండు గంటలకు బెంగుళూరు వెళ్లవలసిన ఫ్లైట్ ను రన్ వే పై రెండు గంటలు నిలిపివేశారు.  ప్రయాణికుల ఆందోళనలతో వారిని కిందకు దింపేసి ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందిగా సిబ్బంది చెప్పారు.  దీంతో విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ లు మిస్సయిన పరిస్థితి. అలాగే వీసీ ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు కూడా ఉన్నారు. వీరంతా ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఎయిర్ పోర్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.   

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఎక్కడో తెలుసా?

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.   ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.   ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.   సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.   దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.   ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.   ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.   సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.  

వియ్ వాంట్ 99స్ వింటేజ్ బాబూ ఫ‌ర్ ఏపీ సేఫ్టీ!

  ఆ ప్ర‌భుత్వం  కేసులు పెడుతుంది- ఈ ప్ర‌భుత్వం కేసులు కొట్టేసుకుంటుంది.... ఇదీ ప్రెజంట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వినిపిస్తోన్న కామెంట్.. చంద్ర‌బాబు మీద మొన్న ఫైబ‌ర్ నెట్ కేసు ఉంటే దాన్ని కొట్టేశారు. అదంతా రాజ‌కీయ క‌క్ష  సాధింపులో భాగంగా.. పెట్టిన  కేసు. ఇందులో మ‌రేమీ లేద‌ని తేల్చేసింది సిఐడీ. దీనిపై కేబుల్ ఆప‌రేట‌ర్ల అసోసియేష‌న్ సైతం న్యాయం గెలిచిందంటూ  బాబుకూ, న్యాయ‌దేవ‌త‌కూ పాలాభిషేకాలు చేసింది.  తాజాగా చంద్ర‌బాబుపై మ‌రో కేసు కూడా  కొట్టివేయ‌బ‌డింది. అదెలాంటిదంటే, 2015-19 మ‌ధ్య కాలంలో.. రూ. 1300 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం కేసు. అంటే గ‌తంలో జ‌గ‌న్ హ‌యాంలో పెట్టిన ఇలాంటి  కేసుల‌న్నీ తేలిపోనున్నాయ‌న్న‌మాట‌. ఈ లెక్క‌న చంద్ర‌బాబు క్లీన్ చిట్ తో పాత కేసుల  నుంచి దాదాపు బ‌య‌ట ప‌డిపోనున్నార‌న్న‌మాట‌. మ‌రి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరిగి అధికారం చేప‌డితే ప‌రిస్థితేంటి??? అన్న ద‌గ్గ‌రే అంద‌రి ప్ర‌శ్న‌లు ఆగిపోతున్నాయి. అందుకే బాబు కూడా  ప‌దే ప‌దే మ‌ళ్లీ మీరు మ‌ళ్లీ వైకుంఠ పాళి ఆడొద్ద‌ని ఆంధ్ర ఓట‌రు జ‌నానికి నూరిపోస్తూ వ‌స్తున్నారు. కానీ గ్రౌండ్ లెవ‌ల్లో ప‌రిస్థితి కూట‌మి ప్ర‌భుత్వానికి చాలా  చాలా వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నీసం టీటీడీ వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను సంపాదించ‌లేక పోతున్నామ‌ని  సోష‌ల్ మీడియా గోడ‌ల మీద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న  త‌మ్ముళ్లూ, సైనికులు కోకొల్లుగా ఉన్నారు. వారి ఫ‌స్ట్రేష‌న్ ప్రెజంట్ అలా ఉంది మ‌రి. ఇటీవ‌ల ఒక ప్రైవేటు చానెల్.. ఆంధ్ర ఓట‌రు నాడి ఏమిటో ప‌సిక‌ట్టే య‌త్నం చేసింది. అయితే ఇందులో 2029లో జ‌గ‌న్ తిరిగి అధికారంలోకి రావ‌డానికే ఆస్కార‌మెక్కువ అన్న విష‌యం బ‌య‌ట ప‌డింది.  దీంతో వైసీపీ జ‌నానికి ఇది మ‌రింత కిక్ ఇచ్చింది. అయితే, ఇక్క‌డే మ‌నం మ‌ర‌చిపోరానిది వ‌దిలి  పెట్ట‌రానిదీ ఏంటంటే,, జ‌గ‌న్ గ‌త ప‌రిపాల‌న‌లో భాగంగా ఓట‌రు జ‌నం నెత్తిన సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర కుమ్మ‌రించారు. ఇంత చేసి కూడా వైసీపీ గెల‌వ‌కుంటే ఇక జ‌గ‌న్ కూడా కొత్త రాజ‌కీయాల‌ను నేర్చుకోవ‌ల్సిందే అన్న కామెంట్లు వినిపించాయ్. కానీ, చంద్ర‌బాబు త‌న అనుభ‌వ‌మంతా రంగ‌రించారు. ఆపై ప‌వ‌న్ కూడా అగ్నికి వాయువు తోడైన‌ట్టు తోడ‌య్యారు. ఇందుకు క‌మ‌ల వ్యూహం సైతం ఫలించింది. దీంతో ప‌రిస్థితి పూర్తిగా  కంట్రోల్లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో.. అంద‌రికీ తెలిసిందే.. 164 సీట్ల‌తో కూట‌మి ప్ర‌భంజ‌నంలాంటి  విజ‌యాన్ని సొంతం చేసుకుంది. . ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు రెండో సారి తిరిగి గెలిచింది కేవ‌లం 1999లో మాత్ర‌మే. ఆ టైంలో ఆయ‌న అడ్మినిస్ట్రేష‌న్ వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ కావ‌డం.. ఐటీ ద్వారా ఉమ్మ‌డి ఆంధ్ర పెద్ద ఎత్తున ల‌బ్ధి పొంద‌డం.. స‌త్యం వంటి మ‌న తెలుగు వారి ఐటీ  కంపెనీల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు రావ‌డంతో బాబు ఒక మోడ్ర‌న్ ఫేస్ క‌ట్ ఆఫ్ ఏపీగా అవ‌త‌రించారు.. ఇది గుర్తించిన వైయ‌స్.. నాడు త‌న ఆత్మ‌లాంటి కేవీపీతో బాబు పోక‌డ చూస్తుంటే మ‌నం అధికారంలోకి రావ‌డం ఇక క‌ల్ల అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు చెబుతారు. క‌ట్ చేస్తే వైయ‌స్ పాద‌యాత్ర‌తో బాబు హ్యాట్రిక్ ఆశ‌ల‌న్నీ కొట్టుకుపోయాయి. అలిపిరి బ్లాస్టింగ్ వంటి సెంటిమెంట్లు కూడా ఏమంత క‌లిసి  రాలేదు. అంత‌గా వైయ‌స్ హ‌వా వీచిందానాడు.   ఆ త‌ర్వాత కూడా ఆయా పార్టీల‌తో జ‌త క‌డితే త‌ప్ప  బాబు గెలిచే  ప‌రిస్థితి లేదు అన్న కామెంట్లు వినిపించాయ్ ఆ మాట‌ను నిజం చేస్తూ బాబు, ఆయ‌న పార్టీ  కూడా సేమ్ టు సేమ్ పెర్ఫామెన్స్ చేస్తూ వ‌చ్చింది. ఇప్పుడు బాబు చివ‌రి అస్త్రంగా చేయాల్సిందేంటంటే.. త‌న‌కు తాను స్వ‌యంగా ఈ పిచ్చి కేసుల గోల నుంచి బ‌య‌ట పడాల‌న్నా.. ఏపీని జ‌గ‌న్ అనే ఒక మాయావి నుంచి ర‌క్షించాల‌న్నా.. తిరిగి బాబులో 1999 నాటి వింటేజ్ బాబు విశ్వ‌రూపం చూపించ‌గ‌ల‌గాలి. అప్పుడుగానీ ఇటు ఏపీ వాసుల‌కు జ‌గ‌న్ పీడ వ‌ద‌ల‌దు, అటు చంద్ర‌బాబు కేసుల గోల కూడా ఉండ‌దు.. జ‌గ‌న్ ఇక అట్నించి అటే వెళ్లిపోతే త‌ప్ప ఏపీకి ఈ కేసులు, అప్పుల గొడ‌వ త‌ప్ప‌దు. అలాంటి ప‌థ‌కం ర‌చించ‌డానికి కూడా చాలా చాలా ద‌గ్గ‌రి మార్గాలున్నాయ్. వాటి ప‌రిశీల‌న అన్వేష‌ణ చేయాల్సి ఉంది.. బాబు కోర్ క‌మిటీ. అయితే బాబు కేంద్రానికి త‌న వ‌ద్ద‌నున్న ఎంపీ సీట్ల భ‌రోసా ఇచ్చి, జ‌గ‌న్ అనే ఈ భూతాన్ని శాశ్వ‌తంగా రాజ‌కీయ భూస్తాపితం చేస్తే త‌ప్ప‌.. ఇవ‌న్నీ నెర‌వేరేలా లేవు. మ‌రి చూడాలి.. 2029 నాటికి చంద్ర‌బాబు చాణ‌క్యం ఎలా ఉండ‌నుందో.. ఈ ఒక్క‌టీ నెర‌వేరిపోతే.. ఇటు ఏపీ ఊపిరి పీల్చుకుంటుంది.. అటు చంద్ర‌బాబు కూడా న‌వ్యాంధ్ర రాజకీయచ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అంటారు ప‌లువురు విశ్లేష‌కులు.

సడన్‌గా ప‌వ‌న్‌పై కోమ‌టిరెడ్డి దాడి వెన‌క‌ మర్మం ఏంటో?

  ఏపీ ఉప  ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు ఏపీలోని  వైసీపీ ఆపై తెలంగాణ‌లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ‌ర్ల  పాలిట  పంచ్ బ్యాగ్ అయ్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అప్పుడెప్పుడో ప‌వ‌న్  రాజోలు ప‌ర్య‌ట‌న చేసిన‌పుడు.. అన్యాప‌దేశంగా ఒక మాట అనేశారు. అదేంటంటే ఏపీ,  తెలంగాణ విడిపోవ‌డానికి కార‌ణం కోన‌సీమ‌లోని ప‌చ్చ‌ద‌న‌మే అనేశారు. అందుకే ఇక్క‌డి కొబ్బ‌రి చెట్లు మోడువారిపోయాయ‌ని అనాలోచితంగా అనేశారాయ‌న‌.  త‌న చేతిలో మైకు ఉన్న‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు లేరు. ఆపై అక్క‌డి  జ‌నాన్ని ఏదో ఊర‌డించ‌డానికి కూడా ఆయ‌నిలా అని  ఉంటారేమో తెలీదు. తాను ఉప  ముఖ్య‌మంత్రిన‌నీ..  ఇలాంటి మాట‌లు అనాలీ, అన‌కూడ‌ద‌న్న సోయ కూడా ప‌వ‌న్ కి ఆ టైంలో లేక పోయి ఉండొచ్చు. విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన ప‌వ‌న్ అన్న విష‌యం ఒక్కోసారి  మ‌ర‌చి పోయే ప‌వన్ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడిన‌ట్టు ఆ ప్రాంత  ప్ర‌జ‌ల ముందు మాట్లాడేశారు. మ‌న కోన‌సీమ‌కు తెలంగాణ వాళ్ల న‌ర‌దిష్టి త‌గిలి ఉంటుంద‌ని.. అనేశారు. అందుకే ఆ చెట్లు అలా మోడు వారి పోయాయ‌ని తేల్చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ఈ వియంలో ఫ‌స్ట్ రియాక్ట‌య్యింది మాత్రం బీఆర్ఎస్ మాజీ  మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అటు పిమ్మ‌ట వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి సైతం ఈ విష‌యంపై త‌న‌వైన సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ బ‌ల్మూరి, మంత్రి వాకిటి శ్రీహ‌రి త‌దిత‌ర మంత్రులు కూడా ప‌వ‌న్ని తిట్ట‌డంలో త‌లో నాలుక వేశారు. ఇక అంద‌రూ అయిపోయారు. ఇక్క‌డితో ఈ మొత్తం వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేన‌ని భావించిన‌పుడు స‌డెన్ స‌ర్ ప్రైజ్ గా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి రియాక్ట‌య్యారు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల త‌ర్వాత ఏంటీ మోత‌.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డింది. ఈ మ‌ధ్య కాలంలో కోమ‌టిరెడ్డికి మంత్రిమండ‌లిలో త‌గిన ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు కూడా క‌నిపించ‌డం లేదు. ఇందుకు రిల‌వెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని బ‌ట్టీ చూస్తే.. సీఎం రేవంత్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అయిన  కోమ‌టిరెడ్డికి ఎలాంటి  స‌మాచారం ఇవ్వ‌కుండానే జూబ్లీ ప్ర‌చారంలో.. సినిమా వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. .సంబంధిత మంత్రి అయిన కోమ‌టిరెడ్డి తో సంబంధం లేకుండా సినిమా వారంద‌రితో భేటీ  అయ్యారు కూడా. ఇంకా ఎన్నెన్నో వ‌రాల‌ను సినీ కార్మికుల‌పై కుమ్మ‌రించారు. దీంతో అంద‌రిలోనూ ఒక అనుమానం.. సంబంధిత మంత్రి. కోమటిరెడ్డి ఆఫ్ ప్రెజ‌న్స్ లో.. సీఎం ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి ఏంట‌న్న ప్రశ్న  త‌లెత్తింది. దీనంత‌టికీ  కార‌ణం కోమ‌టిరెడ్డి మంత్రి ప‌ద‌వి  ఊడిపోనుంద‌న్న మాట వినిపించింది. మ‌రి వీట‌న్నిటి న‌డుమ కోమ‌టిరెడ్డి త‌న ఉనికి కాపాడుకోవ‌డంలో భాగంగానే ప‌వ‌న్ పై ఈ కామెంట్లు చేశారా? అన్న అనుమానం వ‌స్తోంది. త‌న మంత్రిత్వానికి ప్ర‌మాదం ఉంద‌నో ఏమో ఇటీవ‌ల రేవంత్ రెడ్డి కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు కోమ‌టిరెడ్డి. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తుంటే కోమ‌టిరెడ్డి ఏదో ట్ర‌బుల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. అన్న వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి ఇలా ఉందంటే త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం  చూస్తే.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఎప్ప‌టి నుంచో బుంగ‌మూతి పెట్టుకుని  కూర్చున్నారు. మ‌రి ఈ న‌ల్గొండ‌ బ్ర‌ద‌ర్స్ ఫ్యూచ‌రేంటి?  తెలియాల్సి ఉంది.

అవినీతి కేసులను మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ : బొత్స

  తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి  కేసులు మూసివేయిస్తున్నారంటూ మండిపడ్డారు.  ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారని బొత్స పేర్కొన్నారు . తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక ముఖ్యమంత్రి అడ్డదారులు తొక్కుతున్నారు. తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.  దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయనాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేని ఆరోపించారు. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలని. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలని బొత్స డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఆందోళన కలిగిస్తున్న కుక్క కాటు కేసులు

  హైదరాబాద్‌లో కుక్కకాటు ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రేబిస్ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకరమైనదని, కుక్కకాటు జరిగిన వెంటనే గాయం శుభ్రం చేయడమే కాకుండా ప్రి–ఎక్స్‌పోజర్ మరియు పోస్ట్–ఎక్స్‌పోజర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కుక్కకాటు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు కుక్క కాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు. 2023లో 27,172 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 13 మంది మరణించారు. 2024లో కేసులు 29,054కు పెరిగి, రేబిస్‌తో 26 మరణాలు చోటుచేసుకున్నాయి. 2025లో (నవంబర్ వరకు) 31,488 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కుక్కకాటు కేసుల్లో ప్రతి ఏడాది పెరుగుదల ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి ఒకసారి సోకితే ప్రాణాంతకమని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలు చేయగల ముఖ్యమైన చర్య అని ఆయన వివరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే కనీస నిర్లక్ష్యమూ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలు, మహిళలపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇలా నగరంలో వాళ్ళు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నయని.... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు...  

తెలంగాణ గవర్నర్ అధికార నివాసానికి కొత్త పేరు

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ కు పేరు మారింది. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన “రాజ్ భవన్, తెలంగాణ” కు ఇకపై “లోక్ భవన్, తెలంగాణ” అనే కొత్త పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. లోక్ భవన్ పేరును అమల్లోకి తేవడం ద్వారా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల బలాన్ని, ప్రజల ప్రాధాన్యతను మరింత స్పష్టం చేయాలని  ప్రభుత్వం  భావించింది.  సమాజంలో ప్రజాస్వామ్య విలువల పటిమను, జీవాంతకత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ మార్పు చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.వికసిత భారత్ వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ప్రజలే కేంద్రబిందువని గుర్తుచేయడం ఈ నామకరణం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుపబడింది.కొత్త పేరు “లోక్ భవన్, తెలంగాణ” ఇకపై అన్ని అధికారిక పత్రాలు, సూచనలు, రికార్డులు మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్లలోనే ఉపయోగించబడుతుంది.

గంజాయి డాన్‌ నీతుబాయి ఇంటిపై పోలీసుల దాడి

  నానక్ రాంగూడలో నివాసం ఉంటున్న నీతుబాయి గంజాయి వ్యాపారం చేయడంలో కింగ్... ఇప్పటికే ఈ లేడీ డాన్ ను పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. అయినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. మళ్లీ గంజాయి వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు... అంతే కాదండోయ్ ఈ లేడీ డాన్ కుటుంబ సభ్యులు గంజాయితో పాటు మద్యం కూడా విక్రయాలు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే పోలీసులు గంజాయి విక్రయాలు చేసే ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నానక్‌ రాంగూడలో ఉన్న లేడీ డాన్ నీతూ బాయ్ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ పోలీసులు వెళ్ళి ప్రత్యేక దాడులు నిర్వహించారు. టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి నీతు బాయి ఇంటిపై ఆకస్మిక సోదాలు చేశారు.  ఈ దాడుల్లో 786 గ్రాముల గంజాయి, 110 బీరు బాటిల్స్, బ్రీజర్‌, ఒక బైక్‌, అలాగే గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ. 60,890 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు ఒరిస్సా నుండి గంజాయిని వివిధ పద్ధతుల్లో హైదరాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసిన గంజాయి, మద్యం, నగదును షేర్లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించి నట్లు పోలీసులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట : సీఎం రేవంత్‌

  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఆకలి కేకలు చూసి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పెట్టాలని అప్పటి ప్రధాని నెహ్రు వారి వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు శ్రీశైలం, ఎస్సారెస్పీ మొదలగు అన్ని నెహ్రు ప్రారంభించనవేని రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక శాఖల్లో ఉండటం వల్లనే ఇక్కడ అభివృద్ధి వేగంగా అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.  సర్పంచ్‌లు మంచి వ్యక్తిని ఎన్నుకొండి అభివృద్ధి చేసే వాళ్లనే సర్పంచ్ లను చేయండని సీఎం పిలుపునిచ్చారు. భట్టి, తుమ్మల, పొంగులేటి ఏది అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడింది ఇక్కడే అని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మీరంతా ఓట్లేసి గెలిపిస్తేనే.. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం. మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్‌, రేషన్‌ కార్డులు వస్తాయి. గ్రామాల్లో సర్పంచ్‌లు కూడా మంచోళ్లు ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసే మంచి సర్పంచి మీ ఊళ్లో లేకపోతే.. గ్రామాలు దెబ్బతింటాయిని సీఎం రేవంత్ తెలిపారు.