cbn own house in amarawathi

అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు.. ఏప్రిల్ 9న శంకుస్థాపన

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది. అంతే కాకుండా అమరావతిలో కీలకమైన సీడ్  యాక్సెస్ మార్గానికి చేరువగా ఉంది. హైకోర్ట్, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జీవోల నివాససముదాయాలు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి కేవలం రెండు కీలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఐదు ఎకరాల స్థలంలో ఇంటిట నిర్మాణంతో పాటు ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి వాటికి వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్న సంగతి తెలిసిందే. ఆ లోపుగానే తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు ఏప్రిల్ 9 ముహూర్తంగా నిర్ణయించారు.  

telugu desham emergence a sensation

తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం.. ఒక ప్రభంజనం!

భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం.  రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.  ఆవిర్భావమే ఒక ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలలకే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేనా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ సోపానంగా మారింది. ప్రజల దగ్గరకు రాజకీయాలను నడిపించింది. వారినే రాజకీయ నిర్ణేతలుగా మార్చింది. రాజకీయం అంటే ఆధిపత్యం కాదు.. ప్రజా సేవ అని చాటింది.   తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆదర్శం, సందేశం ఆచరణ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సిద్థాంతానికి కట్టుబడి గత నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్ర, దేశ రాజకీయాలలో అత్యంత క్రియాశీలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే.  అటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఘనంగా జరుపుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. తెలుగు వాళ్లు ఉన్న ప్రతి రాష్ట్రం, దేశంలో కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో హైదరాబాద్ లో సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు అంటే మార్చి 29న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం.. ఈ 43 ఏళ్లుగా తెలుగువాడి వాడివేడి సత్తా చాటుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ప్రవేశం చేసిన ఎందరో నేతలు ప్రజాసేవలో ఒదిగి ఎదిగారు.   43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే  ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ… ఆ వెంటనే  అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటిలత్వం కారణంగా అధికారానికి దూరం అయ్యింది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో కాంగ్రెస్ దిగివచ్చి మళ్లీ పువ్వుల్లో పెట్టి తెలుగుదేశం కు అధికారం అప్పగించింది. ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యదక్షత, దీక్షను ప్రపంచానికి చాటింది.  ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకుంది.  దేశానికి రాష్ట్రపతి నుంచి ప్రధానులుగా ఎవరుండాలో నిర్దేశించింది.   అటువంటి పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిన పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ జరుపుకునే పొండుగ ఒక్క తెలుగుదేశం ఇఆవిర్బావ దినోత్సవం మాత్రమేనని చంద్రబాబు అన్నారు.  43 ఏళ్లుగా కష్టనష్టాలలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని పార్టీతో నడుస్తున్న నేతలు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు  ఈ సందర్బంగా చెప్పారు.  పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నామనీ,  ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. తానూ అదే  ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నానన్నారు.    సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.   తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటాలే కారణమన్నారు.  2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించినా కార్యకర్తలు జెండా వదల్లేదు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే... అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం. 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం. త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారని అన్నారు. 

encounter in chattisghar 15 naxals dead

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 15 మంది మావోలు హతం

వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  దండకారణ్యంలో శనివారం (మార్చి 28) ఉదయం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గోగుండా హిల్ పై మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ జరిపాయి. ఆ సందర్భంగా కెర్ల పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను గమనించగానే ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు.  ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లు పాల్గొన్నాయి.

 one day police custody to vallabhaneni vamshi

ఒక రోజు పోలీసు కస్టడీకి వంశీ!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం ద్వంసం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను ఎస్టీఎస్టీ అట్రాసిటీస్ కోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూవివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు గన్నవరం కోర్టులో దాఖలు చేసిన  పిటిషన్ ను విచారించిన కోర్టు వంశీని ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు శనివారం (మార్చి 29) తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.   

priyanka learning malayalam

ప్రియాంకను చూసి నేర్చుకోండి !

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా  కు పరిచయమ అవసరం లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోదరి. అంతే కాదు, గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ ( కేరళ) నియోజక వర్గం ప్రస్తుత ఎంపీ ప్రియాంక. 2024 ఎన్నికల్లో రాహుల గాంధీ  వయనాడ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు.  ఆ తర్వాత  రాహుల్ గాంధీ అమేథీని ఉంచుకుని  వయనాడ్ ను వదిలేశారు. సొంత నియోజక వర్గం అమేథీ ఎంపీగా కొనసాగుతున్నారు. అలా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్  లోక్ సభ స్థానానికి   జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంక వాద్రా కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పడు, ఆమె వయనాడ్  ఎంపీ. అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా  ఇప్పడు  ఆమె గురించి మాట్లాడుకోడానికి ఓ మంచి కారణమే వుంది. ఆమె ఓ మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె  తమ నియోజక వర్గం ప్రజల మాతృ భాష మలయాళం నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో  కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ ఇచ్చిన సలహా మేరకు తాను  ప్రత్యేకంగా ఒక టీచర్ ను పెట్టుకుని మరీ మళయాళం నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు  ఇప్పటికే తనకు మలయాళం కొంచెం కొంచెం అర్థమవుతోందని, కుంచెం కుచెం   మాట్లాడగల్గుతున్నానని  చెప్పారు. సంతోషం. అభినందనీయం.   ఐదేళ్ళు అదే వయనాడ్  నియోజక వర్గానికి ప్రాతినిత్యం వహించిన రాహుల్ గాంధీకి మలయాళం ఎంత వచ్చునో, ఎంత రాదో మనకు తెలియదు కానీ, ఉప ఎన్నికల్లో గెలిచి ఇంకా ఐదు నెలలు అయినా కాక ముందే ప్రియాంక  మలయాళం నేర్చుకోవడం  అభినందనీయం. అన్నిటినీ మించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకునేదుకు  వారి మాతృ భాష నేర్చుకోవాలని  ఆంటోనీ ఇచ్చిన సలహాను అక్కడే మరిచి పోకుండా   ఆచరణలో పెట్టడం చాలా చాలా అభినందనీయం.    సహజంగా  ప్రజాప్రతినిధులకు తాము ప్రాతినిధ్యం వహించే’ నియోజక వర్గం ప్రజల భాష వచ్చే ఉంటుంది. కానీ  ఇదిగో ఇలా వలస వెళ్లి వేరే రాష్టాల నుంచి పోటీ చేయవలసి వచ్చి నప్పుడే భాషా సమస్య వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది నాయకులు దక్షణాది రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు  భాషా సమస్యను ఎదుర్కుంటారు.  గతంలో  1999లో కర్ణాటకలోని బళ్ళారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికలో  కాంగ్రెస్ అభ్యర్ధిగా, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అభ్యర్ధిగా  సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఇద్దరికీ  కన్నడం రాదు. సోనియా గాంధీ ఏ భాషలో మాట్లాడారో ఏమో కానీ,   సుష్మాస్వరాజ్  మాత్రం పట్టుపట్టి కన్నడం నేర్చుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కన్నడంలో ప్రసంగించారు. అయినా  ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు. సుష్మా స్వరాజ్ ఓడి పోయారు. ఓడిపోతే  ఓడి పోయారు కానీ, ఆమె చాలా తక్కువ సమయంలో అంటూ  30 రోజులకంటే తక్కువ రోజుల్లో  కన్నడ  భాష నేర్చుకున్నారు.  సరే  ప్రజాప్రతినిధులు అందరూ సుష్మా స్వరాజ్ లా పక్షం రోజుల్లోనే పరాయి భాష నేర్చుకోలేక పోవచ్చును. పీవీ నరసింహ రావులాగా  14 భాషల్లో మాట్లాడలేక పోవచ్చును కానీ, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజల భాష మాట్లాడ లేక పోవడం మాత్రం, ఆక్షేపణీయం. ఒక రకంగా అది వారికే అవమానం.   కానీ తెలుగురాష్ట్రంలోనూ ప్రజల భాష తెలుగు రాని ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ శాసన సభ విషయాన్నే తీసుకుంటే, ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 20 ఏళ్లకు పైగానే  తెలుగు సభ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలోని చాంద్రాయగుట్ట నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు,ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ  కూడా ఎమ్మెల్యేలుగా,  ఎంపీలుగా ఉన్నారు. అయినా ఆయనకు గానీ, అయన కుటుంబ సభ్యులకు గానీ తెలుగు రాదు.ఇంగ్లీష్ లో  అయితే అనర్గళంగా మాట్లాడతారు. అవసరం అనుకుంటే  తమ ఓటర్ల  కోసం ఉర్దూలోకి షిఫ్ట్ అవుతారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేరు. మాట్లాడ లేక పోవడం  మాత్రమే కాదు. కనీసం అర్థం చేసుకోలేరు. తెలుగు రాష్ట్రంలో పుట్టి  తెలుగు రాష్ట్రంలో పెరిగి,  20 ఏళ్లకు పైగా తెలుగు శాసనసభలో సభ్యునిగా ఉండి మెజారిటీ సభ్యులు, మంత్రుల తెలుగు ఉపన్యాసాలు  వింటూ కూడా ఆయనకు తెలుగు తలకెక్కలేదు.   అయితే  ఆయన మంత్రి సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రాదని ఆక్షేపించారు. మంత్రికి ఇంగ్లీష్, ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు, పరస్పరం ఒకరిని  ఒకరం అర్థంచేసుకోలేక పోతున్నాం.  అంటూ తనకు తెలుగు రానందుకు  క్షమాపణలు చెప్పారు. కానీ  అదే సమయంలో ఆయన మంత్రి సీతక్కను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాద మయ్యాయి.  అయినా ఇప్పటికైనా  ప్రియాంకను ఆదర్శంగా తీసుకుని అయినా ఒవైసీ సోదరులు తెలుగు నేర్చుకుంటారేమో చూద్దాం. నిజానికి  ఒవైసీ సోదరులు మాత్రమే కాదు  ప్రజల భాష రాని ప్రజా ప్రనిధులు ఇంకా ఉండే ఉంటారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ కు ఒరియా భాష రాదని అంటారు. అది ఎంత వరకు నిజమో కానీ  ప్రజాప్రతినిధులకు ప్రజల భాష రావడం అవసరం. అది ఒవైసీలు కావచ్చును, మరొకరు కావచ్చును.

another big shock to jagan

జగన్ కు మరో బిగ్ షాక్? తోట త్రిమూర్తులు జంప్?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో సర్దుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగి దాడులు, దౌర్జన్యాలు చేసిన నేతలూ, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులపై చట్ట ప్రకారం చర్యలకు కూటమి సర్కార్ ఉపక్రమించింది. దీంతో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకీ, జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే వైసీపీ శ్రేణులే అవునని అంటున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీని వీడనున్నారని అంటున్నారు. ఆయన జనసేన తీర్ధం పుచ్చోవడం ఖాయమని అంటున్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు కూడా అదే దారిలో నడవనున్నారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులు కూడా రాజీనామా చేయడం జరిగితే వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇప్పటికే  ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్,  పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తోట త్రిమూర్తులు పార్టీని వీడనున్నారన్న ప్రచారం వైసీపీలోనే జోరుగా సాగుతోంది.   తోట త్రిమూర్తులు1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి తొలిసారిగా  ఎమ్మెల్యే అయ్యారు. 1995లో  తెలుగుదేశంలో చేరి 1999లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.   2014లో  రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.  వెళ్లారు. 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  ఇప్పుడు ఆయన జనసేన గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తోట త్రిమూర్తులు ఆయనతో ఫొటో కూడా దిగారు. అప్పటి నుంచీ తోట త్రిమూర్తులు జగన్ కు షాక్ ఇచ్చి జనసేన గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  

devotees rush in tirumala

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం స్వామి వారిని మొత్తం 65 వేల 569 మంది దర్శించుకున్నారు. వారిలో  21 వేల 780 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చింది. 

kutami gevernment support doctor sudhakar family

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి సర్కార్ అండ.. మంత్రి అనిత

వైకాపా హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురై మరణించిన వైద్యుడు సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో కరోనా నుంచి రక్షణకు వైద్యులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వలేందంటూ విమర్శించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం నానా విధాలుగా వేధించిన సంగతి తెలిసిందే. నర్సీపట్నం ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న సుధాకర్ ను సస్పెండ్ చేసింది. పిచ్చివాడిగా ముద్ర వేసింది. మండుటెండలో అర్ధనగ్నంగా నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చో పెట్టింది. ప్రభుత్వ వేధింపుల కారణంగా డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు.    డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయిని హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం (మార్చి 28)న పరామర్శించారు. విశాఖ సీతమ్మధారలో ఆమె నివసిస్తున్న ఇంటికి వెళ్లిన మంత్రి అనిత ఆమెను పరామర్శించి, అన్నివిధాలుగా అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు.  కొడుకును కోల్పోవడం, సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపై భావోద్వేగానికి గురైన  కావేరిబాయిని ఓదార్చారు.  కొవిడ్‌ సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు జగన్‌ ప్రభుత్వం సుధాకర్‌ను విధులు నుంచి తొలగించిందని దుయ్యబట్టారు. దీనిపై తాను తెదేపా మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో రాసిన లేఖను హైకోర్టు సుమోటాగా స్వీకరించి అప్పటి వైకాపా ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు

Vallabhaneni Vamsi gets a series of shocks.. Bail petition dismissed

వల్లభనేని వంశీకి వరుసగా షాక్ లు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శుక్రవారం ఎస్సీ  ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిన్న సిఐడి కోర్టు  వంశీకి బెయిల్ ఇవ్వడానికి   నిరాకరిస్తే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు  ఇవ్వాళ వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బాధితుడు సత్యవర్దన్ తరపు న్యాయవాది వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు.  నిందితుడు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వంశీకి బెయిల్ ఇస్తే సత్యవర్దన్ ప్రాణాలకు హాని ఉందని పేర్కొన్నారు.  రిమాండ్ లో ఉన్న తన క్లయింట్ కు బెయిల్ ఇవ్వాలని వంశీ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.  వరుసగా రెండ్రోజులు రెండు ప్రత్యేక కోర్టులు వంశీకి బెయిల్ ఇవ్వకపోవడంతో చర్చనీయాంశమైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎపి పోలీసులు వంశీని హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసు నడుస్తుండగానే సిఐడి పోలీసులు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 

then polavaaram and now polavaram

నాడు పోల‘వారం’.. నేడు పోల‘వరం’

పోలవరం కేవలం ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు మాత్రమే కాదు. కోట్లాది మంది ఆంధ్రుల కల. లక్షలాది మంది ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం.  రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం, సాగు, తాగు నీటి కొరత, విద్యుత్ కొరతలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశతో ఎందరో..  తరతరాలుగా తాము జీవించిన ఊరును, ఇళ్లను వదులుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం తృణ ప్రాయంగా త్యజించిన త్యాగధనుల కథ, వ్యథ కూడా .  గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, నిష్పూచీతనం కారణంగా పోలవరం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబాలు అష్టకష్టాలూ పడ్డాయి. వారి జీవితాలు దుర్భరంగా మారాయి.  ఈ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలస్యం వారి జీవితాలను దుర్భరం చేశాయి.అసలు రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం పరుగులు తీసింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు అప్పట్లో సోమవారానికి పోలవారంగా నామకరణం చేసి.. క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించేవారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఆ ఐదేళ్లలో పోలవరం పరుగులు తీసింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ నిధుల విషయంలో సహాయ నిరాకరణ చేసినా చంద్రబాబు వెనకడుగు వేయలేదు.. రాజధాని కూడా లేని రాష్ట్రంలో, పేరు తప్ప మరేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఓ వైపు ప్రగతి పథకంలో నడిపిస్తూనే, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచే పోలవరం పనులకూ నిధులు వెచ్చించారు. అయితే దాదాపు 80శాతం పూర్తైన పోలవరంకు 2019లో గ్రహణం పట్టింది. తెలుగుదేశం అధికారం కోల్పోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ ఏపీకి అత్యంత ప్రధానమైన, కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి పనులను పడకేసేలా చేశారు. రెంటినీ నిర్వీర్యం చేశారు. పోలవరం నిర్వాసితుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు.. నేనేం చేయలేనంటూ చేతులెత్తేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అహంకారం, నిష్క్రియాపరత్వం, అరాచకత్వం మాత్రమే పాలనకు అర్ధం అన్నట్లుగా విర్రవీగిన జగన్ సర్కార్ ను జనం 2024 ఎన్నికలలో తిరస్కరించారు. మళ్లీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ క్షణం నుంచీ పోలవరం పరుగులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సారి కేంద్రంలోని మోడీ సర్కర్ నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ప్రజలలో ఆనందాన్ని నింపింది.   ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గురువారం (మార్చి 27) సందర్శించారు. ఆ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో ముఖాముఖీ మాట్లాడారు.వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ప్రకటించి ఊరుకోకుండా.. ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందుగానే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తానని ప్రకటించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు.   గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని విస్పష్ట హామీనిచ్చారు.  పరిహారం కూడా పారదర్శకంగా అందిస్తామన్నారు.   ఆశలు వదిలేసుకున్ననిర్వాసితుల్లో గుండె ధైర్యం నింపారు.  తమ త్యాగం వృధా కాలేదన్న సంతృప్తి నిర్వాసితుల కళ్లల్లో కనిపించింది. దీంతో పరిశీలకులు నాడుపోల ‘వారం’ అంటూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తించిన చంద్రబాబు నేడు  పొల‘వరం’ అందిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. 

Vishnu Priya gets no relief from the High Court

విష్ణు ప్రియకు హైకోర్టులో లభించని ఊరట

యాంకర్ విష్ణు  ప్రియకు శుక్రవారం  తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న  విష్ణు ప్రియపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని విష్ణు  ప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నెల 20న విచారణకు హాజరయ్యారు. మరోసారి 25న విచారణకు రావాలని పోలీసులు విష్ణు  ప్రియకు  నోటీసులు ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని విష్ణు  ప్రియ హైకోర్టునాశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన క్లయింట్ విష్ణు ప్రియపై పోలీసులు అక్రమ కేసు బనాయించి  కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియ అడ్వకేట్ కోర్టులో వాదించారు.  విష్ణు ప్రియపై నమోదైన కేసును కొట్టివేయడానికి  న్యాయస్థానం జోక్యం చేసుకోదని పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విష్ణు ప్రియపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు  నమోదైన నేపథ్యంలో కోర్టు నాశ్రయించినట్లు  తెలుస్తోంది. 

mayanmar earthquake effect

మయన్మార్ భూకంప ప్రభావం.. భారత్ లోనూ కంపించిన భూమి

మ‌య‌న్మార్ లో సంభ‌వించిన భూకంప ప్రభావం భారత్ లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా  కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో  భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు.  ఒక్క భారత్ లోనే కాకుండా  అలాగే బంగ్లాదేశ్,చైనాల‌లో కూడా భూమి కంపించింది.  బ్యాంకాక్, మయన్మార్ లో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోయాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  భారత ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మయన్మార్, బ్యాంకాక్ లో భూకంప బాధితులకు సహాయం అందించడానికి దేశం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ ఆపత్సమయంలో భారత్ వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. 

announcement fobia in ycp leaders

యూ ఆర్ ఇన్ క్యూ.. వైసీపీలో ఎనౌన్స్ మెంట్ ఫోబియా

వైసీపీ అధినేత మొదలుకుని నేతల వరకు అందరూ క్యూలో   మనం ఏదైనా పని మీద కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్ చేస్తే.. యూ ఆర్ ఇన్ క్యూ.. అనే ఎనౌన్స్ మెంట్ వస్తుంది. దీంతో మన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఇదే ఎనౌన్స్ మెంట్ ఇప్పుడు వైసీపీ నేతల చెవుల్లో మార్మోగుతోంది. మెలకువగా ఉన్నా.. కళ్లు మూసుకుని పడుకున్నా.. యూ ఆర్ ఇన్ క్యూ.. అనే ఎనౌన్స్ మెంటే తెగ వినిపిస్తోంది. దీంతో కొందరు వైసీపీ నేతలు ఎనౌన్స్ మెంట్ ఫొబియాతో అల్లాడుతున్నారట. అవును.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే చర్చ జరుగుతోంది. సజ్జల రామకృష్ణా రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, మిధున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడదల రజనీ, రోజా, వెలంపల్లి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒకరి తర్వాత మరొకరు.. జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. క్వార్ట్జ్ గనులకు సంబంధించి అక్రమాలు భారీ ఎత్తున జరిగాయనే అభియోగాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతోంది. నెల్లూరు జిల్లాలో భారీగా గనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. మాజీ మంత్రి సోమిరెడ్డి గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున పోరాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే నాటి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై అలుపెరగని పోరాటం చేశారో..  అధికారం వచ్చిన తర్వాత కూడా సోమిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు లెక్కే వెంటబడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో వెలుగులోకి వచ్చిన చాలా కుంభకోణాలు.. అక్రమాలన్ని సోమిరెడ్డి లైమ్ లైటులోకి తెచ్చినవేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కాకాణి మీదున్న కేసులు ఒక్కొక్కటీ కొలిక్కి వస్తున్నట్టే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాకాణి అరెస్ట్ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. అలాగే మద్యం కుంభకోణం విషయంలో మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు జైలుకు వెళ్తారనే ప్రచారమూ జోరుగా ఉంది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయం ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంటులో ప్రస్తావించడం.. ఆ తర్వాత అమిత్ షాను కలవడంతో ఏపీలోని మద్యం స్కాం ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆ కేసు రాజకీయంగా కూడా చాలా చర్చకు దారి తీయడంతో.. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్సులో హాటా టాపిక్ గా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 18 నుంచి 20 వేల కోట్ల రూపాయల మద్యం స్కాం ఏపీలో జరిగిందంటే.. ఢిల్లీ పెద్దలు సహజంగానే దానిపై ఆరా తీస్తారు. ఈ పరిణామంతో ఏపీ మద్యం స్కాం కచ్చితంగా ఈడీకి చేరుకుంటుందని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు. ఈ మద్యం స్కాం కేసులు.. విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమార్డు మిధున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారితో పాటు.. ఏకంగా ఈ లింకులు తాడేపల్లి ప్యాలెస్ వైపు దారి తీస్తుండడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చుట్టూ కూడా మద్యం ఉచ్చు బిగిసుకునే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇవాళ కాకున్నా రేపు.. రేపు కాకున్నా ఎల్లుండైనా.. మద్యం స్కాంలో వైసీపీలోని పెద్దల పీఠాలు.. ఆ పార్టీ కూసాలు కదలడం ఖాయమనే చర్చ యమ జోరుగా సాగుతోంది. వీరు కాకుండా.. కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా, విడదల రజనీ వంటి వారిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీద ఎలాంటి కేసూ నమోదు కాలేదు. అయితే వెలంపల్లి కూడా క్యూలో ఉన్నారని తెలుస్తోంది. దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. వెలంపల్లి.. ఆయన అనుచరులు దేవదాయ శాఖలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దేవదాయ శాఖకు చెందిన వివిధ భూముల్లో భారీగా అక్రమాలకు తెరలేపారట వెల్లంపల్లి. కొన్ని భూములకు నిబంధనలకు విరుద్దంగా ఎన్వోసీలు ఇవ్వడం వంటివి చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయనేది తెలుస్తోంది. దీంతో వెలంపల్లి మీద కేసు నమోదు చేయడానికే కాదు.. ఏకంగా శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయనేది ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ క్రమంలో త్వరలోనే వెలంపల్లి మీద కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ చాలా స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీదున్న అభియోగాలను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్దమవుతోందని సమాచారం. హడావుడిగా కాకుండా.. అన్ని ఆధారాలు సేకరించే పని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కన్పిస్తోంది. ఆధారాలు లభ్యమైన తర్వాతే కేసులను బిల్డప్ చేయడంతో పాటు.. తప్పు చేసిన వారు తప్పించుకుపోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం ఇప్పుడు ఏపీలోని పొలిటికల్ సర్కిల్సులో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా జైలుకు వెళ్లడం ఖాయమనే భావన చాలా మందిలో కన్పిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొందరు వైసీపీ నేతలైతే జైలుకు వెళ్లడానికి మానసికంగా ప్రిపేరైనట్టే కన్పిస్తున్నారు.

కేజ్రీవాల్ పై కేసు నమోదు 

ఆమ్ ఆద్మీ పార్టీ నేత , మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో భారీ హోర్డింగ్ లు  పెట్టి  ప్రజాధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేసినట్టు  ఆరోపణలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు  కేజ్రీవాల్ పై కేసు నమోదుచేశారు. 2019 ద్వారకలో భారీ హోర్డింగ్ లు పెట్టి కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఓ వ్యక్తి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థన మేరకు కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కు సంబంధించి నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు.   ఈ కేసులో విచారణ జరుగుతుందని, మరికొంత సమయం కావాలని పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. విచారణకు కోర్టు వచ్చేనెల 18కి వాయిదా వేసింది. 

మయన్మార్ లో భారీ భూకంపం

మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. మయన్మార్ తో పాటు థాయ్ ల్యాండ్ లో కూడా భూమి కంపించింది. మయన్మార్ లో  సంభవించిన భూకంపం కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్ఠం సంభవించినట్లు సమాచారం. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి.   ఇక థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఇక్కడా పలు భవనాలు కుప్పకూలాయి. సహాయ కార్యక్రమాల కోసం సైన్యం రంగంలోకి దిగింది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ  చేశారు. ఇక భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.  

  యుపిలో వింత...ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త 

ప్రాణభయం మనిషిని ఏ స్థాయికి అయినా దిగజారే స్థితికి తీసుకెళుతుంది. కట్టుకున్న భార్య ప్రియుడితే రాసలీలలు కొనసాగిస్తే ఏ భర్త అయినా సహించలేడు. అవకాశం దొరికితే  ప్రియుడిని  ముక్కలుముక్కలుగా నరికేసే రోజులివి. అయినప్పటికీ ఆ భర్త కట్టుకున్నతన భార్యను ప్రియుడికిచ్చి వివాహం చేశాడు.  ఉత్తర ప్రదేశ్ కబీర్ నగర్ జిల్లాలో  రాధిక అనే యువతితో బబ్లూకి  2017లో పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం.  రాధికకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతరసంబంధం ఏర్పడింది. భర్త బబ్లుకు ఈ విషయం తెలియడంతో భార్యతో తరచూ గొడవపడేవాడు. అయినా భార్య రాధిక తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది.  చాటు మాటుగా కాకుండా ఇరుగుపొరుగు వారికి తెలిసేలా   కొనసాగించింది. గత వారం మీరట్ లో ముస్కాన్ అనే యువతి ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయంచి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో వేసిన సంగతి తెలిసిందే.  దేశ వ్యాప్తంగా సంచలనమైన ఈ దారుణహత్య తో  రాధిక భర్త బబ్లూలో ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. బబ్లూకు కూడా ప్రాణ భయం పట్టుకుంది. తన ప్రాణాలను రక్షించుకోవాలని డిసైడయ్యాడు. రాధిక తన ప్రియుడితో హత్య చేయిస్తుందేమోనని వణికి పోయాడు.   నీ ప్రియుడితో పెళ్లి జరిపిస్తాను అని భార్య రాధికను అడిగాడు భర్త బబ్లూ. పెళ్లికి భార్య ఒప్పుకోవడంతో గుడిలో సాంప్రదాయంగా పెళ్లి తంతు జరిపించాడు.   మీరట్ ఘటన తర్వాత  తన  శరీరంలో రక్తం సలసలా కాగుతున్నప్పటికీ   భర్త బబ్లూ  భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేయడం చర్చనీయాంశమైంది.  ఈ  పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.