దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఎక్కడో తెలుసా?

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.  

ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.  

ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.  

సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.  

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు కానుంది. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెంవడది కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.  

ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.  

ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించనున్నారు.  

సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ ప్రముఖులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన గిఫ్ట్ బాస్కెట్లను బహూకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.  

బళ్లారి కాల్పుల వివాదం...ఎస్పీ ఆత్మహత్యాయత్నం

  కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యడిని చేస్తూ బళ్లారి ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై  ఎస్పీ తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.   బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు  జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ,  బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర గోడవ చోటుచేసుకుంది. ఈ గొడవ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపిం ది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బళ్లారిలో హై టెన్షన్ మొదలైంది

న్యూయర్ రాష్ట్రానికి ఘనమైన ఆరంభం : సీఎం చంద్రబాబు

  పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు శుభావార్త అని, కొత్త సంవత్సరానికి ఘనమైన ఆరంభమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినేస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.  2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 51.2 శాతం వాటాను ఆకర్షించడం గమనార్హం.

వెనిజులాపై అమెరికా బాంబు దాడులు

వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఆ దేశంపై బాంబు దాడులకు దిగింది.  వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుఝామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం ఆ దేశ వాసుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలో దేశంలో ఎమెర్జన్సీ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.  సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.  దాంతో సైనిక స్థావరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ పెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసింది. అమెరికా విమానాలు వెనిజులా గగనతలాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఆ ముఠాలతో నికోలస్ మదుకోకు కూడా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపి స్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్దనౌకలు, సబ్‌మెరైన్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మొహరించింది.

బంగ్లా క్రికెటర్‌ని పక్కనపెట్టమని బీసీసీఐ ఆదేశాలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలకు సంబంధించి పెద్ద కలకలమే రేగుతోంది. హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మాస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ మినీవేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు దక్కించుకోవడంపై  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో బీసీసీఐ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని తాజాగా కేకేఆర్‌కు ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న అబుదాబీలో జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండటంతో అతడిని ఐపీఎల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో అతన్ని రిలీజ్ చేయాలని బీసీసీఐ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ముస్తాఫిజుర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. 8.13 ఎకానమీతో సమర్థవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు, అనంతరం ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , చెన్నై సూపర్‌కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 60 మ్చాచ్‌లు ఆడి 65 వికెట్లు తీసుకున్నాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో సీఎస్కే అతడిని విడుదల చేసింది.  మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆడే సిరీస్‌లపై ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలోనూ భారత్‌తో షెడ్యూల్ ప్రకటించింది. భారత్‌తో ఆగస్టు - సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ 20 సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. గత ఏడాది రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరగాల్సి ఉండగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు. ఈ ఆగస్టు టూర్‌తో ఆ లోటు భర్తీ అవుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశాభావంతో ఉంది. అయితే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ మాన్ ను పక్కన పెట్టేయాలన్న బీసీసీఐ   తాజా నిర్ణయంతో  టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య క్రికెట్ సంబంధాల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది.  

పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది!

 అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో  గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.  ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరెళ్ల కుంటలో పడేశారు.  మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు కట్టుకథ అల్లి అందర్నీ నమ్మించాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

డమ్మీ గన్ తో బెదరించి..గొడ్డలితో దాడి చేసి బంగారం దోపిడీ!

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి, షాప్ యజమానిపై గొడ్డలితో దాడి చేసి నాలుగు తులల బంగారం దోచుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన షాప్ యజమాని సందీప్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.  రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్  షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో  షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన సందీప్ ధైర్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులలో ఒకడు తన వద్ద ఉన్న గొడ్డలి లాంటి పదునైన ఆయుధంతో సందీప్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడిలో  సందీప్ తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు   నాలుగు తులల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. ఓనర్ తీవ్రంగా ప్రతిఘటిం చడంతో వారు ఉపయో గించిన డమ్మీ గన్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అరుపులు, గట్టి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వచ్చి చూడగా.. సందీప్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు  కీసర పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని  సందీప్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   కాగా దోపిడీ జరిగిన షాప్ పరిసరాలను, దుండగులు ప్రవేశించిన మార్గాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు.  నిందితులు వదిలేసిన డమ్మీ గన్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు ఎస్‌వోటీతో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ దోపిడీ ఘటనతో నాగారం, కీసర పరిధిలోని వ్యాపార వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ముఖ్యంగా జ్యువెలరీ షాప్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం కలవరపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అత్యంత మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్న ఆయన.. కొండగట్టు ఆంజనేయస్వామివారి సేవ చేసుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.  పవన్ కళ్యాణ్   శనివారం (జనవరి 3)  కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయలం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం అప్పట్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం   35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో  నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3) శంకుస్థాపన చేశారు.  కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.   రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదన్న ఆయన  త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానన్న ఆయన.. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిం చినందుకు ఆనందంగా ఉందన్నారు.  అంతకు ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు వేదపండితులు శాస్త్రోక్తంగా  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గాన్ని సాకారం చేయాలని, అందుకు తానే స్వయంగా వచ్చి కరసేన వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్   బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్, టీటీడీ బోర్టు సభ్యులు ఆనందసాయి,  మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని   ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా  ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో  35.19 కోట్ల రూపాయల వ్యవయంతో  భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా  దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.   టీటీడీ నిధులతో ఇక్కడ నిర్మించనున్న దీక్ష విరమణ మండపంలో  ఒకేసారి   రెండువేల మంది   భక్తులు అయ్యప్ప దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అలాగే   సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు కొండగట్టు ఆలయానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తాయని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో  ఈ ఉదయం జరిగిన  రెండు ఎన్ కౌంటర్లలో  14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు.  సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన  రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.  సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా,  బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.  సుక్మా జిల్లాలోని కొంటా   ప్రాంత అడవుల్లో ఉదయం  నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక నాయకుడు సచిన్ మంగ్డు సహా 12 మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  మృతులలో కొంటా ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు.  సంఘటనా స్థలం నుంచిఏకే-47, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్  రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా శనివారం (జనవరి 3) ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలుఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో ఏకకాలంలో కూంబింగ్ నిర్వహించారు.   ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశముందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన  ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో  దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా  ఏపీ దక్కించు కోగా,  ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో  13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో  12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.