మేఘా కృష్ణారెడ్డి సర్వే.. ఏపీలో రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే?!

ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు. షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన డజనుకు పైగా సర్వేలు తెలుగుదేశం కూటమిదే విజయం అని తేల్చిసినట్లు ఫలితాలు వెలువరించినా.. వాటిని వేటినీ కచ్చితమైన ఫలితంగా పరిగణించలేము.  అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నా పలు ప్రసిద్ధ సర్వే సంస్థలను ఉటంకిస్తూ సామాజిక మాధ్యమంలో ఫలానా పార్టీదే విజయం, ఫలానా పార్టీకి ఘోర పరాజయం తథ్యం అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయా పోస్టుల్లో ఉటంకించిన సంస్థలేవీ వాటిని  నిర్ధారించడం లేదు. తమ సంస్థే ఈ సర్వే నిర్వహించిందని అంగీకరించడం కానీ, ఖండించడం కానీ చేయడం లేదు.  ఈ నేపథ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో  భారీ ఎత్తున కాంట్రాక్టులు వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ టైకూన్ అని చెప్పదగ్గ మేఘా కృష్ణారెడ్డి చేయించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలుగా చెబుతూ సామాజిక మాధ్యమంలో ఏపీ ఔట్ కమ్ పై పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా మేఘా కృష్ణారెడ్డి చేయించిన సర్వే ఫలితం అంటూ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న నివేదిక ప్రకారం ఏపీలో అధికారం చేపట్టబోయేది కూటమి ప్రభుత్వమే. అయితే దీనికి ఎలాంటి సాధికారతా లేదన్నది పక్కన పెడితే.. మేఘా కృష్ణారెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు కీలక కాంట్రాక్టులను దక్కించుకున్న వ్యక్తి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తం. అదే విధంగా ఏపీలో కూడా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పుణ్యమా అని పోలవరం వంటి భారీ కాంట్రాక్టును కూడా దక్కించుకున్నారు. అటువంటి మేఘా కృష్ణారెడ్డి చేయించినట్లుగా చెబుతున్న సర్వే ఫలితం తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. తన పేరుపై సర్క్యులేట్ అవుతున్న సర్వే రిపోర్టుపై మేఘా ఇప్పటి వరకూ ఖండించనూ లేదు, సమర్ధించనూ లేదు.  

సచిన్ సెక్యూరిటీ గార్డ్ సుసైడ్ 

భార‌త‌ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ అయిన‌ ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వ‌గ్రామానికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు.  ఈ క్ర‌మంలో బుధవారం ఉదయం తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రకాశ్ అప్పటికే మృతి చెందాడు. ప్రకాశ్ ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.   కాగా, వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రకాశ్ తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, సన్నిహితులు, స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. వీవీఐపీ సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్ఆర్‌పీఎఫ్ కూడా దర్యాప్తు చేస్తోంది.  

ఎపి హింసపై ఈసీ సీరియస్... వివరణ ఇవ్వాలని సిఎస్, డిజిపిలకు  ఆదేశం 

ఎపిలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనా హింసకు కారణమవుతున్న నేతల హౌస్ అరెస్టులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.అయినా ఇంకా పలు చోట్ల హింస కొనసాగుతుండటంపై ఆగ్రహంగా ఉన్న ఈసీ.. ఢిల్లీ వచ్చి వీటిపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీజీలకు సమన్లు పంపింది. దీంతో వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి హింసకు గల కారణాలు, వాటిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలపై ఈసీకి వివరణ ఇవ్వబోతున్నారు. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. రేపు వీరు ఇచ్చే వివరణ ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు ప్రకటించనుంది.

వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం.. ఫలితం అప్పుడే తెలిసిపోయందా?!

ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు. రాక్షస పాలనకు చరమగీతం పాడుతున్నామన్న ఉత్సాహంతో వెల్లువలా ఓటింగ్ కు తరలివచ్చారు.  ఓటింగ్ సరళిని చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉందా అనే స్థాయిలో ఓటర్లు తమ ప్రతాపాన్నిచూపారు. వైసీపీ మూకలు ఘర్షణలు సృష్టించినా, దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఓటుహక్కును వినియోగించుకున్నారు.  దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ కు ముందు రోజువరకు మీడియా మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసీపీ ముఖ్యనేతలు.. పోలింగ్ సరళిని చూసి నీరసించిపోయారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాదని నిర్ధారణకు వచ్చేశారు. పోలింగ్ సమయంలో అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లోనూ వైసీపీకి ఘోర ఓటమి ఎదురుకాబోతుందని స్పష్టమైందని ఆ పార్టీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. ఈ పరిణామాలతో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అలర్ట్ అయ్యారు. తన కుమారుడు సజ్జల భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న సోషల్ మీడియా విభాగం కార్యాలయానికి  తాళం వేశారు. దీంతో ఇన్నాళ్లు ఆ విభాగంలో పనిచేస్తూ ‘నువ్వే జగన్.. నీ వెంటే జగన్’ అంటూ నినదించిన ఉద్యోగులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఐదేళ్ల పాటు అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పాలుచేశాడు. పోలింగ్ సరళిని చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. వైసీపీ ప్రభుత్వం పాలనా విధానం సరికాదని రాజకీయ ప్రముఖులు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా జగన్ తీరులో మార్పు రాలేదు. దీనికితోడు జగన్ ప్రభుత్వానికి   సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా విశేష సేవలందించింది. సోషల్ మీడియా పేరుతో భార్గవ్ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని జగన్ ప్రభుత్వం తప్పులను ఒప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలపై ఇష్టమొచ్చిన రీతిలో సోషల్ మీడియా విభాగాల్లో పోస్టులు పెట్టడం, నేతల కుటుంబ సభ్యులపైనా అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి దుర్మార్గపు పనులను సజ్జల భార్గవ్ విజయవంతంగా నిర్వర్తించి జగన్ ప్రశంసలు పొందారు. వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వంటి కార్యక్రమాల్లోనూ భార్గవ్ కీలక భూమిక పోషించారు.  భార్గవ్ పైశాచిక ఆనందానికి ఎంతోమంది ప్రాణాలుసై తం కోల్పోయారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా హద్దులు మీరి ప్రవర్తించడంతో ఈసీ కేసు కూడా నమోదు చేసింది. జగన్ ప్రజావ్యతిరేక పాలనతోపాటు.. భార్గవ్ నేతృత్వంలో కొనసాగుతున్న వైసీపీ సోషల్ మీడియా ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు దేశ, విదేశాల నుంచి ఏపీకి తరలివచ్చి ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  వైసీపీ సోషల్ మీడియా కార్యాలయం తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయంపైనే ఉంది. కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగేవి. వందల మంది ఈ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తూ వచ్చారు. వీళ్ల పనల్లా ప్రతిపక్ష పార్టీల నేతలపై విష ప్రచారం చేయడం, వారి ఇళ్లలో మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించడం. దీనికి తోడు ప్రభుత్వం తప్పులను ఒప్పులుగా సోషల్ మీడియా ప్లాంట్ ఫాంల ద్వారా ప్రజల మెదడుల్లోకి చొప్పించడం. ఇలా వైసీపీ కార్యకర్తలను ఓ విధంగా సైకోలుగా మార్చిన ఘనత కూడా భార్గవ్ కు దక్కుతుంది. జగన్ ప్రభుత్వం, వైసీపీ సోషల్ మీడియా అరాచకాలకు విసిరిగిపోయిన ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ సరళినిచూసి ముందుగానే వైసీపీ నేతలు ఓటమిని అంగీకరించారు. తాడేపల్లి కార్యాలయంలోని జగన్ వద్దకు కూడా భారీ ఓటమిని చవిచూడబోతున్నామని సర్వేల ఫలితాలు వెళ్లడంతో.. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఉన్నట్లుండి 130 మందికిపైగా ఉద్యోగులను తొలగించేశారు. ఈ నెలాఖరు వరకు పనిచేసి జీతం తీసుకెళ్తామని చెప్పినా.. నెల మధ్యలోనే కార్యాలయం మూసేసి ఇంటికి పొమన్నారు. ఇక్కడే మూడు నాలుగేళ్లుగా పనిచేస్తూవచ్చిన ఉద్యోగులను సైతం ఉన్నట్లుండి వెళ్లిపోమనడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయిన సమయంలో వారికి ల్యాప్ టాప్ తోపాటు ఫోన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ల్యాప్ టాప్, ఫోన్ ఇవ్వాలని ఉద్యోగులకు భార్గవ్ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. రెండేళ్లు వాడుకున్న పాత ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఏం చేసుకుంటారు? సెకెండ్ హ్యాండ్ మార్కెట్ అమ్ముకుంటారా? అంటూ స్జజల, ఆయన తనయుడు సజ్జల భార్గవ్ పై ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సరళినిచూసి ఓటమి భయంతో వణికిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ఉద్యోగులనుసైతం తీసివేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని స్పష్టం కావడంతోనే ఉద్యోగులను తొలగించి ఉంటారని చర్చించుకుంటున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా రెచ్చగొట్టడంతో ఇన్నాళ్లూ రెచ్చిపోయిన కార్యకర్తలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో భయంతో వణికి పోతు న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జగన్, సజ్జల, భార్గవ్ వంటి వారు ఎలాగోలా సేఫ్ ప్లేస్ కు వెళ్లిపోతారు.. ఇన్నాళ్లు వాళ్లనుచూసి రెచ్చి పోయిన మన పరిస్థితి ఏమిట్రా బాబోయ్ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మొత్తానికి వైసీపీ సోషల్ మీడియా  ఉద్యోగుల పరిస్థితిని చూసి కూటమి పార్టీల నేతలూ, కార్యకర్తలూ నవ్వుకుంటున్నారు. 

హాస్పిటల్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్: గన్‌మన్‌కి పరామర్శ!

వైసీపీ దుర్మార్గపు మూకల హత్యాప్రయత్నం నుంచి గాయాలతో తప్పించుకున్న చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రజల ఆశీస్సులతో కోలుకున్నారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి పులివర్తి నాని  డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే పులివర్తి నాని చంద్రగిరిలో ఉన్న తన గన్‌మాన్ ధరణి ఇంటికి చేరుకున్నారు. ధరణి ఆరోగ్య పరిస్థితిని పులివర్తి నాని అడిగి తెలుసుకున్నారు. గన్‌మన్ ధరణి కుటుంబ సభ్యులకు పులివర్తి నాని చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ రాక్షస మూకలు చేసిన హత్యా ప్రయత్నం సందర్భంగా  గన్‌మన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని చెప్పారు. గన్ మన్, సెక్యూరిటీ  వాళ్లు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయమని చెప్పారు.  ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని పులివర్తి నాని అన్నారు.  టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్దతులు కావని అంటూ, చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పులివెందులలో జగన్ గెలిచేది డౌటే?!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చాప చుట్టేసినట్టు అందరికీ అర్థమైపోయింది. వైసీపీ శ్రేణులు కూడా ఈ చేదు వాస్తవాన్ని అర్థం చేసుకుని ముఖాలు వాడిపోయి కనిపిస్తున్నారు. జగన్‌కి అధికార ప్రతినిధి లాంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ‘‘రాజకీయాలు అన్న తర్వాత గెలుపు, ఓటములు సహజం. అందువల్ల వైసీపీ కార్యకర్తలు బెట్టింగ్‌లు పెట్టి డబ్బు వేస్టు చేసుకోవద్దు’’ అని సాక్షి టీవీ సాక్షిగా పిలుపు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి లబోదిబోమంటున్నారంటే కూడా మేటర్ క్లారిటీగా వున్నట్టు లెక్క.ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు దాడులు, హింసా కార్యక్రమాలు మానుకుని బుద్ధిగా వుంటే మంచిది. అసలు విషయం చెప్తే వైసీపీ క్యాడర్‌కి నిద్ర కూడా పట్టదు.. అదేంటంటే.. పులివెందులలో జగన్ గెలవటం కష్టమే... జగన్ ఓడిపోవడమా... అసంభవం అని అనుకుంటున్న వాళ్ళు భ్రమలు వదిలి వాస్తవంలోకి వస్తే మంచింది. ఇందిరా గాంధీని, ఎన్టీఆర్‌ని, నిన్నగాక మొన్న కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఓడించిన ఓటర్లు మనవాళ్ళు. వాళ్ళందరికంటే జగన్ తోపూ తురుంఖానూ ఏమీ కాదు. జగన్ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ఇంకా ఈ విషయంలో ఏవైనా సందేహాలు వున్నవాళ్ళు పులివెందుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చూస్తే క్లారిటీ వస్తుంది. పులివెందుల టీడీపీ కార్యాలయం కార్యకర్తల సందడితో కళకళలాడిపోతోంది. అందరూ జగన్ మీద పోటీ చేసిన బీటెక్ రవికి ముందస్తు అభినందనలు చెబుతున్నారు. వచ్చేపోయే కార్యకర్తలతో టీడీపీ ఆఫీసు తిరణాలని తలపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు, బీటెక్ రవి ముఖాల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే, ‘వైనాట్ 175’ లాగా ‘వైనాట్ జగన్’ అనాలని అనిపించడం ఖాయం. 

పాలకొల్లు.. నిమ్మల గెలుపు పక్కా.. కేబినెట్ బెర్త్ గ్యారంటీ!

రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు. నిమ్మల పాలకొల్లు నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఇప్పుడు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడాల శ్రీహరిరావు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఎలాగూ ఓటమి ఖాయం అన్న భావనతో డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదని వైసీసీ శ్రేణులే చెబుతున్నాయి. వాస్తవానికి గూడాల శ్రీహరిరావు అక్వా వ్యాపారంలో బాగానే సంపాదించారు. అయినా కూడా ఎటూ ఓటమి తప్పదు కనుక ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదు. దీంతో పాలకొల్లులో వైసీపీ పోటీ నామ్ కే వాస్తే చందంగానే ఉందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు.  నిజానికి పాలకొల్లులో నిమ్మల రామానాయుడికి ప్రజాభిమానం మెండుగా ఉంది. ప్రజలలో మమేకమై వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే నిమ్మల రామానాయుడు జగన్ హవా నడిచిన 2014 ఎన్నికలలో 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో 2019 త్రిముఖ పోటీ ఉంది. అప్పటి ఎన్నికలలో నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి 33 వేల ఓట్లు వచ్చాయి. జగన్ హవా నడిచి, జనసేన పోటీలో ఉన్న ఆ ఎన్నికలలోనే నిమ్మల 18 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు తోడు తెలుగుదేశం కూటమిలో జనసేన కూడా భాగస్వామ్య పార్టీ కావడంతో ఈ సారి నిమ్మల మెజారిటీ భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. హ్యాట్రిక్ గెలుపుతో నిమ్మల ఈసారి చంద్రబాబు కేబినెట్ లో బెర్త సంపాదించడం కూడా ఖాయమని తెలుగుదేశం వర్గీయులు విశ్వాసం వ్యక్తం చే స్తున్నారు.  

దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం ఇదే: ముఖేష్ కుమార్ మీనా 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం..  ప్ర‌స్తుతం జ‌రిగి ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతం గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే అత్య‌ధిక‌మ‌ని అన్నారు. ఉమ్మ‌డి ఏపీ, విడిపోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఈ స్థాయి పోలింగ్ శాంతం న‌మోదుకాలేద‌ని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందనీ, ఇందులో ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ న‌మోదుకాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పోలింగ్ శాతంలో అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 శాతం పోలింగ్ న‌మోదైంది. విశాఖప‌ట్నంలో అత్య‌ల్పంగా 68.63 శాతం పోలింగ్ న‌మోదైంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధికంగా దర్శిలో 90.91 శాతం ఓటింగ్ న‌మోదైంది. అత్యల్పంగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 63.32 శాతం న‌మోదైంద‌ని ముఖేష్ కుమార్ తెలిపారు.ఉద‌యం, సాయంత్ర వేళ‌లో పోటెత్తిన ఓట‌ర్లు.. త‌మ ఓటు హ‌క్కును వినియోగించ‌డానికి ఉద‌యం, సాయంత్రం స‌మ‌యంలో ఓట‌ర్లు భారీగా కేంద్రాల‌కు త‌ర‌లివ‌చ్చారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కాస్త నెమ్మ‌దించింది. పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఓటింగ్ కేంద్రాల్లో క్యూలో ఉండ‌టంతో  మొత్తం 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటల వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింద‌ని తెలిపారు. ఓటింగ్ పూర్త‌యిన త‌ర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ ల‌కు తీసుకురావ‌డానికి కాస్త స‌మ‌యం ఆల‌స్యం అయిందన్నారు. దీనికి టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్,  పోలింగ్ ఆల‌స్యం కావ‌డం, వాతావ‌ర‌ణ ప్ర‌భావం, ప‌లు అనుకోని సంఘ‌ట‌న‌లు కార‌ణాలుగా ఉన్నాయ‌ని తెలిపారు.  దేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతం.. ఏపీ ఎన్నిక‌ల్లో న‌మోదైన ఓటింగ్ శాతం దేశంలోనే అత్య‌ధిక‌మ‌నీ, ఇది కొత్త రికార్డు అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం ఓటు హ‌క్కు ఉప‌యోగించుకున్న మొత్తం ఎలక్ట‌ర్స్  4,13,33,702 గా ఉన్నారు. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4,560 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్ లో పోస్టల్ బ్యాలట్ 4,44,216, హోం ఓటింగ్ 53,573 కాగా మొత్తం 4,97,789 (1.2 శాతం) గా నమోదైంది. మొత్తం ఓటర్లలో 1,64,30,359 మంది పురుషులు, 1,69,08,684 మంది మహిళా ఓటర్లు, 1517 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. గతంలో కంటే అధికంగా పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. ప్రస్తుత నాలుగు ఫేజ్ లలో దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో పోలింగ్ నమోదుకాలేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపాడు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచినట్టు వెల్లడించారు.

ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు!

జూన్ 4న 'ముద్రగడ పద్మనాభరెడ్డి' నామకరణ మహోత్సవానికి భారీగానే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ముద్ర‌గ‌డ నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం అంటూ.. ఒక ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.  పిఠాపురంలో పవన్ ను కచ్చితంగా ఓడిస్తానంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళను తాను పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని.. తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి పవన్ పై గెలిచి తీరుతానని కూడా సవాల్ చేసిన సందర్భం ఉంది.    పోలింగ్ స‌ర‌ళి చూస్తే, పవన్ గెలుపు పక్కా అని తేలడంతో జనసైనికులు ముద్రగడ సవాళ్లను తెరపైకి తీసుకొచ్చారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవాలని,  వినూత్న రీతిలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ట్రోలింగ్స్ మొదలు పెట్టారు.  'ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ నమస్కారం.. ముద్రగడ నామకరణ మహోత్సవానికి రావాలని కాపు సోదర సోదరీమణులందరినీ ఆహ్వానిస్తున్నాం. జూన్ 4వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.  పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు.  ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు వేశారు. వాస్తవానికి ఒకానొక దశలో ముద్రగడ జనసేనలోకి వస్తారని ప్రచారం జరిగింది.  అయితే వైసీపీలోకి వెళ్లిన ఆయన.. పవన్ పై నిత్య విమర్శకుడిగా మారిపోయారు. వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ సైతం చేశారు. ఈ క్రమంలో జనసేన నేతలకు ముద్రగడ టార్గెట్ అయ్యారు. అటు సొంత కుటుంబ సభ్యులు సైతం ముద్రగడ వైఖరిని వ్యతిరేకించారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వైైసీపీ స్వరం మారింది.. ధీమా పోయింది!

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు, ఎన్నికల ఉల్లంఘనలను చూసీ చూడనట్ల వదిలేసిన ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.  పోలింగ్ జరిగిన సోమవారం (మే 13) సాయంత్రం కూడా ప్రభుత్వ సలహాదారు, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గంభీరంగానే మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని ధీమాగా చెప్పారు. వెల్లువెత్తిన ఓటరు చైతన్యం జగన్ సంక్షేమ పాలనకు అనుకూలంగానే ఉందని చెప్పుకున్నారు. సాక్షాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ సైతం తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేసిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాలకు కృతజ్ణతలు చెప్పారు. కానీ మంగళవారం (మే14) ఉదయానికల్లా వీళ్ల స్వరం మారిపోయింది. ధీమా మాయమైపోయింది. బేలతనం బయటపడిపోయింది. తమ కోసం ఐదేళ్లు ఉద్యోగ ధర్మాన్ని కూడా విస్మరించి సేవలు చేసిన పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారనీ, తమ కాళ్లూ చేతులూ కట్టేశారంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు. ఇలా ఆరోపణలు గుప్పించి, తమ ఓటమికి సాకు వెతుక్కోవడంలో వైసీపీ నాయకులు, అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీలు పడ్డారు.  తెలుగుదేశం పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ ప్రతినిథులుగా తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం లెక్క చేయలేదనీ, పట్టించుకోలేదనీ విమర్శలు గుప్పించారు. మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ అభ్యర్థులు ఇలా వీళ్లూ వాళ్లూ అని లేదు వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల సంఘం, పోలీసులు, అధికారులపై విమర్శల పర్వానికి దిగి పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించేశారు. అలా పరోక్షంగా ఓటమిని అంగీకరించిన ప్రముఖుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, నరసరావు పేట లోక్ సభ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్, గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ఉన్నారు. తెలుగుదేశం శ్రేణులు తమపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు తప్ప నియంత్రించడానికి, ఆపడానికీ వీసమెత్తు ప్రయత్నం చేయలేదని వీరు ఆరోపించారు.  ఇక అనీల్ కుమార్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పోలీసులను, ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మేనేజ్ చేశారని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు.   ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ తరఫున పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా  వారీ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే గ్రామాలలో వైసీపీ మూకలు తెలుగుదేశం శ్రేణులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలలలో గెలుపు ధీమా పోయి, ఉక్రోషంతో  ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తిరుపతిలో చిరుత కలకలం 

తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలంరేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తుల కారులో ఘాట్ రోడ్డులో వెళుతుండగా.. చిరుత అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతులు కనిపించాయి.. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు. తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.    

జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ

జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాj ుణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారికి 2ం2 గన్‌ మెన్‌లను నియమించారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాయణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు.

చంద్రబాబు రేపు మహరాష్ట్ర పర్యటన.. కొల్హాపూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.  రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడి శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.  ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.

పెద్దారెడ్డి ఇంటి మీద టీడీపీ జెండా!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో స్వతంత్ర పోరాటాన్ని తలపిస్తున్నాయి. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో బ్రిటీష్ వాళ్ళ భవంతుల మీద మన పతాకాన్ని ఎగరేయడానికి స్వతంత్ర  సమరయోధులు ఎంత రిస్క్ అయినా చేసేవారు. అదే తరహాలో ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు. ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో నిలిచారు. తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా పెద్దారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పలువురు టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించారు. టీడీపీ నాయకుడు మునిరెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి వెళ్ళి రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో పో్లీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యేలా పరిస్థితి తయారయింది. ఈ నేపథంలో జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. దాంతో భయపడిపోయిన పెద్దారెడ్డి ఇంటి నుంచి పరారయ్యారు. జేసీ  దివాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరబోతోందనేదానికి దీన్ని సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు.

కుప్పంలో 85.87%, పులివెందులలో 81.3% పోలింగ్.. భారీ పోలింగ్ చెబుతున్నదేంటంటే..?

ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది.  రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు.  రాష్ట్ర వ్యాప్తంగా 82 శాతానికి పైగానే పోలింగ్ జరిగినట్లు అంచనా.   అయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైన, కీలక నేతలు పోటీలో ఉన్న  ఆరు నియోజకవర్గాలలో మరింత ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది.  ఆ నియోజకవర్గాలు ఏమిటంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పం. కుప్పంలో 85.87 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే వైసీపీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 81.34 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో  85. 74శాతం, జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన పిఠాపురంలో 86.63 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో 77.82, కాంగ్రెస్ ఏపీ అధినేత్రి షర్మిల పోటీ చేసిన కడప లోక్ సభ నియోజకవర్గంలో 78.73 శాతం పోలింగ్ నమోదైంది.  ఎగ్జిట్ పోల్స్ పై ఈ నెల 1వ తేదీ సాయంత్రం వరకూ నిషేధం అమలులో ఉన్నా భారీగా పోలైన ఓట్లు, ఓటరు చైతన్యం, ఓటేసి తీరాలన్న  పట్టుదల గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయ పరిశీలకులు కూడా భారీ పోలింగ్ ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తున్నదని చెబుతున్నారు. పరిస్థితులు ఇంత స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తున్నా వైసీపీ నేతలు మాత్రం విజయంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ 

వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి.. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశమే దీనికి కారణం. మూడు గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఈ సమ్మర్ లో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ ల కారణంగా జనం థియేటర్ల వంక చూడడంలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు నష్టాలు తప్పట్లేదు. తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని థియేటర్ యజమానులు చెబుతున్నారు.  ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి నష్టాలేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్పారు. ఒక్కో షోకు పది, పదిహేను మంది మాత్రమే వస్తున్నారని, టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంట్ బిల్లుకే సరిపోవడంలేదని వాపోతున్నారు. పదిమంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ థియేటర్లను పది రోజుల పాటు బంద్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చిన్న సినిమాల నిర్మాతలకు భారంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలో పలు చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ నేపథ్యంలో ఆ సినిమాలు విడుదలవుతాయా? లేక వాయిదా పడతాయా అనేది చూడాలి

పిఠాపురం హీరో ఎస్వీఎస్ఎన్ వర్మ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హాట్ సీట్ గా అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం మాత్రమేనని చెప్పవచ్చు. అటువంటి పిఠాపురంలో పోలింగ్ ముగిసిన తరువాత కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశా నిస్ఫృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ సాధించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ జరుగుతుండగానే వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపించింది. వైసీపీ అభ్యర్థి వంగా గీత పోలింగ్ బూత్ ల సందర్శన సందర్భంగా ఓటర్లతో పంచాయతీ పెట్టుకోవడం, అసహనం వ్యక్తం చేయడం ద్వారా పరిస్థితి తనకు, తన పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదన్న సంకేతాలు ఇచ్చారు. సరే ఇప్పుడిక పోలింగ్ ముగిసిపోయింది. ఫలితం కూడా దాదాపు అందరికీ తెలిసిపోయింది. మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆసక్తి వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములపై కాకుండా మెజారిటీపైనే నియోజకవర్గంలో బెట్టింగులు జరుగుతున్నాయి.  దీంతో జనసైనికులు ఇప్పుడు పిఠాపురంలో కొత్త హీరో అవతరించారంటూ ఆయనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.  పవన్ కల్యాణ్ లాంటి హీరోను మించి కొత్త హీరో ఎవరంటూ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే జనసైనికులుస్వయంగా తమ అధినేతను మించి ఆ కొత్త హీరోనే ప్రశంసలతో ముంచె త్తుతున్నారు. ఆ కొత్త హీరో ఎవరంటే స్థానిక  తెలుగుదేశం నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఔను కూటమి శ్రేణులంతా ఆయననే హీరోగా అభివర్ణిస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే తెలుగుదేశంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి పార్టీని పటిష్టం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పిఠాపురం సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఎస్పీఎస్ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఎస్పీఎస్ఎన్ వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడారో.. ఆ క్షణం నుంచీ నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిఠాపురంలో జనసేనానిని గెలిపించే బాధ్యతను వర్మ భుజానికి ఎత్తుకున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని విజయం ఖాయమనీ, అందుకు పూర్తి బాధ్యత తనదేననీ వర్మ చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కూ హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను చంద్రబాబు శిష్యుడినననీ, ఆయన మాటే తనకు శిరోధార్యమనీ ప్రకటించారు. తెలుగుదేశం క్యాడర్లో అసంతృప్తిని మటుమాయం చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి అందరినీ ఎకతాటిపైకి తీసుకువచ్చారు.   పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను దీటుగా తిప్పికొట్టడంలో వర్మ ప్రధాన పాత్ర పోషించారు.  వర్మ పవన్ కల్యాణ్ ఉద్రేకంతో, ఉద్వేగంతో పొరపాట్లు చేయకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినీ హీరో పక్కన ఉన్నారన్న మొహమాటం లేకుండా సూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినపుడు కళ్లతోనే వారించారు. అందుకు సంబంధించిన వీడియో ను జనసైనికులే ఇప్పుడు వైరల్ చేస్తూ వర్మకు కృతజ్ణతలు చెబుతున్నారు.  పిఠాపురంలో నిజమైన హీరో వర్మే అంటూ ప్రస్తుతిస్తున్నారు.  

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్ 

ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటలవరకూ పోలింగ్ కొనసాగింది. సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీవ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.1.2శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చెప్పారు. రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో  81 శాతం పోలింగ్‌ నమోదైనట్లు  తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే సాయంత్రం ఐదుగంటల వరకూ.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17 శాతం పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 73.53 శాతం, బాపట్ల జిల్లాలో 72.14 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85 శాతం, నంద్యాలలో 71.43 శాతం, ప్రకాశం 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.