telangana cm revanthreddy pledge will stop bjp

కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ!

కాంగ్రెస్ అధిష్ఠానం మనసు గెలిచేశారా? కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ నుంచి శంఖారావం పూరించింది. అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశంలో న్యాయ్ ఫథ్ పేరిట ఆమోదించిన తీర్మానం  పై జరిగిన చర్చలో  మోదీని ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా నేతల ప్రసంగాలు సాగాయి.  ఎఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది  కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు బీజేపీ విధానాలు, మోదీ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగించారు. ప్రధానంగా బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం లక్ష్యంగానే చిన్న,పెద్ద నేతలంతా ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, మల్లిఖార్జున ఖర్గే సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పునర్జీవనం పొందుతుందనే విశ్వాసం వ్యక్త పరిచారు. అలాగే  ఈసారి ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని లోక్ సభ సాక్షిగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్య నేతలు, రాహుల్ గొంతుతో గొంతుతో కలిపి  గుజరాత్ నుంచి జైత్ర యాత్ర మొదలవుతుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు.  నిజానికి ఖర్గే మొదలు కీలక నేతలు చేసిన ప్రసంగాలలో కొత్తదనం పెద్దగా కనిపించ లేదు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి మాత్రం  కొంత భిన్నంగా, కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటానికి సైద్ధాంతిక వారసత్వాలను జోడింఛి ఉద్రేక పూర్వక  ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటాన్ని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు జరుగతున్న పోరాటంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే  రేవంత్ రెడ్డి బీజేపీ సంఘ్ పరివార్  పై చేసిన ఘాటు విమర్శలలో మరో రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  బహుశా,పూర్వాశ్రయంలో ఆయనకున్న కాషాయ బంధాలకు సంబంధించి వినవస్తున్న ఆరోప ణలు,అనుమానాల నివృత్తి కోసం  రేవంత్ రెడ్డి  ఎఐసీసీ వేదిక నుంచి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే,  బీజేపీ,ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని అంతం చేయ డమే తమ లక్ష్యమని, మరో అడుగు ముందుకేసి  దేశాన్ని దుర్మార్గంగా పాలించిన ఆంగ్లేయుల కంటే గాంధీని చంపిన గాడ్సే వారసులైన బీజేపీ నాయకులతోనే ఈ దేశానికి మరింత ప్రమాదం పొంచి ఉందని  ఘాటైన విమర్శలు చేశారని అంటున్నారు. అలాగే   అహ్మదాబాద్ స్పూర్తితో  తెలంగాణలో బీజేపీని  కాలు పెట్టనీయనని, ఖతం చేస్తామని శపధం చేయడం  కూడా శీల పరీక్షలో భాగంగానే పేర్కొంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం  తెలంగాణలో  రైతు రుణ మాఫీ చేశామనీ, రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీచేసి, లక్షలాది రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. అలాగే  కుల గణన ప్రస్తావన చేశారు. ఇందుకు అనుగుణంగా  రిజర్వేషన్ల పెంపును అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద ధర్నా చేశామని చెప్పారు.  నిజానికి, ఇతరుల ప్రసంగాలతో పోలిస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగం, కొంత భిన్నంగా ఉండడమే కాకుండా, లక్ష్య నిర్దేశంతో, టార్గెటెడ్ గా సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఆయన లక్ష్యం కూడా కొంత నెరవేరినట్లేనని అంటున్నారు. గత కాలంగా   రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, మరీ ముఖ్యంగా  కారాణాలు ఏవైనా, కారణం ఎవరైనా, రాహుల్ గాంధీలోనూ అలాంటి అనుమాన బీజాలు నాటుకున్నాయని, అలాంటి అనుమానాలే ఉన్నాయనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో  రేవంత్ రెడ్డి ఏఐసీసీ వేదికను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ సమక్షంలో  బీజేపీ, ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని వ్యతిరేకించడంలో  తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తునారు. అంతే కాకుండా ఈ ప్రయత్నంలో ఆయన కొంత వరకు సక్సెస్  అయ్యారని కూడా పరిశీలకు భావిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం  కుల గణన విజయవంతంగా చేయడంతో పాటుగా  కులగణన ఆధారంగా బీసీల  రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని రాహుల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.అంతేకాకుండా, అంతటితో ఆగకుండా  ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రయత్నాలను  ప్రశంసించారు. సో,  ఆమేరకు రేవంత్ రెడ్డి ప్రసంగం ఫలితం ఇచ్చిందనే అనుకోవచ్చును, అంటున్నారు.

ontimitta kodanda rama swamy kalyanam

ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఒంటిమిట్ట  కోదండ రాముడి కల్యాణోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా పుష్పాలంకరణకు 12 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. కోదండరాముని కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తారన్న అంచనాలతో భక్తుల రద్దీ తగ్గట్టుగా ఏర్పాటు పూర్తయ్యాయి. భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎక్కడా లోటు రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు.   సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్ తదితర పనులు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు  తిరుమల తిరుపతి దేవస్థానం 70 వేల తిరుమల లడ్డూలను సిద్ధం చేసింది.  

earth quake caution to telangana

తెలంగాణకు భూకంప హెచ్చరిక!?

తెలంగాణకు  భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.  అయితే ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదనీ, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.

reason for trump step back on taxex

ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్‌ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు.  ఏప్రిల్‌ 2న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌ . దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని తోటి రిపబ్లికన్‌ నేతలు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్ లు పదేపదే హెచ్చరించారు కూడా. అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.  ట్రంప్‌ నిర్ణయం వెనక బాండ్‌ మార్కెట్‌ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఆందోళనలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అటు ట్రెజరీ మార్కెట్‌లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారట. ఇదిలాఉండగా టారిఫ్‌లపై విరామం ప్రకటించిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ బాండ్‌ మార్కెట్‌ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాండ్‌ మార్కెట్‌ చాలా గమ్మత్తైనది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. కొంత మంది కోపంగానూ ఉన్నారని ట్రంప్‌ అన్నారు.  కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్ట భయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. చాలా దేశాల్లో ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ బాండ్లను జారీ చేస్తుంటాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది.

police arrest gorantla madhav

పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 

congress win gujarat slogun

పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ  నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య  44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన  షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్  కూడా మిగలలేదు.  అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు  కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప  మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే  1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.  అయితే  ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా  ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా  సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక  వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ  పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన  కారణం  కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు,  కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే  కారణమని కాంగ్రెస్  పార్టీ మరో మారు గుర్తించింది.  ఈ నేపద్యంలో  అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 - 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు  కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు  ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది. ముఖ్యంగా  రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే  దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా  ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే  ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’  తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం  లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.   ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత  తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే  కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా,  గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్  వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే  ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి  ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం...  గుజరాత్  ను గెలవాలి!

renudesai political entry

రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.  పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి

Brs Former MLA Shakeel arrest

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

బీఆర్‌ఎస్ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే  అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  2023లో షకీల్ కొడుకు రహేల్ వేగంగా కారు నడుపుతూ బేగంపేట ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా దుబాయిలో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.

kcr in aig hospital

ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ  పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో  అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.  గతంలో గులాబీ బాస్ ఏఐజీ హాస్పిటాల్‌‌కి వచ్చి హెల్త్ చెకప్ చేయించకున్నారు. సాధారణ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రజత్సోవాలను అధినేత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో  పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం నింపిటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌పార్టీ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే  తొలి పార్టీ ఆవిర్బ సభ కావడంతో దీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సభలో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కి సీట్లు రాకపోవడంతో క్యాడేర్ నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సహం నింపాటానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు.

another complaint on rgv in rajamahendravaram

ఆర్జీవీపై రాజమహేంద్రవరంలో మరో ఫిర్యాదు

వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీరిరువూ సామాజిక మాధ్యమంలో హిందువులను కించపరిచేలా పోస్టులు పెట్టారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా జతపరిచారు.  వీరిరువురూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు    సామాజిక భద్రతకు, జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని మెడీ శ్రీనివాస్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ  వ్యాఖ్యలలో హిందూ దేవుళ్ల పట్ల అమర్యాద కరంగా ఉన్నాయనీ, పవిత్ర గ్రంథాలైన మహాభారతం, రామాయణాలను అపహాస్యం చేసేవిగా ఉన్నాయనీ మేడీ శ్రీనివాస్ పేర్కొన్నారు.  

Maoists are angry over the Karreguttas

కర్రెగుట్టలపై రెచ్చిపోయిన మావోయిస్టులు.. జవాను పరిస్థితి విషమం

చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న జవానును జిల్లా  ఆస్పత్రికి తరలించారు.  వచ్చే మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశం చేస్తామని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. చిన్న కె డి పాల్ వాగు దాటుతున్న జవాన్ల ను చూసిన మావోయిస్టులు బెదిరిపోయి ప్రెషర్ బాంబు పేల్చారు. . కర్రెగుట్టలపై రావొద్దని ఇప్పటికే మావోయిస్టులు బెదిరింపు లేఖ  విడుదల చేశారు.  కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉంది. కొంత భాగం తెలంగాణ ములుగు జిల్లాలో ఉంది. కర్రెగుట్ట మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన వెంటనే పోలీసులు   ఇక్కడ జల్లెడ పడుతున్నారు.   కర్రెగుట్టల్లో మాటు వేసిన మావోయిస్టుల ను మట్టు పెట్టడం అంటే పోలీసులు తమ ప్రాణాలను  రిస్క్ లో పెట్టినట్టే. ఓ వైపు మావోయిస్టులు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే  జవాన్లపై ప్రెషర్ బాంబు పేల్చడం చర్చనీయాంశమైంది.   జవానుపై దాడి తర్వాత కర్రెగుట్ట ల్లో  మరో ఎన్ కౌంటర్ జరిగే అవకాశం ఉంది. సుమారు 100 కిలో మీటర్ల దూరం వరకు కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.  ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. కాగా గురువారం జరిగిన ఘటనలో మావోయిస్టులు  పోలీసులపై  పై చేయిగా నిలిచారు. 

criclet in olympicd

ఒలింపిక్స్ లో క్రికెట్!

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు  128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు. అయితే ఆ తరువాత నుంచి ఒలింపిక్స్ కు క్రికెట్ దూరమైంది. ఇప్పుడు మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్స్ క్రీడల జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకున్నది. ఒలింపిక్స్ అసోసియేషన్. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్ట్, వన్డే ఫార్మట్లలో కాకుండా టీ20 ఫార్మట్ లో క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చాలని నిర్ణయించారు. పురుషులు, మహిళల జట్లకు అవకాశం ఇచ్చారు.  అత్యంత జనాదరణ ఉన్న క్రికెట్ కు ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం కచ్చితంగా క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరిక ఒలింపిక్స్ కు మరింత ఆదరణ పెరగడానికి దోహదం చేస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.

Mumbai blast killer has arrived

ముంబై బ్లాస్ట్ హంతకుడొచ్చాడు 

2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరాడు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాణాను  ముందుగా ఎన్ ఐ ఏ అధికారులకు అప్పగించనున్నారు. అక్కడనుంచి రాణాను తీహార్ జైలుకు అప్పగించనున్నారు.  భారత్ లో జరిగిన ఉగ్రదాడుల్లో 26 నవంబర్ 2008 ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. నిన్న రాత్రి ఏడుగంటల పదినిమిషాలకు  ప్రత్యేక విమానంలో  అమెరికా నుంచి రాణా బయలు దేరాడు. 17 ఏళ్ల తర్వాత   భారత అధికారులు తీసుకొస్తున్నారు.  తహవూర్ రాణా ను ఎన్ఐఎన్ అధికారులు కస్టడీలో తీసుకునే  అవకాశం ఉంది. ఎన్ ఐ ఏ కార్యాలయంలో ఆయన్ని ప్రశ్నించనున్నారు.  తొలుత ముంబై పటియాల కోర్టు జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. భధ్రతా సమస్యల దృష్ట్యా ఆయన్ని ఆన్ లైన్ లో అప్పగించనున్నారు. లష్కర్ ఎ తోయిబా  ఉగ్ర సంస్థకు చెందిన రాణా రాక సందర్బంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ట్రావెల్ సంస్థను నిర్వహించే రాణా అమెరికన్ ఉగ్రవాది హెడ్లీతో పరిచయమైంది . ఈ పరిచయంతోనే హెడ్లీ ముంబై వచ్చి రెక్కీ నిర్వహించాడు. రాణా  వస్తున్న సందర్బంగా తీహార్  జైల్లో భధ్రతను పెంచారు. ముంబై బ్లాస్ట్ లో  రాణా 160 మందిని  పొట్టన బెట్టుకున్నాడు. ఈ  మారణ హోమంలో  పాల్గొన్న మరో టెర్రరిస్ట్ కసబ్ కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది.  కసబ్ తరహా రాణాకు ఉరిశిక్ష అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.

look out notices issued on former minister kakani

మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  అలాగే ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ విచారణకు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ఎటువంటి షీల్డ్ ఇవ్వలేమని స్పష్టం చేసింద. ఈ నేపథ్యంలో కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని అంటున్నారు.   అక్రమ మైనింగ్ కేసులో   పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి  ఇప్పుడు  అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లడమే మార్గం. ఈ నేపథ్యంలోనే పోలీసలుు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ఏ4గా ఉన్న మాజీ మంత్రి కాకాణి  వరుసగా మూడు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే  కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.  హైదరాబాద్‌, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు సమాచారం ఇచ్చారు. ఆయన కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

no official residence for delhi cm

ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు  చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి.  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ  అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’  హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు  డబల్ బెడ్  రూమ్ హామీ ఇస్తారు.  అయితే  ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక  పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ  భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం  ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు.  పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్‌ బాగ్‌లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  షాలిమార్ భాగ్  నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే  పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు  మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.   ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న  ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి  ప్రస్తుత వాసంలో  వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు,  వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా  ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు.  నిజానికి  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం  షీష్ మహల్  కట్టించారు. అయితే, షీష్ మహల్   నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున  దుర్వినియోం చేసిందని  అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో  తెలియదు కానీ  మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్  (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.  సో.. అన్నిఅరోపణలు చేసి  అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి  ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే  పరువు అసలు దక్కదని  బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి  ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి  కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు.  అదలా  ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్‌ లైన్స్‌ లేదా లుటియెన్స్‌ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్‌ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత  మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.

చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు

ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్  ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు   మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్ధితిలో ఉన్నారు. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిలు మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  ఇప్పటికే  పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు  నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 11) విచారణకు హాజరు కావాల్సిందిగా  ఆ నోటీసులలో పేర్కొన్నారు.  జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.  

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా మాజీ సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే  వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది.  

తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం   ఉత్తర దిశగా కదులుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ అల్పపీడన ప్రభావం తమళనాడు వరకూ ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 10) నుంచి వాతావరణం 12వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వర్షాలకు తోడు తీవ్రమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో అయితే తెలంగాణలో క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో గురువారం (ఏప్రిల్ 10) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌, పాలమూరు, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.