abuses occupy prime place in social media

నబూతో.. నభవిష్యతి

నాడు శ్రీరెడ్డి, బోరుగ‌డ్డ అనిల్ నుంచి నేడు ద‌గాప‌డ్డ కిర‌ణ్ చేబ్రోలు వ‌ర‌కూ మ‌ధ్య అలేఖ్య చిట్టీ వంటి ఆడ‌పిల్ల‌లు సైతం బూతు భాషనే ఆశ్రయిస్తున్నారెందుకు?  బూతు ఇంత‌టి ప్ర‌ధాన పాత్ర పోషిచడానికి కార‌ణం ఏంటి? సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చాక‌.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయ‌లేని, ప‌ల‌క‌లేని ఎన్నో ప‌దాలు.. ఇక్క‌డ య‌ధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అంద‌రూ ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్ విష‌యంలో ఇంత పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతున్నారు. కానీ, గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్ర‌బాబు విష‌యంలో తీవ్ర స్థాయిలో వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసిన వారే.  ఆనాడు బాబు ఇది గౌర‌వ స‌భ కాదు- కౌర‌వ స‌భగా మారింద‌నీ. తాను తిరిగి ముఖ్య‌మంత్రిగా వ‌చ్చి ఈ స‌భ ద్వారా తిరిగి సంస్క‌ర‌ణ‌కు పాల్ప‌డ‌తాన‌ని అన్నారు. అన‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇవాళ భార‌తీరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన త‌మ సొంత కార్య‌క‌ర్త కిర‌ణ్ చేబ్రోలు విష‌యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ కిర‌ణ్ చేబ్రోలుపై మొత్తం ఐదు కేసులుండ‌గా, వాటిలో మాజీ మంత్రి విడుద‌ల ర‌జ‌నిపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి. దీంతో వీట‌న్నిటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న గుంటూరు పోలీసులు, అత‌డి సెల్ ఫోన్ సిగ్న‌ళ్ల ద్వారా ఇబ్ర‌హీం ప‌ట్నం ద‌గ్గ‌ర అదుపులోకి తీసుకుని.. మంగ‌ళ‌గిరి పీఎస్ కి త‌ర‌లించారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే.. సీఎం ఆదేశాల‌తో పోలీసులే మొద‌ట సుమోటోగా   స్వీక‌రించ‌డం. ఆ త‌ర్వాత అత‌డిపై వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు కేసులు పెట్ట‌డం, రిమాండ్ కి త‌ర‌లించేలా ఏర్పాట్లు చేయ‌డం. ఇదే గ‌తంలో బోరుగ‌డ్డ అనిల్.. బాబు, లోకేష్, ప‌వ‌న్ వంటి వారిపైనే కాకుండా.. పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.. నాటి సీఎం జ‌గ‌న‌న్ మోహ‌న రెడ్డిగానీ, ఆయ‌న‌ ప్ర‌భుత్వం నుంచి కానీ.. క‌నీస స్పంద‌న లేదు. పైపెచ్చు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయ‌డ‌మే త‌మ‌కు కావ‌ల్సింద‌న్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. లోలోన ఎంత‌గానో సంతోషించార‌ని అంటారు. ఆ మాట‌కొస్తే పోసాని కృష్ణ‌ముర‌ళి.. త‌న విచార‌ణలో చెప్పిన‌దాన్నిబ‌ట్టీ చూస్తే.. సజ్జ‌ల టీమ్ ద్వారా ఆయనకు స్క్రిప్ట్ వ‌చ్చేది. వీరి అనుచిత వ్యాఖ్య‌ల వెన‌క ఎంత‌టి ఫ్యాన్ మార్క్ మాస్ట‌ర్ ప్లాన్ దాగి ఉంద‌ని తేట‌తెల్ల‌మైందని అన‌డానికి ఇంత‌క‌న్నా మించిన సాక్ష్యాలు ఎక్క‌డ దొరుకుతాయ్?  కానీ కూట‌మి ప్ర‌భుత్వం తొలి  నాటి నుంచే మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధుల విష‌యంలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం అనే అంశంలో నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం మాత్ర‌మే కాదు.. ఆ దిశ‌గా ఇప్పటికే ఎంద‌ర్నో ఊచ‌లు లెక్కించేలా చేస్తోంది. ఇది సోష‌ల్ మీడియా ప‌రంగా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిప‌ట్ల త‌మ పంథా అని స్ప‌ష్టంగా తెలియ చేసింది. త‌రత‌మ బేధాలు చూసేది లేదు. వారు ఎవ‌రైనా, ఏ పార్టీ వారైనా స‌రే విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్న సంకేతాల‌ను పంపుతోంది. అయితే ఇక్క‌డే ఒక కొత్త వాద‌న‌. వివేకం సినిమాలోనూ కిర‌ణ్ ఆరోపించిన‌ట్టుగా.. చూపించార‌నీ. భార‌తీరెడ్డికి, అవినాష్ రెడ్డికి వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు ఎస్టాబ్లిష్ చేశార‌నీ.. ఈ చిత్రాన్ని  చూడ‌మంటూ.. బాబు కూడా బ‌హిరంగ ప్ర‌ట‌కన చేశార‌నీ అంటారు కొంద‌రు వైసీపీ వాదులు. అయితే ఇదే వైసీపీ వారు.. హ‌త్య అనే ఒక సినిమా తీసి.. అందులో కొంద‌రి పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేసి.. తద్వారా త‌మ‌దైన అనుకూల విధానంలో వివేకా హ‌త్య‌కు సంబంధించి కొత్త అనుమానాలు రేకెత్తించేలా చేశారు. ఈ చిత్రంలో చూపిన తీరుపై.. సునీల్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకించారు. ఇందులో త‌మ పాత్ర‌ల‌ను కావాల‌నే వ‌క్రీక‌రించార‌నీ.. చాలా మంది పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేశార‌నీ.. సినిమా ద్వారా కూడా రాజ‌కీయాల‌కు తెర‌లేపార‌నీ వైసీపీ వారిపై ఆరోప‌ణ‌లు చేస్తారు సునిల్ యాద‌వ్. ఈ దిశ‌గా ఆయ‌న ఫిర్యాదు చేశారు కూడా. ఒక ద‌శ‌లో హ‌త్య సినిమా వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఈ సినిమా క్లిప్పింగులు షేర్ చేసినా.. కేసులు పెట్టే వ‌ర‌కూ. ఇదే వివేకా హ‌త్య విష‌యంలో.. అవినాష్ కి అన్ని విష‌యాలు తెలుసంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సైతం సంచ‌ల‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్ గా చూస్తే వివేకం సినిమా విష‌యాన్ని ఎత్తి చూపుతున్న వైసీపీ వాళ్లు.. మ‌రి హ‌త్య సినిమా తీయ‌డం వెన‌క  దాగిన ర‌హ‌స్య‌మేంటో చెప్పాలంటారు టీడీపీ వారు. ఏది ఏమైనా ఇన్నాళ్ల పాటు వీడియోలు చేస్తూ వ‌చ్చిన కిర‌ణ్ చేబ్రోలు ఒక్క‌సారిగా అరెస్టులు, కేసులు అంటూ లైమ్ లైట్లోకి వ‌చ్చేశారు. అంటే ఇందుకు కార‌ణం బూతు. ఈ బూతు వెన‌క దాగిన అస‌లు సృష్టిక‌ర్త వైయ‌స్ జ‌గ‌న్. ఆయ‌న‌.. ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఒక పార్టీ అధినేత‌గా.. పోలీసుల ప‌ట్ల గౌర‌వంగా మాట్లాడి ఉంటే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం అనిపించేది  కాదు.  ఒక రాష్ట్రాన్ని పాలించిన వ్య‌క్తి అయి ఉండి కూడా.. పోలీసుల బ‌ట్ట‌లు ఊడ‌దీస్తాన‌నే కామెంట్లు చేయ‌డంతోనే ఒక్క‌సారిగా కాక చెల‌రేగింది. దీనిపై త‌న‌దైన స‌హజ ధోర‌ణిలో బూతు ద‌ట్టించి వ‌దిలారు కిర‌ణ్ చేబ్రోలు. అప్ప‌టికీ కిర‌ణ్ త‌న త‌ప్పు తెలుసుకుని.. క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఒక వీడియో విడుద‌ల చేశారు కూడా. అయిన‌ప్ప‌టికీ వ‌ద‌ల‌ని పోలీసులు అత‌డ్ని అరెస్టు చేశారు. ఇలాంటి బూతు భువ‌నేశ్వ‌రిపై చేసినా, భార‌తీరెడ్డిపై చేసినా  స‌హించేది లేద‌న్న క్లియ‌ర్ క‌ట్ మెసేజ్ పాస్ చేశారు. ఇటీవ‌ల అలేఖ్య చిట్టీ అనే ప‌చ్చ‌ళ్లు అమ్మే అమ్మాయిల ఉదంతంలోనూ బూతు పాత్ర అత్యంత కీల‌కంగా  క‌నిపించింది. మీ ప‌చ్చ‌ళ్లు మ‌రీ ఇంత రేటా? అని ఒక క‌స్ట‌మ‌ర్ అడిగిన‌పుడు.. తాము వాడే వ‌స్తువులు అంత నాణ్య‌మైన‌వ‌ని చెప్ప‌కుండా అలేఖ్య చిట్టీ విపరీత‌మైన బూతును మిళితం చేసిన భాష వాడింది. ఇది ప్ర‌స్తుతం ఆమెను, ఆమె ఇద్ద‌రు సోద‌రీమ‌ణుల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. ఒక ర‌కంగా చెబితే...  ఈ బూతుల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు సామాన్యులు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన బూతు.. సోష‌ల్ మీడియా జ‌మానాలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది. త‌ద్వారా అదొక మాస్ లాంగ్వేజీగా అవ‌త‌రించింది. ఎవ‌రు బూతులు మాట్లాడుతారో వారిని విప‌రీతంగా ఫాలో కావ‌డం యూత్ ఒక ప‌నిగా పెట్టుకుంది.  శ్రీరెడ్డి విష‌యానికి వ‌స్తే.. శ్రీరెడ్డి బేసిగ్గా ఒక‌ వైసీపీ స‌పోర్ట‌ర్. ఆమె భాష ఎంతో విధ్వంస‌క‌రంగా ఉంటుంది. లైవ్ లో అయితే త‌న రేటుతో స‌హా చెప్పేస్తూ.. త‌న ఫాలోయ‌ర్స్ ని ఊరించి వ‌దిలిపెడుతుంది. ఆమె వంట వీడియోలు చేసినా.. అందులోనూ బూతు ప్ర‌ద‌ర్శ‌న‌ చేస్తూ.. హ‌ల్ చ‌ల్ చేస్తుంది.  ఆ మాట‌కొస్తే ఇటీవ‌ల‌ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా బూతుల‌తో త‌న రాజ‌కీయ, సోష‌ల్ మీడియా కోట‌గోడ‌లు నిర్మించుకున్న‌వాడే. బాతాల పోశెట్టి వంటి ఎన్నో బూతు మాట‌ల‌తో సీఎం స్థాయి వ్య‌క్తిపై తీవ్ర ప‌రుష ప‌ద‌జాలం వాడి జ‌నాల్లోకి వెళ్లాడు. వారిని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. ఇవాళ ఇదిగో ఎమ్మెల్సీ గా ఎదిగాడు. అలాగ‌ని త‌న భాష‌ను కంట్రోల్ చేశాడా అంటే అదీ లేదు. తాజాగా రెడ్లు, వెల‌మ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటి వేయ‌బ‌డ్డాడు.  ఒక‌రు సాధార‌ణ పార్ల‌మెంటు భాష‌లో ప్లెయిన్ లాంగ్వీజీలో మాట్లాడితే.. వారి భాష‌నెవ‌రూ స్వీక‌రించ‌డం లేదు. ఆద‌రించ‌డం లేదు. ఎవ‌రైతే రిస్క్ తీస్కుని బూతుల‌తో కూడిన‌ అవాకులు చెవాకులు పేలుతుంటారో వారినే హైలెట్ చేస్తూ వ‌స్తున్నారు ప్రేక్ష‌కులు. వారినే ఫాలో అవుతూ వ‌స్తున్నారు కొంద‌రు. ఇందువ‌ల్లే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతెందుకు ఈనాడును, ఈటీవీని ఎంతో సంస్కార‌వంతంగా న‌డిపిన రామోజిని సైతం ఈ బూతు జ‌బ‌ర్ద‌స్త్ రూపంలో చొర‌బ‌డి బోల్తా కొట్టించింద‌ని అంటారు.  జ‌బ‌ర్ద‌స్త్ లో స్కిట్ల‌లో వాడే భాష మొత్తం దాదాపు బూతు ప‌ద‌జాలంతో కూడుకుని ఉంటుంది. అది హిట్ కావ‌డం, ఏళ్ల‌ త‌ర‌బ‌డి కొన‌సాగుతుండ‌టంతో.. బూతు ఒక మార్కెట్ వ‌స్తువుగా త‌యారైంది. సాధార‌ణ లాంగ్వేజీతో మాట్లాడే ఏ ఇన్ ఫ్లుయెన్ష‌ర్ కి కూడా పెద్ద‌గా ఫాలోయ‌ర్లుండ‌రు. అదే బూతు ప‌ద‌జాలం విస్తృతంగా ఎవ‌రు వాడుతారో.. వారి చుట్టూ ఫాలోయ‌ర్లు మూగిపోతున్నారు. దీంతో బూతు మార్కెట్ స్ట్రాట‌జీలోనే టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది. కిర‌ణ్ చేబ్రోలు మొన్న‌టి వ‌ర‌కూ చేసిన కామెంట్లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలీవు. ఏదో పార్టీ వాయిస్ వినిపిస్తున్నాడ్లే అనుకున్నారు. ఎప్పుడైతే జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పోలీసుల బ‌ట్ట‌లు విప్పారో. దాని ప్రేర‌ణ‌తో కిర‌ణ్ చేబ్రోలు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డారో.. ఆ వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసిపోయారు. ఇవాళ కిర‌ణ్ చేబ్రోలో ఒక పాపుల‌ర్ సెల‌బ్రిటీ హోదా సాధించారు. అది మంచా చెడ్డా చూడ్డం లేదు జ‌నం. పాపుల‌ర్ అయ్యాడా లేదా చూస్తున్నారు.  గ‌తంలో ఇదే వైసీపీకి సంబంధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, నారా భువ‌నేశ్వ‌రిని అన‌రాని మాట‌లు అన‌డం వ‌ల్లే క‌దా?  చంద్ర‌బాబు ఆనాడు స‌భ‌ను వీడింది. క‌న్నీళ్లు పెట్టుకుంది. ఒక్క వంశీయే కాదు.. కొడాలి నాని కూడా చంద్ర‌బాబును, ఆయ‌న కుటుంబాన్ని తీవ్ర ప‌రుష ప‌ద‌జాలంతో దూషించేవారు. వీరికి రోజా, అంబ‌టి, అనిల్ వంటి వారు తాన‌తందాన అనేవారు. వీరు చేసే అనుచిత వ్యాఖ్య‌ల‌ను నాటి వైసీపీ ప్ర‌భుత్వం ఎంత మాత్రం క‌ట్ట‌డి చేసేది కాదు. పైపెచ్చు వారిని మ‌రింత‌గా రెచ్చ‌గొట్టేది. ఇలాంటి  వాటికంటూ స‌జ్జ‌ల పుత్ర‌ర‌త్నం భార్గ‌వ్ చేత ఒక యూనిట్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా.. వీటిని విప‌రీతంగా ప్ర‌చారం చేయించేవారు. ఇదొక ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ గా తీర్చిదిద్దిందే వైసీపీ. దాని సోష‌ల్ మీడియా విభాగం. పైకి టీడీపీ దాని అనుకూల మీడియా ఎంత బ‌లంగా క‌నిపించినా.. వైసీపీ సోష‌ల్ మీడియా, మెయిన్ మీడియా కూడా చూప‌లేని, చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను జ‌నాల్లోకి తీస్కెళ్లి అల‌జ‌డి చెల‌రేగేలా చేసేది. ఈ విప‌రీత ధోర‌ణే ప్ర‌స్తుం వైసీపీకి చేటు తెచ్చింది. 11 సీట్ల‌కు ప‌రిమితం చేసింది. ఇంకా ఇదే పంథాలో వెళ్తే.. ఈ మాత్రం సీట్లు కూడా రావ‌న్న సంకేతాలు అందుతున్నాయ్. మ‌రి చూడాలి వైసీపీ ఈ బూతు ప్రేరేపిత విధానం ఎప్పుడు ఎలా ఆపుతుందో లేదో తేలాల్సి ఉంది.

bja national president suspense continues

అయితే అన్నామలై.. కాదంటే నిర్మలమ్మ!

భారతీయ జనతా పార్టీ  జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు  సమాధానం ఇటు పార్టీ నేతలకు,  అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ  పార్టీ జాతీయఅధ్యక్షు  ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది. అవును  పార్టీ అగ్ర ద్వయం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. అందుకే  ఇటీవల లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతోందని వ్యంగంగా అన్నప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరదా సమాధానంతో, అసలు విషయాన్ని దాట వేశారు. అయితే అక్కడికది సరిపోయినా.. ఈ ప్రశ్న బీజేపీని వెంటాడుతోందని అంటున్నారు. అయితే  ఇక అట్టే కాలం ఈ సస్పెన్స్  కొనసాగదని.. కొనసాగించడం కుదరదనీ కూడా  అంటున్నారు.  బీజేపీ ప్రస్తుతఅధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు కేంద్ర మంత్రిగా జోడు పదవుల్లో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది.  సో.. జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడి  ఎన్నిక ఇక వాయిదా వేసే అవకాశం  లేదని అంటున్నారు. అలాగే రేపో మాపో బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసంతో  పార్టీ వర్గాలు  ఉన్నాయి.  ఏప్రిల్  18,19, 20 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.ఈలోగా నూతన  అధ్యక్షుడి ప్రకటన ఖాయంగా ఉంటుందని పార్టీ  వర్గాలు అంటున్నాయి.  అదొకటి అలా ఉంటే, నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అనేక కోణాల్లో ఆలోచిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సారి అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనే కోణంలో బీజేపీ అగ్ర ద్వయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ఎస్ఎస్  పెద్దలు కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే  తొలి సారిగా పార్టీ పగ్గాలు మహిళా నేతకు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ రచన చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమిళనాడు నుంచే జాతీయ అధ్యక్షుడిని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు.    అదే నిజంమైతే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, చదవు, సంస్కారం, పార్టీ విధేయత, సిద్దాంత నిబద్దత ఉన్నఅన్నామలై’కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అవసరమైన అర్హతలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. అలాగే, అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు.  సో..  దక్షణాదికి అధ్యక్ష పదవి పదవి ఖాయం అయితే అన్నామలైకి అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. ఇంకా కొన్ని పేర్లు వినిపిస్తున్నా.. మోదీ, షా ఇద్దరూ  అన్నామలై వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అందుకే, దక్షణాదికి దక్కితే, అన్నామలై అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమని అంటున్నారు.    అలాగే  పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకు  ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు  బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు, అలాగే, లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  అదే జరిగితే, ఇప్పటికే,  ఫస్ట్ విమెన్ డిఫెన్స్ మినిస్టర్, ( ప్రప్రథమ మహిళా రక్షణ మంత్రి )  ఫస్ట్  ఫుల్ టైమ్   ఫైనాన్సు మినిస్టర్ తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్  ప్రవేశ పెట్టిన తొలి అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్  ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు.  అయితే ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు. ఎకడమిక్ పర్సన్ . ఎకనమిక్ లేడీ.  (ఒక విధంగా ఆమె లేడీ మనోహన్  సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు) అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు. అంతే కాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే  ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.. అయితే  దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్ లో నూ మాట్లాడ గలరు.  సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే జంట ఆలోచనలు చేస్తున్నదే  నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలూన్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు.అయితే..  ఫైనల్ గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్  తప్పదు.

revanth sarkar facing bumarang

అనుకున్నదొకటి.. అయినది మరొకటి!

అదేమిటో కానీ  తెలంగాణ ప్రభుత్వం  ఏం చేసినా,  ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి  ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరో వంక  హైడ్రా మొదలు రేవంత్  రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ప్రాజెక్టూ విమర్శల సుడిగుండంలో చిక్కి అప్రతిష్ట పాలవుతోందనీ, ప్రజల్లోకి వెళ్ళ లేక పోతున్నామనీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నిటికీ మించి  సర్వోన్నత న్యాయస్థానం, సూమోటోగా  విచారణ చేపట్టిన  హెచ్‌సీయూ భూముల వివాదం  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని  అప్రతిష్ట పాలుచేసిందని అంటున్నారు. ప్రాజెక్టుల పరిస్థితే కాదు, పథకాల పరిస్థితి కూడా   అలానే ఉందని అంటున్నారు. అందుకే, ఇంటా బయట విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  అవును, అమలు చేయని గ్యారెంటీల విషయంలోనే కాదు.. అమలు చేసిన హామీల విషయంలోనూ విమర్శలు తప్పడం లేదు. అందుకే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది తలపెట్టినా అనుకున్నదొకటి అయినది మరొకటి అన్నట్లుగానే  కథ అడ్డం తిరుగుతోందని అంటున్నారు.  ఆఫ్కోర్స్  గత 15-16 మాసాలలో కాంగ్రెస్  ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో, అమలుచేసిన వాటికంటే అమలు చేయని గ్యారెంటీలు, హమీలే ఎక్కువ.  చెప్పింది కొండంత చేసింది గోరంత అని జనం పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 15 మాసాలకు పైగానే అయినా  ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ వంటి ఏవో కొన్ని హామీలు మినహా  నిరుద్యోగ భృతి వంటి కీలక హామీల ఊసే లేదు. అలాగే మహిళలకు ఇచ్చిన హమీలదీ అదే కథ.  ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ, ఆడ పిల్లలకు స్కూటీలు,  గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరిట ఇచ్చిన లక్ష రూపాయల పెళ్లి కానుకకు అదనంగా  తులం బంగారం ఇస్తామని ఇచ్చిన మహాలక్ష్మి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి  హామీల విషయంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం చేతులు ఎత్తేసిందని అంటున్నారు. అలాగే రైతులకు ఇచ్చిన రుణ మాఫీ, రైతు బంధు హామీల అమలు అరకొరగానే వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  నిజానికి ప్రజల్లో కాదు అధికార  పార్టీ  నాయకులు, కార్యకర్తలల్లోనూ అసంతృప్తి  దాగడం లేదు. బయట పడుతూనే వుంది. ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతృప్తిగా లేరనే విషయం ఆయన మాటల్లో తొంగి చూస్తూనే వుంది. ఒకరిద్దరు మంత్రులు అయితే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే, కేసీఆర్  ప్రభుత్వమే బాగుందని, ప్రజలు అంటున్నారని  తమ మాటను జనం నోటితో వినిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సంగతి అయితే  చెప్పనే అక్కర లేదు. మింగలేక కక్క లేక అన్నట్లుగా ఉందని అంటున్నారు.  అయితే  ఈ అసంతృప్తికి  కాంగ్రెస్ నాయకులకు  చేసింది చెప్పుకోవడం చేత కాకాకపోవడమే కారణమని కొందరు కాంగ్రెస్ నాయకులు  పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ  అది నిజం కాదు.  నిజానికి  ప్రచారం మోతాదు మించిందనీ, అందుకే ప్రభుత్వం,పార్టీ అప్రతిషతపాలు అవుతోందనే  అభిప్రాయం కూడా  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందని  అంటున్నారు.     అదలా ఉంటే, తాజా  సెన్సేషన్  సన్న బియ్యం విషయమే తీసుకుంటే.. ఇతర విషయాలు ఎలా ఉన్నా సన్న బియ్యం చక్కని సూపర్ ఫైన్ సంక్షేమ పథకం. రాజకీయంగా  వెల్  పాలిషిడ్ ఆలోచన. రాజకీయంగా  ప్రయోజనం చేకూర్చే చక్కని పథకం. అయితే, అతి సర్వత్ర వజ్రయేత్  అనే మాట మరిచి  పథకం అమలు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వలన  కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. అందుకే  అనుకున్నదొకటి.. అయినదిమరొకటీ అన్నటుగా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వస్తోందని అంటున్నారు.  పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లి సన్న బియ్యం భోజనం చేయడం వరకు ఓకే.  కానీ, అలికి అన్నం పెట్టడం  ఊరికి ఉపకారం అన్నట్లు సాగుతున్న ప్రచారం ప్రమాదకరంగా మారుతోందని పార్టీ నాయకులే అంటున్నారు. ఆఫ్కోర్స్  ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కాదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయినా.. మరో ప్రభుత్వం అయినా,  ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రాజకీయ లబ్దిని ఆశిస్తాయి. అలా ఆశించడం తప్పు కూడా కాదు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో  ఉంచుకుని సన్న బియ్యమే సర్వస్వం అన్న రీతిలో పార్టీ నాయకులకు ఫత్వాలు జారీ చేసి మరీ  ప్రచారం సాగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, అంటున్నారు. మరో వంక రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్  రెడ్డి, సన్న బియ్యం క్రెడిట్ మొత్తం తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు అసత్యాలు, ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగంగానే  రాష్ట్రంలో రేవంత్  ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందనీ, పేద ప్రజలకు పంపిణీ చేసే ప్రతి కిలో బియ్యాయినికి కేంద్ర ప్రభుత్వం రూ.37 ఇస్తున్నదని, మొత్తంగా చూస్తే సంవత్సరానికి రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందనీ కేంద్ర మంత్రి  బండి సంజయ్  మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు, కేంద్ర నిధులు వద్దను కుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సవాలు విసిరారు.  మరో వంక  బీజీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి మరీ వాస్తవాలను వివరించి  సన్న బియ్యం ప్రచారానికి కౌంటర్ గా  ‘మోడీ బియ్యం’  ప్రచారాన్ని ప్రారంబించారు. దీంతో ఇప్పడు గ్రామాల్లో సన్న బియ్యం వర్సస్ మోదీ బియ్యం ప్రచారం జోరందుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి  ప్రారంభించిన సన్న బియ్యం పథకం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

youth killed parents

ట్రంప్‌ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులను చంపేశాడు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని హత్య చేసి ఉక్రేయిన్ పారిపోవడానికి ప్లాన్ చేసిన యూస్ యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ట్రంప్‌ని హత్య చేయడానికి తల్లదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఆ 17 ఏళ్ల యువకుడు వారినే హత్య చేయడంతో అసలు కుట్ర వెలుగు చూసింది.  తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఓ 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెల అరెస్టు చేశారు. ఆ కేసు దర్యాప్తులో తెలిసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆ యువకుడు.. అందుకు డబ్బులు ఇవ్వట్లేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్‌ వారెంట్‌లో పేర్కొన్నారు.  విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌ ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత నెల కాన్సస్‌లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు తెలిసింది. అంతేకాదు.. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు అతడు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్‌ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

mangalagiri idol constituency in india

మంగళగిరి ఆదర్శ నియోజకవర్గం.. లక్ష్య సాధన దిశగా లోకేష్ అడుగుల వేగం!

ఐదు రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు.. మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాది లోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ, విక్రయాది హక్కుభుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు. లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా లబ్ధి దారులను ఇచ్చిన పట్టాల విలువ మార్కెట్ రేట్ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో గ్రామాల వారీగా లబ్ధిదారులకు అందజేశారు.   అదే విధంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం (ఏప్రిల్ 13) లోకేష్  మంగళగిరిలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇది కూడా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ కావడం గమనార్హం. అలాగే అదే రోజుల రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించారు.  2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఆ తరువాత ఐదేళ్లూ అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. 2024 ఎన్నికలలో 91 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లోకేష్ కృషి కారణంగా పీపీపీ పద్ధతిలో మంగళగిరి- తెనాలి నాలుగు వరససల రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో  మహానాడు కాలనీలో కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం,  జూన్ నుంచి భూగర్భ డ్రైనేజీ, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్న లోకేష్ ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలలలోపే నియోజకవర్గ రూపురేకలు మారిపోయేలా పనులకు, పథకాలకు శ్రీకారం చుట్టారు.  

mudragada jagan bhajana again

మరో సారి ముద్రగడ.. జగన్ భజన

స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయనను కాపు సామాజికవర్గం తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా ఆయన స్వయంకృతాపరాథమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.    వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ గొంతెత్తడానికి కారణం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా ముద్రగడ  2104-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకున్నారంటారు.   అయితే అప్పట్లో చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినా ముద్రగడ దానిని స్వాగతించలేదు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ఆ నిర్ణయాన్ని ముద్రగడ వ్యతిరేకించడానికి కారణం చంద్రబాబు పట్ల అయిష్టతేననీ, అహంకారం వినా ముద్రగడకు కాపు సామాజిక వర్గంపై అభిమానం లేదనీ, వారి ప్రయోజనాలు పట్టవనీ, అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.  అయితే ముద్రగడకు వైసీపీలో ఎలాంటి గౌరవం లభించలేదు. అసలు ఈ మధ్య కాలంలో ముద్రగడకు జగన్ దర్శన భాగ్యమే దొరకలేదని చెప్పొచ్చు. అయినా ముద్రగడ నోటి వెంట జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.  అటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కారణమేంటంటే.. వైసీపీ అధినేత జగన్ తాజాగా 33 మంది సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. ఆ 33 మందిలో ముద్రగడ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి?  అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం. ఈ కమిటీకి సజ్జల కన్వీనర్ గా ఉన్నారు.  ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకే ముద్రగడ తన జన్మధన్యమైపోయిందన్నంతగా ఆనందపడిపోతున్నారు.  వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగన్ ఆయన కోటరీ మాత్రమే తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే  చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే  బ్రహ్మానందపడిపోతున్నారు. తనకు పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.   జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. కానీ జరిగిందేమిటి? 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే జిల్లాలో ముద్రగడకు ఉన్న పలుకుబడి ఏమిటి? ఎంత అన్నది తేలిపోయిందని, కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.  పిఠాపురంను పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి 52 వేల 675 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. అంత దాకా ఎందుకు 1999 నుంచి ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా  2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘోరంగా కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీర ప్రకటనలు చేయడం ద్వారా తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకోవడమే కాకుండా నవ్వుల పాలౌతున్నారు. 

base camp at tirumala

అలిపిరి వద్ద బేస్ క్యాంప్!

తిరుమలేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా, వారు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన పలు చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమలేశుని దర్శనం జాప్యం లేకుండా వేగంగా జరిగేందుకు వీలుగా ఏఐ సాంకేతికతను వినియోగించుకోవడానికి రెడీ అయ్యింది.  ఇందు కోసం ప్రతి భక్తుడికీ ఒక పర్మనెంట్ ఐటీ ఇచ్చేందుకు సమాయత్తమౌతోంది. అలాగే తిరుమల విజన్ 2047 కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.   అందులో భాగంగానే అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయించింది.  15 హెక్టార్ల విస్తీర్ణంలో  ఏర్పాటు చేయనున్న ఈ బేస్ క్యాంప్ వద్ద నుంచి ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నిరోధించి భక్తులకు బస్సుల్లో అవీ ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించింది. అలాగే అలిపిరి వద్దే వసతి, దర్శనం సహా అన్ని కౌంటర్లనూ ఏర్పాటు చేయనుంది.  ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించింది.  తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీ తగ్గించడం, తద్వారా కాలుష్యాన్ని అరికట్టడం లక్ష్యంగా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.    

deputy cm pawan wife annalegenovo

తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజెనోవో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కుమాడుకు కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నఅన్నా లెజనోవో.. మార్క్ శంకర్ కోలుకోవడంతో అన్నా లెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆమె తిరుమల పర్యటన సందర్భంగా విదేశీయులు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో వాటిని   ఖ‌చ్చితంగా పాటించారు. తిరుమలలోనే ఆమె తిరుమల స్వామివారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చారు.    తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. 

blast in crackers factory

బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.   మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్లి స్థానికులు, అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.    ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని అనిత చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారనీ, ఏడుగురు గాయపడ్డారనీ తెలిపారు.  ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

abv political entry

ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ అక్రమాలను బయటకు తీస్తానని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు  ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవులు, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్ హయాంలో  జరిగిన అక్రమాలు, అన్యాయాలు ప్రజల ముందుంచుతానన్నారు.   మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.  జగన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో  జగన్ చేయాలనుకున్నది చేస్తే.. తాను చేయాల్సిన పోరాటం చేశానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇక ఆ అధ్యాయం ముగిసిందనీ, ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు.  జగన్ అరాచకాలు  బయటకు తెస్తానన్నారు. సండూర్ పవర్‌తో ఆరంభమైన జగన్ అక్రమ సంపాదన ఇప్పుడు లక్షల కోట్లకు చేరిందన్నారు.  అదంతా ప్రజల డబ్బే. దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కిస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  కోడికత్తి శ్రీను లాంటి బాధితులు జగన్ హయాంలో వేలల్లో ఉన్నారన్నారు. జగన్ బాధితులందరికీ తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులు  తనకు సమాచారం అందించాలని కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.  అంతకు ముందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. 

nidadavole minicipality into janasena account

నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశం

తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ఖాతాలోకి ఓ మునిసిపాలిటీ చేరింది. రాష్ట్రంలో జనసేన ఖాతాలో చేరిన తొలి మునిసిపాలిటీగా నిడదవోలు మునిసిపాలిటీ నిలిచింది. ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 27 మంది వైసీపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే వైసీపీకి చెందిన   14 మంది కౌన్సిలర్లు జనసేన గూటికి చేరడంతో  తెలుగుదేశం కౌన్సిలర్ ను కూడా కలుపుకుంటే జనసేన కౌన్సిలర్ల బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మునిసిపాలిటీ జనసేన వశమైంది.  వాస్తవానికి జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.  జీరో సభ్యుల నుంచి మున్సిపాలిటీ జనసేన పరం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చాణక్యం చేశారు.  కాగా  కూటమి ప్రభుత్వం పాలన నచ్చి వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారని   మంత్రి కందుల దుర్గేష్  చెబుతున్నారు.  

local authoritie constituency election

పోటీలోఆ రెండు పార్టీలే.. అందుకే ఆసక్తి!

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ( ఎమ్మెల్సీ  ఎన్నికల, పోలింగ్ కు ఇంకా వారం రోజులకు పైగానే సమయం వుంది. ఏప్రిల్ 23 న పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయినా ఇంకా పోలింగే జరగక పోయినా,ఫలితం అయితే వచ్చేసింది.గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలిసి పోయింది. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం(ఎల్ఎసీ)ఎలెక్టోరల్ కాలేజీ లో పార్టీలకు ఉన్న బలా బలాను బట్టి చూస్తే,ఎంఐఎం గెలుపుకు ఢోకా లేదు. అయితే, ఫలితం ముందుగానే తెలిపోయినా, ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది?  అంటే,  అందుకు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరగడమే కారణం అంటున్నారు.   హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసీ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.ఈ లెక్కన, ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. సో, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్   గెలుపుకు ముందు గానే ఖారరై పోయింది అందుకే, కావచ్చును,ఎలెక్టోరల్ కాలేజీలో 24  ఓట్లున్న బీఆర్ఎస్, 14 ఓట్లున్న అధికార కాంగ్రస్ పార్టీ పోటీకి దిగలేదు.కానీ, పాతిక ఓట్లు మాత్రమే ఉన్న  బీజేపీ మాత్రం, బరిలో దిగింది. సెంట్రల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నేమారుగోముల గౌతం రావును బీజేపీ బరిలో దింపింది. మరో వంక  అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలవి కాని చోట అధికులం అనరాదు అనుకున్నారో, లేక ఇంకా ఏదైనా ‘రహస్యం’ వుందో ఏమో కానీ, ముందుగానే ఓటమిని అంగీకరించి, చేతులెత్తేశాయి. తమ అభ్యర్ధులను బరిలో దింప లేదు.  దీంతో హైదరాబాద్ ఎల్ఎసీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే మిగిలాయి. అయితే, ఏదో అద్భుతం జరిగితే తప్పించి, ఎంఐఎం అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి గెలుపును ఆపడం, మోదీ, షా దిగి వచ్చినా అయ్యేపనికాదని అంటున్నారు. అయితే  ఈ వాస్తవం బీజేపీకి తెలియదా  అంటే తెలుసు. అయితే  ఎంఐఎం ఏకగ్రీవ ఎన్నికను అడ్డు కునేందుకే పార్టీ నాయకత్వం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే, కేవలం ఎంఐఎం ఏకాగ్రీవాన్ని నిరోధించడం మాతమే కాదు,   గెలిచేందుకు కూడా పోటీ చేస్తున్నామని బీజీపే నాయకులు, మరోమాట అంటున్నారు. అంతే కాదు, మా గెలుపు లెక్కలు మాకున్నాయని కొంచెం ధీమాగానే చెపుతున్నారు.  కాషాయ పార్టీ  క్రాస్ వోటింగ్  పై హోప్స్ పెట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. మరో వంక ఓటింగ్ లో పాల్గొంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేక పోలేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవంక ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల స్టాండ్ ఏమిటి అన్నది ఇంకా స్పష్టం కాలేదు.   మాకు బలం లేదు, అందుకే పోటీచేయడం లేదు అంటున్నారే, కానీ, తమ మద్దతు ఎవరికో చెప్పడం లేదు. అంతేకాదు, మద్దతు గురించి చెప్పక పోవడమే కాదు, అసలు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. మరో వంక  మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందనీ, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని  ఆరోపిస్తున్నారు.  మరో వంక, బీజేపీ హిందూ కార్డును తెర పైకి తెచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, అటో ఇటో తేల్చుకోవాలని కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. హనుమత్  జయంతిని పురస్కరించుకుని, శనివారం (ఏప్రిల్ 12) గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానం మేరకు, ఆకాశపురి, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో  బండి సంజయ ఎల్ఎసీ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎంఐఎంను గెలిపించి హిందువుల ఆగ్రహానికి గురికావద్దని  పరోక్షంగా హెచ్చరించారు. అంతే కాకుండా  ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మల్యే రాజా సింగ్ అద్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రలో రాజకీయాలతో సంబంధం లేకుండా  లక్ష మందికి పైగా హిందువులు ముఖ్యంగా యువతీ యువకులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు  కూడా రాజకీయాలకు అతీతంగా ఎంఐఎం ఓడించేందుకు , బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావుకు ఓటేసి గెలిపించాలని పిలుపు  ఇచ్చారు.    అయితే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు లేదా ఇతరత్రా కారణాల కారణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్  కార్పొరేటర్లు  క్రాస్ ఓటింగ్ చేస్తారా? అనేది, ఎలా ఉన్నా  ఆసలు అ రెండు పార్టీలు ఓటింగ్ లో పాల్గొంటాయా? లేదా? అనేది అన్నిటినీ మించిన బిగ్ క్వశ్చన్  అంటున్నారు.  అదలా ఉంటే  ఎంఐఎం మాత్రం గెలుపు విషయంలో ధీమాగా వుంది. అంతే కాకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం యూపీ, సహా అనేక ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నఆరోపణలకు, ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నికలలో పరస్పర పోటీ సమాధానం అవుతుందని ఎంఐఎం నాయకులు సంతోషిస్తున్నారు. అలాగే  బీజేపే కూడా  రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో హిందూ వ్యతిరేక ఎంఐఎంను నిరిధించే సత్తా, సంకల్పం ఒక్ బీజేపీకి  మాత్రమే ఉన్నాయని నిరూపించుకునేందుకు, తద్వారా హిందూ ఓటు బ్యాంకును పతిష్ట పరచుకునేందుకు, ఇదొక అవకాశంగా బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే, ఫలితం ముందుగానే తేలి పోయినా  హైదరాబాద్  ఎల్ఎసీ- ఎమ్మెల్సీ ఎన్నిక, మరో కోణంలో ఆసక్తిని రేకేతిస్తోందని  అంటున్నారు.

another shock to ycp in vizag

జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ

వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్   తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. 74 వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ  వైసీపీ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు. తిప్పలనాగిరెడ్డి  తొలి దశ నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపు విషయమై  వంశీ కౌన్సిల్లో పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.  తాజాగా జీవీఎంసీ లో మేయర్ పీఠాన్ని మార్చే క్రమంలో కూటమి నాయకులు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న  చర్చ జరగనుంది.  ఈ దశలో  వంశీ  వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడం నిస్సందేహంగా జగన్ పార్టీకి బిగ్ షాక్.  నిజానికి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరం ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది వీరితో పాటు మరో ఐదు వైసీపీ సభ్యులు  తమతో టచ్ లో ఉన్నారని   పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారు.  దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది.  ఇప్పటికే కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  అయినప్పటికీ ఈ రకంగా పార్టీ కార్పొరేటర్లు జారిపోడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.  తాజాగా తిప్పల వంశీ మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు.  వార్డు అభివృద్ధి విషయంలో వివక్ష  కారణంగా వంశీ పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు చెబుతున్నారు.

ttd suspends five employees for negligence in duties

పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు .. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సస్పెన్ష్ వేటు

తిరుమలలో శనివారం (ఏప్రిల్ 12) జరిగిన అపచారానికి సంబంధించి బాధ్యులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు తిరుమల ఆలయం మహాద్వారం వరకూ పాదరక్షలతో వచ్చారు.  మహాద్వారం వరకూ భక్తులు రావడానికి ముందు మూడు ప్రాంతాలలో ఉన్న తనిఖీలను వారు దాటుకుని వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలతో మహాద్వారం వరకూ మధ్యలో తనిఖీలను దాటుకుని భక్తులు రావడంతో సిబ్బంది నిర్లక్ష్యం ప్రస్షుటమైంది. మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముఖేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. శ్రీవాణి టికెట్‌పై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 నుండి వీరు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరు డిస్పోజబుల్ పాదరక్షలు ధరించి వచ్చిన సంగతిని అక్కడి సిబ్బంది గుర్తించి వారిని ఆపారు.   అసలు మహాద్వారం వరకూ భక్తులు చెప్పులతో  వస్తుంటే విజిలెన్స్, టీటీడీ అధికారులు ఏంచేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.   ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంి, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.  అలాగే   నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదనలు పంపించింది.  

పుంగనూరులో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు..ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ మరోసారి రెచ్చిపోయింది.  పుంగనూరు మండలం కృష్ణాపురంలో టిడిపి కార్యకర్త రామకృష్ణ ఇటీవల వైసీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే వైసీపీ మూకలు మరో సారి రెచ్చిపోయాయి. తెలుగుదేశం సానుభూతి పరులపై కత్తులు, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఈ దాడికి  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణ స్వామి నేతృత్వం వహించారు. ఈ దాడిలో తెలుగుదేశం కు చెందిన హరినాథ్, హరినాథ్ భార్య కన్యాకుమారి, వెంకటేష్ లు గాయపడ్డారు. క్షతగాత్రులను పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   ఇప్పుడు వైసీపీ మూకల దాడిలో గాయపడిన వారు ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ బంధువులే కావడం గమనార్హం. గత కొంత కాలంగా తమపై దాడి చేసేందుకు పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని హరినాథ్ ఆరోపించారు. గతంలో హత్యకు గురైన రామకృష్ణ కూడా తనకు పెద్దిరెడ్డి మనుషుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, అప్పడూ వారు పట్టించుకోలేదనీ ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   

పిఠాపురం వర్మకు చంద్రబాబు షేక్ హ్యాండ్.. గ్యాప్ ప్రచారానికి ఎండ్ కార్ట్!

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కర్యక్రమానికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమా కుమారుడి నిశ్చితార్థ వేడుకకు పిఠాపురం వర్మ కూడా వచ్చారు. పిఠాపురం వర్మను చూడగానే చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  వాస్తవానికి గత కొన్ని నెలలుగా పిఠాపురం వ్యవహారాలు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేసిన వర్మకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాడర్ లో బలంగా ఉంది.  2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లూ చేసుకుని కూడా   జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించి, పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పగానే క్షణం ఆలోచించకుండా తన  సీటును పవన్ కోసం త్యాగం చేసి చంద్రబాబు మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం  శ్రమించారు.   అక్కడి వరకూ అంతా బానే ఉన్నా.. ఆ ఎన్నికల సందర్భంగా   ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన  హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు.   రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు   ఛాన్స్ దక్కలేదు. అలాగే నియోజకవర్గంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించే విధంగా జనసేన పావులు కదపుతూ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే..ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గ పర్యనటలో వర్మకు ఆహ్వానమే లేకుండా పోయింది. అంతకు ముందు కూడా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాగ బాబు పిఠాపురం పర్యటన ఆద్యంతం అడుగడుగునా తెలుగుదేశం నిరసనలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్మ కాకినాడలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లోకేష్ కు పగ్గాలు, అలాగే 2047 విజన్ డాక్యుమెంట్ లా పార్టీ కోసం కూడా ప్రణాళిక రూపొందించాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిఠాపురం వర్మను ఆప్యాయంగా పలకరించడం, షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చటించడంతో వర్మలో అసంతృప్తి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వర్మతో చంద్రబాబు ఆత్మీయంగా మాట్లాడటం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా జోష్ ను నింపింది. 

రోడ్ సేఫ్టీ కోసం దణ్ణం పెట్టిన ఢిల్లీ సీఎం

సింప్లిసిటీకి  నిదర్శనంగా నిలుస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా. తాను చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 14) ఆమె వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఆహారం విసిరేయడాన్ని చూశారు. దీంతో వెంటనే కాన్వాయ్‌ ఆపి స్వయంగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రినని పరిచయం చేసుకున్న రేఖాగుప్తా  మరో సారి అలా చేయొద్దని చేతులు జోడించి రిక్వెస్ట్‌ చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ఢిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టె ముక్క విసరడం ఆమె చూశారు. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లి,   రోడ్లపైకి ఆహారాన్ని విసిరేయడం వల్ల వాటిని తినేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయని, అప్పుడు మూగజీవాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాహనదారులూ, రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమేనని, అంతేకాదు.. ఆహారాన్ని ఇలా అగౌరవ పరచకూడదని సూచించారు. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే, గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్లాలని,  రోడ్లపై ఆహారాన్ని విసరొద్దని, మూగజీవులను ప్రేమించాలనీ చెప్పారు.  మన సంస్కృతిని గౌరవించండి రహదారి భద్రతను పాటించండని  సీఎం రేఖా గుప్తా తన ట్వీట్లో ఢిల్లీ వాసులందర్నీ కోరారు. ఢిల్లీలోని హైదర్‌పుర్‌ ఫ్లైఓవర్‌పై శనివారం ఈ ఘటన జరిగింది.