ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించిన ఓటరు!

వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ఎన్నికల వేళ దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్ఠించాలని యత్నిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారి పల్లెలో తెలుగుదేశం ఏజెంట్ సుభాష్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుభాష్ కు కుడి కన్ను పోయింది. ఇక పల్నాడులో పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ హింసాకాండకు తెరలేపింది. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం హుటాహుటిన పల్నాడుకు ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రాను అక్కడకు పంపింది. అవసరాన్ని బట్టి అదనపు బలగాలను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.  ఎన్నికల రోజు వైసీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఇందుకు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సీఎస్ జవహర్ రెడ్డి తన వంతు ఇతోధిక సాయం అందజేస్తున్నారు.  సరిగ్గా పోలింగ్ రోజు తెల్లవారు జామునే ఉద్యోగులు పెన్షనర్లకు డీఏ బకాయిలను వారి అక్కౌంట్లలో జమ చేశారు. పోలింగ్ కు రెండు రోజుల మందు ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకా సొమ్మును లబ్ధి దారుల ఖాతాలలో జమ చేయడానికి తన కున్న సర్వ అధికారాలనూ ఉపయోగించి విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు చడీ చప్పుడూ లేకుండా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలలో డీఏ అరియర్స్ ను జమ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని, సీఎస్ పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. ఎన్నికలలో దాడులు, దౌర్జన్యాలు, అసత్య, అబద్ధ ప్రచారాలు, ప్రలోభాలను నమ్ముకుని బరి తెగిస్తున్న వైసీపీకి ఓటర్లు వాటిని వేటినీ లెక్క చేయకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో హద్దులు లేకుండా చెలరేగుతున్నారు. ఓటింగ్ కు పెద్ద ఎత్తున జనం తరలిరావడం, ప్రలోభాలకు గురి చేద్దామని ప్రయత్నించిన వైసీపీ నాయకులపై తిరగబడుతుండటంతో అధికార పార్టీలో ఆందోళన పెరిగిపోతున్నది. పంచిన చీరలను వైసీపీ నేతల ఇళ్ల ముందు విసిరివేయడం, పోలింగ్ బూత్ వద్ద తనపై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థిపై ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లుమనిపించడం వంటి సంఘటనలు ఏపీ ప్రజల మూడ్ ను తెలియజేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఔను  తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ పోలింగ్ బూత్ వద్ద ఓ ఓటర్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఆ ఓటరు తిరగబడి చెంప ఛెళ్లు మనిపించారు. దీంతో ఎమ్మెల్యే పరువు గంగలో కలిసినట్లైంది. ధైర్యంగా ఎమ్మెల్యే దౌర్జన్యానికి దీటుగా బదులు చెప్పిన ఆ ఓటర్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.   అలాగే  మైలవరం నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగబడ్డారు.    150 మందితో  గుంపుగా మైలవరం వేములూరి వెంకటరత్నం కళాశాల పోలింగ్ బూత్ లో జొరబడి హల్ చల్ చేశారు. ఎమ్మార్వో చేష్టలుడిగి నిలబడిపోయారు. విషయం తెలిసి భారీగా తెలుగుదేశం శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.   ఇవన్నీ ఒకెత్తైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బూత్ నంబర్ 55లో ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటు వేస్తే మరొక గుర్తుకు పడుతోందంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. 

ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు దంపతులు 

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయ‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి కూడా ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్ర‌త్యేక‌మైన‌విగా ఆయ‌న పేర్కొన్నారు. ఇవాళ ఓటు వేస్తే రేపు ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంద‌న్నారు. భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నిక‌లే అని తెలిపారు. ఓటు వేసేందుకు ఉద‌యం నుంచే జ‌నాలు బారులు తీర‌డం బాగుంద‌ని, వారు చూపిస్తున్న చొర‌వ మ‌రువ‌లేనిద‌ని చెప్పారు. ఇంకా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. "ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావిత‌రాల భ‌విష్య‌త్తుకు పునాదులు వేస్తుంది. విదేశాల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు స్వ‌స్థ‌లానికి రావ‌డం బాగుంది. అన్న‌మ‌య్య‌, ప‌ల్నాడు జిల్లాల్లో దాడుల‌ను ఖండిస్తున్నా. ఈ దాడుల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. గుండాయిజం, రౌడీయిజంతో రెచ్చిపోతే స‌హించేదిలేదు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు, ఈసీ బాధ్య‌త తీసుకోవాలి. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తే మా కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోరు" అని చంద్ర‌బాబు హెచ్చరించారు. 

ఎపి ఎన్నికలపై మోదీ, షా ప్రత్యేక ట్వీట్స్ 

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.    "ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను. అలాగే నాలుగో ద‌శ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా పోలింగ్ కొన‌సాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓట‌ర్లు పెద్ద ఎత్తున్న త‌ర‌లి రావాలి. ప్రతిఒక్క‌రూ త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించి ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయాలి" అని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  "లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే  ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అమిత్ షా ట్వీట్ చేశారు. అటు తెలంగాణ‌లో జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై కూడా ఈ సంద‌ర్భంగా అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. "తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను అందించే ప్ర‌భుత్వానికి ఓటు వేయాలి. వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించేవారిని ఎన్నుకోండి. బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుంది" అని అమిత్ షా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాలుగో విడత.. పోలింగ్ ఎక్కడెక్కడంటే?

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ సోమవారం (మే13) ప్రారంభం అయింది. నాల్గోవిడతలో దేశ వ్యాప్ంగా 10 రాష్ట్రాలలో  96 లోక్‌సభ స్థానాల్లో   ఓటింగ్‌ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో  పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లుక్యూ కట్టారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.  96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద 19 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు, మానిటరింగ్ బృందాలను నియమించారు. దేశంలో మొదటి మూడు దశల్లో ఓటింగ్ జరిగింది. మొదటి మూడు దశల్లో వరుసగా 66.14శాతం, 66.71శాతం, 65.68శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న జనసేనాని 

మంగళగిరిలో ఓటు హక్కును  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ ఈ పోలింగ్ సెంటర్‎కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఒకానొక సందర్భంలో పోలింగ్ బూతులోకి దూసుకొని వచ్చారు కొందరు వీరాభిమానులు. అయితే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. 

ఎన్నికల కోడ్ పెద్దిరెడ్డికి వర్తించదా?

 మంత్రి పెద్దిరెడ్డి మంచీ చెడూ, ఉచ్ఛం, నీచం వదిలేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా  వ్యాఖ్యలు చేశారు.  యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు. ఆయన ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాను వైసీపీ గుర్తుకు ఓటు వేశానంటూ బాహాటంగా ప్రకటించారు. ఆయన ఆ మాట చెప్పక పోయినా పెద్దిరెడ్డి మరో పార్టీకి ఓటు వేశారని ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాను ఫ్యాన్ గుర్తుకు ఓటుశానని వేలిపై ఇంకు గుర్తు చెబుతూ ప్రకటించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. పోలింగ్ బూత్ ల వద్ద పార్టీ గుర్తుల ప్రస్తావన చేయడం నిషేధం, నిషిద్ధం. మంత్రి హోలాలో ఉన్న పెద్ద రెడ్డి ఇలా తాను ఫ్యాన్ గుర్తుకు ఓటేశానంటూ బాహాటంగా చెప్పడంతో ఆయన నిబంధనలను తుంగలోకి తొక్కారు. ఇక ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరులో  ఈ తెల్లవారు జామునుంచే వైసీపీ దౌర్జన్యాలూ, కిడ్నాపులు, దాడులకు తెగబడింది.    పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని  బూరగమాందలో వైసీపీ నేతలు   పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఐదుగురు తెలుగుదేశం ఏజెంట్లను, మరో పదిమంది తెలుగుదేశం నాయకులను వైసీపీ కిడ్నాప్ చేసి పీలేరు శివారులలో వదిలిపెట్టారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మీరు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌గా కూర్చోవడానికి వీల్లేదంటూ బెదరించారు.  

మొరాయిస్తున్న ఈవీఎంలు

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ఉత్సాహం మీద పలు చోట్ల ఈవీఎంలు నీళ్లు చల్లుతున్నాయి. రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలంగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ లలో వేచి ఉన్నారు. అయితే రాష్ట్రంలోని ఏపీలోని పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి.  పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని దుండగులు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. పోలింగ్ బూత్ లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.  మంగళగిరి నియోజకవర్గంలోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొప్పురావుకాలనీ, సీకే హైస్కూల్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, మోరంపూడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్యను సరిచేసేందుకు పోలింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ గంటకుపైగా నిలిచిపోయింది.  పల్నాడు, పుంగనూరులలో వైసీపీ మూకలు దౌర్జన్యాలకు తెగబడ్డాయి. 

ఏపీలో ఓట్ల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు వేసే వంతు కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయాలన్న పట్టుదల, సంకల్పం జనంలో కనిపిస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అరాచకత్వం పోవాలన్న ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించి తీరాలన్న బలమైన కాంక్ష ప్రజలలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. పల్నాడు, పుంగనూరు వంటి కొన్ని ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు, కిడ్నీప్ లకు తెగబడ్డాయి. ఆ ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఇక పోతే రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, సెలబ్రిటీలు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికలలో 80 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ప్రజలు ఓటింగ్ కు తరలివస్తున్న తీరు చూస్తుంటే ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు 89శాతం పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా  చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు, జగన్ దంపతులు, పవన్ కల్యాణ్ తమ తమ పోలింగ్ బూత్ లలో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే బాలకృష్ణ, వివిధ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఇలా ఉండగా.. ఏపీ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వేర్వేరుగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండంటూ  అమిత్ షా ట్వీట్ చేశారు.   

పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ మూకల దౌర్జన్యాలు

ఆంద్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాపుల ఘటనలు జరిగాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారి పల్లె పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేతలు అరాచకానికి దిగారు. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకి లాగేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లపై వైపీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇలాంటి ఘటనల మీద ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించాలని ఆదేశించింది. కడప జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేసి, పోలింగ్ స్టేషన్ నుంచి బయటకి లాగేశారు. అనంతపురం జిల్లా చాపాడు మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికి వైసీపీ నాయకులు మందలు మందలుగా వచ్చారు. వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంతో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. చిత్తూరు జిల్లాలో తమ పోలింగ్ ఏజెంట్లు ముగ్గురిని కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేసింది. 

వైసీపీ కాడె వదిలేసిందా?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ సరిగ్గా పోలంగ్ రోజున కాడె వదిలేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే ఫేక్ హామీలు, ఫేక్ వాగ్దానాలు చేసిందన్న తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఫేక్ వీడియోలకు తెరలేపింది. విడతల వారీగా చంద్రబాబు ఫేక్ వీడియోలను విడుదల చేయడం చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదు, కనీసం కన్ఫ్యూజ్ చేసి ఏదో ఓ మేరకు లబ్ధి పొందాలన్న దుష్ట పన్నాగానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. రిజర్వేషన్లు, పథకాలు..ఇలా ఒకటనేమిటి.. తమ అధినేత వైఫల్యాల నుంచి జనాన్ని డైవర్ట్ చేయాలంటే చంద్రబాబుపై అసత్యాల ప్రచారం ఒక్కటే మార్గమని తలపోసింది.  ఎన్నికల ప్రచారంలో జనం మొహం చాటేసినీ, తామేం చెప్పినా జనం నమ్మేస్తారన్న భ్రమలో మాత్రం వైసీపీ అధినేతలో పోయినట్లు కనిపించడం లేదు.  విజయంపై ఆశలు వదిలేసుకున్న వైసీపీ దింపుడు కళ్లెం ఆశగా చంద్రబాబుపై ఫేక్ వీడియోల ప్రచారానికి పాల్పడింది.  వాస్తవానికి తెలుగుదేశం కూటమిలో బీజేపీ కూడా ఉన్నప్పటికీ ముస్లింలు కూటమివైపే ఉన్నారు. దీంతో వైసీపీ బెంబేలెత్తిపోతోంది. అందుకే రిజర్వేషన్ల విషయంలో జగన్ మాటలకు భిన్నంగా చంద్రబాబుపై ఫేక్ వీడియోల ప్రచారానికి తెరలేపింది. ఇక సంక్షేమ పథకాల విషయంలో కూడా అదే దారిలో నడుస్తోంది. ఇక అమరావతి విషయంలో కూడా వైసీపీ తగ్గేదేలే అన్నట్లుగా ఫేక్ ప్రచారానికి తెరతీసింది. చంద్రబాబు అమరావతి తప్ప మరే పథకాన్నీ పట్టిచుకోను అని చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ ఆడియోను విడుదల చేసింది.  అయితే పాపం సమయం లేకపోవడమో, మరో కారణమో కానీ  ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు వాయిస్  కాదని చిన్నపిల్లాడికైనా అర్ధమైపోయేలా ఉంది.  సరిగ్గా ఓటు వేయడానికి ముందు వెలుగులోకి వచ్చిన ఈ ఫేక్ వీడియోలు, ఆడియోలు చూసిన జనానికి  వైసీపీ  ఊహించిన దాని కన్నా ఘోరమైన పరాజయం ముంగిట ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. చివరి క్షణంలో పోల్ మేనేజ్ మెంట్ చేయాల్సిన వైసీపీ శ్రేణులు కూడా ఈ ఫేక్ ప్రచారం చూసిన తరువాత, పార్టీ హైకమాండే గెలుపు ఆశలు లేవన్న నిర్ణయానికి వచ్చేసింది, ఇప్పుడిక మనం కష్టపడటం ఎందుకని చర్చించుకుంటున్నారు.  

ప్రజలే ప్రజాస్వామ్యం బలం బలగం.. నారా లోకేష్ ట్వీట్

తెలుగురాష్ట్రాలలో ఓటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్న పట్లుదల కనబరిచారు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు మంగళగిరి లో ఓటు వేశారు.  ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం నారా లోకేష్ ప్రజలే ప్రజాస్వామ్యం బలం బలగం అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మార్పుకోరుకోవడం కంటే మర్పు మనతోనే మొదలు కావాలన్న సంకల్పం ముఖ్యం అని పేర్కొన్నారు. మన భవిష్యత్ ముడిపడి ఉన్న ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  ఇక పోతే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సీఎం జగన్ దంపతులు పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

తన్నుకుని తలకలు పోసుకున్న వైసీపీ ఏజెంట్లు!

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాల వారు తన్నుకుని తలకలు పోసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల వారు అంటే వైసీపీ, టీడీపీ వర్గాల వారు అనుకోకండి.. పోలింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం.. వైసీపీకి రెండు వర్గాల వారు తన్నుకున్నారు. ఎక్కడైనా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వర్గాలు ఘర్షణ పడతాయి. అదేంటో నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులే తన్నుకున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పోలింగ్ బూత్‌లో మా వర్గం వారే ఏజంట్‌గా వుండాలంటే, మావర్గం వారే ఏజెంట్‌గా వుండాలంటూ తన్నుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల వారినీ నాలుగు పీకి కంట్రోల్ చేశారు.

వేదాలు వల్లిస్తున్న వైసీపీ దయ్యం!!

దయ్యాలు వేదాలు వల్లించడం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడూ చూసి వుండకపోతే, పోలింగ్ హింస అనే పాయింట్ మీద కడప ఎంపీ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మాటలు వింటే ఆ అదృష్టం కలుగుతుంది. కడప జిల్లాలో పోలింగ్ హింస జరిపేదే జగన్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడే పోలింగ్ హింస జరక్కుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  కడపలో పోలింగ్ హింసకు టీడీపీ కుట్ర చేస్తోందట. పోలింగ్ ప్రారంభంలోనే పులివెందులలో మొదట హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమట. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అలాంటి హింస చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే చంద్రబాబు దీని మీద డైరక్షన్ ఇచ్చారట. తమ అనుకూల అభ్యర్థులు, ఏజంట్లతో హింసకు టీడీపీ ప్రయత్నిస్తోందట. అనుకూల మీడియా ద్వారా ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించేలా వ్యూహం పన్నారట. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హనానికి పాల్పడేందుకు ఈ వ్యూహం పన్నారట. స్వేచ్ఛగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమట, అందుకే ఇలాంటి కుట్రలు పన్నారట. ఎన్నికల సంఘం, పోలీసులు స్వేచ్ఛగా, నిర్భయంగా ఎన్నికలు జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తిచేస్తున్నారట..  ఓరి నాయనా, మీరేం చేయబోతున్నారో ముందుగానే మీడియాకి లీక్ ఇచ్చారన్నమట. మీరు ఈ ఎన్నికలలో ఇలాంటి దారుణాలన్నీ చేసి, వాటన్నటినీ టీడీపీ అకౌంట్లో వేయడానికి ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టేశారన్నమాట. అవినాష్ రెడ్డి పైన పేర్కొన్న దుర్మార్గాలన్నీ చేయడానికి ప్రిపేర్ అయినట్టు అర్థమైపోయింది. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా వుండాలి.

ఓటు వేయడానికి వ్యయప్రయాసలు లెక్క చేయకుండా వస్తున్నారు.. కూటమి విజయం పక్కా!

అరాచక పాలనను అంతం చేయడానికి సమయం వచ్చింది.. కత్తులతో, పోలీస్ లాఠీలతో ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరించిన నియంతను గద్దె దింపేందుకు సమయం ఆసన్నమైంది.. సొంత తల్లినీ, చెల్లెలను ఇబ్బందులు పాలుచేస్తున్న సీఎంకు బుద్ధిచెప్పే అవకాశం వచ్చింది. సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన పార్టీ అధినేతను తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన దుర్మార్గపు సీఎంకు గుణపాఠం చెప్పేందుకు బెల్ మోగింది.. పదండి పదండి పల్లెకు పోదాం.. ఓటు ద్వారా నియంత సీఎంకు గుణపాఠం చెబుదాం అంటూ.. ఏపీ ఓటర్లు పల్లెబాట పట్టారు. ఐదేళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా తమ రాష్ట్రానికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు సన్నద్ధమయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్న ఏపీ ఓటర్లు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై రెండు రోజులుగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి పరిస్థితిని   చూస్తుంటాం. కానీ, ఈసారి సంక్రాంతి పండుగకు మించిన స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేందుకు ఏపీ ఓటర్లు స్వగ్రామాలకు తరలుతున్నారు. వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పరిస్థితిని చూస్తే ఏపీ ఓటర్లు ఇంతమంది బయట రాష్ట్రాలు, దేశాల్లో జీవనం సాగిస్తున్నారా అని ఆశ్చర్యం కలగక మానదు.  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు విడతల వారిగా జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా సోమవారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తం 4కోట్ల 8లక్షల 7వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2కోట్ల 74వేల 322 మంది, మహిళా ఓటర్లు 2కోట్ల 7లక్షల 29వేల 452 మంది ఉన్నారు. 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈసారి ఏపీలోని పార్టీలతో పాటు ఓటర్లు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రంలో సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంటేనే ఈ స్థాయిలో ప్రజలు ఓటు వేయడం కోసం తహతహలాడుతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్ పై ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో ఓటు కోసం తరలి వస్తున్న జన సంద్రమే నిదర్శనం.   వైసీపీ అధికారంలోకి  వచ్చిన నాటినుంచి ఏపీ అన్నిరంగాల్లో వెనుకబడిపోయింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే ప్రజాభవన్ ను కూల్చేశారు, అన్నా క్యాంటీన్లు తొలగించేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. అక్కడి నుంచి జగన్ రాక్షసత్వం బయటకు వచ్చింది. పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధిని పూర్తిగా పక్కకుపెట్టిన జగన్.. ఇసుక, మట్టి, మద్యం మాఫియా ద్వారా వేల కోట్లతో జేబులు నింపుకున్నారు. జగన్ అరాచక పాలనను ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను, సామాన్య ప్రజలను పోలీసుల సహాయంతో అక్రమ అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం, జైల్లో పెట్టించడం చేసిన జగన్.. ప్రజలను భయపెట్టి పాలించారు. జగన్ తరహాలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం రెచ్చిపోవటంతో ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటూ ఏపీలో జీవనం సాగించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.  వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఉద్యోగ అవకాశాలు లేకపోగా.. పనిచేసేందుకు కనీసం పనికూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఏపీలోని యువత, మధ్య వయస్కులు సొంత గ్రామాలను, రాష్ట్రాన్ని వదిలి పక్కరాష్ట్రాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు.  హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు వెళ్లిన ఏపీ ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. వీరంతా జగన్ అరాకచక పాలనకు ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రం వదిలి వెళ్లిన వారే. ప్రస్తుతం వీరంతా ఓటు ద్వారా జగన్ మోహన్ రెడ్డికి బుద్దిచెప్పేందుకు సిద్ధమయ్యారు. సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు గత రెండు రోజులుగా కిక్కిరిపోతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లిన ఏపీ ప్రజలుసైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. ప్రత్యేక విమానాల ద్వారా సొంత ఖర్చులతో ఓటుకోసం తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. కేవలం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనే ఇందుకు కారణం. అవగాహన, అనుభవం లేని పాలనతో రాష్ట్రానికి కనీసం రాజధానికూడా లేకుండా చేయడంతో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.  ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఐటీలో ఉద్యోగాలు చేస్తున్న ఏపీ యువత గతంలో ఓటు అంటే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో గతంలో ఏపీలో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. గత ఎన్నికల్లోనూ 78.8శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. కానీ, ఈసారి కచ్చితంగా ఓటువేసి తీరాలని విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు ఏపీ ఓటర్లు చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఉంది. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కేవలం కక్షపూరితంగా చంద్రబాబును జైలుకు పంపించారు. దీంతో మెజార్టీ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో, దేశంలోని హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై నిరసనగా గళమెత్తారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసన తెలిపారు. తద్వారా చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఓటు ద్వారా జగన్ ప్రభుత్వానికి చరమగీతంపాడి.. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే చంద్రబాబును అధికారంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తద్వారా విదేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.  

కేసీఆర్.. మరో కేఏ పాల్!?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీయే నాకు పోటీ అన్నట్లుగా పీఎం కుర్చీపై గురిపెట్టారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ జరిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు నాలుగు బహిరంగ సభలు పెట్టి ఇక మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. ఇవన్నీ ప్రజలు నమ్మారు. ప్రాంతీయ, జాతీయ మీడియా సైతం కేసీఆర్ మాటలను విశ్వసించింది. కానీ, ప్రస్తుతం ఒక్కసారిగా సీన్ మారిపోయింది. గత ఏడాది జరిగిన తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సీఎం కేసీఆర్ కాస్తా.. మాజీ సీఎం అయ్యారు. కేసీఆర్ మాత్రం ఇంకా తానే సీఎంను అనే భ్రమల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తన ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ ప్రసంగాలు చూస్తే అదే విషయం తేటతెల్లం చేస్తున్నాయి.  తాజాగా కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాటలు రాజకీయ వర్గాలలో నవ్వులు పూయించింది. జనబాహుల్యంలో ఆయనను నవ్వుల పాలు చేసింది.   తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ మాటలు  ప్రతి ఒక్కరూ విశ్వసించే వారు. ఎందుకంటే.. ఆయన చెప్పిన మాటలు కార్యరూపం దాల్చేందుకు ఆస్కారం ఉండేది. కానీ, అధికారం కోల్పోయిన తరువాత కూడా తాను చెప్పిందే జరుగుతుంది అనే తరహాలో కేసీఆర్ వ్యాఖ్యలు, తీరు  ఉండటం బీఆర్ఎస్ శ్రేణులకు కూడా మింగుడు పడటం లేదు. కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో లేరు. అంతేకాక, అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన పక్కన ఉన్న ప్రజాబలం, పేరున్న నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. రోజు రోజుకూ బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహించని కేసీఆర్ వాస్తవానికి దూరంగా వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఏపీలో వైసీపీకి 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయని జగన్ చెప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామని చెప్పుకోవచ్చు. కానీ, తన పరిధి దాటేసి.. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే.. అవకాశం వస్తే ప్రధాని రేసులో తానూ ఉంటానంటూ చెప్పుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేసీఆర్ అధికారాన్ని కోల్పోయినప్పటికీ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.  కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను చూస్తే ఎవరికైనా కేఏ పాల్ గుర్తుకొచ్చే ఉంటారు. ఎందుకంటే.. కేఏ పాల్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన మతబోధకుడు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల అధినేతలు సైతం ఒకప్పుడు కేఏ పాల్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూడాల్సి వచ్చేందన్నది జగమెరిగిన సత్యమే. కానీ, ప్రస్తుతం కేఏ పాల్ పరిస్థితి ఏమిటి. ఊహకు కూడా అందని విధంగా కేఏ పాల్ మాట్లాడటంతో ప్రజలు ఆయన్ను విశ్వసించడం మానేశారు. రాజకీయాల్లో మన స్థాయిని గుర్తెరిగి మాట్లాడాలి. కానీ, కేఏ పాల్ ఆచరణకు సాధ్యంకాని హామీలు, వాగ్దానాలతో ప్రసంగాలు చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంతో  ఆయన్ను తెలుగు ప్రజలు ఓ జోకర్ గా భావిస్తున్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు అదే పరిస్థితి ఎదువుతుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.   ప్రధాని మంత్రిని అవుతానని కేసీఆర్ చెప్పడంతో ఆయనను పాల్ తో పోలుస్తూ సెటైర్లు పేలుతున్నాయి.   

నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!

ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర దేవాలయంలో ఒక వ్యక్తి నాలుక కోసుకున్నాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. నాలుక కోసుకునే ముందు అతను ఒక లేఖ రాశారు. అందులో ‘‘నా పేరు చెవల మహేశ్. మాది పశ్చిమ జిల్లా గూటల గ్రామం. నేను గతంలో రాజశేఖరరెడ్డి, జగన్ ముఖ్యమంత్రి కావాలని ఇక్కడే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నా.  ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, పవన్, లోకేశ్ గెలవాలని నాలుక కోసుకున్నా’’ అని రాశాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దేశానికి కావలసింది ఇలాంటి వాళ్ళు కాదు.. ఇలాంటి వారి తెలివితక్కువ త్యాగాలు చూసి సంతోషించేవారు ఎవరూ లేరు. ఈయన ఎవరు ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారన్న భ్రమలేవో వున్నట్టున్నాయి. ఇలాంటి వారి మొక్కులు రాజశేఖర్ రెడ్డికి, జగన్‌కి కావాలేమోగానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కి అక్కర్లేదు. నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!!

జగన్‌కి పిఠాపురం ఎమ్మెల్యే షాక్!

ఎన్నికల ముందు రోజున జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు ధిక్కార స్వరం వినిపించారు. పిఠాపురం నుంచి తప్పుకుని వంగా గీతకు సపోర్ట్ చేస్తే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, అదే విధంగా వంగా గీతని కూడా మినిస్టర్ని చేస్తానని హామీ ఇచ్చారని, ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవి ఎలా ఇస్తారు? నాకు ఇచ్చిన హామీ మోసమా లేక వంగా గీతకు ఇచ్చిన హామీ మోసమా అని దొరబాబు ప్రశ్నించారు. దొరబాబు తిరుగుబాటు చేయడంతో దొరబాబుకు సంబంధించిన ఓట్లు వంగా గీతకు పడవు అని తేలిపోయింది. దొరబాబు అదృష్టం ఏమిటంటే, వైసీపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి, తనకు మంత్రి పదవి రాదు.. వంగా గీతకీ రాదు.. శుభం.