ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

  ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్ల పై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్‌మెంట్లలో అత్యధిక మోసపూరిత టిక్కెట్స్ ను గమనించింది. రైల్వే పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్ణయాత్మక చర్యలో భాగంగా రిజర్వ్ చేయని టిక్కెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది.  ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా ప్రయాణికులు ఇకపై తమ ఫోన్‌లలో రిజర్వ్ చేయని టిక్కెట్లను చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వేలు ఒక నియమాన్ని రూపొందించాయి. బదులుగా, టికెట్ భౌతిక ప్రింటౌట్ ఇప్పుడు తప్పనిసరి. టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా దోపిడీకి గురవుతున్న లొసుగులను మూసివేయడం లక్ష్యం.

గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ కోసం ఎంపీల వినతి

  గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రిని కోరారు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుందని, అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. అలాగే, కొండపల్లి రైల్వే స్టేషన్ వద్ద నీటి సమస్యను పరిష్కరించి, రైళ్ల రాకపోకలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి నిర్ణయం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో శాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. వినతిపత్రం సమర్పించారు.  గొల్లపూడిలో శాటిలైట్/హాల్ట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్ పై భారం తగ్గుతుందని ఎంపీలు వివరించారు. ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బల్బ్‌లైన్స్‌ చుట్టూ ఖాళీ స్థలాలున్నాయని, వాటిని రైల్వే అవసరాలకు సులభంగా సేకరించవచ్చని రైల్వేమంత్రికి వివరించారు. ఈ ప్రాంతం కొత్త రైలు, వాయుమార్గాలతో అనుసంధానం కానుందని.. అమరావతి రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికి అన్ని సౌకర్యాలకు సెంటర్‌గా ఉంది కాబట్టి, గొల్లపూడిలో హాల్ట్/శాటిలైట్ స్టేషన్ నిర్మించాలన్నారు.  అంతేకాదు కొండపల్లి రైల్వేస్టేషన్ దగ్గర నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్‌పై నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఎంపీలు కోరారు. ఈ రెండు సమస్యల పరిష్కారం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుండి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌పై మురుగునీరు, వర్షపునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు వివరించారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఇక్కడ నీరు నిలిచిపోతోందని, దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రికి తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, ట్రాక్‌ పక్కన డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు నిర్మించి వర్షపునీరు సులభంగా వెళ్లిపోయేలా చూడాలని వారు కోరారు. ఇందుకోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎంపీల ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగునీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి వివరించాను. వర్షాకాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్వర్క్, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, కాలువలు అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట మురుగు నీరు నిల్వ‌వుంటుంద‌ని తెలియజేశాను.. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు ముఖ్యంగా కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపాను.  ఈ ప్రతిపాదనకు అమల్లోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు, స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశభావం వ్యక్తం చేశాను.. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు' అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.  ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలా రియాక్ట్  అవుతారో చూడాలి.

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు

  మాజీ మావోయిస్టు,  సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో ఇంటర్వ్కూలు ఇవ్వడం, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో  మవోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామానికి వెళ్లి రావడం  వంటి అంశాలపై విచారిస్తున్నారు.  మవోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నాందున ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి గాదే ఇన్నయ్యను  అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మరణించిన మవోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియాలకు ఇన్నయ్య హాజరయ్యారు.   

జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

  వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా సీఎం చంద్రబాబు జన్మదిన  శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. జగన్‌కు దేవుడు మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.  అన్నగా సంబోధించకుండా శుభాకాంక్షలు తెలిపారు. “వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా, పవన్, షర్మిల ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు, నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇంద్రకీలాద్రి భక్తులకు ఇకపై ఆన్‌లైన్‌లో అన్ని సేవలు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం, పారదర్శకత పెంచడానికి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది . భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా పారదర్శకత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విజయవాడ దుర్గగుడిలో ఇకపై దర్శన టిక్కెట్లు, అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇకపై భక్తులు తమ దర్శన టిక్కెట్లను, ఇతర సేవలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన సేవలు, అలాగే ఆలయానికి ఇచ్చే విరాళాలు కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారానే స్వీకరిస్తారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు నగదు రహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ ఈవో శీనానాయక్‌ తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం ఈ డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టామన్ానరు. ఈ మార్పుల వల్ల ఆలయ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.. భక్తులు ఈ కొత్త విధానాన్ని అర్థం చేసుకుని, సహకరించాలని కోరారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ల విక్రయాల్లో అక్రమాలకు చెక్ పడింది. భక్తుల కోసం అన్ని డిజిటల్‌ పేమెంట్‌ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దుర్గమ్మ భక్తులు తమ టిక్కెట్లను సులభంగా కొనుగోలు చేయడానికి వీలుగా, రెండు వెబ్‌సైట్లు, ఒక మొబైల్ యాప్, ఒక వాట్సప్ నంబర్ అందుబాటులో ఉంటాయి. ఈ డిజిటల్ సేవలు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.  భక్తులు www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా ముందుగానే టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కనకదుర్గమ్మ ఆలయ మొబైల్‌ యా‌ప్‌‌తో పాటుగా మనమిత్ర వాట్సప్‌ సేవ: 9552300009 ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది.  దీనిలో భాగంగా, ప్రతిరోజూ ఏ ఆలయంలో ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులు జరిగాయో ర్యాంకులు ఇస్తున్నారు. ఈ క్రమంలో, ప్రతిరోజు ఆన్‌లైన్ చెల్లింపుల్లో అత్యధికంగా రాణించిన ఆలయాలకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా, ఇటీవల బుధవారం ప్రకటించిన ర్యాంకుల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. విజయవాడ దుర్గగుడి 947 ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. దుర్గమ్మ ఆలయంతో పాటుగా శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇలా అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల కోసం ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రధాన ఆలయాలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత అల్పానికి పడిపోయాయి. జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడా అదే పరిస్థితి నెలకొంది. శనివారం (ఈ నెల 20) తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో అత్యంత అల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పదేళ్ల రికార్డు స్థాయిలో చలి బెంబేలెత్తిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో అత్యంత అల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, గత ఏడాది ఇదే ప్రాంతంలో 17.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూలో కూడా గత కొద్దిరోజుల నుంచి గడ్డ కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్‌లో 10 డిగ్రీలు, మహాబూబ్‌నగర్‌లో 5.4, మెదక్‌లో 5.4 ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రతి చోటా సాధారణం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉండనుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎజెన్సీ ప్రాంత ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. చలి వాతావరణం కారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వెచ్చటి ప్రాంతాల్లోకి పరుగులు తీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్, విజయవడ వంటి సిటీల్లో కూడా ఉష్ణోగ్రతలు 16కు పడిపోతూ జనాన్ని వణికిస్తున్నాయి.

ఏపీ పర్యాటకులకు గుడ్‌న్యూస్...త్వరలో ఆంధ్రా ట్యాక్సీ యాప్

  ఆటో ట్యాక్సీ రంగంలో కూడా ప్రభుత్వ వాహనాలు ఉంటే బాగుండు.. చౌకగా, సౌకర్యవంతంగా వెళ్లిపోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. వారి ఆశలు నిజం కాబోతున్నాయి. ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా ప్రయాణికులు చౌకగా, సురక్షితంగా ఆటో, ట్యాక్సీ సేవలు పొందవచ్చు. విజయవాడలో ప్రైవేటు ఆటో, ట్యాక్సీల నుంచి పర్యాటకుల దోపిడీని అరికట్టేందుకు, డ్రైవర్లకు స్థిరమైన ఉపాధి కల్పించేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.  యాప్ ద్వారానే కాకుండా వాట్సప్, ఫోన్ కాల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చాలా చౌక. కానీ అదే స్థానికంగా ఉండే ప్రాంతాలకు ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు చెప్పే ధరలు వింటే. మరీ ముఖ్యంగా మెట్రో నగరాలు, సిటీల్లో.. చాలా దగ్గర దగ్గర దూరాలకు కూడా భారీ మొత్తంలో వసూలు చేస్తుంటారు. ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ క్యాబ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రయాణికులు చాలా చౌకగా.. సురక్షితంగా ప్రయాణాలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా.. ఆంధ్రా ట్యాక్సీ అనే ప్రభుత్వ పోర్టల్, యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా జనాలు ఆటో, ట్యాక్సీలో కూడా తక్కువ ధరలకే ప్రయాణాలు చేయవచ్చు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో 'ఆంధ్రా ట్యాక్సీ' అనే ప్రభుత్వ పోర్టల్/యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గ గుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు చౌకగా, సురక్షితంగా రవాణా సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. విజయవాడ వచ్చే పర్యాటకులు, భక్తుల వద్ద నుంచి స్థానిక ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ట్యాక్సీ యాప్ ‌ ద్వారా మోసాలను అరికట్టి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా.. పర్యాటకం వృద్ధి చెందడం మాత్రమే కాక.. వాహనదారులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ ద్వారా.. ఆటో, క్యాబ్‌లను.. యాప్, వాట్సప్, ఫోన్‌కాల్, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన ప్రాంతాన్ని యాప్‌లో నమోదు చేస్తే, అక్కడ రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి.  ఆ యాప్లో కనిపించే డ్రైవర్లను అధికారులు ముందే అన్ని రకాలుగా చెక్ చేసి.. ఆ తర్వాత అనుమతిస్తారు. అలానే రవాణా శాఖ అధికారులు పరీక్షించి, ఫిట్‌నెస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ ఆంధ్రా ట్యాక్సీలో అవకాశం కల్పిస్తారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ఈ యాప్‌ను రూపొందించారు. యాప్‌లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది.  దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది. విజయవాడతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు రవాణా సేవలతో పాటు, హోటల్ గదులను కూడా ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం ప్యాకేజీలను కూడా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా డ్రోన్ సేవలను కూడా అందించనున్నారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

  ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికారులు ఆర్టీఓ కార్యాలయంలో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో ఆర్టీఓ కార్యాలయంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న 13 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వివిధ సేవల కోసం దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసినట్లు అనుమానిస్తున్న రూ.78,120 లెక్కలేని నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏజెంట్ల స్వాధీనంలో 837 అసలు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RCలు) అసలు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమవడం సంచలనంగా మారింది.  తనిఖీల్లో ఆర్టీఓ కార్యా లయంలోని హాజరు రిజిస్టర్, నగదు రిజిస్టర్ సహా పలు అధికారిక రిజిస్టర్లు సరిగా నిర్వహించబడటం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, అనధికార ఏజెంట్లు ప్రభుత్వ కార్యాల యానికి సంబంధించిన అసలు పత్రాలను నిర్వహిం చడం తీవ్ర విధానపరమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.  ఏజెంట్లు స్వేచ్ఛగా పనిచేయడానికి, అసలు పత్రాలు నిర్వహిం చడానికి అనుమతించడం వల్ల అవినీతి పెరిగి, దరఖాస్తుదారులు వేధింపు లకు గురవుతున్నారని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరియు ఇందులో పాల్గొన్న ఇతరులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ చేస్తే 1064కి ఫోన్ చేయండిప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేస్తూ,ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని కోరింది.  

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు

  సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు కఠిన శిక్ష విధించడం అటు పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది.  ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పులు వెలువరించడం గమనార్హం. 2021 మే నెలలో సౌదీలో ఇమ్రాన్ పర్యటించారు. 2021 మే నెలలో సౌదీ అరేబియా పర్యటించిన సందర్భంగా యువరాజు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఖరీదైన ‘బల్గరి’ నగల సెట్‌ను బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ ఖాజానాకు అప్పగించకుండా ఇమ్రాన్ అతని భార్య బుష్రా సొంత ప్రయోజనం కోసం తక్కువ ధరకు విక్రయించినట్లు వచ్చిన ఆరోపణపై కేసు నమోదైంది.  ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ సంచలన తీర్పు ప్రకటించారు. ప్రధాని హూదాలో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడినందుకు పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 కింద 10 ఏళ్లు కఠిన శిక్ష, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 7 ఏళ్లు సాధారణ శిక్ష విధించారు. అంతేకాదు దంపతులకు చెరో రూ.16.4 మిలియన్ జరిమానా కూడా విధించారు. ఈ తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ మరో పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ తీర్పును హై కోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ తరుపు న్యాయవాది తెలిపారు.

ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశాన్ని అందించారు : సీఎం రేవంత్‌రెడ్డి

  ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు.  తెలంగాణలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సోనియాగాంధీ కూడా ఇదే నెలలోనే జన్మించారు.  ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ అన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చింది. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం.  ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా 50లక్షల మంది పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టాం.ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా ఏసు ప్రభువు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో  7వేల చర్చిలకు  రూ.30వేల చొప్పున క్రిస్మస్‌ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించామని మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దీపక్‌ జాన్‌ తెలిపారు. ఈ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు

  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి శనివారం రోజు నాంపల్లిలోని ప్రజాప్రతి నిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గతంలో తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి విచారణలో భాగంగా సిఎం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావడం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ లో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించా రనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసుతో పాటు తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ వివిధ కారణాలతో సిఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోద య్యాయి.ఈ కేసులన్నీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా పెట్టినవని పేర్కొంటూ, వాటిని కొట్టి వేయాలంటూ ముఖ్యమంత్రి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో కొనసాగుతున్న విచారణకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై తన వాదనలను వినిపించారు.  ముఖ్యమంత్రి హాజరు సందర్భంగా పోలీస్ యంత్రాంగం కోర్టు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ఈ కేసులపై కోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సీపీ సజ్జనార్ షాక్

  హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ ఊహించని షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో పెద్ద ఎత్తున బదిలీలు జరగడంతో సంచలనం సృష్టించాయి. ఎస్సై స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు వివిధ ర్యాంకులకు చెందిన అధికారులను టాస్క్‌ఫోర్స్ నుంచి అటాచ్‌మెంట్‌పై ఇతర విభాగాలకు పంపించారు. కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లోనే కొనసాగుతూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిం చాయి. ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకు న్నాయి. ప్రత్యేకంగా ఒక కేసులో నిందితుడిని తప్పించేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. ఈ వ్యవహారం శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చే స్థాయికి చేరిందని భావించిన హైదరాబాద్ సిపి సజ్జనార్, టాస్క్‌ఫోర్స్‌లో సమూల మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ను మరింత పారదర్శకంగా, సమర్థంగా పనిచేసే విభాగంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సీపీ అవినీతి ఆరోపణల పై అంతర్గత విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో టాస్క్‌ఫోర్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమ్మాయిల ఫోటోలతో డాక్టర్‌కి....14 కోట్లు కుచ్చుటోపి

  సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటన కలకలం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ని టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు ముందుగా అందమైన యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి  కంబోడియా నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో ముందుగా ఓ మహిళ పేరుతో నకిలీ ఖాతా ద్వారా డాక్టర్‌కు మెసేజ్ పంపించారు. అందమైన అమ్మాయి దీంతో డాక్టర్ ఆమెతో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తాను ఒంటరి మహిళనని, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న ఆ మహిళ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో తమ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ మహిళ మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టగా, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మరింత డబ్బు పెట్టేలా ప్రోత్సహించారు. చివరకు ఆమె చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ తన ఇల్లును కూడా అమ్మి మొత్తం రూ.14 కోట్లు పెట్టుబడిగా జమ చేశారు. అయితే ఆ తర్వాత అకౌంట్లలో నుంచి డబ్బు మాయమవ్వడంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ మోసానికి కంబోడియాలో తిష్ట వేసిన చైనీస్ సైబర్ నేరగాళ్లే ప్రధాన కారణమని గుర్తించారు. కంబోడియా నుంచే ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు ఉపయోగించి డాక్టర్‌ను ట్రాప్ చేసినట్లు తేల్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాలుగు మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్లలోకి డాక్టర్ పంపిన డబ్బును జమ చేసి, వివిధ మార్గాల ద్వారా కంబోడియాకు తరలించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.... “చైనీస్ సైబర్ గ్యాంగ్‌లు కంబోడియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భారత్ నుంచి యువకులను ఉద్యోగాల పేరుతో అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మన దేశానికి చెందిన వారినే ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతు న్నారని ఏసీపీ ప్రసాద్  తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు, లింక్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దని సైబర్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మోసపో యిన లేదంటే ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రుషికొండకు బోడిగుండు కొట్టి... యోగా దినోత్సవంపై విమర్శలా? : సీఎం చంద్రబాబు

  రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు...ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్ట్ తయారీ యార్డును సందర్శించారు.  అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి.  గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.  ఈసారి పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం థీమ్‌గా తీసుకున్నాం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది. సమగ్ర ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుంది. వ్యర్థాలు-మురుగు నీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్టింగ్, పారిశుధ్య సేవలు, హరిత ఉత్పత్తులు, సర్క్యులర్ ఎకానమీ కార్యకలాపాలు...ఇవన్నీ స్థానికంగా ఉపాధి కల్పించేవే.  ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చాం. పొడి, తడి చెత్తను వేరు చేయడంపై చాలామందిలో అవగాహన వచ్చిందని పలువురు పారిశుధ్య కార్మికులు స్వయంగా నాకు చెప్పారు.  వ్యర్థాలను వనరుగా, సంపదగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అసలైన అర్థాన్నిచ్చాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పారిశుధ్య కార్మికులే నిజమైన సైనికులు. అందుకే వారి  గౌరవం పెరిగేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది.  ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1,257జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ  ‘గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త మొత్తం తొలగించాం. 2026, జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఏపీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్ట్ తయారీతో ఏ రోజు చెత్తను ఆరోజు ప్రాసెస్ చేస్తున్నాం. జనవరి 26 నాటికి రాష్ట్రంలో రోడ్డుపై చెత్త అనేది కనపడకూడదు. ఫ్రిబ్రవరి 15 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో   ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తాం. అక్టోబర్ 26 నాటికి పొడి,తడి చెత్త వేరు చేయడం 100 శాతం పూర్తి కావాలి. గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  ఇంటి వ్యర్థాలను కంపోస్ట్ గా తయారు చేసుకొని కూరగాయలు పండించుకోవచ్చు. వీలైనంత వరకూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  వచ్చే ఏడాది అక్టోబర్ 2 తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ కనపడకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలో మరో 100 ప్రారంభిస్తాం. ప్రతీ ఉమ్మడి జిల్లాకు 6 నుంచి 8 చొప్పున స్వచ్ఛ రథాలు కేటాయిస్తాం.  స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశాక గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంట్లో చెత్త తీసి రోడ్డుపై వేసే అలవాట్లు మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థికంగా దెబ్బతీశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేశాం. ప్రధాని మోదీ, మిత్రులు పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నాతో సహా నేతలు, కలెక్టర్లు, ఎస్పీలు సహా గ్రామస్థాయి అధికారి వరకు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపంచమంతా విశాఖ వైపే చూస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారబోతున్నాయి.  ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఎంవోయూలు కుదిరాయి. SIPB ద్వారా మరో రూ.8.29 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా మొత్తం 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సులో అనకాపల్లి జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు కుదిరాయి. విశాఖకు గూగుల్ వస్తోంది.  ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. టిసిఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థ జిల్లాలో పెట్టుబడి పెడుతోంది. రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కు విశాఖ కేంద్రం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 

నవ దంపతుల మృతి ఘటనలో కొత్త ట్విస్ట్!

  కొత్తగా పెళ్లయిన ఈజంట... ట్రైన్లో సరసాలు ఆడుతూ సరదాగా గడిపారు. సంతోషంగా కనిపిస్తున్న ఈ నవ దంపతుల సంతోషం కొద్దిసేపట్లో ముగిసిపోతుందని ఎవరైనా ఊహించగలరా.... కొన్ని  క్షణాల్లోనే ఆ ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారా ఎవరైనా ఊహిస్తారా... కానీ ఎవ్వరూ ఊహించలేనిది ఆ ట్రైన్ లో ఒక్కసారిగా జరిగేసరికి ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారందరూ ఉలిక్కిపడ్డారు... ట్రైన్ లో నవవరుడు భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సరదాగా గడుపు తున్న సమయంలో ఈ నవజంట ఒక్కసారిగా అదుపు తప్పి ట్రైన్ నుండి కింద పడిపోయి మృత్యువాత పడ్డారు.  ఇది చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.  ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గం లో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది .మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా రైల్వే పోలీసులు గుర్తించారు.  ట్రైన్లో ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్నా సమయంలో కొందరు వీడియో తీశారు... ఈ నవజంట మృత్యువాత పడిన అనంతరం ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి... ఈ వీడియోలను చూసిన ఇరు కుటుంబ సభ్యులు బోరున వినిపించ సాగారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ యువ దంపతులు క్షణాల్లోనే మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

టీ20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా జట్టు ఇదే.. శుభమన్ గిల్ కు ఉద్వాసన

టి20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. వరల్డ్ కప్ కు ప్రకటించిన జట్టే న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఎంపికయ్యింది.  విశేషమేంటంటే.. టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు ఈ జట్టులో స్థానం దక్క లేదు.   ఇలా ఉండగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లో విఫలమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అంతే కా కుండా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్ గాఅక్షర్ పటేల్ ను నియమించారు.   ఇషాన్ కిషన్‌ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా,  సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.

కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా... పవన్ సంచలన వ్యాఖ్యలు

  తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని నన్ను విమర్శించారు. ప్రజల కోసమే తాను సీట్లు తగ్గించుకున్నా అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటా..బెదిరించే నాయకులకు భయపడను. యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు అని పవన్  తెలిపారు. అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములుని సదా  స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశామని పవన్ తెలిపారు.  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం... మీకు  యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్.    ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయిందని పవన్ తెలిపారు. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని తెలిపారు.   కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్న పిల్లల మధ్య సామాజికవర్గాల పేరిట చిచ్చు పెట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించామని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించామని ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే దానికి కారణం ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ. ఆయన సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు  అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని తెలిపారు.   

విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా

  విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా  అటల్ బీహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్  ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారు.  అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.