ఏముంది మునగాకులో..?

‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే... 100 గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. అంటే 20 గ్రా. మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ, సి - విటమిన్లూ, 100 గ్రా. ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి. అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌. అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది. ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, వ్యాధులన్నీ పారిపోతాయి.

నేరేడు... రోగ నివారిణి

  నేరేడు లేదా గిన్నె చెట్టు (Jamun) ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, మరియు ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది.  అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు.  సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం..వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్‌ దీని శాస్త్రీయ నామము. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. ఒక్క పండే కాదు..నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట,దురదలు,సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది. బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్‌.ఎల్‌ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్‌.ఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది.   జాగ్రత్తలు:  నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు. పండ్లతో పచ్చళ్ళు, జామ్ లు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు.నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారుచేయుటకు వాడతారు. చెట్టు బెరడులో మరియు విత్తనాలలో 13- 19 % వరకు టానిన్లు ఉంటాయి. విత్తనం నుండి తీసిన రసం అధిక రక్తపోటును నయం చేస్తుంది. ఇవి కొంతవరకు మధుమేహంలో కూడా పనిచేస్తాయి...కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలానే ఇవి రక్తక్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి. నేరేడు పండ్లలో అధికమోతాదులో సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌, మాలిక్‌ యాసిడ్లు తగిన లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అనీమియా (రక్తహీనత) తగ్గిస్తాయి. కాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్- సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధినిరోధకశక్తిని ఇవ్వడమేకాక ఎముకలకు పుష్టిని ఇస్తుంది. నేరేడు పండుకు గుండెవ్యాధులను నివారించే శక్తి ఉంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. నేరేడు పండ్లలో గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహవ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు ఆకులు మరియు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి.అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్‌కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు,చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది మాత్రమే కాదు. దీనికి రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది. పోషకాలు (వందగ్రాముల్లో) తేమ: 83.7గ్రా,  పిండి పదార్థం: 19 గ్రా,  మాంసకృత్తులు: 1.3గ్రా,  కొవ్వు: 0.1గ్రా,  ఖనిజాలు: 0.4గ్రా,  పీచుపదార్థం: 0.9గ్రా,  క్యాల్షియం: 15-30మి.గ్రా,  ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా,  సల్ఫర్‌: 13మి.గ్రా,  విటమిన్‌ సి: 18మి.గ్రా.   నేరేడుపండ్లలోరకాలున్నాయి. 1. గుండ్రంగా పెద్దగ వుండే ఒక రకం.  2. కోలగా వుండి పెద్దగా వుండే రకం. వీటిని అల్ల నేరేడు అని అంటారు. 3. గుండ్రంగా వుండి చిన్నవిగా వుంటాయి. వీటి చిట్టి నేరేడు అని అంటారు.  

పేను కొరుకుడుకి కారణాలు... నివారణ ఎలాగో తెలుసుకుందాం!

    పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.   కారణాలు:  ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.   *ఆయుర్వేద చికిత్సా: కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది. ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే..... జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజలు: గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. * మందార ఆకులు పూలతో నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది. పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి. పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి. మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు. ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది. ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి. ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో    ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంది.

వడదెబ్బ నివారణ కొరకు సులభ యోగాలు..

  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.   ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.    *  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.      * వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .   *  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును.      *  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.    *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు.    * వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును.    *  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును.      * వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను .    *  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.    *  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను .    *  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను.    *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .      *  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను .    *  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.

బడిలో బహుపరాక్‌

  బడులు తెరిచేశారు. చదువుల పండుగ మొదలైంది. కొత్త పుస్తకాలు కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, యూనిఫారాలను సిద్ధం చేసుకోవడం... ఇవన్నీ తల్లిదండ్రులు దగ్గరుండి సాగించే క్రతువులు. ఇంట్లో పిల్లలను మనం కంటికి రప్పలా కాపాడుకుంటాం. కానీ బడిలో వారు ఎలా ఉంటున్నారో, ఎలాంటి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారో గమనిస్తూ ఉండటం ఏమంత తేలిక కాదు. అసలే పిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎలాంటి వ్యాధినైనా ఇట్టే పట్టేసుకుంటారు. పిల్లలకు జబ్బు చేస్తే వారికే కాదు, కన్నవారికీ బాధే. అందుకని బడిలో కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.   - బడులు మొదలవుతూనే వర్షాకాలం కూడా మొదలవుతుంది. ఈ కాలంలో జలుబూ, దగ్గు వంటి అంటువ్యాధులు అతిసాధారణంగా ఒక పిల్లవాడి నుంచి మరో పిల్లవాడికి చేరిపోతాయి. కాబట్టి పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. చ్యవన్‌ప్రాస్, పాలు, బాదం పప్పు, ఆకుకూరలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారం మీద మరింత దృష్టి పెట్టాలి.   - పిల్లలకి కర్చీఫ్‌ వాడటాన్ని తప్పకుండా అలవాటు చేయాలి. తాము దగ్గేటప్పుడో, ఎదుటివారు దగ్గేటప్పుడో కర్చీఫుని నోటి అడ్డం పెట్టుకోమని గుర్తు చేయాలి. చేతిరుమాలుని బడిసంచిలో కాకుండా జేబులోనే ఉంచుకునే అలవాటు కలిగించాలి.   - అన్నం తినేముందరా, ఆటలాడుకున్న తరువాతా, మూత్ర విసర్జన చేశాకా.... శుభ్రంగా చేతులు కడుక్కోమని చెప్పాలి. చేతులు కడుక్కోవడం అంటే అంటురోగాలను సగానికి సగం దూరం చేసుకోవడం అన్న నమ్మకాన్ని కలిగించాలి.   - పిల్లవాడికి కండ్ల కలక ఉంటే బడికి పంపకపోవడమే మేలు. ఒకవేళ బడిలో కండ్ల కలకలు ఉంటే... చేతులు తరచూ శుభ్రం చేసుకోమనీ, వీలైనంతవరకూ చేతులతో కంటిని తాకవద్దనీ హెచ్చరించాలి.   - పిల్లలకి చర్మవ్యాధులు చాలా సులభంగా అంటుకుంటాయి. ఇతర పిల్లల ద్వారాగానీ, మట్టిలో ఆడుకునే అలవాటు వల్లగానీ ఈ వ్యాధులు రావచ్చు. కాబట్టి సాక్స్‌తో సహా పిల్లల దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వారు స్నానం చేసేటప్పుడు చర్మవ్యాధులకు సంబంధించిన కురుపులు కానీ, దద్దుర్లు కానీ ఉన్నాయేమో గమనించుకోవాలి.   - పిల్లల్లో ఫ్లూ, ఆటలమ్మ తదితర టీకాలు వేయించారో లేదో గమనించుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకూ సంబంధిత టీకాలను వేయించకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. దాని వల్ల బడిలోని ఇతర పిల్లల నుంచి అంటువ్యాధులు సోకకుండా నివారించవచ్చు.   - పిల్లలకి నీళ్ల బాటిళ్లను కరచుకుని తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల కూడా అంటువ్యాధులు వ్యాపించవచ్చు. అందుకని ఎవరి నీళ్ల బాటిల్ వారే వాడుకోమని పిల్లలను హెచ్చరించాలి.   - పిల్లలను దింపడానికి వెళ్లేటప్పుడు బడిలోని నీటి లభ్యతా, టాయిలెట్ల సౌకర్యం సరిగా ఉందో లేదో ఓ కన్ను వేయాలి. అపరిశుభ్రమైన పరిసరాలు, సౌకర్యాలూ ఉంటే వాటిని బడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లేందుకు జంకకూడదు.   - పిల్లవాడు కొత్తబడిలో చేరిఉంటే వీటికి అదనంగా అతని మానసిక ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొత్తబడిలోని వాతావరణానికి అతను అలవాటుపడేవరకూ అతనికి అండగా ఉండాలి.   - నిర్జర.

గుప్పెడు గుండెకు ..గ్లాసుడు జ్యూస్

ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50 శాతానికి పైగా, అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.  కాబట్టి అధిక రక్త పోటును అదుపులో వుంచగలిగితే గుండెకు ముప్పు తగ్గినట్టే.  అందుకు వ్యాయామం , మంచి ఆహరం ముక్య సూత్రాలు . వీటితో పాటు  ఉదయాన్నే ఓ గ్లాసుడు జ్యూస్ తాగండి చాలు అంటున్నారు పరిశోధకులు. ఏ ఏ జ్యూసులు గుండెకు మంచివంటే .. * బీట్రూట్ పేరు వినగానే, మొహం చిట్లిస్తారు చాలామంది. కాని రోజు ఉదయాన్నే ఓ చిన్న  గ్లాసు బీట్రూట్ రసం తాగితే రక్త పోటు అదుపులో ఉంటుందట. బీట్రూట్ లో వుండే నైట్రేట్ కంటెంట్ రక్త నాళాలని శుభ్రపరచి అవి విచ్చుకునేలా చేస్తుంది అంటున్నారు లండన్ స్కూల్ అఫ్ మెడిసిన్ పరిశోధకులు . * యూనివర్సిటీ అఫ్ వేస్కోసిన్ పరిశోధకుల ప్రకారం రోజుకి ఒక గ్లాసుడు ద్రాక్ష రసం చాలు గుండె గట్టిగా ఉండటానికి .  ద్రాక్ష రక్త నాళాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుందట . దాంతో రక్త సరఫరా సజావుగా సాగుతుంది.  అంతేకాకుండా బ్యాడ్ కొలస్ట్రాల్ ని కూడా తగ్గించగలదు. రక్తనాళాలలో ఆటంకాలు వంటి ముప్పు తగ్గుతుంది.  * ఇక ఫ్రెంచ్ వైద్య నిపుణులు కమలా రసం తప్పక తాగాలి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అంటున్నారు. కమలాల లో వుండే హెస్పిరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధ పడేవారు రోజు ఈ జ్యూస్ తాగితే నెలరోజుల్లో రక్త పోటులో తరుగుదల కనిపిస్తుందని తేలింది వీరి పరిశోధనలలో . అయతే బిపి తో పాటు షుగర్ కూడా వుంటే మాత్రం ఒకసారి వైద్యుల సలహా తీసుకోవటం మంచిది అంటున్నారు. చివరిగా ఒక్క మాట జ్యూస్ లు మంచివన్నారు కదా అని వాటిలో ఇంత పంచదార వేసుకుని తాగకండి అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు.  పంచదార ఏ రకంగా చూసినా మంచిది కాదని తెలిసిందే గా . అందులోనూ జ్యూస్ ల లో కొంచం ఎక్కువ మొతాదులోనే వేస్తారు . కాబట్టి ఒట్టి రసాలని తీసుకు తాగండి ..గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి .

సూర్యుడు ఎంతసేపు ఉంటే అంత ఆరోగ్యం

  మన పూర్వీకులు సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించేవారు. ఇప్పటికీ సూర్యడు అంటే హిందువులకు భగవానుడే. ఆయన లేకుండా సృష్టిలోని జీవకోటి మనుగడ లేదన్న విషయం తెలిసిందే! కానీ సూర్యుడు ఆకాశంలో ఎంతసేపు ఉంటే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారన్న విషయం తెలుసా...   ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి: మార్క్‌ బీచర్‌, లారెన్స్‌ రీస్‌, డెనిస్‌ ఎగెట్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి సూర్యకాంతి మీద ఓ పరిశోధన చేశారు. ఇందులో ఒకరు తన దగ్గరకి మానసిక సమస్యలతో వచ్చే రోగులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక్క చోటకి చేర్చారు. మరొకరు వాతావరణానికి సంబంధించిన గణాంకాలన్నీ సేకరించారు. ఇంకొకరు ఈ రెంటికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.   అందరి మీదా ప్రభావం: కొంతమంది చలికాలంలో మాత్రమే డిప్రెషన్‌కి లోనయ్యే జబ్బుతో బాధపడుతూ ఉంటారు. దీనిని Seasonal affective disorder (SAD) అంటారు. చలికాలంలో సూర్యకాంతిలో మార్పు రావడం వల్ల మన శరీరంలోని సెరిటోనిన్‌, మెలటోనిన్‌ అనే హార్మోనుల ఉత్పత్తిలో మార్పు వస్తుంది. ఫలితంగా కొందరు SAD బారిన పడతారు. కానీ తాజా పరిశోధనతో తేలిందేమిటంటే పగటివేళలు తగ్గడం అనేది మనలో ప్రతి ఒక్కరి మీదా ఎంతో కొంత ప్రభావం చూపుతుందట.   వేళలే ముఖ్యం: సూర్యుడు ఎంత తీక్షణంగా ఉన్నాడన్నది ముఖ్యం కాదని ఈ పరిశోధనతో తేలింది. కాలుష్యం కారణంగానో, ఆకాశం మేఘావృతంగా ఉండటం చేతనో సూర్యుడు పెద్దగా కనిపించపోయినా ఫర్వాలేదు కానీ... సూర్యుడు వీలైనంతగా ఆకాశంలో ఉండటమే ముఖ్యం అని తెలిసింది. మరో మాటలో చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఎంత ఎక్కువ సమయం ఉంటే మనుషులు అంత సంతోషంగా ఉన్నారట. సూర్యకిరణాలు భూమిని ఎంత ఎక్కువసేపు తాకితే మన మానసిక ఆరోగ్యం అంత బాగా ఉంటుందట.   కారణం! పగటివేళలకీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించైతే చెప్పారు కానీ దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం పరిశోధకులు తేల్చలేదు. బహుశా SAD రోగుల విషయంలోలాగా ఇతరులలోనూ హార్మోనుల ఉత్పత్తిలో వచ్చే మార్పులే దీనికి కారణం కావచ్చు. ఇక సూర్యరశ్మి నుంచి లభించే D విటమిన్‌లో లోపం ఏర్పడటం వల్ల కూడా మనిషి మనసులో ఇలాంటి అలజడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పగటివేళలు తక్కువగా ఉండే కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. - నిర్జర.

ఇలా చేస్తే మీ ఎముకలు భద్రం

  ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారాన్ని నడిపించే బాధ్యత ఎముకలదే! 30 ఏళ్ల వరకూ ఎముకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎముకలు నానాటికీ బలాన్ని పుంజుకుంటాయి. అప్పటివరకూ ఎముకలు తగినంతగా ఎదిగేందుకు అవసరమయ్యే పోషకాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక 30 ఏళ్ల తరువాత ఎముకల ఎదుగుదల కంటే తరుగుదలే అధికంగా ఉంటుంది. అప్పుడు వాటిని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఇవీ...     ఎముకలు = కాల్షియం ఎముకల ప్రస్తావన వచ్చే ప్రతిసారీ కాల్షియం గురించి చెప్పుకోక తప్పదు. ఎముకల ఎదుగుదలకీ, రక్షణకీ కూడా కాల్షియం చాలా అవసరం. అందుకే మన శరీరానికి అందే కాల్షియంలో 90 శాతం ఎముకలకే సరిపోతుందట. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బోలుగా మారిపోయి త్వరగా విరిగిపోయే ‘ఆస్టియోపొరోసిస్‌’ అనే ప్రమాదాన్ని కూడా కాల్షియం నివారిస్తుంది. అందుకే కాల్షియం సమృద్ధిగా ఉండే పాలపదార్థాలు, ఆకుకూరలు, బీన్స్, సోయాపాలు వంటివి పుష్కలంగా తీసుకోవాలి.     విటమిన్‌ డి మనం ఎంత పోషకాహారాన్ని తీసుకున్నా... వాటిలోని కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్‌ డి అవసరం. అయితే ఈ విటమిన్‌ చేపలు, జున్ను, గుడ్డు వంటి కొన్ని పదార్థాలలోనే ఉంటుంది. అందుకనే ఈ మధ్య నూనె, పాలు వంటి పదార్థాలకు కృత్రిమంగా డి విటమిన్‌ను చేరుస్తున్నారు. ఈ బాధలన్నీ పడే బదులు విటమిన్‌ డిని సహజంగా, సమృద్ధిగా ఇచ్చే సూర్యకాంతి కింద కాసేపు తిరగడం మేలు.   వ్యాయామాలు పరుగులెత్తడం, జాగింగ్‌ చేయడం, టెన్నిస్‌ ఆడటం, డాన్స్ చేయడం... ఇలా ఎముకల మీద ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయడం వల్ల అవి దృఢపడతాయంటున్నారు నిపుణులు. పైగా శరీరానికి తనని తాను అదుపు చేసుకునే క్షమత కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు నడక, ట్రెడ్‌మిల్‌ వంటి వ్యాయామాలతో సరిపెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.     కాఫీ, సిగిరెట్, మద్యం దూరం కాపీలో ఉండే కెఫిన్‌ మన శరీరం కాల్షియంను గ్రహించేందుకు అడ్డుపడుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఇక విపరీతంగా మద్యం సేవించడం డి విటమిన్‌ పనితీరుని దెబ్బతీస్తుందనీ తేలింది. సిగిరెట్లు తాగడం వల్ల కూడా ఎముకలు పెళుసుబారిపోతాయని హెచ్చరిస్తున్నారు.   అవసరమైతే మందులు తప్పదు వయసుని బట్టి మనకు రోజువారీ 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల వరకూ కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. దీనికి దాదాపు 1000 IUల వరకూ విటమిన్‌ డి కూడా జోడించాల్సి ఉంటుంది. ఇవి మన రోజువారీ జీవితంలో తగినంతగా అందుతున్నాయో లేదో తేల్చుకునేందుకు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సదరు వైద్యుని సలహా మేరకు అవసరం అనుకుంటే కాల్షియం, డి విటమిన్లను మందుల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన స్త్రీలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు, వంశపారంపర్యంగా ఆస్టియోపోరోసిస్‌ సమస్య ఉన్నవారు తమ ఎముకల ఎంతవరకూ దృఢంగా (Bone Density) ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.   - నిర్జర.

వంటింట్లో సంజీవని... కరివేపాకు!

‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అంటూ వాపోయేవారు, ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అయితే కూరకి రుచి అంటగానే చక్కగా ఆకుని కాస్తా ఏరిపారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు ప్రాశస్త్యం తెలిస్తే చక్కగా అన్ని వంటల్లో ఇంత కరేపాకు ఏరిపారేయడానికి వీలు లేకుండా ఎలా వేయొచ్చో తప్పకుండా ఆలోచిస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది.  కానీ, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌లో కరివేపాకు వెనుకబడిపోయింది.  మనం ఎవరి ఫాస్ట్‌ఫుడ్స్‌ని అలవాటు చేసుకుని కరివేపాకుకి దూరమవుతున్నామో వారు మాత్రం కరివేపాకుని భారీగా వినియోగిస్తారంటే నమ్ముతారా! మన దేశం నుంచి సుమారు 900 టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతోందిట. గల్ఫ్ దేశాలలో మన కరివేపాకుకి బోలెడంత డిమాండ్. ఐరోపా వాసులైతే  ఎండబెట్టిన కరివేపాకు ఆకుల పొడి వాడతారుట. అసలు కరివేపాకుని ఎందుకు తినాలి? అందులో బోల్డన్ని పౌష్టిక విలువలు ఉండబట్టేనని చెప్పుకున్నాం. అంతేనా.. దానిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు. నిజానికి జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులూ చెబుతుంటారు.  ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.పిల్లలు ఆకలిగా లేదంటూ అన్నం చూడగానే ముఖం తిప్పేస్తుంటే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలుట. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.  ఇక డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యానికే కాదు.. అందానికీ కరివేపాకుని వాడతారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయిట కూడా. ఇలా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది అని నిపుణులు గట్టిగా చెబుతున్న కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చేశారా? మరింకేం.. కమ్మటి పచ్చడి, టేస్టీ పొడి లేదా పూర్వంలా మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వంటివి మొదలుపెట్టండి. పిల్లలు ఏరిపారేస్తారన్న భయం లేకుండా వుండాలంటే అన్ని కూరల్లో కరివేపాకు పొడిచేసి వేస్తే సరి!

నీరు ఎక్కువగా తాగితే మరణమే..!

  అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పెద్దలు..అతిగా ఏం చేసినా అది మంచిది కాదు. ఈ సూత్రం ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. నీళ్లు తాగడం శరీరానికి మంచిదన్నారని అతిగా నీరు తాగితే అది ఏకంగా ప్రాణాలనే హరిస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది.   వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు. అనంతరం వారి ఎంఆర్ఐ తీసి చూడగా... అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి వారు ఏదైనా తినాలన్నా..నమలడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని కనుగొన్నారు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు నీళ్లు అధికంగా తాగకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   ఎక్కువ నీళ్లు తాగితే తొందరగా సన్నబడతామనో, ఆరోగ్యం బాగుపడుతుందనో భావించి నీళ్లు బాగా తాగేస్తుంటారు. నిజానికి ఎంత నీరు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ మానవ శరీరంలో ఉంటుందట..ఆ వ్యవస్థ మనిషిని ఎక్కువ నీళ్లు తాగకుండా ఆపుతుందట. అయినప్పటికి మోతాదుకు మించి నీళ్లు తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో బాడీలోని కణాలు వాస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా పోవచ్చు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు.

మీకు 45 సం. నిండాయా?

  మీకు 45 సం. నిండాయా? అయితే మీరు రోజు కనీసం 2 వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి. ఎందుకంటే.... డాక్టర్స్ దాచిపెడుతున్న ఈ పదార్థం 14 రకాల క్యాన్సర్ ను నివారిస్తుంది ! ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయేవారి సంఖ్య మొదటిస్థానంలో ఉంటె, రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయేవారు ఉన్నారు. క్యాన్సర్ తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే వైద్యులకి, వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమిగ్నమై ఉన్నారు. క్యాన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా మీ శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు. దాదాపు అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 - 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు. ఈ రేమ్మలని వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి allinase అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ మరియు యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి. క్యాన్సర్ మాత్రమే కాదు... తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు.  

కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు..

ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది. కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి. గుండెకు చాలా మంచిది: కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.   జీవక్రియను పెంచుతుంది : రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.   కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు : తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. డీ హైడ్రేషన్ ఉండదు : కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.   జీర్ణశక్తిని పెంచుతుంది: కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.

Is Excessive Sweating embarrassing you??

  Sweating is physiological process occurring in the body, it way of dissipating heat and also means by which certain toxic wastes are thrown out. Sweating in warm and humid conditions or after exercising is considered normal. Sweating occurring in unusual conditions, without any stimulus or even in cooler climates is considered hyperhidrosis or excessive sweating. It is usually linked to some medical conditions like menopause, anxiety or hyperthyroidism. Sweating is embarrassing, it stains clothes and ruins the social interactions, and it may also have serious implications such as making it difficult to grip on things and may earn you the tag of ‘butter fingers’. Hyperhidrosis is mostly neurologic, endocrine, infectious and systemic diseases, most cases are the people who are apparently healthy and still suffer from hyperhidrosis. Systemic conditions associated are; heart diseases, cancer, stroke, hyperthyroidism, menopause, spinal cord injuries, lung diseases, Parkinsonism and certain anti-depressants. Best way to tackle this to find out the trigger and have a judicious approach. Usage of anti-perspirants which contain aluminum or aluminum chloride, oral anti-cholinergic drugs reduce sweating and Botox-A has been approved by the FDA for treating excessive axillary sweating. The sweat gland can be destroyed by microwave energy or lasers, to reduce the sweating. As a last resort is thoracic sympathectomy these will cut off the stimulation of sweat glands, for sweating. -Koya Satyasri  

డయాబెటీస్‌ ఉంటే పండ్లు తినవచ్చా!

  డయాబెటీస్‌ ఉన్నవారు పండ్లకి ఆమడ దూరంలో ఉంటారు. మహా అయితే నేరేడు పండ్ల సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే చక్కెర వ్యాధి ఉన్నవారు నేరేడు పండు తప్ప మరే పండు తిన్నా తేడా వస్తుందేమో అన్న భయం వారిది. నిజానికి మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అతి చవకగా, అతి సహజంగా అందించే బాధ్యత పండ్లది. అలాంటి పండ్లని పూర్తిగా దూరం పెట్టడం వల్ల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మరి డయాబెటీస్‌ ఉన్నవారు ఎలాంటి పండ్లను, ఏ రకంగా తీసుకోవాలో నిపుణులు చెబుతున్న మాటలను ఓసారి చూద్దాం... ఎలాంటి బెర్రీలైనా!  స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు... ఇలా రకరకాల బెర్రీ పండ్లు ఇప్పుడు మనకి కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నిస్సంకోచంగా తీసుకోవచ్చంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరుకోదనీ, కాబట్టి వీటిని తినవచ్చనీ సూచిస్తున్నారు. పైగా ఈ బెర్రీలలో ఉండే రకరకాల విటమిన్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది కూడా. నారింజ: చక్కెరవ్యాధిగ్రస్తులకు ఇష్టమైన పండు నారింజేనేమో! తీపి కంటే పులుపే ఎక్కువగా ఉండే నారింజతో శరీరానికి కావల్సిన ‘C’ విటమిన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో పీచుపదార్థాలు కూడా అధికమే! పైగా నారింజలో ఉండే ఫోలేట్‌, పొటాషియం అనే పదార్థాలకి రక్తపోటుని అదుపుచేసే గుణం ఉంది. జామ:  డయాబెటీస్‌ ఉన్నవారు జామని కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ ఏ,సీలు ఆరోగ్యానికి కావల్సిన పోషకాలను అందిస్తే, పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. ఇక శరీరంలోని కండరాల పనితీరుని మెరుగుపరిచే పొటాషియం కూడా జామకాయలో సమృద్ధిగా దొరుకుతుంది. యాపిల్:  రోజుకో యాపిల్‌తో రోగాలు దూరమన్న విషయం తెలిసిందే! కానీ కాస్త తియ్యగా ఉండే యాపిల్‌ అంటే డయాబెటీస్‌ రోగులు భయపడుతూ ఉంటారు. నిజానికి యాపిల్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంటల్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు! కొన్ని పోషకాలను శరీరం మరింత సమర్థంగా జీర్ణం చేసుకునేందుకు కూడా యాపిల్స్ ఉపయోగపడతాయి. అయితే వీటిని తొక్కుతో సహా తిన్నప్పుడే... మరింత ఉపయోగం అని గుర్తుచేస్తున్నారు వైద్యులు. అరటిపండు:  అరటిలో ఉన్న సుగుణాలు అన్నీఇన్నీ కావు! అత్యంత చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంలు ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. అంతేకాదు శరీరంలోని జీవక్రియకు (మెటాబాలిజం) తోడ్పడే B6 విటమిన్‌ కూడా అరటిలో కనిపిస్తుంది. ఇక జీర్ణక్రియకు అరటిపండు చేసే సాయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! పుచ్చకాయ:  ఎండాకాలం వస్తూనే ఊరించే ఈ పండుని పూర్తిగా కాకుండా కొన్ని ముక్కలను తీసుకోవడంలో తప్పులేదంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో విటమిన్‌ సి ఎలాగూ ఉంటుంది. ఇక పళ్లరసాలను దూరంగా ఉండే డయాబెటీస్‌ రోగులకు... పుచ్చకాయ, జ్యూస్‌ తాగినంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక నీరు, దాహాన్ని తీర్చి శరీరానికి కావల్సిన తేమని అందిస్తుంది. కేవలం పైన పేర్కొన్న పండ్లే కాకుండా పీచ్‌, పియర్స్‌, కివీ, అవకాడో... వంటి విదేశీ పళ్లు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన పండ్ల జోలికి ఎవరు వెళ్తారులే అనుకుంటే ఉసిరి, దానిమ్మ, పంపరపనస... వంటివి ప్రతి చోటా కాస్త తక్కువ ధరలోనే లభిస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి కాస్త కాస్త మోతాదులో తీసుకోవడం, అన్ని పదార్థాలతో కలిపి లాగించేయకుండా విడిగా తినడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం ఉన్నవారు కూడా పళ్ల రుచిని ఆస్వాదించవచ్చునని సూచిస్తున్నారు వైద్యులు. - నిర్జర

సమ్మర్ లో మామిడితో మజా

మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి... ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :- వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్  సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.  ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.