ఉక్రెయిన్‌లో విమాన ప్రమాదం: 295 మంది దుర్మరణం

  మలేషియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 777 విమానం విమానం ఉక్రెయిన్లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం ఉక్రెయిన్లో కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా మరణించినట్లు మలేషియా హోం శాఖ తెలిపింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ తెలిపింది. రష్యా ప్రయోగించిన క్షిపణి వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు. బోయింగ్ 777 గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది.

రష్యా సరిహద్దు వద్ద కూలిన మలేషియా విమానం

  ఈరోజు సాయంత్రం మలేషియా విమానమొకటి ఉక్రెయిన్-రష్యా సరిహద్దు వద్ద కూలిపోయింది. అందులో 280 మంది ప్రయాణికులు, 15మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. నెదర్ల్యాండ్స్ లో అమెస్టర్ డాంనుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరిన ఈ విమానం, రేపు ఉదయం ఆరు గంటలకు మలేషియాలో కౌలాలంపూరు విమానాశ్రయంలో దిగవలసి ఉంది. కానీ రష్యా సరిహద్దులో గల దొంతెస్క్ అనే ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు ఉక్రేన్ దేశ హోంశాఖ అధికారి అంటన్ గెరషేంకో తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు విమానాన్ని 10కిలోమీటర్ల ఎత్తులో ఉండగా బంకర్ నుండి మిసైల్ తో పేల్చివేసినట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు. విమానం కూలిన చోటుకు చేరుకొన్న రాయిటర్స్ విలేఖరి మండుతున్న విమాన శకలాలు, మృత దేహాలు అంతటా చెల్లా చెదురుగా పడిఉన్నాయని తెలియజేసారు. ఈ ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం కనబడటం లేదని ప్రాధమిక సమాచారం.

రెండు నెలల్లో హైదరాబాద్‌లో 4జి ఇంటర్నెట్

  హైదరాబాద్ నగరంలో 4జీ ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఐటీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 దశల్లో రూ.4,100 కోట్లతో 4జీ సేవలను అందించాలని నిర్ణయించారు. నగరం చుట్టు పక్కల వైఫై సేవలతో హైఫై నగరంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. మొత్తం 6 కార్పొరేషన్లలో 4జీ సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. 4జీ సేవలను విస్తరించి సెప్టెంబర్ నెలఖారులోగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 37 మున్సిపాలిటీలు, 220 మండల కేంద్రాల్లో 4జీ సేవలు ఇవ్వాలని అన్నారు. నగరంలో వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్ నెలాఖరునాటికి హైదరాబాద్‌ను 4జీ వైఫై నగరంగా మార్చాలని తెలిపారు.

మర్డర్లు చేసిన ఎడిటర్ కేసులో తీర్పు: చచ్చేదాకా జైల్లోనే!

  తన దగ్గర పనిచేసే ఉద్యోగులను చంపిన నేరంలో ఓ పత్రిక ఎడిటర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. త్రిపురలో ఓ బెంగాలీ స్థానిక దినపత్రికకు సంపాదకుడు, యజమాని కూడా అయిన సుశీల్ చౌధురికి స్థానిక కోర్టు ఈ శిక్ష విధించింది. . 'దైనిక్ జ్ఞానదూత్' అనే పత్రిక సంపాదకుడైన 76 ఏళ్ల చౌధురి పాత్ర ఈ నేరంలో ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఆయనకు మరణశిక్ష విధించాలని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన దిలీప్ సర్కార్ వాదించారు. రంజిత్ చౌధురి, బలరాం ఘోష్, సుజిత్ భట్టాచార్జీ అనే ముగ్గురు ఉద్యోగులను ఆయనే చంపాడని సర్కార్ ఆరోపించారు. అయితే, తాను నిర్దోషినని, కనీసం తన వయసు చూసైనా క్షమాభిక్ష పెట్టాలని చౌధురి కోర్టును వేడుకున్నారు. ఈ కేసు మీద న్యాయమూర్తి స్పందిస్తూ, ‘‘మీరు ముగ్గురు ఉద్యోగులను చంపినట్లు రుజువైంది. వాస్తవానికి ఇది ఉరిశిక్ష విధించాల్సిన కేసే గానీ, మీ వయసును దృష్టిలో పెట్టుకుని ఆయనకు యావజ్జీవ ఖైదు విధిస్తున్నాం. అంటే, మీరు సహజంగా మరణించేవరకు జైల్లోనే ఉండాలి’’ అని పశ్చిమ త్రిపుర అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కృపాంకర్ చక్రవర్తి తన తీర్పులో తెలిపారు. దాంతోపాటు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. 2013 సంవత్సరం మే 19వ తేదీన పత్రిక కార్యాలయంలోనే ముగ్గురు ఉద్యోగులు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది.

కూల్చివేతలకు జీహెచ్ఎంసీ బ్రేక్: కేసీఆర్‌కి షాక్

  హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ తీర్మానం చేసింది. ఈమేరకు గురువారంర జరిగిన జీహెచ్‌ఎంసీ స్థాయిసంఘ సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్‌ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను ఆపాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పాలక మండలి లేఖ రాయనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని పరిణామమేనని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కేసీఆర్‌దే అయినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం జీహెచ్ఎంసీకే బాధ్యత వుంటుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అక్రమ కట్టడాలను కూల్చడానికంటే ముందు అక్రమ నిర్మాణాలకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకున్నాకే ఆయా కట్టడాల కూల్చివేతలు జరపాలని స్థాయి సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

రజనీకాంత్ చెప్పకపోతే అంబరీష్‌కి తెలియదా?

  నటి సుమలత భర్త, కన్నడ నటుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్ అనారోగ్యం కర్నాటకలో రాజకీయ దుమారం రేగటానికి కారణమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ సింగపూర్‌కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి కాబట్టి ఆ బిల్లును ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం ఆ బిల్లు మొత్తాన్నీ అణా పైసలతో సహా చెల్లించేసింది. అయితే అంబరీష్ చేసిన బిల్లు ఎంతయ్యా అంటే, అక్షరాలా కోటి పదహారు లక్షలు. అయితే నిబంధనల ప్రకారం ఒక మంత్రి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడు లక్షలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. మరి అంబరీష్ ఏకంగా కోటి 16 లక్షలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఇదిలా వుంటే ప్రముఖ నటుడు రజనీకాంత్ చెప్పడం వల్లే తాను సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకోగలిగానని అబరీష్ అమాయకుడిలా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంబరీష్ లాంటి ప్రముఖ నటుడికి, కర్ణాటకలో బోలెడంతమంది అభిమానులు వున్న వ్యక్తికి తన వ్యాధికి ఎక్కడ చికిత్స చేయించుకోవాలో కూడా తెలియదా అనుకుంటున్నారు.

ఎంసెట్ లేటయితే అంతే సంగతులు: దేవినేని ఉమ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంజనీరింగ్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) ఆలస్యమైన పక్షంలో ఇక అంతే సంగతులని, రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అలాగే 1956 నిబంధనను భౌగోళిక అంశాలకు కూడా వర్తింపజేస్తారా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల స్థానికతపై నిర్ణయం తీసుకోవడానికి కెసిఆర్ ఎవరని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. లోకల్, నాన్‌లోకల్ అనే విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలో ఉందని అన్నారు. స్థానికతపై కేసీఆర్ 1956ను కటాఫ్‌గా తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. విభజన చట్టానికి అనుగుణంగా పదేళ్ల ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కేసీఆర్ సహకరించాలన్నారు.

కట్టడాల కూల్చివేత ఆపండి: జీహెచ్ఎంసీ

  హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ తీర్మానం చేసింది. ఈమేరకు గురువారంర జరిగిన జీహెచ్‌ఎంసీ స్థాయిసంఘ సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్‌ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను ఆపాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పాలక మండలి లేఖ రాయనుంది. అక్రమ కట్టడాలను కూల్చడానికంటే ముందు అక్రమ నిర్మాణాలకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకున్నాకే ఆయా కట్టడాల కూల్చివేతలు జరపాలని స్థాయి సంఘం పేర్కొంది.

సుమలత భర్త అనారోగ్యం: రాజకీయ దుమారం

  నటి సుమలత భర్త, కన్నడ నటుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రి అంబరీష్ అనారోగ్యం కర్నాటకలో రాజకీయ దుమారం రేగటానికి కారణమైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ సింగపూర్‌కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి కాబట్టి ఆ బిల్లును ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం ఆ బిల్లు మొత్తాన్నీ అణా పైసలతో సహా చెల్లించేసింది. అయితే అంబరీష్ చేసిన బిల్లు ఎంతయ్యా అంటే, అక్షరాలా కోటి పదహారు లక్షలు. అయితే నిబంధనల ప్రకారం ఒక మంత్రి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడు లక్షలు మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. మరి అంబరీష్ ఏకంగా కోటి 16 లక్షలు ఖర్చు చేశారని ప్రతిపక్షాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మీద విరుచుకుపడుతున్నాయి. ఏడు లక్షల లిమిట్ మాత్రమే వుంటే, కోటి 16 లక్షలు ఎందుకు ఇచ్చారని, అలాగే కోటీశ్వరుడైన అంబరీష్ ప్రజాధనంతో వైద్యం ఎందుకు చేయించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా క్లెయిమ్ చేస్తుందని, ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని నిలదీస్తున్నారు.అయితే శాసనసభ్యులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం తరపు రూ. 7లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ, ఇది ప్రత్యేక కేసుగా భావించి ప్రభుత్వం తరపున అంబరీష్‌కు సంబంధించిన వైద్య ఖర్చులను(రూ. కోటి) క్లెయిమ్ చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పష్టం చేశారు. సామాన్యులకు ఏవైనా ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తారు.. రాష్ట్ర మంత్రులకు మాత్రం విదేశాల్లో వైద్య సేవలు అందించి, వాటికి ఖర్చులు కూడా చెల్లిస్తారా అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రుణాల రీషెడ్యూల్ పై ఆర్బిఐకి ఏపీ సమాధానం

రుణమాఫీ అంశంపై రిజర్వ్ బ్యాంకు లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానమిచ్చింది. రుణాల రీషెడ్యూల్ మూడేళ్ళు అన్న ఆర్బిఐ విధానాన్నిఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విబేధించింది. రుణాల రీషెడ్యూల్ ఆరేళ్ల పాటు పొడిగించాలని, ఒక ఏడాది మారటోరియం విధించాలని ఎపి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకును కోరింది. బంగారు రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించాలని లేఖలో పేర్కొంది. త్వరలోనే కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఇక రుణాలు ఎలా చెల్లిస్తామనే కార్యాచరణకు సమాధానంగా త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వున్నాయో వివరాలు ఇవ్వాలని ఎస్ఎల్ బీసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

ఖరగ్‌పూర్ ఐఐటీలో బుజ్జి స్టూడెంట్!

  అందం, పర్సనాలిటీతో పనిలేదు ఆత్మవిశ్వాసం వుంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చు. ఈ సూత్రానికి నిఖార్సయిన నిర్వచనంలా నిలిచే యువకుడు కేరళలోని కొట్టాయానికి చెందిన జాకుబ్ టామీ. కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే వుండే జాకుబ్ టామీ ఒక్క అడుగు అడిగి మూడు అడుగులలో విశ్వాన్నే సొంతం చేసుకున్న వామనావతారాన్ని గుర్తు చేస్తున్నాడు. తాను చాలా పొట్టివాడైనప్పటికీ గుండెనిండా వున్న ఆత్మవిశ్వాసంతో శ్రమించి చదువుకున్నాడు. సీబీఎస్ఈలో ప్లస్ టూ పాసై ప్రతిష్ఠాత్మక ఖరగ్ పూర్ ఐఐటీ ప్రవేశ అర్హత పరీక్షలో 21వ ర్యాంకు సాధించాడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో శిక్షణ పొందడానికి సమాయత్తమవుతున్నాడు. తాను పొట్టివాడైనప్పటికీ తన మనసులో దానికి సంబంధించిన న్యూనతాభావం ఏదీ లేదని, తనను తాను అందరితో సమానంగా భావిస్తూ వుంటానని జాకుబ్ టామీ చెబుతున్నాడు.

స్థానికతని నిర్ణయించడానికి కేసీఆర్ ఎవరు?: ఏపీ మంత్రులు

  విద్యార్థుల స్థానికతను నిర్ణయించడానికి కేసీఆర్ ఎవరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు అన్నారు. విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వారు చెప్పారు. ఆర్టికల్‌-371(డీ) ఉండగా కొత్త నిబంధనలు ఎలా తీసుకువస్తారని వారు ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని, గవర్నర్‌, కేంద్రం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసకోవాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.

చివరి రక్తపు బొట్టు వారి కోసమే:బాబు

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వున్న వాటిని అధిగమించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రైతుల రుణమాఫీ అమలుచేసి వారికి అండగా వుంటామని అన్నారు. నా జీవితంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు పేదవారి కోసం పనిచేస్తానని చెప్పారు. వృద్దులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు పదిహేను వందల రూపాయల పింఛన్ ఇస్తామని అన్నారు. డ్వాక్రా సంఘాలకు కూడా ఈ ఏడాది మార్చి ఆఖరు వరకు రుణాలు ఉన్నవారికి మాపీ చేస్తామని స్పష్టం చేశారు. బెల్టు షాపులను ఇష్టం వచ్చినట్లు పెట్టారని,దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని,వాటిని రద్దు చేయాలని ఆదేశించామని అన్నారు. పోలవరం ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, కొందరు రాజకీయ నాయకులు పోలవరంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ అధికారాలపై మాట్లాడేది లేదన్న హోం శాఖ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కి విశేష అధికారాలనిచ్చే అంశంలో ఇప్పుడే ఏమీ మాట్లాడబోమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో గవర్నర్‌కి అధికారాల అంశం మీద మాట్లాడే అవకాశం వుందేమోనిన ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ప్రయత్నించినప్పుడు ఆయన స్పందన పైవిధంగా వుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై చర్చ జరిగింది. పీపీఏ, కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఆమోదించిన పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్, కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు.

డోర్ తెరిచే మెట్రో నడిపాడు: డ్రైవర్ సస్పెండ్!

  ఢిల్లీ మెట్రో రైలును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యంత భద్రతతో కూడిన మెట్రో రైలు వ్యవస్థగా అందరూ అభివర్ణిస్తూ వుంటారు. అయితే గురువారం నాడు ఒక మెట్రో రైలు డోర్లను మూసి వేయకుండానే మెట్రో రూట్లో పరుగులు పెట్టింది. డోర్ తెరిచి వుండగానే వాయువేగంతో దూసుకుపోతున్న మెట్రో ట్రెయిన్‌ని చూసి జనం బిత్తరపోయారు. రైల్లో వున్న ప్రయాణికులైతే రైలు వేగానికి ఎక్కడ ఎగిరి బయటకి పడిపోతామో అని భయపడిపోయారు. కుర్చీలను గట్టిగా పట్టుకుని కూర్చుండిపోయారు. డోర్లు క్లోజ్ చేయకుండా పరిగెడుతున్న రైలును కొంతమంది ప్రయాణికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించి ఆ ఫుటేజ్‌ని మెట్రో రైల్వే అధికారులకు చూపించారు. అది చూసి అవాక్కయిపోయిన అధికారులు సదరు మెట్రో ట్రెయిన్ డ్రైవర్ని అర్జెంటుగా సస్పెండ్ చేశారు.