సీబీఐ కోర్టు ముందు వైఎస్ జగన్ హాజరు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న జగన్ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణతోపాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, ప్రతాప్రెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డి, ఐఏఎస్లు బీపీ ఆచార్య, శ్యాంబాబు, ఆదిత్యనాథ్దాస్, మన్మోహన్సింగ్ కోర్టుకు హాజరయ్యారు. మిగిలిన వారు కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.