మావోయిస్ట్ ల ఎన్‌కౌంటర్‌.. ముఖ్య నేతలు హతం..

  ఛత్తీస్‌గడ్‌లో భారీ  ఎన్‌కౌంటర్‌ జరిగింది. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం రాత్రి మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం అందుకున్న పోలీసు భాలగాలు కూంబింగ్‌ నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు మూడు సార్లు మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు.. మావోయిస్టు ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి లచ్చన్న ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్‌ కూడా మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు వీరి దగ్గర నుండి ఏకే-47, మూడు ఎస్ఎల్ఆర్, మూడు రైఫిల్ స్వాదీనం చేసుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు గారికి "జీవన సాఫల్య పురస్కారం"

 ప్రఖ్యాత సినీ నటులు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని "జీవన సాఫల్య పురస్కారం" తో  డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ మార్చి 12 వ తేది సాయంత్రం 6 గం. లకు పాలకొల్లు లో జరిగే జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి, కార్యదర్శి శ్రీ మానాపురం సత్యన్నారాయణ లు తెలిపారు.   ఈ సభకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి  శ్రీ బొజ్జల  గోపాలకృష్ణా రెడ్డి, ఎస్. సి కార్పోరేషన్  చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకరరావు, డా. గజల్ శ్రీనివాస్,  కేంద్ర మాజీ మంత్రివర్యులు  శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు,  ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. ముర్రు  ముత్యాల నాయుడు, శాసన మండలి సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్,  శాసన మండలి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,   చలనచిత్ర ప్రముఖులు శ్రీ కోడి రామకృష్ణ,  శ్రీ ఆర్. పి . పట్నాయక్, హీరో శ్రీ  నిఖిల్ , శ్రీ భాస్కర భట్ల, శ్రీమతి అనితా చౌదరి లు పాల్గొంటారని తెలిపారు.   మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షులు

లైసెన్స్ లేకపోతే.. 2వేలు, హెల్మెట్ లేకపోతే రూ. 100..

తెలంగాణ రవాణా, పోలీసు శాఖలు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు శాఖలు కలిపి రూల్స్ ను అతిక్రమించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని..నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా బయటకు వస్తే జరిమానా విధించనున్నారు.  లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే. ఇక లెసెన్స్ లేనివారు.. ఉండి సస్పెండ్ అయినవారు వాహనాలను నడిపినా శిక్ష అనుభవించాల్సిందే. అంతేకాదు డ్రంకన్ డ్రైవ్‌లో మూడు సార్లకు మించి పట్టుబడిన వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్, లైసెన్స్‌తో పాటు ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహారిస్తామన్నారు. మార్చి 1 నుంచి ఈ చర్యలు అమలుకానున్నాయి. మరి ఇక మీద వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే..

మోడీ జీ.. వాట్ అబౌట్ అమరావతి జీ..

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగేదేం కనిపించడంలేదు. మొన్నటికి మొన్న ప్రకటించిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు మొండిచేయి చూపించింది.  అసులు విభజన హామీలో ఉన్న విశాఖ రైల్వే జోన్ గురించి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తీరు చూస్తుంటే కూడా అలానే కనిపిస్తుంది.   ఒక పక్క ఏపీ సీఎం చంద్రాబబు.. అసలే ఆర్దిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అలాంటి అమరావతికి ఎలాంటి నిధులు కేటాయించలేదు సరికదా.. దాని గురించిన ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు జైట్లీ. ఏపీ అభివృద్దికి పాటుపడుతా.. ఏపీ అభివృద్దికి ఆర్ధికంగా సహాయపడతా అన్న మోడీ ప్రజలకు ఊరించి ఆఖరికి ఏం చేయకుండానే ఈ ఏడాది బడ్జెట్ ను ముగించారు. ఇక ఏదో ఏపీలోని ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా నిధులు ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు ..విజయవాడకు 100 కోట్లు కేటాయించింది.   మరి అసలు ప్రధాని మోడీకి ఏపీ అనే ఒక రాష్ట్రం ఉంది.. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజలకు రాజధానికి ఏర్పాటు కావాలి.. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలి అన్న విషయం అసలు గుర్తుందా అని అనుకుంటున్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ కనీసం ఒక్క వరం కూడా ప్రజలకు ఇవ్వలేదు.. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కూడా అమరావతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇక ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం జరిగేదెప్పుడూ.. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరాతి విశ్వనగరంగా మారేదెప్పుడూ..తెలుగు ప్రజల కల తీరేదెప్పుడూ..

జగన్ మీటింగ్ కు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా.. గుడ్ బై చెబుతారా..?

ఏపీలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. నిన్ననే మరో ఎమ్మెల్యే డేవిడ్ రాజు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా వరుస వలసలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవైపు టీడీపీతోనే పడలేకపోవడంతో మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా జగన్ కు తలనొప్పిగా తయారైనట్టు తెలుస్తోంది.   పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న నేపధ్యంలో జగన్ కాస్త జాగ్రత్తగా ఉంటూ.. పార్టీ నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు పార్టీ నేతలే డుమ్మా కోడుతున్నారు. ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. అందరు ఎమ్మెల్యేలు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటను పెడచెవిన పెట్టి సమావేశానికి  గైర్హాజరయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలు ఆసక్తికర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పదిమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారా.. అందుకే సమావేశానికి హాజరు కాలేదా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   అయితే మరోపక్క ఈ ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత కారణాలవల్లే సమావేశానికి రాలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ వీరిలో కొందరు మాత్రం పార్టీని వీడటం పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రంగు, రుచి, వాసన లేని బడ్జెట్.. జైట్లీ బడ్జెట్ పై పలువురి స్పందనలు

అందరూ ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు జైట్లీ. అయితే ఇప్పుడు ఆయన వేసిన బడ్జెట్ అకౌంట్స్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్..   అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గ్రామీణ, రైతుల, పేదల బడ్జెట్ గా రాధామోహన్ సింగ్ అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పేదలు, రైతులు, గ్రామీణులకు పెద్ద పీట వేసిన బడ్జెట్ ఇదని ఆయన అన్నారు. కమల్ నాథ్ దేశ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక సుస్థిరతకు ఏది ఉండాలో అదే బడ్జెట్ లో లోపించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. అరుణ్ జైట్లీ దశ, దిశ లేని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరీక్ష పాసయ్యారని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా అన్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి ఒనగూరిందని ఆయన అన్నారు. శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏమాత్రం రంగు, రుచి, వాసన లేని అతి సాధారణ బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. యుపిఎ హయాంలోని పలు పథకాలనే మ‌ళ్లీ జైట్లీ పేర్కొన్నారని శశిథరూర్‌ అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు మరీ ఇంత తక్కువా..

ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఈసారి కూడా  అనుకున్నంత నిధులు రాలేదనే అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించమని కోరినప్పటికీ కేంద్రం మాత్రం ఏదో నామమాత్రపు నిధులే కేటాయించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించారు. అయితే దీని నిర్మాణ పనులకు గాను ఏపీ ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.. కేంద్రం మాత్రం 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. మరి ఈ వంద కోట్లతో ఏపీ ప్రభుత్వం ఏం నిర్మాణం చేపడుతుందో చూడాలి. మొత్తానికి కేంద్రం ఇలా కొసరి, కొసరి ఇస్తే పోలవరం నిర్మాణం ఎప్పుడయ్యోనో ఏమో..

మొత్తం బడ్జెట్ 19.78.. ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్లు

  కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 ఏడాదికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఏడాదికి గాను మొత్తం బడ్జెట్ 19.78 లక్షల కోట్లు కాగా.. ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్లు.. ప్రణాళికేతర వ్యయం 14.28 లక్షల కోట్లు ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలు.. * బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు * ముద్రా బ్యాంక్‌ ద్వారా రూ.లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు * పంటల బీమా పథకాలకు గత బడ్జెట్‌ కంటే నిధులు రెట్టింపు * రూ.900 కోట్లతో పప్పు ధాన్యాలకు మార్కెట్‌ స్థిరీకరణ నిధి * రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళికా వ్యయం 28శాతం పెంపు * ఆర్థిక సేవల విషయంలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం * సాగరమాల ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు *రూ35లక్షల లోపు ఇల్లు కొనుక్కొనే వారికి మినహాయింపు * పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ 10నుంచి 15శాతం పెంపు * రూ.10లక్షల పైబడ్డ కార్ల కొనుగోలుపై 1శాతం సర్వీస్ ఛార్జి విధింపు * బీడీలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు