మహిళా కానిస్టేబుల్ పై రాజకీయ నాయకుడి రౌడీయిజం.. ఎక్కడ..?

ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఏం చేసిన ఎవరు అడగరూ అన్న ధీమాతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే జరిగింది ముంబైలో. ముంబైలో ఓ మహిళా కానిస్టేబుల్ పై శివసేన నేత శశికాంత్ రౌడీయిజం చూపించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న అతనిని మహిళా కానిస్టేబుల్ ఆపింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆయన కిందకి దిగి మహిళా అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా అయితే దాడికి పాల్పడ్డ వ్యక్తికి శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజకీయ నాయకులను చంపేయాలి.. మాజీ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

జేఎన్యూ వివాదంపై ఇప్పటికే దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజ్యసభలో కూడా రచ్చ రచ్చ జరుగుతోంది. ఇప్పుడు వీటికి ఆజ్యం పోస్తున్నట్టు ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ దింగ్రా చేస్తున్న వ్యాఖ్యలు. జేఎన్యూ విద్యార్ధులు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష  విధించడాన్ని ఖండిస్తూ చేసిన నిరసనలను ఆయన తప్పు బట్టారు.  పార్లమెంటుపై దాడి సందర్భంగా 40,50 మంది ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఏంటని  వారిని వెనకేసుకొస్తున్న పార్లమెంటు సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. అఫ్జల్‌ గురును వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను చంపేయాలంటూ వివాదానికి తెర లేపారు. అఫ్జల్ గురు లాంటివారు సమాజానికి చెడు చేసేవారు.. అలాంటి వారికి శిక్ష విధించే హక్కు న్యాయస్థానాకి ఉంటుంది అని ఆయన అన్నారు.

అన్నను అన్నందుకు.. బాలయ్యకు పవన్ కౌంటర్..!

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 27, 28 తేదీల్లో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల నేపథ్యంలో బాలకృష్ణ చిరంజీవిపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లేపాక్షి ఉత్సవాల నిర్వహణ తన కష్టార్జితమని, ఎవరినీ పిలువాలో.. పిలువకూడదో తనకు తెలుసునని.. చిరంజీవిని ఉత్సవాలకు పిలువలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. నా నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం నాకు లేదు.. అంటూ పెద్ద లెక్చరే ఇచ్చారు. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చిరంజీవితో పాటు ఇంకో వ్యక్తి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్వతహాగా అన్నా దమ్ముల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా.. అతని అన్న జోలికి వస్తే మాత్రం తను అంత తేలికగా వదిలిపెట్టడు. గతంలో తన అన్నపై సెటైర్లు వేసిన మొహన్ బాబుకి కూడా ఇలానే చురకలు అంటించాడు.   అయితే ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకుగాను పవన్ కళ్యాణ్.. బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి తన అన్నను పిలవాలని పవన్ అనుకుంటున్న నేపథ్యంలో అక్కడే బాలకృష్ణకు గట్టిగా సమాధానం ఇస్తారని అనుకుంటున్నారు. మరి పవన్ ఎప్పుడు కౌంటర్ ఇస్తారో చూడాలి.

పీఎస్ లో హీరోయిన్ స్వాతిరెడ్డి.. ఆమె తల్లి కొట్లాట..

ప్రముఖ వర్దమాన నటి స్వాతిరెడ్డి ప్రేమ గోల పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆమె తల్లి నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాకి చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తిపై అనుమానాలున్నాయంటూ.. అతనే తన కూతురికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడంటూ బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వార్తలకు స్పందించిన స్వాతిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను ఎక్కడికీ వెళ్లలేదని.. మాఅమ్మకు నాకు ఆర్ధికా లావాదేవీల్లో గొడవలున్నాయి అంటూ తెలిపింది. అసలు తనకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని.. డబ్బు కోసం తల్లి.. తనను చాలాసార్లు వేధించినట్లు స్వాతిరెడ్డి  చెప్పింది. ఈ నేపథ్యంలో స్వాతిరెడ్డి, నాగేంద్రమ్మ... పోలీసుల ఎదుటే కొట్లాటకు దిగారు. దీంతో పోలీసులు వారిని వారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్వాతిరెడ్డి లవ్ అనే సినిమాలో నటించింది.

రైల్వే బడ్జెట్ లో కేంద్రం ఏపీకి టోపి...

కేంద్రమంత్రి సురేశ్ ప్రభు నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన ప్రవేశ పెట్టిన రైల్వె బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగింది ఏం లేదని తెలుస్తోంది. ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజల ఆశలపై నీరు జల్లినట్టే అయింది. రైల్వే బడ్జెట్ లో కేంద్రం ఏపీకి టోపి వేసిందని.. విశాఖకు రైల్వే జోన్ ఇస్తానని చెప్పి ఆఖరికి చెవిలో పూలు పెట్టినంత పని చేసింది. దీంతో ఏపీలో అప్పుడే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. కేంద్రాన్ని ఒప్పించే సత్తా మన దగ్గర లేదా..?అమరావతి రాయలసీమ కనెక్ట్ విటీ ఇంకెప్పుడూ..? విశాఖపట్నంకు రాని రైల్వే జోన్ తెస్తామన్న సుజనా ఎక్కడ విఫలమయ్యారుఅంటూ పలు ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే యూనివర్శిటీని అమరావతికి కేటాయించమని ఎన్నోసార్లు.. మంత్రిగారిని..మోడీ గారిని కోరినా ఆఖరికి అది కూడా దక్కలేదు. మరి ఈ వ్యవహారంపై ఇంకేన్ని వివాదాలు తలెత్తుతాయో చూడాలి.

సంజయ్‌దత్‌ గొడవలో పడి బడ్జట్‌ను పట్టించుకోలేదు!

  ఈసారి రైల్వే బడ్జట్‌ జనానికి కాస్త నిరాశ కలిగించిన మాట వాస్తవమే. మామూలుగా అయితే మీడియా ఈ విషయాన్ని ఏకిపారేసేది. కానీ నిన్న మన రైల్వే మంత్రిగారికి లాభించిన విషయం ఒకటి జరిగింది. రైల్వే బడ్జట్‌ను ప్రవేశపెట్టినరోజునే సంజయ్‌దత్‌ ఎరవాడ జైలు నుంచి విడుదల కావడంతో వార్తాఛానళ్లన్నీ ఆయనకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాయి. సంజయ్‌దత్‌ విడుదల అయిన వెంటనే ఏ గుడి వెళ్లాడు? ఆయన విడుదల అయ్యాక ఎన్ని సినిమాల్లో నటించబోతున్నాడు? అసలు సంజయ్‌దత్‌ ఏ కేసులో జైలుకి వెళ్లాడు? తదితర విషయాలన్నింటి మీదా వార్తలను ప్రసారం చేయడంలో మునిగిపోయాయి. దాంతో రైల్వే బడ్జట్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నిన్న సోషల్‌ మీడియాలో కూడా అంతా సంజయ్‌ హవానే నడిచింది. దాంతో సురేష్‌ ప్రభు రైలుకంటే సంజయ్‌బాబు రైలే వేగంగా దూసుకుపోయిందంటూ జనం నవ్వుకున్నారు.

అగ్రిగోల్డ్ కుంభకోణంలో మరో ట్విస్ట్.. ఇంకా 70 స్థిరాస్తులు

అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో విషయం బయటపడింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి ఆసంస్థ కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు కాకుండా ఇంకా 70 స్థిరాస్తులు తమ విచారణలో వెల్లడైనట్లు ఏపీ సీఐడీ హైకోర్టుకు నివేదించింది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు తెలియజేయకుండా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మోసం చేసిందని.. ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు అటాచ్‌ చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానానికి తెలియకుండా ఏ ఒక్క ఆస్తి కూడా ఉండరాదని, ఇప్పటికైనా స్వచ్ఛందంగా బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను ధర్మాసనానికి నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జుకర్‌బర్గను చంపేస్తాం, ట్విట్టర్‌ను పాతేస్తాం... ISIS

  తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్లు వేలాది ఖాతాలను రద్దు చేయడంతో ISIS తీవ్రవాదులకి తెగ కోపం వచ్చేసింది. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ను, ట్విట్టర్‌ సీఈఓ జాక్‌ డార్సీనీ చంపేస్తాం అంటూ హెచ్చరికలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది. తమను అణగదొక్కేందుకు ఈ సోషల్‌మీడియావారు అమెరికాతో కలిసి ఎన్ని కుతంత్రాలు పన్నినా, వాటిని దీటుగా ఎదుర్కొంటామంటూ వీడియోలో స్పష్టం చేసింది. వీడియో చివర్లో ‘మీరు రోజూ మా ఖాతాలను నిర్మూలించామంటూ ప్రకటిస్తుంటారు. అంతకు మించి మీరేమీ చేయలేరు. కానీ మేము మాత్రం మీ జీవితాలనే నిర్మూలించి పారేస్తాం’ అంటూ ముగించారు.

బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..పారిపోయాడు.. ఎక్కడ..?

సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన నాయకులే తప్పులు చేస్తే.. ఇంకా ఆ ప్రజలకి ఎవరు రక్షణ కల్పిస్తారు. బీహార్ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ప్రజల బాగు కోసం పాటుపడాల్సి ఓ ఎమ్మెల్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్ నలందాకు చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసి.. ఆమెను కారులోనే అత్యచారం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను అశ్రయించారు. పోలీసులు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో  ఆసక్తికర విషయం తెలిసింది. బాలిక కిడ్నాప్ కు గురికావడానికి కొందరు మహిళలు సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వ్యవహారంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారని... ఎన్ని రోజులు ఎమ్మెల్యేను స్వేచ్చగా తిరగనిస్తారు అని పోలీసులపై మండిపడ్డారు.

జెఎన్ యూ విద్యార్దులపై మరోసారి నోరుజారిన అహుజా..

రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ జేఎన్ యూ విద్యార్థులపై ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంతేకాదు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం కూడా ఆదేశించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన నోరు పారేసుకున్నట్టు తెలుస్తోంది. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని.. ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎంతటి దుమారం రేగుతుందో చూడాలి.

మరోసారి చెలరేగిన స్మృతీ ఇరానీ

  ఒక విద్యార్థి మరణాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలందరినీ ఏకిపారేసిన స్మృతీ ఇరానీ, ఇవాళ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జేఎన్‌యూలో రాక్షసుడైన మహిషాసురుని పూజిస్తూ అతడిని సంహరించిన దుర్గాదేవిని దూషిస్తున్నారంటూ నిన్న స్మృతీ ఇరానీ  ఒక కరపత్రాన్ని ఉట్టంకించిన విషయం తెలిసిందే. అలాంటి కరపత్రాలను బహిరంగంగా చదవాల్సిన అవసరం లేదంటూ విపక్షాలు ఆమెను అడ్డుతగులుతూనే ఉన్నాయి. పైగా స్మృతీ ఇరానీ దుర్గాదేవికి సంబంధించి అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. దానికి జవాబుగా స్మృతీ తాను చెప్పిన విషయాలన్నీ విశ్వవిద్యాలయంలో పంపిణీ అవుతున్న కరపత్రాలలోవేననీ అంతేకానీ తన ప్రభుత్వమేమీ వాటిని ముద్రించలేదని పేర్కొన్నారు. తాను స్వయంగా దుర్గాదేవి భక్తురాలిననీ, కరపత్రంలో ఆమెకు సంబంధించి ఉన్న వివాదాస్పద విషయాలను పైకి చదవడం తనకేమీ సరదా కాదనీ పేర్కొన్నారు.

నేను దుర్గ భక్తురాలిని.. స్మృతీ క్షమాపణ చెప్పాల్సిందే..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రోహిత్ ఆత్మహత్మపై, జెఎన్ యూ ఘటనలపై దాదాపు గంటసేపు భావోద్వేగమైన ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె వారికి ఘాటుగానే సమాధానమిచ్చింది. అయితే ఇప్పుడు స్మృతీ చేసిన వ్యాఖ్యలపై  ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్మృతీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాల్సిందే అని.. దుర్గా దేవిపై స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  స్మృతీ క్షమాపణ చెప్పనంతవరకు సభ జరగదని ప్రతిపక్షాలు తీర్మానించాయి.   మరోవైపు  స్మృతీ ఇరానీ కూడా దీనిపై స్పందించి.. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను.. అని తేల్చిచెప్పారు. కాగా జేఎన్‌యూలో విద్యార్థులు మహిషాసురుడి సంబరాలు చేసుకోవడం దారుణమని.. విద్యార్థులు దుర్గా దేవిని అవమానించారని ఆమె తన ప్రసంగంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను దుర్గామాత భక్తురాలినని.. జేఎన్‌యూలో దుర్గామాతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ.. వాటిని చూపించారు. అక్కడ మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారని కూడా ఆమె అన్నారు.

పసిపాపను పన్నెండుసార్లు కత్తితో పొడిచి.. కానీ..!

థాయ్‌లాండులో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పసిపాపను కత్తితో పొడిచి పాతి పెట్టారు. అదృష్టం ఏంటంటే పాప బతికే ఉండటం. పెద్దవాళ్లను కత్తితో పొడిస్తేనే బతకడం కష్టం.. అందునా పలుసార్లు కత్తితో పొడిస్తే ఇంక కష్టం. అలాంటిది ఒకటి కాదు రెండుకాదు పన్నెండుసార్లు కత్తితో పొడిచినా కానీ ఆపసిపాప సజీవంగా బతికి అందరినీ అశ్యర్యపరిచింది. వివరాల ప్రకారం.. థాయ్‌లాండులోని ఖాన్ కేన్ అనే ప్రావిన్సులో ఒక మహిళకు అక్కడి పొలాల్లో పనిచేస్తుండగా ఒక పసిపాప ఏడుపు వినిపించింది. అయితే ఆమె వెళ్లి చూడగా  పాప ఒళ్లంతా కత్తితో పొడిటిన గాయాలతో కనిపించింది. దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందిచింది. పోలీసులు అక్కడికి చేరుకొని పాపను ఆస్పత్రికి తరలించి పాప ప్రాణాలు కాపాడారు. కాగా పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.

చంద్రబాబుకి జగన్ సవాల్..

తాజాగా వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకుంటున్నారన్నారు అని ఆయన అన్నారు. మేం పార్టీ స్థాపించినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలం మాత్రమే ఉన్నాం.. ఆ తరువాత 18కి చేరాం.. ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు.. ఇప్పుడు పార్టీ మారిన వారి వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు.. అని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని.. ఆయన చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

దుర్గావతారం ఎత్తిన స్మృతీ ఇరానీ.. ప్రతిపక్షాలకి చుక్కలు

హెచ్ సియూ విద్యార్థి ఆత్మహత్యపై రాజ్యసభలో పలువురు నేతలు పలు రకాలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రతి పక్షాలు అయితే రోహిత్ చావుకి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ దుయ్యబట్టారు. దీనికి ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. అయితే కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ మాత్రం తన ఉగ్ర స్వరూపాన్ని చూపించారు. రాజ్యసభలో దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగిచిన ఆమె ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. "నా పేరు స్మృతీ ఇరానీ. నా కులమేంటని ఎవరైనా అడగగలరా?  అంటూ విపక్ష సభ్యులను చాలెంజ్ చేసిన ఆమె, రోహిత్ దళితుడు కాబట్టే సస్పెండ్ చేశారని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఢిల్లీ కూడా దాటి కాలు బయటపెట్టని రాహుల్ గాంధీ హెచ్సీయూ ఘటన తరువాత పలుమార్లు హైదరాబాద్ వెళ్లి రాజకీయాలు చేసి వచ్చారని విరుచుకుపడ్డారు. ఇంకా ప్రతిపక్షాలు ఈ ఘటనలను కేవలం రాజకీయ లబ్దికోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు.

రహస్యాలు తెలుసుకోవడానికి విజయవాడ వెళ్తున్నా.. వర్మ

రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వంగవీటి లోగో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.  అయితే ఈ సినిమాకి సంబంధించి రాంగోపాల్ వర్మ మరిన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి విజయవాడ వెళుతున్నారట. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన.. అలనాటి జ్ఞాపకాలు తలుచుకుంటుంటే.. విజయవాడ నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవమని.. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను ఏది నేర్చుకున్నా అది విజయవాడనుండే అని అన్నారు. అంతేకాదు వంగవీటి’కి సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను. ఈ పాటను సిరాశ్రీ రాయగా.. సుశర్ల రాజశేఖర్ సంగీతం అందించాడని తెలిపారు.