భారత్,పాకిస్థాన్.. ఆసియా కప్ పోరు నేడే
టీమిండియా జట్టు అన్ని జట్లతో ఆడటం వేరు.. ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ తో ఆడటం వేరు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈనేపథ్యంలోనే ఆసియా కప్ భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి పాకిస్థాన్ పై గెలుపు ఖాయమని భావిస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లి, సురేష్ రైనాలతో ఇప్పటి అత్యంత బలంగా ఉన్న భారత్ బ్యాటింగ్కు.. హర్థిక్ పాండ్య బ్యాటింగ్ కూడా తోడవడం కూడా భారత్ కు ఫ్లస్ పాయింట్ అయింది. ఇంకా.. శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, యువరాజ్ కూడా బ్యాటింగ్లో రాణిస్తే పాకిస్థాన్ను చిత్తు చేయడం అత్యంత సులభమని అభిమానులు ధీమాగా ఉన్నారు. అలాగే పాకిస్థాన్ తక్కువ అంచనా వేయడానికి మించిన పోరపాటు లేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ మంచి హోరా హోరీగా ఉంటుందని భావిస్తున్నారు.