రామోజీరావు పద్మవిభూషణ్ పై కోర్టులో పిల్..
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొగల్ రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రామోజీరావుకి అవార్డ్ వచ్చిన దానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలోనే విమర్శలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థల ద్వారా రామోజీరావు ప్రజలను మోసం చేస్తున్నారని అలాంటి ఆయనకు పద్మవిభూషణ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై హైకోర్టులో ఎప్పుడు విచారణ జరగనుందన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు.