'సూపర్ సేల్' తో ముందుకొచ్చిన ఎయిర్ ఇండియా...
భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎయిర్ ఇండియా ఒక సరికొత్త స్కీముతో ముందుకొచ్చింది. 'సూపర్ సేల్' పేరుతో ఒక స్కీమును ప్రారంభించింది. గతంలో స్పైస్జెట్, ఇండిగో, ఎయిర్ ఏషియా ఇండియా తదితర సంస్థలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించేశాయి. స్పైస్ జెట్ రూ. 511 (పన్నులు అదనం), ఇండిగో రూ. 800 (పన్నులు అదనం)కు టికెట్లను విక్రయించాయి. ఇప్పుడు అదే బాటలో ఎయిర్ ఇండియా సైతం నడుస్తోంది. మే 25 నుంచి సెప్టెంబరు 30లోపు తమ విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకున్న వారు 'సూపర్ సేల్' స్కీమ్ ద్వారా తగ్గింపు ధరకే టిక్కెట్లను పొందవచ్చని తెలిపింది. దేశీయ రూట్లలో టిక్కెట్ ప్రారంభ ధర 1,499(పన్నులతో కలిపి)గా ఉందని చెప్పింది. తాము నడుపుతున్న అన్ని రూటల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.