ఏటీఎం క్యూ లైన్.. వరుసలో పీఎం, మాజీ పీఎం, అద్వానీ
నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అన్నది అందరికి తెలిసిన సత్యమే. కానీ ఇలా లైన్లో నిల్చున్న వారిని ఎవరూ ఫొటోలు తీయరు. వారి గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రముఖులు క్యూలో నిల్చుంటే మాత్రం ఫొటోలు తీసేసి సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తారు. అలాంటి ఒక ఫొటోనే ఇప్పుడు వైరల్ మారింది. అదేంటంటే ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఎల్కే అద్వానీ ఒకరి వెంట ఒకరు వరుసగా నిలబడిన ఫొటో. ఈ ఫొటో ఎక్కడ అనుకుంటున్నారా..? పార్లమెంట్ ఏటీఎం వద్ద మోడీ, మన్మోహన్సింగ్, ఎల్కే అద్వానీ, అరుణ్ జైట్లీ నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక నెటిజన్లు పెట్టిన కామెంట్లపై ఓ లుక్కేద్దాం..
మీరు ఏటీఎం క్యూలో నిలబడ్డప్పుడు.. మీ కన్నా ముందున్న వ్యక్తి మెషిన్ దగ్గరకెళ్లి రెండో కార్డు తీస్తే.. మీరు ఇలాగే చూస్తారు అంటూ ఓ నెటిజన్ చమత్కరించగా.. మోదీ కొత్త రెండువేల నోటు, మన్మోహన్ పాత వెయ్యినోటు, అద్వానీ పాత 100 నోటు అంటూ మరొకరు పేర్కొన్నారు. ప్రధాని, మాజీ ప్రధాని, ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి అంటూ ఇంకొకరు క్యాప్షన్ ఇచ్చారు. కెప్టెన్, మాజీ కెప్టెన్, కోచ్ అంటూ మరొకరు చమత్కరించారు.